నిజంనిప్పులాంటిది

Jul 02 2024, 12:53

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..

దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ..

తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేసిన భీమవరంకు చెందిన శివ కుమారి 

యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ 

విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.

జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్న స్పెషల్ టీం.

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్.

నిజంనిప్పులాంటిది

Jul 02 2024, 09:53

తాడేపల్లిలో జగన్​ నివాసం దగ్గర అడ్డంకులు తొలగింపు - హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఎవరైనా అనుమతి లేకుండా వెళ్లే వాహనాలను నిలుపుదల చేసేందుకు జగన్​ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన రెండు టైర్ కిల్లర్లు, నాలుగు హైడ్రాలిక్ బొలార్డ్స్ భూమిలో ఏర్పాటు చేశారు. ఇవి ఆటోమేటిక్ విధానంలో పని చేస్తాయి. వీటిని తొలగించి, జగన్ ఇంటి సమీపంలోని చెకింగ్ పాయింట్లను తీసేశారు.

వైఎస్సార్సీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. జగన్‌ ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కావడంతో ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రత టెంట్​లను సోమవారం రాత్రి తొలగించారు, ఆయన నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో గతంలో అత్యంత ఆధునిక సామగ్రితో భద్రతా ఏర్పాటు చేశారు.

ఇప్పుడు జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపి వేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు (మేకులతో కూడిన బారికేడ్లు), హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్​తో పని చేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్రరత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. రహదారి వెంట కంటైనర్లు మాత్రం అలాగే ఉన్నాయి.

ఇంతకు ముందే తాడేపల్లి ప్యాలెస్ ముందు అంక్షలు తొలిగాయి. నాలుగు లేన్ల రహదారి మంగళగిరి - తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించటంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్బంధించారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ రహదారిలోకి వెళ్లాలంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫొటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది.

ఇదే విధంగా జగన్​ అక్రమ కట్టడాలు, ఆడంబర బందోబస్తులకు ఎన్డీయే ప్రభుత్వం ఒక్కొక్కటిగా చెక్​ పెడుతోంది. దీంతో ప్రజలకు విముక్తి కలుగుతోంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ జగన్​ వెలగబెట్టిన కార్యాలను ప్రభుత్వం చక్కబెడుతూ వస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:36

హైకోర్టులోను కేసీఆర్‌కు ఎదురుదెబ్బ !

- పవర్ కమిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం 

- కెసీఆర్ ను విచారించాలని గ్రీన్ సిగ్నల్ 

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణపై కేసీఆర్ సవాల్ చేశారు.

నేడు కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది.

హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మూడు రోజుల ముందే వాద‌న‌లు ముగిశాయి. అయితే ఆ రోజున హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అసలు కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని నియమించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని ఇవాళ హైకోర్టు కొట్టివేసింది.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:34

పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కిన రైతు !

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు చెట్టు ఎక్కిన సంఘటన చోటు చేసుకుంది బాధితుడు భూక్య బాలు చెప్పిన వివరాల ప్రకారం

పెద్దనాగారం జీపీ పరిధిలోని హజ్ తండ కు చెందిన తనకు రెండు ఎకరాల భూమి ఉండగా తన భూమిని భూక్య హరిలాల్ భద్రు ల పేరిట పట్టా చేయడంతో తను సర్వేకు అప్లై చేసుకొనగా సర్వేయర్ వచ్చి సర్వే చేసే క్రమంలో అడ్డు తగిలినట్లు తెలిపాడు.

తన భూమిని తనకి ఇప్పించాలంటూ ఎన్నోసార్లు తహశీల్దార్ కు విన్నవించుకున్నట్లు తెలిపాడు ఇప్పటివరకు తన భూమిని తన పేరిట చేయకపోవడంతో తనకు అన్యాయం జరిగుతుందని బాధితుడు బాలు తెలిపాడు.

తహశీల్దార్ నాగరాజును వివరణ కోరగా సర్వేయర్ వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలియ చేయనున్నట్లు తెలిపాడు తహశీల్దార్ పోలీసులు భూ సమస్యను పరిష్కరించుతామంటూ హామీ ఇవ్వడంతో రైతు చెట్టుపైనుండి కిందికి దిగాడు.

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 16:05

వామ్మో ‼️; రాష్ట్రంలో మళ్ల కరెంట్ తిప్పలు !

- ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కోతలు 

- ఆదిలాబాద్ రిమ్స్ లో కరెంటు లేక మస్తు తిప్పలు 

- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి 

- రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లో కరెంటు కోతలు 

- తక్కువ ఓల్డ్ ఏజ్ కి ఇంటికి సరఫరా పెరుగుతున్న విద్యుత్ బిల్లులు 

- పంట పొలాల్లో కాలిపోతున్న మోటర్లు 

తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది. ఇగ ఎండాకాలంలో పొలాలన్నీ బీళ్లుగానే ఉండేటివి. ఆనాడు నరకం చూసినం. ఇక వెల్డింగ్‌, మెకానిక్‌వంటి దుకాణాలు నడిపించే వారికి గిరాకీలుండేటివి కావు. కరెంట్‌ కోతల వల్ల అనేక పరిశ్రమలు మూతపడ్డయ్‌. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినంక 24 గంటల ఉచిత కరెంటిచ్చిన్రు.

రైతులందరం పదేండ్ల పాటు రంది లేకుంట ఎవుసం చేసుకున్నం. యేటా రెండు.. మూడు పంటలు కూడా తీసినం. నిరంతర విద్యుత్‌తో చిరువ్యాపారులకు సైతం చేతినిండా పని దొరికింది. ఇదంగా కేసీఆర్‌ గొప్పతనమే. గాయనలెక్క మంచి పనులు చేసినోళ్లు లేరు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్‌ కష్టాలు మొదలైనయ్‌. ఎప్పుడు పడితే అప్పుడు కోతలు పెడుతున్నరు. యాసంగిలో పంటలు ఎండిపోయినయ్‌. గీ వర్షాకాలంలో కూడా కరెంటు సరిగా ఇస్తరో.. ఇవ్వరోనని భయమైతంది.’ అని రైతులు అభిప్రాయపడుతున్నారు.

2014 కంటే ముందు కరెంటు లేక అష్టకష్టాలు పడ్డం. కరెంటు లేక, లో ఓల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. రైతులు అరిగోస పడుతున్నా పట్టించుకునేవాళ్లు కాదు. కాలిపోయిన కరెంటు మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు రిపేరు చేయించుకునేందుకు తిప్పలపడేటోళ్లం. తెలంగాణ వచ్చినంక మా గోస తీర్చింది కేసీఆరే. 24 గంటల పాటు కరెంటిచ్చిండు. పదేండ్లు రంది లేకుంట పంటలు తీసినం. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినంక మళ్లా కరెంట్‌ కోతలు పెడుతున్నరు. పంటలు పండుతయన్న గ్యారెంటీ లేకుంటైతంది. 

తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు అనుభవించినం. కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. పంటలేసి మస్తు నష్టపోయినం. కొందరైతే ఎవుసం ఇడిసిపెట్టి కూలీ పనులకు పోయిన్రు. మన రాష్ట్రం వచ్చి కేసీఆర్‌ సీఎం అయినంక రైతుల బాధలు తీర్చిండు. 24 గంటలు కరెంటిచ్చి ఢోకా లేకుంట చేసిండు.

 - రైతు (లచ్చయ్య) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

నిజంనిప్పులాంటిది

Jul 01 2024, 07:48

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం..

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్‌ పాములు నాయక్‌ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేసిన సీఎం చంద్రబాబు.. పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌.. 

లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

నిజంనిప్పులాంటిది

Jun 30 2024, 07:13

టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది...

భారత్ మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణయత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది..

విరాట్ కోహ్లీ 76 (59) పరుగులతో రాణించగా అక్షర్ పటేల్ 47 (31) పరుగులు శివం దుబాయ్ 27 (16) పరుగులు చేశారు..

తర్వాత బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ నష్టానికి 169 పరుగులు చేసి పరుగులు చేసి భారత్ చేతిలో ఓటమిపాలైంది..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 29 2024, 08:54

మరికాసేపట్లో కొండగట్టుకు పవన్ కళ్యాణ్!

మరికాసేపట్లో హైదరాబాద్ నుంచి కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.

గతంలో వారాహికి తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు. కూటమి పొత్తులను ప్రకటించింది కొండగట్టులోనే కావడం గమనార్హం. రాత్రి అమరావతి నుంచి పవన్ హైదరాబాద్ వచ్చారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్‌‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకుంటారు.

కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజలు తర్వాత తిరిగి హైదరాబాద్‌కు కల్యాణ్ ప్రయాణమవుతారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30గంలకు హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు.

తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.

నిజంనిప్పులాంటిది

Jun 28 2024, 07:36

త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణ!

- జూలై మొదటివారంలోనే ముహూర్తం.. 

- పీసీసీ చీఫ్‌ ఎంపికపైనా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు

- 4 రోజులుగా ఢిల్లీలోనే రేవంత్‌.. 

- అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి భట్టి.. 

- సోనియాతో మహేశ్‌కుమార్‌, యాష్కీ భేటీ

రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్‌ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్రెస్‌ అధిష్ఠా నం దృష్టి సారించింది.

క్యాబినెట్‌ విస్తరణ, పీసీసీ చీఫ్‌ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అధిష్ఠానం మళ్లీ ఢిల్లీకి పిలిపించుకున్నది. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు భేటీ అయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. జూలై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

పార్టీలో కొత్తగా చేరినవారిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి? పాతవారిలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అభిప్రాయాలను దీపాదాస్‌ మున్షీ తీసుకున్నట్టు సమాచారం. స్థానికత, సామాజికవర్గాల కోణం లో లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీకాలం జూలై 7తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి సారించడంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీగౌడ్‌ గురువారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు తమవారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు పలువురు మంత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 28 2024, 07:31

వచ్చే రెండు రోజులు వర్షాలు !

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌లోని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో అత్యధికంగా 10.49 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా కరీంనగర్‌ మండలంలో 9.89 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM