నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:43

ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

జిల్లాలోని రామడుగు మండలం వేదిర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది . కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి లోని గంగాధ మండలంలో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఫిట్స్ వచ్చింది .

వెంటనే బస్సులోని ప్రయాణికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు . అంబులెన్స్ వేగంగా రాకపోవడంతో ప్రయాణికుడి బస్సులోని శ్వాశ విడిచాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు పై అరా తీస్తున్నారు .

నిజంనిప్పులాంటిది

Jul 11 2024, 11:07

బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్

సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సోహైల్ తన కెరీర్‌లో అనేక జిల్లా-స్థాయి, రాష్ట్ర-స్థాయి, దక్షిణ భారత-స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.. 

మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన మహ్మద్ సోహైల్ చిన్న వయసులో మరణించడంతో అందరూ కన్నీరుమున్నీరు అయ్యారు.

Streetbuzz News

Real time news platform

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jul 09 2024, 19:13

సిరాజ్ కు బంపర్ ఆఫర్ ...‼️

టీ20 వరల్డ్‌కప్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ గెలిచినందుకు సిరాజ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అంతేకాదు.. భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను సిరాజ్‌కు నగరంలో ఓ ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అటు.. సిరాజ్ టీమిండియా జెర్సీని సీఎంకి బహూకరించాడు.

ఇదిలావుండగా.. టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ ఉన్న విషయం తెలిసిందే. అమెరికా వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు తుది జట్టులో ఉన్నాడు. అయితే.. వెస్టిండీస్‌కు వేదిక షిఫ్ట్ అయ్యాక అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు.

అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో.. సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవడం జరిగింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే.. స్పెల్ మాత్రం బాగా వేశాడు. భారీ పరుగులు ఇవ్వకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి తన సత్తా చాటాడు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

మరోవైపు.. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పుడు సిరాజ్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అది చూసి ఉప్పొంగిపోయిన సిరాజ్.. తానూ వాహనంపై ఓపెన్ టాప్ తీసి పాట పాడారు. డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపారు. కాగా.. సీఎం రేవంత్‌ని సిరాజ్ కలిసిన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ కూడా పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 08 2024, 10:58

లక్ష్మీ నరసింహస్వామి నీ దర్శించుకున్న డిజిపి..

రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ..

గుంటూరు లోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషం..

లక్ష్మీ నరసింహస్వామి గుడిని చిన్నప్పటి నుండి దర్శించుకునేవాడిని..

కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోడం సంతోషంగా ఉంది..

పోలీసులు అందరూ జవాబుదారీ తనంగా ఉండేలా చేస్తాం..

పోలీస్ వ్యవస్థలో కొన్ని సదుపాయాలు లేక కొన్ని విభాగాలు మూతపడ్డాయి..

ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించి నూతన విధానాన్ని అమలు చేస్తాం..

క్రింది స్థాయి పోలీసులకు ఉన్న సమస్యలు తీర్చాడనికి కృషి చేస్తాం..

నిజంనిప్పులాంటిది

Jul 06 2024, 13:07

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి

పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు..

ప్రస్తుతం నెల్లూరు జైలులో పిన్నెల్లి

అదనపు విచారణ కోసం కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు..

రెండ్రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన మాచర్ల కోర్టు..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈవీఎం పగులగొట్టడం, పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.

అదనపు విచారణ కోసం పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పిన్నెల్లిని రెండ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది.

అదే పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు, తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది..

నిజంనిప్పులాంటిది

Jul 05 2024, 13:32

హీరో రాజ్ తరుణ్ పై కేసు!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ (Raj Tarun) పై అతని ప్రేయసి లావణ్య (lavanya)పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తాము విడిపోవడానికి కారణం ఓ సినీ నటి కారణమని.. రాజ్‌ తరుణ్‌ను వదిలేకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తున్నారని సినీ నటితోపాటు ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది లావణ్య.

పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు.

3 నెలల క్రితం రాజ్ తరుణ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు.

రాజ్‌ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ తరుణ్‌ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి.

గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని.. ఆ సమయంలో రాజ్‌ తరుణ్‌ తనకెలాంటి సాయం చేయలేదని పేర్కొంది లావణ్య.

నిజంనిప్పులాంటిది

Jul 05 2024, 12:58

కేసిఆర్ కథ ముగిసేనా ⁉️

- లక్కీ నంబర్ 6

- ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ 

- కార్యకర్తలకు సర్దిచెప్పి పార్టీలోని కొనసాగింపు

ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు.. అయినా ఇప్పుడీ నంబర్ అంటేనే బేజారుగా ఉందట.

ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్‌ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..! నంబరేంటి.. ఇబ్బందేంటనే సందేహాలు వస్తున్నాయ్ కదూ..! అవునండోయ్.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! ఇంతకీ ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ స్టోరీ చకచకా చదివేయాల్సిందే మరి..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్‌ ఎలక్షన్‌లో అయినా పరువు నిలుపుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. అయితే.. అంతకుమించి ఘోరమే చవి చూసిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి.. అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్‌ నుంచి జంపింగ్‌లు పెద్ద ఎత్తునే మొదలయ్యాయి. అది కాస్త అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఎక్కువైంది. 

