VijayaKumar

Jul 15 2024, 19:35

సమాజంలోని సంఘటనలతో నీలం నాటకం , సమాజానికి మంచి సందేశం: యువ రచయిత దర్శకుడు నీలం నరేష్

"నీలం" నాటకం ప్రతిభ ని ఎవరు  అడ్డుకోలేరని అంటున్నాడు యవ రచయిత, దర్శకుడు, నీలం నరేష్_ , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు నీలం థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో " నీలం " నాటకం నందమూరి తారక రామారావు ఆడిటోరియం, నాంపల్లి లో అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా" మామిడి హరికృష్ణ, ఆత్మీయ అతిథులు రచయిత నటుడు డా" మల్లేష్ బాలస్ట్, నటుడు దర్శకుడు ధనరాజ్,మరియు రచయిత దర్శకుడు నటుడు అజయ్ మంకెనపల్లి, కార్యక్రమంలో పాల్గొన్నారు, నాటకం అద్భుతంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని నాటకాలు వేయాలని, నీలం నాటకం సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని మల్లేష్ బలస్ట్ అన్నారు, అజయ్ మంకే నపల్లి మాట్లాడుతూ ఈ నాటకాలు నటించినటువంటి నటినట్లు అందరికీ అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి నాటకాలు చేయాలని అలాగే కళాకారులని బాగా పాత్రలో జీవించి నటించరు అని అభినందించారు, నీలం నాటకం డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నాటకం సమాజంలో జరుగుతున్నటువంటి, కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని రాయడం జరిగిందని అన్నారు ఈ నాటకంలో నటించినటువంటి నటి,నటుల అందరికీ అభినందనలు తెలిపారు. మా నాటకానికి సహకరించిన డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు అలాగే రానున్న రోజుల్లో మిగతా హరివిల్లు లో రంగులను ప్రదర్శిస్తామని, అన్నారు.

VijayaKumar

Jul 15 2024, 19:20

వలిగొండలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం  పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు .ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేశామని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారుల పై ,మైన డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు నడిపిన ,మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని అన్నారు ,వాహనాలు నడిపేవారు వాహనాలకు సంబంధించిన మరియు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు.

VijayaKumar

Jul 15 2024, 17:48

భువనగిరి: ఉసిల్ల వాగు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి: సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలోని బస్వాపురం , భువనగిరి రోడ్డు మధ్యలో ఉన్న వాగు దాటడానికి బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉసిల్ల వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా గత ఎమ్మెల్యేకు, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేకు, అధికారులు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. వర్షాకాలంలో వర్షం పడితే వాగు పైనుంచి నీరు పోతే అవతలికి భువనగిరి పట్టణానికి పోవడానికి దాటాడానికి వీలుగాని పరిస్థితి బసాపురం గ్రామ ప్రజలతోపాటు చుట్టుముట్టు ఆరు గ్రామాల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామ రైతులు కూడా బావుల వద్దకు వ్యవసాయ పనులకు, వాడి ఆవుల దగ్గరికి నిరంతరము వెళ్తూ ఉంటారని వర్షం వస్తే నీరు అధికంలో రావడం వల్ల అవతలికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి పదిహేను కిలోమీటర్లు తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేసినారు. అదే విధంగా గ్రామంలో మురికినీటి కాలువల సమస్యలు పరిష్కరించాలని, లింకు రోడ్లకు సంబంధించి బస్వాపురం నుండి హనుమాపురం , బసాపురం నుండి గంగాసాంపల్లి వరకు లింకు రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, పార్టీ సీనియర్ నాయకులు మధ్యపురం బాల్ నర్సింహ్మ, మచ్చ భాస్కర్, గ్రామ ప్రజలు సత్యనారాయణ , శ్రీనివాస్ , తిరుపతి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 15 2024, 16:15

వలిగొండ పట్టణంలో మురికి కాలువల్లో పేరుకపోయిన చెత్తాచెదరా న్ని తొలగించాలి: సిపిఎం డిమాండ్

వలిగొండ పట్టణంలో మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,చెట్లను తొలగించాలి... సిపిఎం డిమాండ్ వలిగొండ పట్టణంలో వెలువర్తి రోడ్డు నుండి పాత ఎమ్మార్వో కార్యాలయం వెళ్లే దారిలో మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కాల్వకు ఇరువైపులా పెరిగిన పిచ్చి చెట్లను వెంటనే తొలగించి ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు సోమవారం రోజు సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఏరియాలో సర్వే నిర్వహించారు వెల్వర్తి రోడ్డు నుండి పాత ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న మురుగు కాలువ పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయిందని ఈ కాల్వకు ఇరువైపులా చెట్లుపెరిగి దోమలు మురుగునీటి వాసన ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి మురుగు కాలువను శుభ్రం చేయించాలని చెట్లు చదరాలను తొలగించాలని బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని డిమాండ్ చేశారు ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్ల మధ్యలో ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు పెరగడానికి అవకాశం ఉందని దీంతో అక్కడ ప్రజలకు డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా లాంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు కొండూరు సత్తయ్య,వేముల లక్ష్మయ్య,నరేందర్, కవిత,యాకమ్మ,సురేష్,పర్వీన్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jul 15 2024, 14:00

అడ్డగూడూరులో AISF నాయకుల ముందస్తు అరెస్ట్

నిర్బంధాలు అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేస్తున్న పోలీసులు* *తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని, ఈ ప్రజా పాలనలో ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి సరైన న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది* *ఈ సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్,చెరుకు శివరాజ్ గార్లను ముందస్తుగా అరెస్టు చేసి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది* ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు పెయింటింగ్ లో ఉండడం వలన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి సమస్య పరిష్కారం కోసం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పెయింటింగ్స్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

VijayaKumar

Jul 14 2024, 23:04

సీఎం రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన... వలిగొండలో BJYM నాయకుల ముందస్తు అరెస్టు...

ప్రభుత్వం ఏర్పడి 200 రోజుల అయినప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేని ఈ అసమర్థ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పర్యటించాలన్న భయంతో , BJYM నాయకులను ముందస్తు అరెస్టు లు చేసి జైల్లో పెట్టే దౌర్భాగ్యం స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది* *ఈరోజు తెలంగాణ CM రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ట్ పర్యటనకి వెలుతున్న సందర్బంగా ఎక్కడ BJYM నాయకులు అడ్డుపడతారనే భయంతో ముందస్తుగా వలిగొండ మండల కేంద్రానికి చెందిన BJYM నాయకులను ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్బంగా BJYM నాయకులు మాట్లాడుతు BJYM నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, నిరుద్యోగుల డిమాండ్లను మరియు వారికి ఇచ్చిన హామీలను , నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెలకు 4000 భృతి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాల్సిందే లేకుంటే సిఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు మండల బీజేపీ నాయకుల పూచీకత్తు మీద BJYM నాయకులను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్,బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , దంతూరి సత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్, మండల సెక్రెటరీ మందుల నాగరాజు, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM మండల ఆద్యక్షులు ,మందాడి రంజిత్ రెడ్డి,BJYM మండల ప్రదనకార్యదర్శి అమనగంటి శివ కుమార్,BJYM మండల ఉపాధ్యక్షులు మైసోల్ల హరీష్ తదితరులను అరెస్టు చేయడం జరిగింది.

