నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 17:13

ప్రజలంతా కేసీఆర్ వైపే

ప్రజలంతా కేసీఆర్ వైపే

చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న నేత కేసిఆర్

రేషన్ ద్వార సన్నబియ్యం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కెసిఆర్ మానవీయ పాలనకు నిదర్శనం

తుంగతుర్తి లో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే

పారిశ్రామిక హభ్ ను నెలకొల్పి , స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం

కిషోర్ నుఆశీర్వదించండి .అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి

➖➖➖➖➖➖➖➖➖➖

తుంగతుర్తిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మంత్రి జగదీశ్ రెడ్డి

అర్వపల్లి యోగానంద స్వామి ఆలయంలో మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్యే కిషోర్ ప్రత్యేక పూజలు.....

శంఖం ఊది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి

➖➖➖➖➖➖➖➖➖➖

చెప్పిన ప్రతి మాటను , చేసిన ప్రతీ వాగ్దానాన్ని నిజం చేసిన నేత ముఖ్యమంత్రి కేసిఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ తరపున ఎన్నికల శంఖారావాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి పూరించారు. అంతకుముందు అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నరసింహుని సన్నిధిలో కిషోర్ కుమార్ కు బి ఫారం ను అందజేశారు. అక్కడనే శంఖాన్ని ఊది ప్రచార పర్వానికి తెరలేపారు. అర్వపల్లి లో తరలి వచ్చిన ఆశేశ జనవాహిని ని ఉద్దేశించి  మంత్రి మాట్లాడుతూ రేషన్ ద్వార అందరికీ సన్నబియ్యం , సబ్సిడీ ద్వారా 400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయాలు కెసిఆర్ మానవీయ పాలనకు నిదర్శనం అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ వైపే తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. 2014 ముందు కక్క్ష్యలు, కార్పన్యాలతో రక్తమోడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే అన్నారు. కిషోర్ హయాంలో తుంగతుర్తి నియోజకవర్గం ససశ్యామలం అయిందన్నారు. 

పారిశ్రామిక హభ్ ను నెలకొల్పి , స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే కిషోర్ ఆశయం అన్నారు.

కిషోర్ ను మరోసారి ఆశీర్వదించి తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 16 2023, 10:36

స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్‌

స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్‌

'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు.

స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు.

అభివృద్ధిని చూసి నన్ను దీవించండి

హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

ప్రజలందరి సహకారంతోనే నంబర్‌వన్‌గా తెలంగాణ

కాంగ్రెస్‌కు 10 చాన్స్‌లు ఇస్తే ప్రజలకు చేసిందేంది?

60 ఏండ్ల కిందే దళితబంధు ఉంటే పేదరికం ఉండేదా?

విధివంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదే

నేడు రైతులకు కంటినిండా నిద్ర.. కడుపునిండా కరెంటు

వడ్ల రాశులు చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టున్నది

మిషన్‌ భగీరథలాంటి పథకం ప్రపంచంలోనే లేదు

సీఎం హోదాలో మళ్లీ హుస్నాబాద్‌కు వస్తా: కేసీఆర్‌

అభ్యర్థి వొడితెల సతీశ్‌కు బీఆర్‌ఎస్‌ బీ-ఫాం అందజేత

తొమ్మిదిన్నరేండ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఎంత భయానకమో గుర్తు చేసుకోవాలి. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నట్టే.. ప్రజలందరి సహకారంతో తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకుపోయినం. కేంద్రం సహకరించకున్నా, గౌరవెల్లిలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నింటినీ అధిగమించుకొంటూ ఒక్కొక్కటీ పూర్తిచేసుకొంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు సాధించాం. ఆ క్రమం కొనసాగాలి.

-సీంఎ కేసీఆర్‌

 'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్‌ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా హు స్నాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌కు బీఫారం అందజేశారు. 'సభ సాక్షి గా, మీ అందరి సాక్షిగా సతీశ్‌కు బీఫారం అందిస్తున్నాను. మీ బిడ్డగా దీవించండి' అని ప్రజల ను కోరారు. అనంతరం ప్రసంగిస్తూ.. 2018 లో అసెంబ్లీ ఎన్నికల మొదటి సభను హుస్నాబాద్‌లోనే నిర్వహించినట్టు గుర్తు చేశారు. 'హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు నాలుగిం ట మూడు వంతులు.. అంటే 88 సీట్లతో అఖం డ విజయాన్ని సాధించినం. ఈసారి కూడా మళ్లీ హుస్నాబాద్‌ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు సూచించారు. అందుకే ఈ రోజు హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి, మ్యానిఫెస్టో ప్రకటించి, మీ దర్శనానికి ఇక్కడికి వచ్చాను' అని చెప్పారు.

రౌతేందో.. రత్నమేందో గుర్తించాలె

తాను చెప్పే విషయాలను విని వదిలేయకుండా ఇంట్లో, బస్తీలో, గ్రామంలో, తండాల్లో చర్చించాలని ప్రజలను కేసీఆర్‌ కోరారు. 'ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోతయి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రౌతేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వ ట్టాలె' అని అన్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని చెప్పారు. మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్ర తలరాతను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని అన్నారు.

10 చాన్స్‌లిస్తే ఏం చేశారు?

'ఎన్నికలు రాంగనే కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరు. అలవిగాని హామీలు ఇస్తరు. ఆపద మొక్కులు మొక్కుతరు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నేను గుళ్లె, నేను సల్లె అన్నట్టుగా.. యాడికి తీసుకపోతరో తెల్వదు' అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు వచ్చి ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నాయ ని మండిపడ్డారు. 'ఒక్క చాన్స్‌ ఎందుకు నాయ నా ప్రజలు మీకు 10 చాన్సులు ఇచ్చారు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలుగవెట్టిర్రు కదా. చేసిందేమిటి?' అని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దళితులు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారంటే అందరం బాధపడాలని, దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఒకవేళ 60-70 ఏండ్ల కిందటే దళితబంధులాంటి పథకం పెట్టి ఉంటే, ఇప్పుడు దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదో ఆలోచించాలని తెలిపారు. ఈ విధాన లోపం ఎవరిదని ప్రశ్నించారు. 50 ఏండ్లు రాజ్యం చేసి, ఇప్పు డు మల్లా ఓట్లడిగేటోళ్లు పాలించిన జమానాలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేదో గుర్తు చేసుకోవాలని అన్నారు.

 

తెలంగాణలో ఇప్పుడు రైతుకు తెల్లందాక కరెంటు పెట్టబోయే బాధ లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్ర.. కడుపు నిండా కరెంటు .. కల్లాల నిండా వడ్లు. రెండు నెలలు వందల లారీలు పెట్టి గుంజినా తరగని వడ్లు. కల్లాలు ఒడుస్తలేవు. ఏ గ్రామంలో చూసినా, ఏ తారు రోడ్డులో చూసినా ధాన్యపు రాశులతో నిండిపోయాయి. వాటిని చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నది. ఇవన్నీ ఊరికే రాలేదు.. వాటి వెనుక ఎంతో కృషి ఉన్నది.

-సీఎం కేసీఆర్‌

వారిని ఆదుకొనే బాధ్యత సమాజానిదే

గతంలో పింఛన్‌ రూ.40, రూ.70 చివరగా రూ.200 ఇచ్చారని కేసీఆర్‌ గుర్తు చేశారు. తాను సీఎం అయిన తర్వాత 'ఎందుకు పెన్షన్‌ ఇవ్వాలి?. దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉన్నదా? ఓట్ల కోసం మాత్రమే ఇస్తున్నామా?' అని అధికారులను అడిగానని చెప్పారు. అప్పు డు తేలిందేమిటంటే.. దురదృష్టవశాత్తూ మాన వ సమాజంలో కొందరు విధివంచితులు ఉం టారని, వారిని డెస్టిట్యూట్స్‌ అంటారని అన్నా రు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పిల్లలు సరిగా చూడని వృద్ధులు ఉం టారని, ఏ రోజుకైనా వాళ్లందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదేనని స్పష్టం చేశారు. అందుకే పింఛన్‌ పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. మానవీయ కోణంలో ఒకేసారి పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచామని చెప్పారు. తొలివిడత పూర్తయ్యేసరికి రూ.2 వేలకు తీసుకుపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.5 వేలకు పెంచబోతున్నట్టు చెప్పారు. ఓట్ల కోసం ఒకే రోజులో రూ.5 వేలకు పెంచుతామని చెప్పలేదని, మొదట రూ.3 వేలకు పెంచి తర్వాత ఏటా రూ.500 పెంచుతూ ఐదేండ్లు ముగిసేనాటికి రూ.ఐదు వేల పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. రైతుబంధు పెట్టాలని తనను ఎవరూ అడగలేదని, ఎవరూ డిమాండ్‌ చేయలేదని చెప్పారు. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నామని, దాన్ని ఇంకా పెంచుతున్నామని చెప్పారు.

హుస్నాబాద్‌ అద్భుతంగా మారింది

ఒకప్పుడు హుస్నాబాద్‌కు హెలికాప్టర్‌లో వస్తుంటే కండ్లల్లో నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల్లో నీళ్లు తీసుకుపోయి తోట లో మొక్కలు కాపాడుకున్న ఘటనలను చూశానని చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్‌ నుంచి చూస్తే హుస్నాబాద్‌ వాగుమీద రెండుమూడు చెక్‌డ్యాంలు వరుసగా కనిపిస్తున్నాయని, రెం డిట్లో నీళ్లు ఉన్నాయని తెలిపారు. కనుచూపుమేర పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌కు అటు దేవాదుల, ఇటు తోటపల్లి బరాజ్‌ నుంచి నీళ్లు వస్తున్నాయని, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే గౌరవెల్లి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఎలక్షన్‌ తర్వాత 6 నెలలు కష్టపడితే లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. 'ఇక్కడ ఓట్ల కోసం ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడిగేందుకు వస్తున్నారు.. మోసకపోకండి. ఆ పెద్దలు ఇక్కడ చాలా వెలగబెట్టారు. మహా సముద్రం గండిని ఆగంబట్టించారు. దాని గురించి నాడు బీసీ వెల్ఫేర్‌ మినిస్టర్‌గా ఉన్న కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నాకు చెప్పారు. ఇదొక్కటి పూర్తి చేస్తే 10-12 ఊళ్లకు మేలైతది, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అప్పుడు చేస్తానని మాటిచ్చా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుడు కవ్వా లక్ష్మారెడ్డి, లక్ష్మీకాంతరావు, సతీశ్‌తో కలిసి మహాసముద్రం గండి పనులన్నీ పూర్తి చేశాం. 12 ఊర్లలో నీటి ఊటలు పెరిగినయ్‌’ అని పేర్కొన్నారు.

బామ్మర్ది చెప్పిండనో, మేనమామ చెప్పిండనో, సుట్టం చెప్పిండనో ఓట్లు వేయొద్దు. ఆ పద్ధతి బంద్‌ కావాలి. కచ్చితంగా ఆలోచించి, స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతో ఓటింగ్‌ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి.

-సీఎం కేసీఆర్‌

మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో వస్తా

చిగురుమామిడి మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు మిడ్‌ మానేరు నీళ్లతో పచ్చని ప్రాంతంగా మార్చామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్నారు. 'ఎన్నికలు అయిపోయిన ఐదారు నెలల్లో దాన్ని పూర్తి చేసి, దాని నుంచి నీళ్లు విడుదల చేయడానికి నేనే సీఎం హోదాలో మళ్లీ వస్తా' అని చెప్పారు. శనిగరం ప్రాజెక్టు కాలువ పూర్తవుతుందని, కొత్తకొండ వీరభద్రుడి ఆలయాన్ని బాగు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పారు. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారిగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.

బిందెతో ఆడబిడ్డ కనిపిస్తే రాజీనామా చేయమన్నా!

ప్రపంచంలో మిషన్‌ భగీరథలాంటి పథకం ఎక్కడా లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నీళ్లు ఎక్కడి నుంచి ఇంటికి వస్తున్నయో ఎవరికీ తెలియదని, ఎక్కడా గొయ్యిలు, మోటర్లు, పంపులు లేవని పేర్కొన్నారు. ఏ ఊర్లో ఏ లెవల్‌ ఎంతున్నదో కొలిచి పైపులైన్లు వేశామని, దీంతో నేరుగా వచ్చి నీళ్లు ట్యాంకులో పడుతున్నాయని తెలిపారు. 'ఎక్కడైనా ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డెక్కితే వెంటనే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆ నాడు చెప్పిన. అంతలా శపథం తీసుకున్నా. నాడు ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు అందరు కలిసి పనిచేస్తే.. నేడు మనం మిషన్‌ భగీరథ నీళ్లు తాగుతున్నాం' అని పేర్కొన్నారు.

హుస్నాబాద్‌ గెలుపే నాంది కావాలి

హుస్నాబాద్‌ గెలుపే రేపు 95-105 సీట్ల మధ్య బీఆర్‌ఎస్‌ గెలువడానికి నాంది కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. 'ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను. దీవించండి. బ్రహ్మాండమైన మ్యానిఫెస్టోను విడుదల చేసినం. కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్మన్‌, సర్పంచులు అందరూ బాధ్యత తీసుకోండి. మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికీ పంచిపెట్టండి' అని సూచించారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌ చాలా మంచి ఎమ్మెల్యే అని, అందరి తలలో నాలుకలా ఉంటాడని చెప్పారు. 'మీ సేవకోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇటువంటివారు చాలా తక్కువగా ఉంటారు. ఆయన సేవలు వినియోగించుకునేందుకు భారీ మెజార్టీతో ఒడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలి' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 15 2023, 22:26

తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు....

Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు....

Singireddy Somasekhar Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటోన్న వేళ ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు..

ఆ పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సన్నిహితుడు సోమశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది.

సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ టికెట్ ను ఆశించారు. అయితే, తనకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాదని తేలడంతో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీలో ఇటీవల భారీగా చేరికలు జరిగాయి. తెలంగాణ ఎన్నికలకు త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది.

ఈ సమయంలో ఇటీవలే మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందే కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

Oct 15 2023, 09:51

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి..

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి.. రూల్స్‌ సామాన్యులకేనా అంటూ నిలదీత, వీడియో వైరల్


కారు ఫ్రంట్‌ సీట్‌లో కూర్చుని సీటు బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను గుర్తించి నిలదీశాడు ఓ సాధారణ వ్యక్తి. రూల్స్‌ సాధారణ ప్రజలకేనా పోలీసులకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. నడిరోడ్డుపై ఓ యువకుడు పోలీసులను ప్రశ్నించిన తీరు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


కారు డ్రైవ్‌ చేసేటప్పుడు డ్రైవర్‌తో పాటు ఫ్రంట్‌ సీట్లో కూర్చున్న వారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం తప్పనిసరి. లేదంటే జరిమానా తప్పదు. కొందరు సీట్‌ బెల్ట్‌ లేకుండా ప్రయాణిస్తూ.. మధ్యలో వాహన తనిఖీలు ఎదురైనప్పుడు సీట్ బెల్ట్‌ పెట్టుకుంటారు. మెట్రో పాలిటన్‌ నగరాల్లో సీట్ బెల్ట్‌(Police Without Seatbelt) పెట్టుకోకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారు.

