VijayaKumar

Jul 09 2024, 17:30

వెలువర్తి - అరూరు గ్రామాల మధ్యన గుంతలమైన బీటి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్వర్తి గ్రామం నుండి అరూర్ వరకు గుంతలమైన నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు మంగళవారం రోజున సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా వెల్వర్తి గ్రామంలో సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ వెల్వర్తి గ్రామం నుండి అరూరు వరకు నాలుగు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే అనేకమంది ప్రయాణికులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుందని అనేకమంది ఈ గుంతల్లో పడి గాయాల ఫాలఅవుతున్నారని వెంటనే రోడ్లు భవనాల శాఖ అధికారులు స్థానిక బోనగిరి ఎమ్మెల్యే స్పందించాలని కోరారు వెలువర్తి మొగిలి పాక గ్రామాలకు చెందిన అనేకమంది ప్రజలు అరూరు వేములకొండ గ్రామాల్లో బ్యాంకు పనుల నిమిత్తం మరియు ఇతర పనుల కోసం నిత్యం ప్రయాణం చేస్తుంటారని వారందరూ ఈ గుంతలమైన రోడ్డు వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో ఉన్న అధికారులు స్పందించకపోవడం వల్ల ఈ రోడ్డుకు ఈ పరిస్థితి వచ్చిందని వెంటనే ఇప్పటికైనా నూతన ప్రభుత్వం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు అదేవిధంగా వెలువర్తి గ్రామం నుండి వలిగొండకు ప్రయాణం చేసే వలిగొండ వెల్వర్తి గ్రామాల మధ్యన వర్షాకాలం వచ్చిన సందర్భంలో ఇబ్బందులకు గురిచేసి కల్వర్టులను బ్రిడ్జిలుగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లను మంజూరు చేయాలని వెల్వర్తి-కేర్చిపల్లి గ్రామాల మధ్యన ఉన్న బీటీ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు,శాఖ కార్యదర్శి కల్కూరి వాసు,కూచుమల్ల కిష్టయ్య,గ్రామ రైతులు ఎడవెల్లి పాపయ్య, నరసింహ,యాదయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jul 09 2024, 17:23

సహృదయ వృద్ధాశ్రమంలో ఘనంగా రాములు గౌడ్ జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం బత్తిని రాములు గౌడ్ (స్వామి)గారి పుట్టినరోజు సందర్భంగా" వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో నివసిస్తున్న 51 మంది అనాధ వృద్ధులకు మరియు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాములు గౌడ్ గారి కుటుంబ సభ్యులు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బత్తిని వినోద, బత్తిని వాసవి శ్రీధర్ గౌడ్, భక్తులు ఆకుల శ్రీను, పెరుమెల్లి తిరుమలేష్, కోల వెంకటేష్ గౌడ్, పాక జహంగీర్, బత్తిని వెంకటేష్, ఉపేందర్, సంతోష్, వెలిమినేడు వెంకటేష్ , డీజే రవి కిరణ్ , సంస్థ వ్యవస్తాపకుడు బుషపాక శివకుమార్,ఆశ్రమ
నిర్వాహకులు సంతోష్ , లక్ష్మణ్ లుపాల్గొన్నారు.

VijayaKumar

Jul 09 2024, 13:14

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజి వరకు బిటి రోడ్డు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలి: సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

పల్లెర్ల నుండి వేములకొండ స్టేజ్ వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని , స్టేజి నుండి ఆత్మకూరు వరకు డబల్ రోడ్డు వేయాలని సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లా కమిటీ పిలుపుమేరకు పోరుబాట కార్యక్రమంలో భాగంగా పల్లెల గ్రామంలో మంగళవారం పల్లెర్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించగలరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మండల కమిటీ సభ్యులు రచ్చ గోవర్ధన్, గ్రామ కార్యదర్శి గుండబోయిన స్వామి, మండల కమిటీ సభ్యులు నాయని కృష్ణారెడ్డి, నాయినిరామ్ రెడ్డి, యాదిరెడ్డి, రోషి రెడ్డి, ఎరుకల చంద్రయ్య, లోడి గోపాల్, కానుకుంట్ల నరసింహ, సంఘపాక నరసింహం, గుండబోయిన మహేష్, వట్టిప్పల ఐలయ్య, మేడి బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 21:00

స్వర్ణ గిరి క్షేత్రాన్ని సందర్శించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదరావు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రాన్ని సోమవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, జనత టీవీ చైర్మన్ కప్పర ప్రసాద్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ ఖాజా, ఫసియుద్దిన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకన్న తదితరులు  పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 18:57

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి: KGKS యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ

రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర ప్రతినిధి బృందం ఇప్పటికే రెండుసార్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. వృత్తిలో ప్రమాదం వలన వందలాదిమంది గీత కార్మికులు చెట్టు పై నుండి పడి చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుంది. ఇప్పటికే 520 మంది ప్రమాదానికి గురయ్యారు వీరిలో 76 మంది చనిపోయారంటే ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు. వీటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. టాడి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారి చొరవతో *సేఫ్టీ రోప్* 2022 లో యాదగిరిగుట్టలో రూపొందినప్పటికీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. తక్షణమే ఇచ్చి గీత కార్మికులకు ప్రాణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు రూపాయలు ఎక్స్ గ్రేషియా నెలరోజుల లోపు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు.ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. మెడికల్ బోర్డు విధానం తొలగించలేదు. *ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే వీటిపై స్పందించాలి*. టాడి కార్పొరేషన్ నుండి ఇచ్చే తక్షణ సహాయం తీవ్ర జాప్యం జరిగింది వాటిని వెంటనే అందివ్వాలి. బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి కేటాయించిన 22.20 కోట్ల రూపాయలతో నిర్మించిన నీరా కేఫ్ ని ఎలాంటి సంబంధం లేని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి టాడి కార్పొరేషన్ కి అప్పగించాలి అన్నారు. *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ప్రతి జిల్లాలో నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అన్నారు.చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి జీవో నెంబర్ 560 ప్రకారం 5 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆగస్టు 18 లోపు నిర్మించాలి. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి.50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుని కి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. *జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు మాట్లాడుతూ* నందనములో తాటి ఉత్పత్తుల పరిశ్రమ పనులు తక్షణమే పూర్తి చేసి గీత కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు. ప్రమాద నివారణకు ఇచ్చే సేఫ్టీ మోకులు యాదగిరిగుట్ట నుండి పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఆగస్టు రెండు నుండి 18 వరకు జిల్లాలో అమరుల యాదిలో కార్యక్రమం చేపడుతున్నామని దానిని జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు , గీతా కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర సలహాదారు మాటూరు బాలరాజు జిల్లా కమిటీ నాయకులు ధూపట్టి వెంకటేష్ బత్తిని బిక్షం అంతటి అశోక్ గాజుల ఆంజనేయులు మచ్చ నరసింహ పాండాల మైసయ్య మట్ట బాలరాజు. కుర్మిండ్ల ఈశ్వర్.బావల పెళ్లి బాలరాజు. పులి బిక్షము. చెరుకు బాలరాజు. కొండమడుగు శ్రీనివాస్.పరకాల అంజయ్య. బొడిగ బిక్షపతి. కోలా కృష్ణ. పల్సము స్వామి.బత్తిని సత్యనారాయణ. పాండవుల లక్ష్మణ్. పబ్బతి మల్లయ్య. కొక్కొండ లింగయ్య. శ్రీరామ్మూర్తి పూజారి కుమారస్వామి. ఎర్ర రవీందర్. కునూరు మల్లేశం. గడ్డమీద నిఖిల్. గడ్డమీద సోములు. రంగ కొండల్. తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 16:53

భువనగిరి పట్టణంలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించిన సినీ నటి మంచు లక్ష్మి

భువనగిరి పట్టణం బాహార్ పేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ స్కూల్ లో ఎర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంలో హజరై డిజిటల్ క్లాస్ రూంల ప్రారంబోత్సవంలో పాల్గోన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,భువనగిరి కలెక్టర్ శ్రీ జెండగే హనుమంత్ కొండిబా ,సినీ నటి మంచు లక్ష్మీ ,పిన్నపురెడ్డి శ్రీదర్. మంచు లక్ష్మి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి జిల్లా అధికారులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. శాలువా తో సన్మానించారు .సరస్వతి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా 2022 నుంచి మా టీం ఇక్కడ పనిచేస్తున్నారని టీచ్ ఫర్ చేంజ్ సంస్థ  నిర్వాహకులు తెలిపారు.

VijayaKumar

Jul 08 2024, 16:28

మెగా డీఎస్సీ 25 వేల పోస్టులతో నిర్వహించి వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి: పల్ల గొర్ల మోదీ రాందేవ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో అధ్యక్షతన సోమవారం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరిగింది. ఈ  ముట్టడి కార్యక్రమానికి వేలాదిమంది DSC నిరుద్యోగ అభ్యర్థులు తరలిరాగా, మెగా డీఎస్సీ 25 వేల పోస్టులు భర్తీ చేయాలని ,ఎగ్జామ్ కు రెండు నెలలు గడువు ఇవ్వాలని రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడి జరిగింది .వేలాది మందిని అరెస్టులు చేసి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్ పగిళ్ళ సతీష్ ,పల్లగొర్ల మోదీరాందేవ్ ,ప్రీతం కుమార్ నిఖిల్ పటేల్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు వారందరినీ అరెస్టు చేయడం జరిగిందని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు.

VijayaKumar

Jul 08 2024, 16:17

ఆలేరు: రైతు భరోసా సకాలంలో ఇవ్వాలి, తక్షణమే రుణమాఫీ చేయాలి : AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజయ్య, కుమార్

ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే మాఫీ చేసి రైతు భరోసాను వెంటనే ఇవ్వాలని *ఏ.ఐ. కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిరబోయిన రాజయ్య, బెజడి కుమార్* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరు న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా రాజయ్య, కుమార్ లు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ ఆచరనలో అమలు కావడం లేదని వారు దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చే బీమా పథకం అమలు చేయడం లేదు, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కానీ ఎరువులు,విత్తనాలు, అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.కల్తీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, మహారాష్ట్ర నుండి పాలు దిగుమతి చేస్కోవడం వల్ల రాష్ట్ర పాడి రైతులకు 1కేజీ పాలకు 12 నుండి 15 రూపాయలు ధర తగ్గడం జరిగింది, దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే పాడి రైతులను ఆదుకోవాలి, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేసి రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని, బోనస్ విధానం కేవలం సన్న వడ్లకే కాదూ, అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతాంగం పట్ల పెట్టి రైతులను ఆదుకోవాలని వారు అన్నారు.గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నప్పటికీ రైతు భరోసాను ప్రభుత్వం అందించకపోగా రైతులు వర్షాలు లేక, అప్పుల బాధతో కొట్టుమిట్టాడుతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు భరోసాని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేకుంటే రానున్న కాలంలో *ఏ.ఐ. కె.ఎం.ఎస్.* ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, జిల్లా కోశాధికారి తమ్ముడి అంజయ్య,చిరబోయిన కొమురయ్య, గోపాల్ రెడ్డి, వంగాల నర్సింహారెడ్డి, కడకంచి బీరయ్య, పాల్గొన్నారు

VijayaKumar

Jul 08 2024, 15:00

ఆత్మకూర్ డబుల్ బెడ్రూంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం

ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న డబల్ బెడ్ రూమ్లలో బహిర్భూమికి వసతులు లేవని వెంటనే సెప్టిక్ ట్యాంకర్ నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గురువారం రోజున ఆత్మకూరు మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్లలో ఉన్న సమస్యలను సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించి అక్కడ నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వేముల భిక్షం మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్లలో నివాసం ఉంటున్న మహిళలు బహిర్భూమికి వెళ్ళడం కోసం పాతకాలం పద్ధతులలో చెట్లు వెతుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం సెప్టిక్ ట్యాంకులు, సి.సి రోడ్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజీనీ నిర్మించడం కనీస బాధ్యతని అయినా ప్రభుత్వాలు విస్మరిచ్చాయని .కరెంట్ తీగలను ఇంటికి కిటికీలకు ఆనుకునే పద్ధతులు నిర్మాణం చేశారని ఫలితంగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నదని తెలియజేశారు .ఇంటికి కిటికీల ప్రేమలున్నాయి తప్ప గ్లాస్ లు గానీ,చెక్కలు గాని లేవని రాత్రి వేళలో అన్నం ప్లేట్లలో పురుగులు నిండుతున్నాయని నివాసం వుంటున్నవారు ఇబ్బందుల పడుతున్నారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని RI (మల్లికార్జున్)గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇట్టి వినతి పత్రం కలెక్టర్ గారికి పంపివ్వగలరని విజ్ఞతి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రచ్చ గోవర్ధన్, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, గర్దాసు బాలయ్య, రచ్చ రమేష్, ఆవుల సారమ్మ, వనం అలివేల, మాండ సంతోష, గంధంల రజిత, ఆవుల యాదయ్య, ఎండి అనిష్ప, ఆవుల రాజమ్మ, జిడ్డి నాగమణి, ఎద్దు సురేష్, ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 08 2024, 14:36

రైతుల రుణమాఫీ చేయాలని మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మండల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. ఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్త రామచందర్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఇంతవరకు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ నీ అమలు చేయలేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ తో పాటు రైతుబంధు రైతు బీమాను అమలు చేయాలని అదేవిధంగా కౌలు రైతుకి ఇచ్చిన హామీని భేశరథిగా అమలు చేయాలని ఆయన అన్నారు. రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరాని 12 వేల రూపాయలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంట బీమా యోజన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు బందారపు రాములు, మంద నరసింహ, పబ్బు వెంకటేశం, కట్ట దానయ్య, పెరికే వెంకటేశం, గొలనుకొండ ప్రభాకర్ ఆవుల బిక్షం సింగనబోయిన కృష్ణ సోలిపురం జనార్దన్ రెడ్డి బొడిగే ఆనంద్ బుంగమట్ల బుచ్చయ్య, అంతటి పాండు, బాలగోని మహేందర్, శివ పబ్బు, రమేష్, మైలారం బీరప్ప, సోలిపురం వేణు రెడ్డి, కొత్త అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.