madagoni surendar

Jul 06 2024, 21:49

వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు.

వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు నకిలీ విలేకరుల అరెస్టు.

 వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం సీఐ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి నకిలీ ప్రెస్ లోగోను పట్టుకొని విలేకరులమని పేర్లు చెబుతూ వచ్చిపోయే లారీలను ఆపి వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వని లారీ డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తూ విలేకరులమని చలామణి అవుతున్న ముగ్గురుని శనివారం వెంకటాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద రూ.32 వేల నగదు, 3 ఐడి కార్డ్స్, నకిలీ ప్రెస్ లోగో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

madagoni surendar

Jul 06 2024, 19:34

ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.

ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు

న్యూ ఢిల్లీ :జులై 06

జూన్ 18వ లోక్‌సభ కొలు వుదీరిన విషయం తెలిసిం దే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌ సభ స్పీకర్‌ గా ఎన్నికయ్యారు. 

ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభం కానున్న ట్లు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు శనివారం ప్రకటించారు. 

ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్ట నున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యం తర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నిక ల అనంతరం పూర్తిస్థాయి లో బడ్జెట్‌ ప్రవేశపెట్టను న్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. 

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశ పెట్టనున్నారు...

madagoni surendar

Jul 06 2024, 17:59

టిఎఎస్ జేఏ బృందాన్ని పీర్ల పండుగకు ఆహ్వానించిన ముజావర్లు

టిఎఎస్ జే ఏ బృందాన్ని పీర్ల పండుగకు ఆహ్వానించిన ముజావర్లు

నల్గొండ జిల్లా :-

.

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ లో ముస్లిం పెద్దలు స్థానికంగా జరుపుకునే పండుగ పీర్ల పండుగ ఇట్టి పీర్ల పండుగ రేపు జూలై 07 నుండి జూలై 17 వరకు వరుసగా పది రోజులు వైభవంగా జరుపుకునే ఈ పీర్ల పండుగకు స్థానిక ముస్లిం పెద్దలు ముజావర్లు అయినటువంటి షేక్ సైదాభి,షేక్ మోయినొద్దిన్, షేక్ నాగూల్ మీరా మొదలైన ముస్లిం మైనారిటీ సోదరులు ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానం అందించి తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరు ఇట్టి పీర్ల పండుగ కార్యక్రమం లో పాల్గొని మొక్కుబడులు చెల్లించి పీర్లకు దట్టిలు గంధం కొబ్బరి కుడకలు బెల్లం సమర్పించుకొని ఆహ్వానించడం జరిగింది అని తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు టి ఎస్ జే ఏ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్, టి ఎస్ జే ఏ నియోజకవర్గ నూతన అధ్యక్షులు అల్వాల రవికుమార్, టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ మాజీ ప్రస్తుత గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు తెలిపినారు.

madagoni surendar

Jul 06 2024, 15:52

సూర్యాపేట లో బాలెంల సాంఘీక సంక్షేమ గురుకులలో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రూంలో బీరు సీసాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*సూర్యాపేట లో బాలెంల సాంఘీక సంక్షేమ గురుకులలో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రూంలో బీరు సీసాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

madagoni surendar

Jul 06 2024, 15:40

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

ప్రజలు అప్రమత్తంగా  ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

నల్గొండ జిల్లా:-

 నల్లగొండ జిల్లా ఎస్పి  శరత్ చంద్ర పవార్    ఆదేశానుసారం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కొత్త చట్టాలపై అవగాహన కలిగించుటకు రోడ్డు ప్రమాదాలు నివారణ  గంజాయి మత్తు పదార్థాల నివారణ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత బాల కార్మికులు సోషల్ మీడియా స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలా నివారణ కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు దొంగతనాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ  ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యంపుటకు పోలీస్ కళాబృందల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ,, ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నకిరేకల్ పిఎస్ పరిధిలోని చందంపల్లి గ్రామంలోసీఐ  రాజశేఖర్,ఎస్సై  గోపిక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాకారుల బృందం షేక్ హుస్సేన్, శేఖర్ పురుషోత్తం, సత్యం, మురళి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,  ఈ సందర్భంగా,సీఐ రాజశేఖర్,ఎస్ఐ గోపిక్రిష్ణ లు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చిన అనుమానిత వ్యక్తులు కనిపించిన 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసువారికి  సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు,  

madagoni surendar

Jul 06 2024, 14:29

నలగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ నిలిచి పోయింది
నలగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో సింహపురి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టలపైనే నిలిచి పోయింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈ ట్రైన్ హిల్ బ్రేక్ లాక్ కావడన్ని గుర్తించిన రైల్వే అధికారులు

madagoni surendar

Jul 05 2024, 20:49

టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడి గా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ క్రృతజ్ఞతలు. టిఎస్జేఏ హుజూర్నగర్ అధ్యక్షులు అల్వాల రవికుమార్

టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడి గా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ క్రృతజ్ఞతలు

టిఎస్జేఏ హుజూర్నగర్ అధ్యక్షులు అల్వాల రవికుమార్*

నల్గొండ జిల్లా :-

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి కి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి నాగబాబు కి,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు కి ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము కి,రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ కి , రాష్ట్ర కమిటీ సభ్యులు దేవరం రామకృష్ణారెడ్డి కి, బరిగెల విజయ్ కుమార్ కి,త్రిపురం లక్ష్మారెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని

హుజూర్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు అల్వాల రవికుమార్ అన్నారు.

madagoni surendar

Jul 05 2024, 14:30

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌.

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్:జులై 05

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు.

కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు.

ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నా డు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది.

తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది.తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు

సోనూసూద్‌. అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడు గ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గి లింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు.

మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది...

madagoni surendar

Jul 03 2024, 18:42

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన., అనంతరం.. కట్టంగూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ, ఎంపీటీసీ ల 5 సంవత్సరాల (2019-2024)పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో కట్టంగూర్ జెల్లా ఎంపీపీ ముత్తిలింగయ్య.కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ టు మాద యాదగిరి,అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Jul 03 2024, 14:18

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకు న్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది.

కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ లో చేరారు..