నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 10:26

AP: జంతర్ మంతర్ లో దీక్షకు సిద్ధమవుతున్న షర్మిల...

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న షర్మిల, కాంగ్రెస్ నేతలు.. రేపు ఉ.10 గంటలకు జంతర్‌మంతర్‌లో షర్మిల దీక్ష.. ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్ష చేపట్టనున్న షర్మిల. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులు..జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం.. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతలను కలవనున్న షర్మిల.

నిజందాగదుక్షణంఆగదు

Feb 01 2024, 09:37

ఏపీ:పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసిన టిడిపి

టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు, పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు.

శ్రీకాకుళం-రామ్మోహన్‌నాయుడు

అనకాపల్లి-దిలీప్‌ చక్రవర్తి, 

విశాఖ-ఎం.భరత్

ఏలూరు-గోపాల్ యాదవ్, 

విజయవాడ-కేశినేని చిన్ని

నరసరావుపేట-శ్రీకృష్ణదేవరాయలు

అనంతపురం-కాల్వ శ్రీనివాసులు

హిందూపురం-బీకే పార్థసారథి

తిరుపతి-అంగలకుర్తి నిహారిక

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 12:14

ఢిల్లీ:కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. ద్రౌపతి మూర్ము

ఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి రాష్ట్రపతి  ప్రసంగం

కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇది నా తొలి ప్రసంగం.. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం భారత్‌, ఆసియా క్రీడల్లో తొలిసారి వందకుపైగా పతకాలు సాధించాం.. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది, జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయి.. రీఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం.. గరీబ్‌ హఠావో అనే నినాదాలు మాత్రమే విన్నాం.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశాం.. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి.. కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం.. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎంతో గొప్ప ఘట్టం.. ఏక్‌ భారత్‌-శ్రేష్ట్‌ భారత్‌ మన లక్ష్యం.. అంతరిక్ష రంగంలో అద్భుత ప్రగతి సాధించాం-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 10:06

సంగారెడ్డి: నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ..

సంగారెడ్డి: నేడు తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఆవిష్కరణ.. గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమిని కేటాయించిన హెచ్‌ఎండీఏ.. నేడు విగ్రహావిష్కరణకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 08:32

తిరుమల: నేడు శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం...

తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,135 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,004 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 17:36

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో పది లక్షల విలువగల గంజాయి పట్టివేత..

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో పది లక్షల విలువగల గంజాయి పట్టివేత..

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో 10 లక్షల 50 వేల విలువ చేసే 42.63 కే.జీ ల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకొని , ఓ మహిళ ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్... ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది

పరారీలో మరొక వ్యక్తి...

పాడేరు నుంచి పూణే కు 19 ప్యాకెట్లను బ్యాగుల్లో తరలిస్తున్న ఎండు గంజాయి పట్టివేత...

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 17:27

Ts: విద్యుత్ సరఫరా పంపిణీ సంస్థలు సమ్మేలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం...

విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం

ఎస్మా చట్టం కింద 6 నెలల పాటు ట్రాన్స్ కో, ఎస్‌‌పీడీసీఎల్‌‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 10:03

ఏపీ: నేడు ఆర్ధిక శాఖపై సమీక్షించి.. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను గురించి ఎల్ఐపిబి బోర్డుతో సమావేశం..

అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత

ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం.. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించనున్న ఎస్ఐపీబీ.. సాయంత్రం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 09:40

హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి లాగినందుకు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు...

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఘటనపై సీపీ సీరియస్‌.. ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్‌ ఫాతిమాను సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 09:32

తిరుమల: క్యూ లైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,082 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,912 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు