నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 07:55

Ts,:సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం...

సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌: ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల 29లోపు దరఖాస్తులు పంపించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ సమాచార కమిషనర్ల నియామకానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 12 2024, 07:49

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం..

నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం.. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు.. కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు.. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్టేజీ.. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ.

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 18:18

చర్ల: భద్రాచలం:CRPF ఎదురు సందులో కరెంట్ స్థంభానికి ఉన్న ట్రాన్స్ఫార్మర్ వెంటనే తొలగించాలి:సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ముసలి సతీష్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లోని లింగాల కాలనీ గ్రామంలో CRPF, పోలీస్ క్యాంప్ ఎదురు సందులో ఉన్న కరెంట్ స్తంభానికి ఉన్న ట్రాన్స్ఫార్ను తొలగించాలి న్యూడెమోక్రసీ నేత కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీలోని లింగాల కాలనీ గ్రామంలో సిఆర్పిఎఫ్ పోలీస్ క్యాంప్ ఎదురుగా ఉన్న సందులో కరెంటు స్తంభానికి ఒక ట్రాన్స్పరు నిర్మించబడి ఉన్నది అది వెంటనే తొలగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ఉద్దేశించి చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్ ఫార్మర్ స్తంభానికి కింది బాగానే ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు అనేకమంది ప్రమాదానికి గురి అయ్యే పరిస్థితి ఉంది ఇది రహదారి కావడంతో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్న క్రమంలో అలసిపోయి పట్టుకుంటే కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉన్నది కావున విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క కింది భాగాన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని తొలగించి వేరే దగ్గర నిర్మించవలసిందిగా కోరుతున్నాం లేనియెడల అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని వారు కోరారు ఈ కార్యక్రమంలో POW జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క మండల నాయకురాలు బొర్ర సమ్మక్క రామలక్ష్మి నాగమణి ఇర్ప వెంకటేష్ కణితి రమణ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:11

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే....

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 09:05

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మునిసిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవిశ్వాసం పెట్టనున్న కాంగ్రెస్...

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం.. మున్సిపల్ చైర్పర్సన్ కల్పనభాస్కర్ గౌడ్పై ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న కాంగ్రెస్.. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్న 14 మంది కౌన్సిలర్లు..

నిజందాగదుక్షణంఆగదు

Jun 11 2024, 08:55

ఆగస్టు నెలలో రైతుల రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే.. పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి.. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:49

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..వార్షిక తెప్పోత్సవాలు ఎప్పటినుండి అంటే...

తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,833 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు

17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.. 19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు.. 22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:37

TS:నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి...రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు...

నిజామాబాద్‌ వరకు విస్తరించిన నైరుతి

రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు నిజామాబాద్‌ జిల్లా వరకు విస్తరించాయి. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాపించనున్నాయి. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. మరోవైపు శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఖమ్మం జిల్లా కొణిజర్లలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిజందాగదుక్షణంఆగదు

Jun 10 2024, 08:27

'నీట్' పై టెన్షన్... వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

'నీట్' పై టెన్షన్

వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీపై విమర్శల వెల్లువ

దేశవ్యాప్తంగా కోర్టులను ఆశ్రయిస్తున్న విద్యార్థులు

చెప్పిన తేదీకి పది రోజుల ముందే ఫలితాల వెల్లడిపై సందేహాలు

ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేయడంపైనా అనుమానాలు

కొందరికి గ్రేస్‌ మార్కులిచ్చారు సరే...

మరి హైదరాబాద్‌ విద్యార్థులకు ఇవ్వరా?

హైదరాబాద్‌: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ప్రవేశ పరీక్ష సందర్భంగా లోపాలు తలెత్తడం... ఫలితాల వెల్లడి సమయంలో మార్కుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న అనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వందలాది మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. దీంతో అసలు నీట్‌ ఫలితాలు ఇవే ఉంటాయా? వాటిని రద్దు చేస్తారా? మళ్లీ నీట్‌ పరీక్ష ఏమైనా పెడతారా? అన్న ఆందోళనలు విద్యార్థుల్లో నెలకొన్నాయి. మరోవైపు నీట్‌ ఫలితాలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో సందిగ్ధ పరిస్థితి నెలకొంది. రద్దు ఉండకపోవచ్చని... దానివల్ల విద్యార్థులు మరింత నష్టపోతారని అధికారులు అంటున్నారు.

ఎన్‌టీఏపై విమర్శల వెల్లువ

మే 5న నీట్‌ పరీక్ష జరగ్గా, ఫలితాలను జూన్‌ 14న ప్రకటిస్తామని ఎన్‌టీఏ ముందుగానే ప్రకటించింది. కానీ జూన్‌ 4న దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే... అదే రోజు చడీచప్పుడు కాకుండా నీట్‌ ఫలితాలను ఎన్‌టీఏ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. అంత హడావుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచి్చందనే విమర్శలు వస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఆరోజు విడుదల చేశారన్న చర్చ జరుగుతోంది. అలాగే ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులకు ముందే అవకాశం కలి్పంచారు. అయితే, ఆలిండియా ర్యాంకులు.. మార్కులు.. ఫలితాల సమగ్ర సమాచారాన్ని మాత్రం ఆరోజు మరింత ఆలస్యం చేసి ఇచ్చారు. ఇలా అనుమానాలకు తావిచ్చేలా ఎన్‌టీఏ వ్యవహరించిందన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌లోనూ ఆలస్యం

ఇక పలువురు విద్యార్థులకు ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు ఇచి్చన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నీట్‌ పరీక్ష సమయం 3 గంటల 20 నిమిషాలు. కొన్ని కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల అందజేతలో ఆలస్యం, చిరిగిన ఓఎంఆర్‌ పత్రాలు తదితర కారణాల నేపథ్యంలో సమయం వృథా అయ్యిందంటూ కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, ఛతీస్‌గఢ్, హరియాణ న్యాయస్థానాల్లో రిట్‌ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను ఎన్‌టీఏ సమీక్షించి వారికి గ్రేస్‌ మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. అలాగైతే దేశంలో అనేకచోట్ల విద్యార్థులకు ఆలస్యంగా పరీక్ష పేపర్‌ ఇచ్చారు. వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలోని ఒక రూంలో ప్రశ్నపత్రాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా ఇచ్చారు. ఆ గదిలో గడియారం ఆగిపోవడం... తప్పుగా చూపించడకపోవడంతో ఆలస్యం చేశారు. తప్పు సిబ్బందిదే అయినా కానీ విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అనేకమంది ప్రశ్నలు రాయలేకపోయారు. అంత సమయం పోవడం వల్ల తమకు మార్కులు తగ్గుతాయని, రావాల్సిన సీటు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మరి వారికెందుకు గ్రేస్‌ మార్కులు కలపలేదని ప్రశి్నస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jun 09 2024, 17:02

ఏపీ : ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి : ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించిన చంద్రబాబు. వివిధ కీలక శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న టీడీపీ అధినేత. కీలకాంశాలపై వరుస రివ్యూలు ఉంటాయని అధికారులకు చంద్రబాబు స్పష్టీకరణ. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు స్పష్టీకరణ. ప్రమాణస్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు సిద్ధం అవుతన్న కీలక శాఖల అధికారులు.