Mane Praveen

Jun 26 2024, 20:50

ఎస్పీ ని కలిసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు

నల్గొండ జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శరత్ చంద్ర పవార్ ను, మంగళవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గిరిజన సాంప్రదాయ కండువాను జిల్లా ఎస్పీకి బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేలావత్ నగేష్ నాయక్, లోకా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 26 2024, 12:40

NLG: సామాజిక కార్యకర్త కి డాక్టరేట్ ప్రదానం
నార్కట్ పల్లి మండలం, ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి రవి గత కొంత కాలంగా, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ సృస్తికర్త అయినటువంటి డాక్టర్ కృష్ణంరాజు తో పనిచేస్తూ రాష్ట్రంలో పలు జిల్లాలలో రక్తం అవసరం ఉన్నవారికి కొన్ని వందల మందికి రక్తధాతలని పంపించి అవసరం తీర్చి,  సోషల్ వర్కర్ గా గుర్తింపు పొంది అనేక రకాల సేవ కార్యక్రమాలలో పాల్గొని ముందుండి నడిపిస్తూ సేవ చేస్తున్నారు. వారు చేసే సేవలకు ఐకానిక్ పీస్ అవార్డ్ కౌన్సిల్  ( IPAC ) వారు విడుదల చేసిన డాక్టరేట్ డిగ్రీ కి నామినేషన్ లో ఎంపికైయ్యారు. ఈ అవార్డు ను ఐకానిక్ పీస్ అవార్డు కౌన్సిల్ చే సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా ఢిల్లీ లో గౌరవ డాక్టరెట్ ని అందుకున్నారు.

Mane Praveen

Jun 25 2024, 14:44

అనుమతుల్లేని పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి
బీసీ విద్యార్థి సంఘం మరియు బిసి రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్పిఆర్ హైస్కూల్ పేరు మీద పాఠశాలను చలాయిస్తున్నారని, దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవనీ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని, విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరుతున్నట్లు తెలిపారు. ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ చోరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Mane Praveen

Jun 25 2024, 14:34

బొట్టుగూడ హైస్కూల్లో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ
హైస్కూల్లో యూత్ ఫర్ సేవ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఇవాళ విద్యార్థినీ విద్యార్థులకు మానవ శరీర నిర్మాణం మరియు అంతర్గత అవయాల పనితీరు మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకొనుట కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడిపల్లి లింగయ్య గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మరియు యూత్ ఫర్ సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 24 2024, 22:10

అంగన్వాడీల వేతనాలు పెంచాలి: ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్
NLG: అంగన్వాడీల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తక్షణమే వేతనాలు పెంచాలని ఇతర హామీలు అమలు చేయాలని  ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. AITUC ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడిల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.  రాష్ట్ర వ్యాప్తంగా2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల సమ్మె చేస్తే  గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అంగన్వాడి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే రూ. 18 వేల వేతనం చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు హెల్పర్ కు 5 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు లక్ష రూపాయలు ఆయాకు 50 వేలు మాత్రమే చెల్లిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని అన్నారు.

అంగన్వాడి లపై పనిబారం తగ్గించాలని ,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , ఖాళీగా ఉన్న  సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని  డిమాండ్ చేసారు. గ్రామస్థాయిలో అన్ని రకాల పనులు అంగన్వాడీల చేత చేయిస్తూ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.

అంగన్వాడి సెంటర్ కు గుడ్లు నాణ్యత లేకుండా వస్తున్నాయని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు. గత ప్రభుత్వం జారీ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో నెంబర్ 10 ని వెంటనే రద్దు చేయాలని కోరారు. గతంలో సమ్మె కాలపు 24 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని దీనివలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందడం లేదని అన్నారు.

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ మాట్లాడుతూ.. గత 50 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు గా ఆయాలుగా   పనిచేస్తున్నా నేటికీ గౌరవ వేతనం మాత్రమే పొందుతూ వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంటి అద్దెలు కూరగాయల బిల్లులు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడమ సుమతమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు శాంత కుమారి, కోట్ల శోభ, శంతాబాయి, సాయి సుజిత, బి.రాణి, అన్నపూర్ణ, ప్రభావతి, అంజలి,రమణ,వణజా, విజయ,టీ సరిత,దస్లి,జగదేశ్వరీ, పద్మావతి, సునీత, కేదారి,స్వప్న బక్కమ్మ,CH. తారక, జయంతి జంగమ్మ, జ్యోతి, ప్రమీల, అరుణ విజయలక్ష్మి, భద్రమ్మ, రెడ్డి బాయ్,AITUC డివిజన్ కార్యదర్శి విశ్వనాధులు లెనిన్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో  ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

Mane Praveen

Jun 24 2024, 17:05

ప్రజావాణి ని ఆర్బాట కార్యక్రమంగా మార్చొద్దు.. టైం బౌన్డ్ తో సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజావాణి ని ప్రచార ఆర్బాట కార్యక్రమంగా మార్చకుండా సమస్యలు పరిష్కరించే వేదికగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ కోరారు.

మర్రిగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మర్రిగూడ మండల పార్టీ కార్యదర్శి ఏర్పుల యాదయ్య లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అధికారులు మారినప్పుడల్లా కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. తర్వాత వాటిని పట్టించుకోకుండా ఉండే పరిస్థితి ఉందని ఇప్పుడు పెట్టే ప్రజావాణి కూడా  ప్రజలు ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలను అధికారులు స్వీకరించి టైం బౌన్డ్ ప్రకటించి పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని కోరారు. దరఖాస్తులు తీసుకొని వాటి పరిష్కారం చేయకుండా ఆర్భాట కార్యక్రమాన్ని దీని నిర్వహిస్తే రాబోయే కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. గ్రామాలలో భూమి, పెన్షన్, రేషన్ కార్డ్, ఇల్లు ఇళ్ల స్థలాలు లాంటి వ్యక్తిగత సమస్యలతో పాటు రోడ్లు కరెంటు మురికి కాలువలు తదితర సామూహిక సమస్యలు కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వీటికి ప్రభుత్వం పరిష్కారం చూపకుండా విధివిధానాలు ప్రకటించకుండా అధికారులు దరఖాస్తులు తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంటదో అధికారులు చెప్పాలని కోరారు.

ప్రజావాణి కి నిజమైన సార్ధకత దక్కాలంటే వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కారంకు టైం బౌండు పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Mane Praveen

Jun 24 2024, 09:00

పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
NLG: మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందించే దిండి ఎత్తిపోతల,ఉదయ సముద్రం, నక్కలగండి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరతగతిన పూర్తి చేసి.. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు నీరు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గం సిపిఐ మండల కార్యదర్శిల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయినట్లయితే మునుగోడు, దేవరకొండ నియోజకవర్గలలో కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. రైతులను దృష్టిలో పెట్టుకొని సాగునీటి ప్రాజెక్టులపై కాలయాపన చేయకుండా ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మాటల గారెడితో  నలగొండ జిల్లాలో పెండింగ్  సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యకుండా కాలయాపన చేసి నల్లగొండ జిల్లా రైతులను మోసం చేశారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజ రామచంద్రం, బోలుగురి నరసింహ, తీర్పురి వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శులు చాపల శ్రీను, ఈ. బిక్షం రెడ్డి, దుబ్బాక భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 23 2024, 22:06

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు
భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా, కనగల్ ఎక్స్ రోడ్ లో బిజెపి శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని, ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చలేగా నహి చలేగా అని పిలుపునిచ్చిన గొప్ప జాతీయవాది అని కొనియాడారు. మండల అధ్యక్షులు పులకరం బిక్షం,  మండల ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న, ఉపాధ్యక్షులు పంతంగి సైదులు, మాధగోని ఏడుకొండలు, మండల కోశాధికారి నీలకంఠ వెంకన్న, పాలకూరి సైదులు, బూత్ అధ్యక్షులు జక్కల నవీన్, కందుల నాగబాబు, బొమ్మగంటి లింగస్వామి, వజ శీను తదితరులు పాల్గొన్నారు.
Ads

Mane Praveen

Jun 23 2024, 21:47

తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నగునూరి శంకర్
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం, గోదావరిఖని పట్టణానికి చెందిన నగునూరి శంకర్ ను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ  తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగునూరి శంకర్ మాట్లాడుతూ.. నా పై నమ్మకంతో అప్పజెప్పిన భాధ్యతలను జాతి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్ కోసం, హక్కుల కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాష్ట్ర,జిల్లా కమిటీ తరపున కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు నగునూరి శంకర్ కు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మడికొండ ఓదక్క , రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కాసర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి మునిగంటి సంపత్ పాల్గొన్నారు.

Mane Praveen

Jun 23 2024, 21:31

విలేకరిపై తప్పుడు కేసు పెట్టిన సిఐ సస్పెండ్
ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లు గా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్.