పంట పొలాల సందర్శన.. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు
పంట పొలాల సందర్శన
జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు బుక్కరాయసముద్రం మండలంలో వడియం పేట గ్రామం నందు బోరు బావులు క్రింద సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాలను సందర్శించారు ప్రస్తుతం పంట కంకి పాలు పోసుకునే దశలో ఉన్నది ప్రస్తుతం పైరు లో కత్తెర పురుగు మరియు ఆకు మాడు తెగులు ఆశించినట్లు వారు గమనించారు. వీటి నివారణకు నివారణ చర్యలు తెలియజేయడం జరిగినది. కోరాజిన్, రైనాక్సీఫర్ ఎకరాకు 60 మిల్లీల లను 200 లీటర్ల నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలని రైతులకు సలహా సూచనలు ఇవ్వడం జరిగినది.
ఆకు మాడు తెగులు నివారణకు 600 గ్రాములు M- 45 లేదా ప్రోఫీ కొనజోల్ 200 మిల్లీలు 200 లీటర్ల నీటి కలిపి ఎకరానికి పిచికారి చేయవలెను
పొలము చుట్టూ మూడు నాలుగు వరుసలు జొన్న పంటను ఎర పంటగా వేయవలెను 45 రోజుల తర్వాత తీసివేయవలెను అంతర పంటగా అపరాలను సాగు చేయడం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది అని రైతులకు సూచించడం జరిగినది
ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు ఎ డి ఎ శైలజ, వ్యవసాయాధికారి శ్రీనివాసులు ఏఈఓ ప్రసాద్ మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీనివాస్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
Mar 13 2024, 07:53