madagoni surendar

Jul 05 2024, 14:30

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌.

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్:జులై 05

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు.

కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను ఈరోజు సంద‌ర్శిం చారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్‌కు వెళ్లి ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.తాను కుమారి ఆంటీతో ఉన్నాన‌ని, ఆమె గురించి ఎంతో విన్న‌ట్లుగా ఆ వీడియోలో సోనూసూద్ చెప్పుకొచ్చారు.

ఉమెన్ ఎంప‌వ‌ర్మెంట్‌కి నిజ‌మైన అర్థం ఇదేన‌ని అన్నాడు. కుటుంబం కోసం స్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డుతు న్నార‌ని, ఇందుకు కుమారి ఆంటీ స‌జీవ సాక్ష్య‌మ‌న్నా డు. వెజ్‌, నాన్‌వెజ్‌ల‌లో ఏదీ ల‌భిస్తుంద‌ని అడుగ‌గా.. రెండు ఉంటాయ‌ని కుమారి ఆంటీ చెప్పింది.

తాను వెజిటేరియ‌న్ అని ప్లేట్ ఎంతా అని అడిగారు. వెజ్ అయితే రూ.80, నాన్ వెజ్ అయితే రూ.120 అని తెలిపింది.తాను రూ.80 క‌స్ట‌మ‌ర్ అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు

సోనూసూద్‌. అదే స‌మ‌ యంలో త‌న‌కు ఎంత డిస్కౌంట్ ఇస్తార‌ని అడు గ‌గా.. మీకైతే ఫ్రీగానే పెడ‌తాన‌ని చెప్పింది. ఈ రోజు నాకు లాట‌రీ త‌గి లింది. ఫ్రీగా పెడ‌తానంటే ప్ర‌తి రోజు వ‌స్తాన‌ని సోనూ అన్నాడు.

మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా త‌క్కువే అంటూ కుమారి ఆంటి అంది. అనంత‌రం కుమారి ఆంటీని సోనూసూద్ స‌త్క‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్‌గా మారింది...

madagoni surendar

Jul 03 2024, 18:42

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ నియోజకవర్గం:-కట్టంగూర్ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 96 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన., అనంతరం.. కట్టంగూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ, ఎంపీటీసీ ల 5 సంవత్సరాల (2019-2024)పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న.నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.ఈ కార్యక్రమంలో కట్టంగూర్ జెల్లా ఎంపీపీ ముత్తిలింగయ్య.కట్టంగూర్ మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ టు మాద యాదగిరి,అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

madagoni surendar

Jul 03 2024, 14:18

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‎లోకి కేకే

బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‎లో చేరేందుకు నిర్ణయించుకు న్నారు. నేడు ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన కేకే కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది.

కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ లో చేరారు..

madagoni surendar

Jul 03 2024, 12:28

ఖమ్మం జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరో వాహనం.

ఖమ్మం జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరోవాహనం.

నల్గొండ జిల్లా :-

సూర్యాపేట జిల్లా : టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారి, చివ్వెంల మండల పరిధిలోని ఎల్ ఎన్ రావు తండా సమీపంలో బొలెరో వాహనం హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూన్న క్రమంలో టైర్ పంచర్ అవ్వడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ వాహనంలో నారాయణ కళాశాల సంబంధించిన ప్రింటింగ్ బుక్స్ లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవ్వగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.

madagoni surendar

Jul 02 2024, 18:08

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన నిర్మించిన అదనపు గదులు మరియు రేకుల షెడ్డు ను ప్రారంభించిన.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో రివ్యూ ను చేపట్టడం జరిగింది త్వరలో పదవి విరమణ చేయబోతున్న ఎంపీపీని,యంపిటిసి సభ్యులను ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :-గడిసిన కాలంలో ప్రజలకు సేవ చేసిన నకిరేకల్ ఎంపీపీ కి అభినందనలు ప్రజాపతినిదులకు పదవి కాలం ముగిసింది తిరిగి మళ్లీ ప్రజాలకు సేవ చేస్తే ప్రజాప్రతినిదులు కావచ్చు గడిసిన 4 సంవత్సరాలో ఏలాంటి అభివృద్ధి చెందలేదు ఈ 05 సంవత్సరాలో మెరుగ్తెన అభివృద్ధి చేసుకుందాం ప్రజాప్రతినిదులు కాల పరిమితి ఉంటుంది, అధికారులకు జీవితం మైతం ఉంటుంది అధికారులందరికి నా సహయసహకరం ఉంటుంది

యం.పి.పి నిత్యం పేద ప్రజలకు సేవ చేస్తుంటారు వారికి అభినందనలు..ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య,నకిరేకల్ మండల ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్,నకిరేకల్ పి.ఏ.సి.ఎస్.చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,మండల ప్రజాప్రతినిదులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు..

madagoni surendar

Jun 29 2024, 13:39

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్

నల్లగొండ జిల్లా :-

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారి జన్మదినం సందర్భంగా నకిరేకల్ లో వారి నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకకు హజరై కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన.కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ముక్కామల శేఖర్ యాదవ్, కట్టంగూర్ మాజీ ఎంపీటీసీ గట్టిగొర్ల సత్తయ్య యాదవ్, కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు మేడి విజయకుమార్,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Jun 24 2024, 19:53

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

"ప్రజావాణి" తో ప్రజల సమస్యలు పరిష్కారం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

సోమవారం నాడు నకిరేకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో నిర్వహించే వారు.పేద వారికి, వృద్ధులు, వికలాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటురని దూర బారం ఐతుందని గమనించి మన జిల్లా కలెక్టర్ ఇకపై ప్రతీ సోమవారం మండల స్థాయి కార్యలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించలను కోవటం మంచి నిర్ణయం.

ఇకపై సమస్యలు పరిష్కారానికి సులువుగా ఉంటుంది

అధికారులందరికి నా విజ్ఞప్తి మీకు ఏ సమస్యలున్నా నేను పరిష్కారం చేస్తా నా దృష్టికి తీసుకురండి. మీ వంతుగా కూడా వచ్చిన దరఖాస్తులన్నీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయండి పారదర్శకంవమైన పాలన ఇద్దాంనకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న అధికారులందరూ బాగా పనిచేస్తున్నారు అందరికీ నా అభినందనలు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్,పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు.

madagoni surendar

May 14 2024, 16:27

నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే.ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న
నల్గొండ, ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నకిరేకల్ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  మరియు నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు ఈ కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వివిధ సంఘాల నాయకులు,పట్టభద్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్  ఎమ్మెల్యే వీరేశం  మాట్లాడుతూ -; ఈనాటి నల్గొండ,ఖమ్మం,వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎంమ్మెల్సి అభ్యర్థిగా బరిలో ఉంటున్న తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా మన నియోజకవర్గం నుండి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మన అందరి ఆశీర్వాదం మల్లన్నగారికి ఇచ్చి మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కోసం ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరందరూ ఒకసారి చప్పట్ల ద్వారా మల్లన్నగారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందు ఉన్న నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మల్లన్నకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన DTF,PRTU,TPTF సంఘాల నాయకులు రావడం జరిగింది,వాళ్ళందరూ మల్లన్నను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తునందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా.. ఈరోజు ముఖ్యంగా మల్లన్నకు ఎందుకు ఓటు వెయ్యాలి అన్నదానికి నేను సమాధానం చెప్త.మల్లన్న చట్ట సభలకు పోవాలి. నేను మొన్న ఒక యూట్యూబ్ లో చూసిన ఏంత సిల్లి గా ఏంత చిల్లర గా మాట్లడుతుండంటే ఒక వ్యక్తి దాదాపు సెంచరీ కి నియరెస్టు గా కేసులు పెట్టుకొని తెలంగాణలో నడుస్తున్న నియంతృత్వ పాలనను,నియంత పాలనను గద్దె దించేవరకు ఎన్ని కేసులైనా ఎన్నిసార్లు జైలుకైన చివరికి తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా పెడతా కానీ ఆ దొర కి తలవంచ అని ఆ దొరని దించడమే లక్ష్యం అని కొట్లడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అలా కొట్లడిండు కాబట్టే తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకి వాస్తవాలు చుయించిండు కాబట్టే,తెలంగాణ ప్రజలకు సత్యాలు చెప్పిండు కాబట్టే, ఆ సత్యాలను వాస్తవాలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే సత్యాన్ని కూడా ఈ సందర్బంగా గుర్తు చేస్తున్న.నేను చాలామంది జర్నలిస్టులను చూసిన,నాకు చాలా మంది జర్నలిస్టులు ప్రెండ్స్ ఉన్నారు.ఏక్కడనో ఒక్క దగ్గర కుటుంబమో పిల్లలో ఆస్తి అంతస్తో అడ్డువచ్చి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది.కానీ మల్లన్న తో నాకు అంతకుముందు పరిచయం లేకున్నా చాలా గర్వపడే వాడిని ఒక నిఖార్సయిన జర్నలిస్టు గా ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపుత అని ఛాలెంజ్ చేసిన దమ్మున్న మొగోడు మల్లన్న ఒక కమిట్మెంట్ ఉంటే ఒక నిబద్ధత ఉంటే ఒక నిఖార్సయిన వ్యక్తిగా ఎదైనా సాధించవచ్చు అని మల్లన్న ను చూస్తే తెలుస్తుంది ఆరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోజు ఉన్న ధనం,ఆరోజు ఉన్నటువంటి అధికార భలం నాతో సహా ఏ ఒక్కరూ సపోర్ట్ చెయ్యకున్న ప్రజల బలంతోని చువుకున్న వాళ్ళ బలంతోని ,ఆలోచించే వాళ్ళ మద్దతు తొని కొద్దిలో మిస్ అయ్యింది.కానీ నైతికమైన గెలుపైన కూడా గెలుపు స్వీకరించలేదు ఓటమి అనే గుణపాఠం నుండి గెలుపు అనే మెట్టు వైపు పరుగెడుత అని బయల్దేరిన వ్యక్తి మన మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో మనకి తెలిసిన ప్రతి ఒక్కరికీ పోన్ చేసి మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి మద్దతుగా నిలబడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మల్లన్న వాయిస్ చట్ట సభల్లో ఉంటే అది సామాన్యుని వాయిస్ ప్రజల వాయిస్ ,నీతి వైపు ధర్మం వైపు మాట్లాడిన గొంతుక చట్ట సభల్లో ఉంచవలసిన అవసరం మన మీద ఉంది.నిన్న జరిగిన ఎన్నికలలో చూసినం బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి.ఈ రెండు పార్టీలు వేరు కాదు అని నిన్న ఎన్నికలలో తేలిపోయింది.రేపు జరగబోయే ఎంయల్సి ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యే ప్రమాదం ఉంది.కావున మనం అందరం కలిసి మల్లన్నకు ఓటు వేసి భారీ మెజారిటీతో చట్ట సభకు పంపించవల్సిందిగా కొరుకుంటున్నాను.

నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ -;
ఖమ్మం,నల్లగొండ,వరంగల్, పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న నిలబడ్డడు . ఎక్కడికి పోయిన ఒక్కటే మాట పోయిన సారి మల్లన్నకు అన్యాయం జరిగింది.. ఈసారి జరగదు  అసలు ఈ ఉపఎన్నిక ఎందుకొచ్చిందంటే....!!పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆఫ్ట్రాల్ పదవి ఎందుకని వదిలేస్తే వచ్చింది. 3 యేండ్ల పాటు MLCగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సంఘాల నాయకుల్ని అన్నా ముఖ్యమంత్రిని కలిపించిండా వారి సమస్యలు వినిపిచిండా.
నేను MLC ఐన తెల్లారే అన్ని ఉద్యోగ సంఘాల నాయకుల్ని సీఎం దగ్గరికి తోలుక పోతా...వారి సమస్యలు వినిపిస్తా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లో ఉన్నన్ని నాళ్ళు కబ్జాలు చేయటానికే టైం సరిపోలేదు... ఇంకా మనకు పనిచేయటానికి టైం ఎక్కడిది.నేను ఓడిపోయిన రోజునుండి ఈ రోజు వరకు కూడా మీకోసం పేదల కోసం పోరాటం చేస్తునే ఉన్న.... చేస్తూనే ఉంటా. కేసీఆర్ వందల కేసులు నా మీద పెట్టించిండు.... నేను ఏ రోజు భయపడలేదు.

ఆ కేసుల్లో నాసొంత సమస్య ఒక్కటి లేదు అవన్నీ కేసీఆర్ ని ప్రశ్నించడం మూలంగా పెట్టిన అక్రమ కేసులే . కేసీఆర్ ని గద్దె దించుతామని శపథం చేసిన చేసిచూయించిన అది నా పోరాట పటిమ అంటే. ఈ ఎన్నికల్లో మీ ప్రేమ అభిమానం ఎలా ఉండబోతుందో నాకు తెలుసు  ఎక్కడన్నా ఈదేశ రాజకీయాల్లో తన కుటుంబ ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి రాజకీయాల్లో పోటీ చేసిన నాయకుడు ఉండా? ఇంత వరకు లేడు కదా. ఇగో మీ వీరేశం అన్న తమ్ముడు తీన్మార్ మల్లన్న మాత్రం ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి MLCగా పోటీ చేస్తుండు

అమ్మ అయ్య మీద ఒట్టేసి చెబుతున్న మీ ఓటు వృధా కానివ్వను....

madagoni surendar

May 08 2024, 15:26

ఎట్టకేలకు పట్టాలెక్కనున్న తొలి ప్రైవేట్ రైలు
ఎట్టకేలకు పట్టాలెక్కనున్న తొలి ప్రైవేట్ రైలు
దేశంలోని తొలి ప్రయివేటు రైలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.

కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది.

భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.

తిరువనంతపురంలో మొదలయ్యే ఈ రైలు త్రివేండ్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ మీదుగా గోవా చేరుకుంటుంది.

ఈ రైల్లో 2 స్లీపర్ కోచ్‌లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లు, 2 సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.

వైద్య నిపుణులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనువుగా టూర్ ప్యాకేజీలను సైతం రెడీ చేశారు.....

madagoni surendar

May 02 2024, 10:12

కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లోఇంటింటి ప్రచారం నిర్వహించిన.నాయకులు
నల్గొండ జిల్లా:- కట్టంగూర్ మండల కేంద్రంలోని 195 వ బూత్ లో   గురువారం నాడు భువనగిరి పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా యూవజన నాయకులు రెడ్డిపల్లి విరస్వామి,నాయకులు చిక్కుల లింగయ్య,పోగుల చంద్రయ్య గౌడ్, సలీమ్,బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు