Mane Praveen

Jul 09 2024, 20:04

NLG: వన్ టౌన్ నూతన సిఐ రాజశేఖర్ రెడ్డి ని కలిసిన బంజారా నాయకులు
నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి ని, ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అధ్యక్షులు కేళావత్ నాగేష్ నాయక్, రాజశేఖర్, సాగర్ పాల్గొన్నారు.

Mane Praveen

Jul 09 2024, 19:59

మర్రిగూడ మండలం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ వివిధ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చొరవతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 08 2024, 20:31

విద్యాశాఖ మంత్రిని నియమించాలి: దళితరత్న బుర్రి వెంకన్న
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సూర్యపేట, బాలేంల సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ హాస్టల్లో ప్రిన్సిపాల్ బీర్లు తాగుతుందని డిగ్రీ విద్యార్థినిలను ప్రిన్సిపాల్ వేధిస్తుందని ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారని,  అలాగే నల్గొండ జిల్లాలోని "డిండి" మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకులాల పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరవడం కలకలం రేపుతుందని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న అన్నారు. దేవరకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల గదులు శుభ్రంగా లేకపోవడం, పురుగుల అన్నం పెట్టడం, వండిన కూరలు సరిగా లేకపోవడం, కొన్ని విద్యార్థి సంఘాలు అడగగా లోపలికి అనుమతుల్లేవని ప్రిన్సిపల్ పొంతన లేని సమాధానం చెపుతూ వారి ఆవకతౌకలు, వారి తప్పిదాలు బయటపడతాయని, ప్రజాసంఘాలను లోపలికి అనుమతించకపోవడం చాలా బాధాకరం ఆవేదన వ్యక్తం చేశారు. డిండి ఎస్సీ బాలికల హాస్టల్స్ ను తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని వారికి నాణ్యమైన భోజనం అందించాలని, అలాగే బాలికల హాస్టల్లో పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ ను తక్షణమే విచారణ చేసి సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గవర్నమెంట్ గురుకుల హాస్టల్స్ లో బాలికలను చేర్పించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. అసలు హాస్టల్లో పిల్లలను ఉంచాలా, ఇంటికి తీసుకెళ్లాలా సందిగ్ధంలో తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని అయోమయంలో తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం  తప్పులకు పాల్పడుతున్న ఇలాంటి హాస్టల్ ప్రిన్సిపాల్ ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని మరియు ప్రముఖ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని గురుకులాల కార్యదర్శిగా నియమించి సంక్షేమ హాస్టల్స్ ను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ  గురుకుల హాస్టల్లలో నాణ్యమైన భోజనం నాణ్యమైన విద్య అందించాలి.

విద్యార్థుల పట్ల శ్రద్ధతో పాటు బాధ్యతాయుతంగా సంక్షేమ హాస్టల్లో అధికారులు, ప్రభుత్వ పాఠశాల కళాశాల అధికారులు సక్రమమైన విధి నిర్వహణను నిర్వర్తించాలని, రాష్ట్రంలో ఇలాంటి ఉదాంతాలు తలెత్తితే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ పక్షాన మరో న్యాయబద్ధమైన ఉద్యమానికి దళిత బహుజన సంఘాలను ఐక్యం చేసి  శ్రీకారం చుడతామని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

Jul 08 2024, 19:59

మర్రిగూడ తాజా మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి కి ఘనంగా సన్మానం
మర్రిగూడ మండల జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి 5 సంవత్సరాలు పదవి కాలం పూర్తి అయిన సందర్బంగా, సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం లో ఆయన ప్రధాన అనుచరుడు భీమనపల్లి తాజా మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు ఆధ్వర్యంలో అభిమానులు మరియు పార్టీ శ్రేణులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత 5 సం.లుగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, వారి మన్ననలను పొందారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేసారని కొనియాడారు. ప్రజలకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత పాశం సురేందర్ రెడ్డికే దక్కిందని అన్నారు. భవిష్యత్తులో ఉన్నతమైన పదవిని పొందాలని ఆశించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల ఓర్కింగ్ ప్రెసిడెంట్ నక్క తిరుపతయ్య, అంతంపేట మాజీ ఎంపీటీసీ బంతిలాల్, మల్గిరెడి కృష్ణారెడ్డి, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, జిల్లా కృష్ణ, నారెడ్డి సుధాకర్ రెడ్డి, మునగాల నాగిరెడ్డి, వస్పర్ సంజయ్, ఐతరాజు స్వామి, శ్రీను నాయక్,కడారు యాదయ్య, హనుమరెడ్డి, సురిగి ఎట్టయ్య, సిరికొండ వెంకటయ్య, నడిమింటి శ్రీను, సిలివేరు రమేష్, కర్నాటి మహేష్, కర్నాటి శివ, సూరిగి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 07 2024, 17:34

కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీల ఏర్పాటు

మర్రిగూడెం మండలం కొట్టాల, ఇందుర్తి గ్రామాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామ కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య లు మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇందుర్తి మాజీ సర్పంచ్ జంగిలి ప్రసన్న రవి, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య, గంట మల్లేష్, నందికొండ లింగారెడ్డి, పలువురు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Jul 07 2024, 11:08

లెంకలపల్లి: బెల్టు షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య సమక్షంలో గ్రామంలోని రెండు బూత్ ల నుండి కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి గ్రామ బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, ఏర్పుల శ్రీశైలం, నందికొండ లింగారెడ్డి, చాపల రవి, అయితగోని వెంకటయ్య, మేతరి శంకర్, దాసరి వెంకన్న, లింగయ్య, హరీష్, , వెంకటయ్య, యాదయ్య, నాగరాజు, శ్రీను, గిరి, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Jul 06 2024, 14:32

ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు కు ఘన సన్మానం
ఫిజికల్ డైరెక్టర్ గా పదోన్నతి బదిలీ పై వెళ్లిన బొమ్మపాల గిరిబాబు ను ఇవాళ జేబీఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను సన్మానించి అభినందించారు. పాఠశాల లో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకల్పనకు, విద్యాభివృద్ధికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి వారు చేసిన కృషిని కొనియాడారు.

Mane Praveen

Jul 05 2024, 21:05

నాయి బ్రాహ్మణ కుటుంబాలకు అండగా నాయి యువసేన ఫౌండేషన్
మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుడు దోమలపల్లి ఎల్లయ్య గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఎల్లయ్యకు ప్రస్తుతం కుల వృత్తి చేయలేని స్థితిలో ఉన్నందున విషయం తెలుసుకున్న నాయి యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వారి నివాసం అభంగాపురం గ్రామంలో 50 కేజీల బియ్యం మరియు వారానికి సరిపడా కూరగాయలను, నిత్యవసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం నాయి యువసేన ఫౌండేషన్ వారు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని, కలిసి ఉంటేనే కలదు సుఖం అని వారు అన్నారు. ఆపదలో ఉన్న వారిని తమ వంతు సహాయ సహకారాలు అందించడంలో మా నాయి యువసేన ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి, సత్య, ఉపేందర్, నగేష్, వెంకట్, నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 04 2024, 20:13

NLG: హెడ్మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.డి యూసుఫోద్దీన్ కు సన్మానం
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు ప్రభుత్వ హైస్కూల్ FAC హెడ్మాస్టర్ గా  బాధ్యతలు స్వీకరించిన యూసఫోద్దీన్ లకు ఈరోజు గేయ రచయిత
డాక్టర్ వై. శ్యాంసుందర్ రెడ్డి మరియు ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు లు శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల లోని ఉపాధ్యాయులు.. ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో అనుభవం నిబద్ధత గల వారని, వారందరి కృషి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతూ విద్యార్థి విద్యార్థులు చదువుతోపాటు సర్వతో ముఖాభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని తెలిపారు.

Mane Praveen

Jul 04 2024, 18:36

NLG: గ్రామ సమస్యలపై ఫిర్యాదు అందజేసిన ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు
మర్రిగూడెం మండలం, ఖుదాభక్షి పల్లి గ్రామంలో  ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ పలు గ్రామ సమస్యల పై డిప్యూటీ తహసిల్దార్ తారక రామన్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బూడిద సురేష్ మాట్లాడుతూ.. రైతుల పొలాలలో ఉన్న ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూములను కాపాడాలని, గ్రామంలో బందరు దొడ్డి ఆక్రమణకు గురికాకుండా యధాస్థితిలో ఉంచాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ కార్యదర్శి పొట్టగిరి, సహాయ కార్యదర్శి మేతరి యాదయ్య, సీనియర్ నాయకులు ఇష్కిల్ల మహేందర్, సిరిపంగి శ్రీనివాస్ బొమ్మగాని హనుమంతు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.