VijayaKumar

Jul 14 2024, 22:40

వలిగొండ ప్రగతి పాఠశాల పూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకార గ్రామం లో ఏలే చంద్రశేఖర్ వ్యవసాయ క్షేత్రంలో వలిగొండ ప్రగతి  పాఠశాల పూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బల్లెపు సత్తయ్య సార్ మాట్లాడుతూ చాలా సంవత్సరం కాలం తర్వాత ప్రగతి పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులందరినీ  కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందరూ తమ తమ వ్యక్తిగత సుఖసంతోషాలను పంచుకున్నారు. ప్రగతి పాఠశాలలో అవకాశం కల్పించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులందరూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని తగనగుణంగా కలసి మెలసి ఉంటూ  ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహలకు, ఏలే చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు సత్తయ్య సార్, గడ్డమీది ధనంజయ గారలను ఘనంగా సన్మానించారు. పాల్గొన్న ప్రతి ఉపాధ్యాయులకు మెమెంటోలను  బహుకరించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బల్లెపు సత్తయ్య సార్, గడ్డమీద ధనుంజయ సార్ , సుంకోజు నరసింహ చారి సార్, వనం ఓంకార్ సార్, మహమ్మద్ జిలాని సార్, బుంగ జయరాజు సార్, వనగంటి సత్యనారాయణ సార్, బి .ముత్యాలు సార్, శ్రీనివాస్ సార్, బర్ల జగదీశ్వర్ సార్ , మార్క నరసింహ సార్,మాటూరి వెంకటేశం సార్, మారోజు యాదగిరి సార్, రాచకొండ కృష్ణ సార్ , సంగిశెట్టి పాండు సార్ , గజ్జి గంగారం సార్ , వల్లమాల రత్నయ్య సార్ , సంగిశెట్టి విజయ్ కుమార్ సార్, ఇంద్రసేనారెడ్డి సార్, తదితరులు పాల్గొన్నారు

.

VijayaKumar

Jul 14 2024, 11:00

వలిగొండ : ప్రొద్దుటూరులో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన కూర శివ ప్రసాద్ వయస్సు 27, తన తమ్ముడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తీవ్ర మనస్తపానికి గురై శివప్రసాద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jul 14 2024, 07:58

జనాభా నియంత్రణ , ఆరోగ్య జీవన విధానం అనే అంశాల్లో గోడపత్రిక తయారి పోటీల్లో విజేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్యకర ప్రపంచం నిర్మాణం కోసం జనాభా నియంత్రణ అవసరమని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి లింగరెడ్డి అన్నారు .ప్రపంచ జనాభా నియంత్రణ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వెన్నెల కాలేజీలో గోడపత్రిక తయారి పోటీలు నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ... మహిళా సాధికారత కోసం జనాభా నియంత్రణ ,ఆరోగ్య జీవన విధానం అనే అంశాల్లో గోడ పత్రిక తయారి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్ శ్రీకళ, పదో తరగతి ఆదర్శ పాఠశాల చౌటుప్పల్ ప్రథమ బహుమతి, పి సాయి కుమార్ పదవ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి ద్వితీయ బహుమతి ఎస్.కె జోయా జోబిన్ 9వ తరగతి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రామన్నపేట విజేతలుగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహాలక్ష్మి, రమాదేవి, రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 13 2024, 21:00

వరిగొండ మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండలం 37 గ్రామపంచాయతీ లతో జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉండడంతోపాటు విద్యుత్,వ్యవసాయ మోటర్లపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న మండల రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం మండల కేంద్రంలో అందుబాటులో లేక భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు రామన్నపేటకు ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లడానికి రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని వేలాది రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తుందని వెంటనే వలిగొండలో స్థానిక సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు శనివారం రోజున సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్స్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని మండల ప్రజలు అనేక సంవత్సరాల నుండి కోరుతున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు గత ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించలేదన్నారు ఇప్పటికైనా వెంటనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ఎమ్మెల్యే స్పందించి వలిగొండ మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ యందు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి,మెరుగు వెంకటేశం,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య,కందడి సత్తిరెడ్డి, కవిడే సురేష్,దుబ్బ లింగం,నాయకులు దొడ్డి భిక్షపతి,రాదారపు మల్లేశం,జక్కా రాఘవరెడ్డి,బండమీది సుందరయ్య,చేగురి నర్సింహ,మాడుగుల వెంకటేశం,మందుల యాదయ్య,ఏటేల్లి నర్సింహ,మంగ పాండు,వేముల నాగరాజు,పోలేపల్లి స్వామి,బండమిది సత్తయ్య,జరుగుమల్ల శ్రీకాంత్,మైసోళ్ల నరేందర్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు