చౌటుప్పల్ లో విత్తన, ఎరువుల డీలర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే
యాదాద్రి భువనగిరి జిల్లా:నకిలీ విత్తనాలు అమ్మిన కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం నాడు చౌటుప్పల్ లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాప్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్వాయిస్ బిల్లులు, పత్తి, వరి విత్తనం ప్యాకెట్లను పరిశీలించి దాని లోని లాట్ నంబర్స్, ఇన్వాయిస్ లు ఎక్కడినుండి తెచ్చారు, డీలర్ షిప్ వివరములు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలు అన్ని క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకి విక్రయించాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాలు కొన్న తర్వాత రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీలర్లు అనుమతి లేని విత్తనములు, నకిలీ విత్తనములు, ప్యాకింగ్ చేయకుండా లూస్ గా ఉన్న విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచకూడదని తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొన్న దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, సీజన్ అయిపోయే వరకు బిల్లులను, విత్తన ప్యాకెట్లని భద్రపరచుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన బ్యాగు మీద విత్తన తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, బీటీ టు పత్తి విత్తనాలు అన్ని రకాలు ఒకే రకమైన దిగుబడిస్తాయి కాబట్టి రైతులు దయచేసి ఒకే రకం పత్తి విత్తనాలు డిమాండ్ చేయకుండా నచ్చిన విత్తనాలను తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు ఎటువంటి ప్యాకింగ్ లేకుండా ఉండే విత్తనాలను, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వారి దగ్గర కొనకూడదని, ప్రభుత్వ అధికారులకు అటువంటి నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వాలని, రైతులు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7288878404 ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లాలోని 240 విత్తన డీలర్లను, గోదాములను విస్తృతంగా తనిఖీ చేయుటకు నాలుగు సీడ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి, తాసిల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మండల స్థాయి తనిఖీల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు రాకుండా, అలాగే డీలర్లు గారిని డిస్ట్రిబ్యూటర్లు కానీ పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా, విత్తనాల కొరత చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా:నకిలీ విత్తనాలు అమ్మిన కృత్రిమ కొరత సృష్టించిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం నాడు చౌటుప్పల్ లోని ధనలక్ష్మి ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాప్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్వాయిస్ బిల్లులు, పత్తి, వరి విత్తనం ప్యాకెట్లను పరిశీలించి దాని లోని లాట్ నంబర్స్, ఇన్వాయిస్ లు ఎక్కడినుండి తెచ్చారు, డీలర్ షిప్ వివరములు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలు అన్ని క్షుణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన డీలర్లు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకి విక్రయించాలని, రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తనాలు కొన్న తర్వాత రసీదులు ఇవ్వాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీలర్లు అనుమతి లేని విత్తనములు, నకిలీ విత్తనములు, ప్యాకింగ్ చేయకుండా లూస్ గా ఉన్న విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచకూడదని తెలిపారు. రైతులు కూడా తప్పనిసరిగా లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తనాలు కొన్న దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, సీజన్ అయిపోయే వరకు బిల్లులను, విత్తన ప్యాకెట్లని భద్రపరచుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తన బ్యాగు మీద విత్తన తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, బీటీ టు పత్తి విత్తనాలు అన్ని రకాలు ఒకే రకమైన దిగుబడిస్తాయి కాబట్టి రైతులు దయచేసి ఒకే రకం పత్తి విత్తనాలు డిమాండ్ చేయకుండా నచ్చిన విత్తనాలను తీసుకోవాల్సిందిగా సూచించారు. గ్రామాల్లో ఎవరైనా లూజు పత్తి విత్తనాలు ఎటువంటి ప్యాకింగ్ లేకుండా ఉండే విత్తనాలను, బీటీ త్రీ పత్తి విత్తనాలు అమ్మినట్లయితే వారి దగ్గర కొనకూడదని, ప్రభుత్వ అధికారులకు అటువంటి నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వాలని, రైతులు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 7288878404 ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. జిల్లాలోని 240 విత్తన డీలర్లను, గోదాములను విస్తృతంగా తనిఖీ చేయుటకు నాలుగు సీడ్ స్క్వాడ్ బృందాలతో పాటు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారి, తాసిల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మండల స్థాయి తనిఖీల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు రాకుండా, అలాగే డీలర్లు గారిని డిస్ట్రిబ్యూటర్లు కానీ పత్తి విత్తనాలు, ఇతర విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేయకుండా, విత్తనాల కొరత చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్వీ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అని పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు, కవులు, కళాకారులు, రచయితలు, మహిళా సంఘాలు,ఇలా ఎన్నో సబ్బండ వర్గాలు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాలు వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులైన జర్నలిస్ట్ లని విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని,మరోసారి గుర్తు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలిపారు. ఈ ప్రభుత్వమైనా జర్నలిస్టులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మండల కార్యదర్శి శివ, బలరాం రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య తదితరులు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా లో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని గురువారం కలెక్టర్ హనుమంతు కే జెండగే అధికారులను కోరారు. జూన్ 3 నుంచి 19 వరకు జరిగే బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు .బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, భువనగిరి ఆర్డీవో అమరేందర్ ,తదితరులు పాల్గొన్నారు.
నా నియామకానికి సహకరించి నియమించినందుకు రాష్ట్ర అద్యక్షులు చీమ.శ్రీనివాస్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అద్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను చైతన్యంవంతం చేసి,అనేక తెలంగాణ ఉద్యమ పోరాటాలు చేసి నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయాలని అన్నారు.ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో బాబు. లింగం తదితరులు పాల్గొన్నారు.
May 31 2024, 22:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.5k