Telangananews

Jul 03 2024, 15:31

TG : విద్యార్థులకు శుభవార్త... త్వరలో లాప్ టాప్ లు

రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు పాఠశాల విద్యార్థులకు 20వేల ల్యాప్టాప్లు అందించాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దీనిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నోకియా సంస్థ ప్రతినిధులతో CM చర్చించారు. లాప్ టాప్ లు ఏ క్లాస్ నుంచి అందించాలనే అంశాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Telangananews

Jul 03 2024, 15:27

TS : మళ్ళీ పొడగించిన కవిత జ్యుడీషియల్ కస్టడీ


ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న BRS ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

ఇవాళితో కవిత జ్యడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. తదుపరి విచారణను జులై 25కి రొజ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

Telangananews

Jul 03 2024, 15:24

TG : త్వరలో ధరణిలో సంస్కరణలపై నివేదిక!
రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు ధరణి కమిటీ.. పోర్టల్ లో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇక శాశ్వత పరిష్కారాల్లో భాగంగా పోర్టల్లో మార్పులు చేర్పులు చేయడం ఒక్కటే మిగిలి ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ గుర్తించిన అంశాలతో కూడిన నివేదికను కొద్దిరోజుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమోదంతో సీఎం రేవంత్రెడ్డికి అందజేయనున్నట్లు సమాచారం.

Telangananews

Jul 01 2024, 09:09

తిరుమల సమాచారం 01-జులై-2024 సోమవారం
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 01-జులై-2024 సోమవారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Telangananews

Jul 01 2024, 09:05

నేటి రాశి ఫలాలు జులై 01, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు జులై 01, 2024 మేషం ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి. వృషభం సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం ఉండబోతోంది. మానసిక ప్రశాంతత కోసం శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం. మిధునం ప్రారంభించిన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది. కర్కాటకం అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శని శ్లోకం చదివితే మంచిది. సింహం ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు లాభిస్తాయి. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్య స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది. తుల దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ, సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం. వృశ్చికం ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ధనుస్సు మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి. మకరం ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారులు సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం. కుంభం మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. మీనం కీలక వ్యవహారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jul 01 2024, 09:00

నేటి పంచాంగం జులై 01, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం జులై 01, 2024 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం, తిథి : దశమి ఉ11.00 వరకు, నక్షత్రం : అశ్విని ఉ7.38 వరకు, యోగం : సుకర్మ మ3.21 వరకు, కరణం : భద్ర ఉ11.00 వరకు, తదుపరి బవ రా9.56 వరకు, వర్జ్యం : సా4.41 - 6.12, దుర్ముహూర్తము : మ12.29 - 1.21, మ3.05 - 3.57, అమృతకాలం : రా1.45 - 3.15, రాహుకాలం : ఉ7.30 - 9.00, యమగండం : ఉ10.30 - 12.00, సూర్యరాశి : మిథునం, చంద్రరాశి : మేషం, సూర్యోదయం : 5.32, సూర్యాస్తమయం: 6.34.

Telangananews

Jun 29 2024, 08:30

తిరుమల సమాచారం 29-జూన్-2024 శనివారం
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 29-జూన్-2024 శనివారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Telangananews

Jun 29 2024, 08:27

నేటి రాశి ఫలాలు జూన్ 29, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు జూన్ 29, 2024 మేషం నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిధునం దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. కర్కాటకం వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. కన్య ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. తుల కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వృశ్చికం వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. ధనస్సు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. మకరం వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. కుంభం ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీనం వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jun 29 2024, 08:22

నేటి పంచాంగం జూన్ 29, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం జూన్ 29, 2024 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: కృష్ణ - బహుళ తిథి: అష్టమి సా.04:00 వరకు తదుపరి నవమి వారం: శనివారం - మందవాసరే నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ‌11:06 వరకు తదుపరి రేవతి యోగం: శోభన సా.06:51 వరకు తదుపరి అతిగండ కరణం: కౌలువ సా.04:00 వరకు తదుపరి తైతుల రా.02:41 వరకు తదుపరి గరజ వర్జ్యం: రా.10:18 - 11:47 వరకు దుర్ముహూర్తం: ఉ‌.05:44 - 07:24 రాహు కాలం: ఉ‌.09:02 - 10:41 గుళిక కాలం: ఉ‌.05:44 - 07:23 యమ గండం: ప‌.01:58 - 03:37 అభిజిత్: 11:53 - 12:45 సూర్యోదయం: 05:44 సూర్యాస్తమయం: 06:54 చంద్రోదయం: రా.12:07 చంద్రాస్తమయం: ప‌.12:38 సూర్య సంచార రాశి: మిథునం చంద్ర సంచార రాశి: మీనం దిశ శూల: తూర్పు త్రిలోచనాష్టమీ వ్రతం త్రిలోచనపూజ అనఘాష్టమి ఆళంది సంత్‌ జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకి ప్రస్థానం తిందుకాష్టమి‌ శీతలాష్టమి వినాయకాష్టమి‌ కాళిక్కామ‌ నాయనార్‌ గురుపూజ

Telangananews

Jun 28 2024, 08:55

పిసిసి చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ...
పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది.

అందులో భాగంగా టి-కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఏఐసిసి గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన మంత్రులకు, సీనియర్‌లకు ఏఐసిసి కబురు పంపింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రు లు వివిధ పనుల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.

ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సైతం ఏఐసిసి ఆదేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకొని గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక,

మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ అయ్యారు.

అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది.