Jul 10 2024, 17:38
నిర్మాణ్ పౌండేషన్ ఆధ్వర్యంలో అమీన్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ..
నోట్ పుస్తకాల వితరణ - నిర్మాణ్ ఫౌండేషన్ (2)
అమీన్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల నందు నేడు నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు, విశ్రాంత అధ్యాపకులు కిషన్ గారు, ఆశగారి లక్ష్మణ్, ఫౌండేషన్ అధ్యక్షులు ఏలే వెంకటనారాయణ, ఫౌండేషన్ సభ్యులు వడ్డేపల్లి హరిప్రసాద్, వెంకట్రాంరెడ్డి మరియు శ్రీనివాస్ గిర్నాల తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందని, దానికి తోడుగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం తప్పక కృషి చేస్తుందని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
విశ్రాంత అధ్యాపకులు కిషన్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రభుత్వ అధ్యాపకుల అంకితభావము ఇక్కడ విద్యార్థుల సంఖ్య మరియు క్రమశిక్షణ ద్వారా తెలుస్తుందని అధ్యాపకుల కృషిని కొనియాడారు.
ఫౌండేషన్ సభ్యులు వెంకటనారాయణ, వెంకట్రాంరెడ్డి, హరి ప్రసాద్ మరియు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌలభ్యాల కొరకు తప్పక కృషి చేస్తామని చెబుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Jul 15 2024, 18:53