VijayaKumar

Jun 18 2024, 20:09

భువనగిరి : అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్న గదిని ఎన్ ఎస్ యు ఐ నాయకులకు ఫిర్యాదుతో సీజ్ చేసిన ఎంఈఓ

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ హైస్కూల్లో అక్రమంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున తల్లిదండ్రులు NSUI నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు NSUI నాయకులు గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో తనిఖీ చేయగా పుస్తకాలు అమ్ముచున్న గదిని సందర్శించి కలెక్టర్, డీఈవో గార్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఎంఈఓ గారిని స్కూల్ వద్దకు పంపించి పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్, పట్టణ ఉపాధ్యక్షులు కార్తీక్, ఎండి. అసద్, అబ్దుల్, కౌశిక్, సద్దామ్, జలీల్,ఫిరోజ్, ప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 18 2024, 20:00

యాదాద్రి భువనగిరి : హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ గా కంచి హరీష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా  హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కంచి హరీశ్ నియామక మయ్యారు. ఆ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు పోకల సాయికుమార్ ఆయనకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం  నియామక పత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షులు ఎండీ ముజాహిద్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం నిరంతరం పోరాడాలని సూచించారు.

VijayaKumar

Jun 18 2024, 12:47

యాదాద్రిలో గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యాదగిరిగుట్టలో *ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు 10 వేల మందితో సామూహిక గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ గిరిప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జై బోలో లక్ష్మీనరసింహస్వామి అంటూ,భజనలు చేస్తూ,యధా ఋషి వద్ద నమస్కరించి గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది విగ్రహం వద్ద నమస్కరించి ఈ గిరిప్రదక్షిణ కొనసాగించారు. గిరి ప్రదక్షిణ అనంతరం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని సర్వదర్శనం క్యూలైన్లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు.

VijayaKumar

Jun 17 2024, 20:10

జూలై 7న వరంగల్ లో జరిగే 30 ఏళ్ల మాదిగల ఆత్మ గౌరవ కవాతును జయప్రదం చేయండి: దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ ప్రెస్ మీట్ సమావేశంలో దుబ్బ రామకృష్ణ మాదిగ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ...రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీ లోని అన్ని ఉప కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా పంపిణీ జరగాలని అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటాలకు పురుడు బోసిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించి జులై 7 నాటికి గౌరవ *శ్రీ మంద కృష్ణ మాదిగ**గారి నాయకత్వంలో ఏర్పడి నేటికీ 30 సంవత్సరాలు కావస్తుందని తెలిపారు. ఎమ్మార్పీ ఉద్యమం ఆవిర్భవించిన నాటి నుండి కేవలం మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల ప్రజా సమస్యల మీద వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్ల పెంపు కోసం మరియు గుండె జబ్బు చిన్నారుల ఉచిత వైద్యం కోసం చేసిన పోరాటమే ఆరోగ్యశ్రీ కార్డు రూపకల్పనకు దారి దీసిందని తెలిపారు ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటమే సమాజంలో అన్ని వర్గాలకు మేలు కలిగిందని తెలిపారు తమ లక్ష్య సాధనైనా ఎస్సీ వర్గీకరణకు అతి త్వరలోనే నూతనంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సందెలు శ్రీనివాస్ మాదిగ యాకర్ నరసింహారావు మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బాల నరసింహ మాదిగ జాంగిర్ మాదిగ పాముకుంట్ల బసవయ్య మాదిగ మాజీ సర్పంచ్ బిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 17 2024, 18:52

వినియోగదారుల సంఘాల సమాఖ్య దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి : కొడారి వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు

తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కొ) దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో జరిగింది. ఈ సమావేశంలో క్యాట్కో రాష్ట్ర కమిటీ నాయకులు వేముల గౌరీ శంకర్ రావు, శంకర్ లాల్ చౌరాసియా, ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రంలో రైతు వినియోగదారుల సంఘాలు, మహిళా వినియోగదారుల సంఘాలు, పిల్లల, వృద్ధుల, మరియు వికలాంగుల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లలో చైతన్యం తీసుకువచ్చి గ్రామస్థాయిలో వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంస్థ ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా ఆగష్టు 10,11-2024 రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు "ఆహ్వాన కమిటీ సభ్యులను" ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దశాబ్ది ఉత్సవాల ముఖ్య భాద్యతలు రాష్ట్ర ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు అప్పగించారు. ప్రతి ఒక్క వినియోగదారుల సంఘం బాధ్యులు నూతన వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కృషిచేయాలని సూచించారు. ఆగస్టు 10,11 న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంపత్ కుమార్(రంగారెడ్డి ), ఎస్ రమేష్ బాబు(మేడ్చల్), సిహెచ్ గురవయ్య (నల్లగొండ), పి సోమయ్య(యాదాద్రి భువనగిరి), షేక్ సైదా, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు( సూర్యాపేట), ఏ మట్టయ్య ,ఎండి ముస్తాఫా, ఎండి నజీర్ పాష, కట్ట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 17 2024, 17:38

ఎంపీ చామలను కలిసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు

నకిరేకల్ :   భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఔరవాణి గ్రామ కాంగ్రెస్ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, ముక్కముల నాగరాజు, సింగం నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 17 2024, 16:53

భువనగిరి: హనుమపురం నుండి అనంతారం, తాజ్పూర్ గ్రామాలకు బిటి రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలి : సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్

హన్మాపురం నుండి అనంతరం, తాజ్ పూర్ గ్రామాల వరకు ధ్వంసమైన బీటీ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం సిపిఎం హన్మాపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో గుంతలు పడి ప్రజలకు ఇబ్బంది అవుతున్న రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని నూతన రోడ్డును వేయాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ హన్మాపూర్ మీదుగా అనంతరం నుండి బీబీనగర్, తాజ్ పూర్ నుండి బొమ్మలరామారం వివిధ గ్రామాలకు సంబంధించిన అనేకమంది ప్రయాణికులు కార్మికులు విద్యార్థులు వృత్తిదారులు రైతులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉన్నదని రోడ్డు మొత్తం ధ్వంసమై వెళ్లడానికి ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ అధికారులు పలుమార్లు రోడ్డు విషయంలో వారి దృష్టికి తీసుకుపోయిన గత నాలుగైదు సంవత్సరాలుగా పట్టించుకోవడంలేదని గత ఎమ్మెల్యే గారు కూడా రోడ్డు విషయంలో పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ రోడ్డు ప్రజలందరికీ వివిధ గ్రామాల ప్రజలకు ప్రధాన రోడ్డుగా మారిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ మధ్యకాలంలో గెలిచిన స్థానిక శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ తక్షణము స్పందించి రోడ్డును పరిశీలన చేసి గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మరోమారు బీటీ రోడ్డును వేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. 15 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే మూడు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మోటే ఎల్లయ్య, సహాయ కార్యదర్శి బండి శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్, సిపిఎం నాయకులు గ్రామ ప్రజలు తోటకూరి నాగరాజు, తోటకూరి గణేష్, కుసుమ మధు, పైళ్ల సత్తిరెడ్డి, ముద్దం చంద్రయ్య, కమ్మ బాలయ్య, శీను, అరిగే సంజీవ, సోమ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 17 2024, 15:39

ఈనెల 20 నుంచి గ్రూప్ - 4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: టీజీపీఎస్పీ

ఈనెల  20 నుంచి గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గ్రూపు-4 ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఎవరైనా గైర్హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని తెలిపింది. షెడ్యూల్‌ను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టామని పేర్కొంది.

VijayaKumar

Jun 16 2024, 22:28

వలిగొండ: వెలువర్తి గ్రామంలో ప్రజలకు యువతకు గంజాయి పై అవగాహన కల్పించిన ఎస్సై మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం: తెలంగాణ ప్రభుత్వం గంజాయి పైన ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, భువనగిరి డిసిపి వారి సూచనలు మేరకు వలిగొండ మండలంలో వివిధ గ్రామాలలో డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ సూచనలు ఇస్తూ ముందు కెళ్తున్నామని వలిగొండ ఎస్సై  మహేందర్ అన్నారు. వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలువర్తి గ్రామంలో ప్రజలకు మరియు యువతకు గంజాయి పై అవగాహన కల్పిస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ వెల్వర్తి గ్రామ పరిధిలో యువత యువకులకు మరియు గ్రామ ప్రజలకు నార్కోటిక్ డ్రగ్స్ చెడు వ్యసనాల పట్ల దాని పై మాదకద్రవ్యాల దుర్వినియోగం దాని అక్రమ రవాణా యొక్క పరిణామాలను గురించి ఈరోజు సాయంత్రం వెల్వర్తి గ్రామంలో అవగాహన సదస్సులో... ఎస్సై మహేందర్  మాట్లాడుతూ గంజాయి ఇన్ని రకాలుగా యువత వాడుకుంటున్నారు దానిపైన అవగాహన కల్పిస్తూ వాటి విశేషాలను వారికి వివరిస్తూ ఏ రకంగా దూరం పెట్టుకోవాలి., అధికారుల సూచనలు అందరికీ స్థానికంగా ప్రతి గ్రామంలో వివరాలను వెల్లడిస్తూ వారికి మేమున్నామని మనోధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపిన స్థానిక ఎస్సై మహేందర్.. విద్యార్థి, యువత, యువకులు తల్లిదండ్రులను మీ పిల్లలని మీరే కాపాడుకోవాలని సూచన చేసినారు... అలాగే వలిగొండ నుండి వెలువర్తి గ్రామముకు గంజాయి గానీ ఇంకా వేరే పదార్థాలు గానీ వెల్వర్తికి అక్రమ సరఫరా చేస్తున్నారా అన్న కోణంలో కూడా పూర్తిగా వివరించారు అలా సరఫరా కాకుండా అరికట్టాలని సూచన కూడా చేశారు.. ఎవరి పట్ల పైన అనుమానం కలిగినచో స్థానిక పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 గాని ఫోన్ చేసి వివరాలు వెల్లడించాలని, వివరాల్లో వెల్లడించిన వారి పేర్లు కానీ స్థానికత కానీ ఎవరికి కూడా వివరాలు వెల్లడించకుండా పొందుపరుస్తామని తెలియజేశారు.

VijayaKumar

Jun 16 2024, 20:55

ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: దళిత హక్కుల పోరాట సమితి

దుప్పల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద డిహెచ్పిఎస్ కరపత్రాలు ఆవిష్కరించారు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 18, 19 ,20 తేదీలలో లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ యాదగిరి గుట్ట మండలంలో నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా *వలిగొండ డిహెచ్పిఎస్ మండల కన్వీనర్ కట్ల యాదగిరి మాట్లాడుతూ* దళితులు తరతరాలుగా అంచివేతకు అంటరాని తనం వివక్షత దోపిడీ పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలపై ఆశేష శ్రామిక కులాలు అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించింది సమాజంలో తరతరాలుగా అంటరానితనం అనే అవమాన నియా దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోతున్న దళితులను సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి అనిచివేతలను ఎదిరించి సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా చైతన్యవంతం చేయుటకు ప్రధాన లక్ష్యంగా దళిత సామాజిక దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి దళితులలో చైతన్యం పరిచి మనిషిని మనిషిగా చూడ నిరాకరించి తోటి మనిషిని బానిసగా మార్చుకొని తరతరాలుగా అవమానాలకు అణిచివేతలకు దోపిడి పీడనాలకు కారణమైంది. ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ ఇలాంటి కుల వ్యవస్థకు పునాది అయిన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి కుల వ్యవస్థ పై యుద్ధం ప్రకటించాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సేవలు ఉన్నత విద్యా ప్రవేటికరణ వేగవంతం కావడానికి తోడు ఈ ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్లు లేకపోవడంతో పాటు రిజర్వేషన్లు విషయంలో రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు ఈ నైపెద్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణకు సామాజిక న్యాయం కొరకు కుల వివక్షత నిర్మూలన కొరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని మరింత బలోపేతం చేయాలని దళితులకు కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకం అమలు చేయాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించుటకు భవిష్యత్తు కార్యచరణను రూపుదించుకొని రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని వారన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ఎంపిక చేసిన దళితులు ఎక్కువ శాతం హాజరై ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలనిఅన్నారు ఈ కార్యక్రమంలో *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, మాజీ సర్పంచ్ బందేల స్వామిదాస్, సిపిఐ గ్రామ శాఖ నాయకులు మెట్టు లక్ష్మీనారాయణ, ఎర్ర కిరణ్, మారోజు నరసింహ చారి,కట్ల సామేల్, మామిడికాయల నరేష్, అశోక్,రాజు తదితరులు పాల్గొన్నారు