నిజందాగదుక్షణంఆగదు

Jan 31 2024, 08:32

తిరుమల: నేడు శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం...

తిరుమల: 2 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,135 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 19,004 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 17:36

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో పది లక్షల విలువగల గంజాయి పట్టివేత..

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్లో పది లక్షల విలువగల గంజాయి పట్టివేత..

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో 10 లక్షల 50 వేల విలువ చేసే 42.63 కే.జీ ల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకొని , ఓ మహిళ ను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్... ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది

పరారీలో మరొక వ్యక్తి...

పాడేరు నుంచి పూణే కు 19 ప్యాకెట్లను బ్యాగుల్లో తరలిస్తున్న ఎండు గంజాయి పట్టివేత...

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 17:27

Ts: విద్యుత్ సరఫరా పంపిణీ సంస్థలు సమ్మేలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం...

విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం

ఎస్మా చట్టం కింద 6 నెలల పాటు ట్రాన్స్ కో, ఎస్‌‌పీడీసీఎల్‌‌, ఎన్‌పీడీసీఎల్‌ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 10:03

ఏపీ: నేడు ఆర్ధిక శాఖపై సమీక్షించి.. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను గురించి ఎల్ఐపిబి బోర్డుతో సమావేశం..

అమరావతి: నేడు ఆర్ధిక శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేటి సమీక్షకు ప్రాధాన్యత

ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం.. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించనున్న ఎస్ఐపీబీ.. సాయంత్రం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 09:40

హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి లాగినందుకు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు...

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఘటనపై సీపీ సీరియస్‌.. ఏబీవీపీ కార్యకర్త జుట్టు పట్టి లాగిన కానిస్టేబుల్‌ ఫాతిమాను సస్పెండ్‌ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు

నిజందాగదుక్షణంఆగదు

Jan 30 2024, 09:32

తిరుమల: క్యూ లైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,082 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,912 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు

నిజందాగదుక్షణంఆగదు

Jan 29 2024, 20:15

తెలంగాణ టుడే టాప్ న్యూస్...

తెలంగాణ టుడే టాప్ న్యూస్...

హైదరాబాద్‌: రికార్డు స్థాయిలో రైస్‌ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ.. ఒకే రోజు 56వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించిన మిల్లర్లు.. పౌరసరఫరాలశాఖ చరిత్రలోనే అత్యధికం.. 50 రోజుల్లో 40 శాతం పెరిగిన సీఎంఆర్‌.

హైదరాబాద్‌: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరు.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలి.. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలి. ఎయిమ్స్‌ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలి. -సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌ నార్సింగిలో డ్రగ్స్‌ పట్టివేత. ఓ టాలీవుడ్‌ హీరో ప్రియురాలిని పట్టుకున్న పోలీసులు. యువతి నుంచి 4 గ్రామలు MDMA డ్రగ్స్‌ స్వాధీనం. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు సమాచారం. NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

హైదరాబాద్‌ బాలాపూర్‌లో ఉద్రికత్త. డైమండ్‌ పాయింట్‌ దగ్గర పోలీసులపై రాళ్లు రువ్విన ఓ వర్గం. నిన్న బర్మాకు చెందిన యువకుడి హత్యకు నిరసనగా ఆందోళన. నిరసనకారులు రాళ్లురువ్వడంతో కానిస్టేబుల్‌కు గాయాలు. బాలాపూర్‌లో భారీగా మోహరించిన పోలీసులు.

నిజందాగదుక్షణంఆగదు

Jan 29 2024, 19:54

చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి

చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించిన నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి

చలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నల్లగొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని కరపత్రం ఆవిష్కరించడం జరిగింది.

 ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనగణలో కులగనని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలందర ఫిబ్రవరి 5 6 తేదీల్లో చలో ఢిల్లీ ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం సభ్యులతోపాటు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ నాగుల వేణు యాదవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి బిసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా మహిళా కార్యదర్శి కంభంపాటి దుర్గ దుడుకు తిరుపతయ్య పగిళ్ల కృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షులు వల్ల కీర్తి శ్రీనివాస్, సదాశివ రుదిగామ స్వామి గంజి రాజేందర్ గంజి రంగనాయకులు ఖమ్మంపాటి కనకయ్య మునాస నాగరాజు తాడిమనీల్ కుమార్ అంబటి రాజశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

నిజందాగదుక్షణంఆగదు

Jan 28 2024, 19:02

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి...

ఉప్పల్‌ టెస్ట్‌లో భారత్‌ ఓటమి..

28 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చిన హార్ట్‌లే

7 వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌ హార్ట్‌లే

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246, రెండో ఇన్నింగ్స్ 420

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 436, రెండో ఇన్నింగ్స్‌ 202

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లండ్‌

నిజందాగదుక్షణంఆగదు

Jan 28 2024, 18:44

TS; మాజీ ఎంపీ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు..

మాజీ ఎంపీ మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు..

BRSను వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు

కానీ మేమే పార్టీలోకి తీసుకోవడం లేదు-మధుయాష్కీ

కాంగ్రెస్‌ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీలేదు

పార్లమెంట్‌ ఎన్నికల వరకు పీసీసీ మార్పు ఉండదు

కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తే..

రూ.వందల కోట్లు బయటికి వస్తాయి-మధుయాష్కీ