Telangananews

Jun 28 2024, 08:55

పిసిసి చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ...
పిసిసి అధ్యక్షుడి పదవిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌నాయకులు పేర్కొంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి కాలం గురువారంతో ముగియడంతో నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసిసి కసరత్తు ప్రారంభించింది.

అందులో భాగంగా టి-కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో ఏఐసిసి గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసిసి ఆదేశించింది. ఈ భేటీకి హాజరు కావాలని రాష్ట్రానికి చెందిన మంత్రులకు, సీనియర్‌లకు ఏఐసిసి కబురు పంపింది. సిఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రు లు వివిధ పనుల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఢిల్లీ టూర్‌లో ఉన్నారు.

ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సైతం ఏఐసిసి ఆదేశాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకొని గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక,

మంత్రివర్గ విస్తరణ, చేరికలు, నామినేటెడ్ పోస్టులకు నాయకుల ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టుగా పిసిసి వర్గాలు చెబుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఏఐసిసి ముఖ్య నేతలతో పాటు సిఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ అయ్యారు.

అధ్యక్ష పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అయితే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే వారికే ఈ పదవిని కట్టబెట్టాలని ఏఐసిసి భావిస్తోంది.

Telangananews

Jun 28 2024, 08:41

ఈ రోజు మధ్యాహ్నం 10th సప్లిమెంటరీ ఫలితాల విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎస్‌సి బోర్టు అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఫలితాలను అధికారిక వెబ్ సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చని వారు తెలిపారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు.

అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

Telangananews

Jun 28 2024, 06:39

ఈ రోజు రాశి ఫలాలు జూన్ 28, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః ఈ రోజు రాశి ఫలాలు
జూన్ 28, 2024

మేషం

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనసు చెడు విషయాల పైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

మిధునం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.

కర్కాటకం

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు, మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

సింహం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

కన్య

కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

తుల

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. శ్రీవిష్ణు నామస్మరణ శుభప్రదం.

ధనుస్సు

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శనిధ్యానం చేయాలి.

మకరం

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కుంభం

కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

మీనం

మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. జన్మచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శ్రేయస్కరం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jun 28 2024, 06:33

ఈ రోజు పంచాంగం జూన్ 28, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు పంచాంగం జూన్ 28, 2024 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: జ్యేష్ఠ పక్షం: కృష్ణ - బహుళ తిథి: సప్తమి సా.06:28 వరకు తదుపరి అష్టమి వారం: శుక్రవారం - భృగువాసరే నక్షత్రం: పూర్వాభాద్ర ప.12:50 వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం: సౌభాగ్య రా.09:36 వరకు తదుపరి శోభన కరణం: భధ్ర ఉ‌.07:47 వరకు తదుపరి బవ సా.06:28 వరకు తదుపరి బాలవ రా.తె.05:14 వరకు తదుపరి కౌలువ వర్జ్యం: రా.09:45 - 11:14 వరకు దుర్ముహూర్తం: ఉ‌.08:22 - 09:15 మరియు ప‌.12:45 - 01:38 రాహు కాలం: ఉ‌.10:40 - 12:19 గుళిక కాలం: ఉ‌.07:23 - 09:02 యమ గండం: ప‌.03:36 - 05:15 అభిజిత్: 11:53 - 12:45 సూర్యోదయం: 05:44 సూర్యాస్తమయం: 06:54 చంద్రోదయం: రా.12:07 చంద్రాస్తమయం: ఉ‌.11:42 సూర్య సంచార రాశి: మిథునం చంద్ర సంచార రాశి: మీనం దిశ శూల: పశ్చిమం నక్షత్ర శూల: దక్షిణం కాలాష్టమీ‌ సంత్ తుకారాం పల్లకి ప్రస్థానం పూరి జగన్నాథ్ బొవురి‌ యాత్ర శ్రీ విల్లిపుత్తూర్‌ శ్రీ ఆండాళ్ పూరపట్టు‌ ఉత్సవం

Telangananews

Jun 27 2024, 10:27

మద్యపానం కారణంగా ఏటా ఎంత మంది చనిపోతున్నారో మీకు తెలుసా...
మద్యపానం కారణంగా ఏటా ఎంత మంది చనిపోతున్నారో మీకు తెలుసా... ఆల్కహాల్, డ్రగ్స్ వల్ల ఏటా దాదాపు 30 లక్షల మంది చనిపోతున్నారని WHO వెల్లడించింది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తుందని తెలిపింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినియోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2019లో మద్యం సేవించడం వల్ల 26 లక్షల మరణాలు సంభవించాయని WHO నివేదిక పేర్కొంది.

Telangananews

Jun 27 2024, 08:48

చరిత్రలో ఈరోజు... జూన్ 27...

సంఘటనలు

1787: 1787 జూన్ 27 నాడు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. 1793 లో, బెంగాల్ లో, శాశ్వత కౌలుదారీ పద్ధతి (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరుకు ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను, మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా 1831లో కలెక్టరు కి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను), ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చింది.

2007: యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.

జననాలు

1838: బంకిం చంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (మ.1894)

1917: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.1991)

1933: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987)

1939: బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. (మ.2016)

1939: రాహుల్ దేవ్ బర్మన్ ,సంగీత దర్శకుడు .(మ.1994).

1967: గంగాధర శాస్త్రి , గాయకుడు,సంగీత దర్శకుడు.

1971: దీపేంద్ర, నేపాల్ రాజు (మ.2001).

1980: సురభి ప్రభావతి, తెలుగు రంగస్థల నటి.

1992: కార్తీక నాయర్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.(నటి రాధ కుమార్తె)

మరణాలు

1927: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (జ.1871)

1978: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (జ.1901)

2005: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942)

2008: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914)

2009: ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి.

2019: మహమ్మద్‌ బాజి కోరాపుట్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1917)

2019: విజయ నిర్మల , తెలుగు సినీ నటి, మహిళా దర్శకురాలు.(జ.1946)

Telangananews

Jun 27 2024, 08:38

తిరుమల సమాచారం 27-జూన్-2024 గురువారం

ఓం నమో వేంకటేశాయ

Telangananews

Jun 27 2024, 08:19

ఈ రోజు రాశి ఫలాలు జూన్ 27, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు రాశి ఫలాలు

జూన్ 27, 2024

మేషం

ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. లాభస్థ చంద్రస్థితి అనుకూలంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం

కర్మస్థానంలో చంద్రుడు శుభఫలితాలను ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.

మిధునం

మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.

కన్య

సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్ధికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

తుల

ప్రారంభించబోయే పనులలో పట్టుదల పనిచేసి విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

వృశ్చికం

మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభపలితాలను అందుకుంటారు.

ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం.

కుంభం

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.శ్రీఆంజనేయ

 ఆరాధన చేయాలి. 

మీనం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. లింగాష్టకం చదవండి. మంచి జరుగుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Telangananews

Jun 27 2024, 07:05

ఈ రోజు పంచాంగం జూన్ 27, 2024
ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

ఈ రోజు పంచాంగం
జూన్ 27, 2024
విక్రమ సంవత్సరం: 2081

పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: గ్రీష్మ

మాసం: జ్యేష్ఠ

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: షష్ఠి రా.08:54 వరకు తదుపరి సప్తమి

వారం: గురువారం - బృహస్పతి వాసరే

నక్షత్రం: శతభిషం ప‌.02:24 వరకు తదుపరి పూర్వాభాద్ర

యోగం: ఆయుష్మాన్ రా.12:25 వరకు తదుపరి సౌభాగ్య

కరణం: గరజ ఉ‌.10:01 వరకు తదుపరి వణిజ రా.08:54 వరకు తదుపరి భధ్ర

వర్జ్యం: రా.08:23 - 09:53 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:07 - 11:00 మరియు ప‌.03:23 - 04:16

రాహు కాలం: ప‌.01:57 - 03:36

గుళిక కాలం: ఉ‌.09:01 - 10:40

యమ గండం: ఉ‌.05:44 - 07:23

అభిజిత్: 11:53 - 12:45

సూర్యోదయం: 05:44

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: రా.11:28

చంద్రాస్తమయం: ఉ‌.10:44

సూర్య సంచార రాశి: మిథునం

చంద్ర సంచార రాశి: కుంభం

దిశ శూల: దక్షిణం

శ్రీ గోవింద మహారాజ్ పుణ్యతిథి‌
దగ్ధయోగము

స్వామి వివేకానంద పుణ్యతిథి‌

స్వామిమలై‌ శ్రీ మురుగన్ స్వర్ణకవచ‌ దర్శనం - రథోత్సవం

నానాసాహెబ్ పేష్వా‌ స్మృతి దినం

Telangananews

Mar 22 2024, 11:06

ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.
హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం.. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి ప్రియదర్శిని. చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా.. హైదరాబాద్‌ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు. తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్‌, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు. గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది. అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం.. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు