నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:37

Delhi: ఢిల్లీలో వేడి గాలులకు పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు

ఢిల్లీ: ఉత్తర భారతదేశం(North India)లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సహా ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది..

45 నుంచి 50డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు (High temperature) నమోదు అవుతుండడంతో వేడిగాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు రాష్ట్రాల్లో రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం(IMD) ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది.

గడిచిన 72గంటల్లో వడదెబ్బతో 15మంది మృతి..

ఢిల్లీలో గరిష్ఠంగా 45డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ నెల సగటుతో పోలిస్తే ఇది 6డిగ్రీల అధికం. దీంతో ఎండ వేడిమి, వేడిగాలుల ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గడిచిన 72గంటల్లో వడదెబ్బతో 15మంది మృతిచెందారు.

వీరిలో ఢిల్లీ ఆర్ఎంఎల్, సఫ్డర్ జంగ్, LNJP ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ ఐదుగురు మృత్యువాత పడ్డారు. నోయిడాలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ RML ఆస్పత్రిలో ఇప్పటికే వడదెబ్బతో 36మంది చికిత్స పొందుతుండగా.. వారిలో లైఫ్ సపోర్ట్‌పై 12మంది రోగులు ఉన్నారు. ఇలాగే వేడిగాలులు కొనసాగితే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:36

10 రోజుల్లో న్యాయం జరగాలి.. లేదంటే కుటుంబమంతా నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి..

అనంతపురం: వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..

అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ''నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు.

బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్‌ చేసినవారు ఇంటికి పోయారు. 10 రోజుల్లో నాకు న్యాయం జరగాలి..

లేదంటే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపడతాం. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత విషయం.. నాకు న్యాయం జరగాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకీ రాజీనామా చేస్తా'' అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:35

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న వైకాపా అక్రమాలు

అమరావతి: గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు నివ్వెరపరుస్తోంది..

వైకాపా కోసం పని చేసిన కొన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలు అందాయి. ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్దఎత్తున నియామకాలు జరిగాయి.

ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వైకాపాకు అనుకూలంగా పని చేసే వ్యక్తులు.. ఉద్యోగులుగా చోటు సంపాదించారు. వీరిలో చాలా మంది అసలు ఆఫీసుకే వెళ్లలేదు. అయినా ఠంచనుగా వైకాపా సర్కారు వీరికి జీతాలు చెల్లించింది..

వారంతా వైకాపా సోషల్‌ మీడియా కోసం పనిచేస్తూ కాలం గడిపారు. కొన్ని చోట్ల అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్‌ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు సమాచారం. సొమ్ము దోచిపెట్టేందుకు జగన్‌ సర్కారు ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.

నాటి అక్రమ నియామకాలు, చెల్లింపుల వివరాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలను సేకరిస్తోంది. పలు శాఖల్లో పొరుగుసేవల పేరిట జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహిస్తోంది..

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 17:34

రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించనున్న చంద్రబాబు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది..

2015 అక్టోబరు 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.

అనంతరం సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌, ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్‌ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్‌లను పరిశీలిస్తారు.

ఐదేళ్లపాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్‌.. భవనాలను పాడుబెట్టారని దుయ్యబట్టారు. 70.. 80శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైకాపా ప్రభుత్వం వదిలేసిందన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 10:37

Pawan Kalyan: నేడు పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

సచివాలయంలో కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు..

Streetbuzz News

SB NEWS

REAL TIME NEWS PLATFORM

నిజంనిప్పులాంటిది

Jun 19 2024, 10:35

ఏపీ అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకం

•నూతన ఏజీగా దమ్మాలపాటిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

•గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి

ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దమ్మాలపాటి శ్రీనివాస్ కు అడ్వొకేట్ జనరల్ పదవి కొత్త కాదు. ఆయన గతంలో 2014 నుంచి 2019 వరకు ఏజీగా పనిచేశారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఏజీ పదవి దమ్మాలపాటికే దక్కుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 

గత ప్రభుత్వ హయాంలో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబం పైనా రాజధాని భూముల విషయంలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను ఆయనే వాదించుకున్నారు. 

అంతేకాదు, టీడీపీ ముఖ్య నేతలపై కేసులను కూడా హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాసే వాదించారు. కొన్ని పెండింగ్ కేసుల్లోనూ ఆయనే వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి నియామకం పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 16:55

హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి..

గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, షేక్‌పేట, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, లక్డీకపూల్‌, అమీర్‌పేట, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పురా,

ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్‌, గండిపేట్‌, శివరాంపల్లి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌

ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి..

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 16:53

పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు

పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..

అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..

''పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి''

రాష్ట్రానికి శాపంగా జగన్‌..

''రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు. 'ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు'' 

వేల కోట్ల ప్రజాధనం వృథా..

''ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్టడీ. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?. ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది. ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వక్తికి చెందిన ప్రాజెక్టు ఇది'' అని చంద్రబాబు అన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:43

బక్రీద్ సందర్భంగా పట్టణంలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

కామెంట్స్:-

బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక..

 నల్గొండలో గత 30 ఏళ్లుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారు..

 పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తాం..

ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తాం...  

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తాం..

అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నా..

పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన ఎస్పీ చందన దీప్తికి ప్రత్యేక అభినందనలు...

నిజంనిప్పులాంటిది

Jun 17 2024, 11:41

రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పర్వదినం ఉద్దేశ్యం: చంద్రబాబు.

స్వార్థం, రాగద్వేషాలు వదిలిపెట్టి త్యాగగుణం పెరగాలి: చంద్రబాబు.

త్యాగగుణాన్ని ప్రభోదించే బక్రీద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు...

సమైక్యతా మానవత్వం దిశగా అడుగులు వేయాలి: సీఎం చంద్రబాబు.....