Mane Praveen

May 19 2024, 14:32

NLG: సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి
మర్రిగూడ: కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా, మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో,  సుందరయ్య  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS NLG

Mane Praveen

May 19 2024, 10:54

NLG: జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్
జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగదనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టిన చరిత్ర సుందరయ్య దని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సుందరయ్యది అని ఆయన కొనియాడారు. భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు  వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు, విస్తృత పరిచేందుకు అంకితమైనారని ఆయన అన్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని ఆయన అన్నారు. సిపిఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగాబాధ్యతలు చేపట్టారు. ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైది. వారి ఆశయ సాధన కోసంప్రతి ఒక్కరు కృషి చేయాలని.. భారతదేశంలోదోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.

ఈకార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులుఅంతిరెడ్డి,సిపిఎం నాయకులుఈరగట్లస్వామి, ఈరటి వెంకన్న, సోనగోనిగణేష్, కొత్తపల్లి వెంకన్న, బొమ్మరగోని యాదయ్య,ఓర్సు రాములు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 18 2024, 22:05

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ
ప్రధాని మోదీ..  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు. SB NEWS

Mane Praveen

May 18 2024, 21:57

సిఎం రేవంత్ రెడ్డి  సంచలన ప్రకటన
*తెలంగాణ ప్రభుత్వంలోని వికలాంగులందరికీ శుభవార్త*

*ఇక నుండి సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుంది.*
*ఎవరైనా ఎపుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చును.*
*స్లాట్ బుక్ చేసుకోగానే స్లాట్ ఉన్నచో స్లాట్ క్యాంపు తేది, వెన్యూ చూపెడుతుంది.* *స్లాట్ లేనిచో రిజర్వులో ఉంటుంది.*
*ఎపుడైతే స్లాట్ షెడ్యూల్ ఇస్తారో వారికి ఆటోమేటిక్ గా స్లాట్ అల్లాట్మెంట్ జరుగుతుంది.* *స్లాట్ బుక్ కాగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు డిపార్ట్‌మెంట్ ద్వారా SMS పంపడం జరుగుతుంది.*
*అందులో క్యాంపు మరియు స్లాట్ వివరాలు వారికి తెలియజేయబడుతుంది.*

Mane Praveen

May 18 2024, 21:51

NLG: మర్రిగూడ మండలంలో 1384 గ్రాడ్యుయేట్ ఓటర్లు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఓటర్ లిస్ట్ లను అధికారులు అధికారిక వెబ్సైట్లో లో పొందుపరిచారు. ఈ ఎన్నిక కోసం నల్లగొండ జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐతే మర్రిగూడ మండలంలో 1384 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 917 మంది ఉండగా  మహిళలు 467 మంది ఉన్నారు. ఈ ఎన్నిక కోసం మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Mane Praveen

May 18 2024, 17:19

NLG: డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ఆన్లైన్ దోస్త్ రిజిస్ట్రేషన్  జరుగుతున్నవి. ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసమై ఆన్లైన్ ద్వారా దోస్త్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, కళాశాలలో మొత్తం 1560 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో 240 సీట్లు, బీకాంలో 420 సీట్లు, బి బి ఏ లో 60 సీట్లు, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 360 సీట్లు, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ లో 420 సీట్లు , బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, దోస్త్ కన్వీనర్ వెంపటి శ్రీనివాసులు తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగా బీకాం ఫైనాన్స్ కోర్స్ మరియు బి ఏ (ఈ హెచ్ పి) స్పెషల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని , ఫస్ట్ ఫేస్ రిజిస్ట్రేషన్ దోస్త్ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా ఈనెల 29వ తారీకు లోగా నమోదు చేసుకొని, ఈనెల 20వ తారీకు నుంచి 30వ తారీకు వరకు దోస్త్ ఆన్లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు. SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 18 2024, 14:42

నిరాశ్రయ కుటుంబానికి ముత్తు చేయూత

RR: మాడ్గుల మండలం, అన్నెబోయినపల్లి గ్రామానికి చెందిన జిల్లా శారద అనే మహిళ భర్త ఇటీవల ఆక్సిడెంట్ కారణంగా మరణించాడు. భర్త మరణంతో శారద ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. బాధితురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఇల్లు గడవటం కూడా కష్టంగా మారింది.

సహచరుల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి భరోసాను అందించారు. ఆర్థిక సహాయంగా శారదకు పదివేల రూపాయలను అందించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫౌండేషన్ ని సంప్రదించాలని ముత్తు కోరారు.

ఈ సందర్బంగా ముత్తు  మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ ఎంతో మంది పేద ప్రజలకు నీడనిస్తుందని, అన్నార్తులకు ఆకలి ముద్దగా కడుపు నింపుతుందని పేర్కొన్నారు. పేదల కోసం తమ ఫౌండేషన్ ఎప్పటికి అండగా నిలబడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, జనరల్ సెక్రెటరీ మొగిలి కిషన్, ఎం. మల్లేపల్లి మాజీ సర్పంచ్ మార్ల వెంకటయ్య, నర్ర పరమేష్ తదితరులు ఉన్నారు.

Mane Praveen

May 17 2024, 15:27

మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.

మాడుగులపల్లి లో 2, వేములపల్లి 1, మిర్యాలగూడ 13, దామరచర్ల 2 అడవిదేవులపల్లి 1, నిడమనూరు 2 త్రిపురారం 2, తిరుమలగిరి సాగర్ 2, హాలియా 2,  పెద్దవూర లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Mane Praveen

May 17 2024, 15:27

మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.

మాడుగులపల్లి లో 2, వేములపల్లి 1, మిర్యాలగూడ 13, దామరచర్ల 2 అడవిదేవులపల్లి 1, నిడమనూరు 2 త్రిపురారం 2, తిరుమలగిరి సాగర్ 2, హాలియా 2,  పెద్దవూర లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Mane Praveen

May 17 2024, 14:35

శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ను ప్రారంభించిన జడ్పిటిసి
నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ఓపెన్నింగ్ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి  హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వివిధ రకాలైన పంట గింజలు, మందులను రైతులు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు, కోట రఘు నందన్, ఈద శేఖర్, దోటీ పరమేష్, కత్తుల రాజు, తదితరులు, ఉన్నారు.