అది కాస్త అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఎక్కువైంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సిట్టింగ్‌లు, టికెట్లు దక్కించుకున్న వాళ్లు సైతం ‘కారు’ దిగేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పేసుకోవడంతో హైకమాండ్ కంగుతిన్నది. ఎలాగో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటీ గెలవలేదు. దీంతో ఇక బీఆర్ఎస్‌ ఉంటుందా.. ఊడిపోతుందా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయని ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జంప్ చేయడం మొదలుపెట్టారు.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలై.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసుల రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇలా మొత్తం ఆరు మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలా పడిపోయింది.

ఈ షాక్ నుంచి తేరుకోకమునుపే.. ఒకేసారి ఆరు మంది ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, ఎం.ఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానంద్, బసవరాజ్ సారయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగితే.. ఎమ్మెల్సీలు ఒకేసారి ఆరుగురు ఇలా జంప్ కావడం హైకమాండ్‌కు ఊహించని షాకేనని చెప్పుకోవచ్చు. దీంతో ‘ఆరు’ అనే నంబర్ అంటేనే.. బాబోయ్ గులాబీ దళం బెంబేలెత్తిపోతున్నదని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అంటే కేసీఆర్‌కు ఇష్టమైన లక్కీ నంబర్‌తోనే కాంగ్రెస్ కొడుతోందన్న మాట.

ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్ అయిన తర్వాత మరో ‘ఆరు’ మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఆ పార్టీలు గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ఈ ఆరుగురు కూడా బీఆర్ఎస్ బిగ్ షాట్‌లే.. అందులోనూ పార్టీ హైదరాబాద్ సిటీకి చెందిన వారే కావడంతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే అప్పట్లో రేవంత్‌తో కలిసి పనిచేసినవాళ్లే..! ఆ ‘ఆరు’ అనే నంబర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మా రెడ్డి, అరికెపూడి గాంధీ పార్టీ ఉన్నారట.

నిజంనిప్పులాంటిది

Jul 05 2024, 11:48

ప్రధాని మోడీతో ఏపీ సీఎం భేటీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీని కలిసిన చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వద్దు, ఏం అడిగారో తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) కీలక భాగస్వామిగా ఉన్న నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి మరింత సహాయం చేయాలని కోరినట్లు చెబుతున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) కీలక మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ (టిడిపి) చీఫ్ 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదుర్కొన్న సవాళ్లను హైలైట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర సహాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు మరియు ప్రత్యేక కేటగిరీ హోదాకు బదులుగా సహాయం పెంచాలని సూచించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్‌లను కూడా కలిశారు.

హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆరోగ్య మంత్రి జెపి నడ్డాతో సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా నాయుడు కలవవచ్చని వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశాల అనంతరం, మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ 'రాష్ట్రాల మధ్య పవర్‌హౌస్‌'గా మళ్లీ ఆవిర్భవించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 'X'పై ఒక పోస్ట్‌లో, 'ఆంధ్రప్రదేశ్ సంక్షేమం మరియు అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి నేను ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్మాణాత్మక సమావేశం నిర్వహించాను. ఆయన సారథ్యంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు మించిన శక్తిగా పుంజుకుంటుందన్న నమ్మకం నాకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 67 శాతం పెరిగి 2023 మార్చి చివరి నాటికి రూ.4,42,442 కోట్లకు చేరుకుంది. మార్చి 31, 2024 నాటికి రాష్ట్ర స్థూల ఆర్థిక లోటు రూ. 55,817.50 కోట్లుగా అంచనా వేయబడింది, 2018-19లో రూ. 35,441 కోట్ల కంటే 57 శాతం ఎక్కువ.

నిజంనిప్పులాంటిది

Jul 03 2024, 19:04

మంత్రి వర్గంలో చోటు ఎవరికి ?

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సమాయత్తం అవుతుండటంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌లతోపాటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్‌కు ఊపు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేంసాగర్‌రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీగా పదవిని అలంకరించారు. 2018లో మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పీఎస్సార్‌కే మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్‌ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి తనయులైన బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌లు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్‌ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. గడ్డం వివేక్‌ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడిగా సేవలందించారు.

వీరు సైతం కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి మంత్రి పదవి దక్కించుకునేందుకు మంతనాలు సాగించారు. మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ప్రచారం జిల్లాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

నిజంనిప్పులాంటిది

Jul 03 2024, 19:00

రేపు విద్యాసంస్థల బంద్ !

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూలై 4వ తేదీన జరిగే విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి డాక్టర్లను అందించే నీట్‌ పరీక్షపత్రాన్ని లీక్‌చేయడంతో 20లక్షల మంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా మారిందన్నారు.

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా సంస్థల బంద్‌ కార్యక్రమంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగమట్ల శివ, పిల్లి కార్తీక్‌, దాసరి కార్తీక్‌, ముఖేష్‌ పాల్గొన్నారు.

Streetbuzz News

Real Time News Platform