సీట్ బెల్ట్‌ పెట్టుకోకపోవడం కారణంగా ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఆయా ప్రభుత్వాలు సీట్‌ బెల్ట్‌ను సేఫ్టీ ఫీచర్‌గా తప్పనిసరి చేశాయి. చాలా మంది దీనిని ఉల్లంఘిస్తూ జరిమానాలు ఎదుర్కోవడమే కాకుండా యాక్సిడెంట్స్‌లో బలి అవుతున్నారు. అయితే ఈ నిబంధన కేవలం సాధారణ వ్యక్తులకేనా అంటే కాదు.. అందరికీ వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో పోలీసులు సీట్‌ బెల్ట్‌(Police Without Seatbelt Viral Video) పెట్టుకోకపోవడంతో యువకుడు కారును ఆపి వారిని నిలదీసిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నూర్‌లో పోలీసులు సీట్‌ బెల్టులు పెట్టుకోకుండా కారులో పెట్రోలింగ్‌కు వచ్చారు. అయితే ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ యువకుడు వారు పోలీసులు అని కూడా చూడకుండా వారి కారును ఆపాడు.

Man-Stopped-Police-Vehicle-For-Not-Wearing-Helmet

చట్టం సామాన్య ప్రజల కోసమేనా.? పోలీసులకు వర్తించదా అంటూ కారులో ఫ్రంట్‌ సీట్లో కూర్చున్న సీనియర్ పోలీసు అధికారిని ప్రశ్నించాడు.

అయితే ఈ సంభాషణ అంతా మళయాళంలో జరుగుతుంది. యువకుడు నిలదీయడంతో కోపం వచ్చిన పోలీసు అధికారి కారులో నుంచి దిగి అతడితో వాగ్వాదానికి దిగారు. అయినప్పుడు ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఆ కాసేపటికి కారులో వెనుక కూర్చున్న పోలీసులు సైతం కిందికి దిగి అతడితో గొడవకు దిగారు.

డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించావంటూ యువకుడిని పోలీసులు తిట్టిపోస్తున్నారు. వెంటనే కారులో నుంచి పేపర్‌, పెన్‌ తీసుకుని యువకుడికి వ్యతిరేకంగా కంప్లెయింట్‌ రాస్తూ సంతకం చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే ఈ గొడవ మొత్తాన్ని అక్కడే ఉన్న సాధారణ ప్రజలు గమనిస్తున్నారు.

యువకుడిని ఒక్కడిని చేసి పోలీసులు గొడవకు దిగుతున్నారని భావించిన స్థానికులు.. యువకుడికి మద్దతుగా నిలిచారు. సంఘటనను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పోలీసులతో గొడవకు దిగారు. గొడవ పెద్దది అవుతుండటంతో లాభం లేదనుకున్నారేమే.. కాసేపటికి అక్కడి నుంచి తమ వాహనంలో వెళ్లిపోయారు.

గతేడాది టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ కారు ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కారు వెనుక సీట్లలో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ ధరించడం ఆవశ్యకతపై ఆటో మేకర్లు దృష్టి సారిస్తున్నారు. పోలీసులు కూడా సీటు బెల్టు పెట్టుకోని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 17:01

బీఆర్ఎస్ పార్టీలోకి పొన్నాల లక్ష్మయ్య...!
*

*

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 16:02

ఆడపడుచులతో కలిసి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

ప్రకృతిని ఆరాధించే పండుగ ‘బతుకమ్మ’

ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిభింభం

ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ

తెలంగాణ సంస్కృతి ని విశ్వవ్యాప్తం చేసింది బతుకమ్మ పండుగ

 మధ్య లో నిరాదరణకు గురైన బతుకమ్మ పండుగ ను ఇంటికి ఇంటికి చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే 

ఆడ పడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు 

➖➖➖➖➖➖➖➖➖➖

సూర్యాపేట లో మంత్రి జగదీష్ రెడ్డి నివాసం లో బతుకమ్మ సంబరాలు

 ఆడపడుచులతో కలిసి బతుకమ్మలను పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి

బతుకమ్మ పాటలతో మహిళల సంబరాలు

➖➖➖➖➖➖➖➖➖➖

ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ పండుగ అని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట లోని విద్యానగర్ మంత్రి నివాసంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ను పేర్చి ఆశ్చర్యపరిచారు. తీరొక్క పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో మంత్రి సతీమణి సునీత మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ , పలువురు మహిళలు పాల్గొన్నారు. సునీత జగదీష్ రెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో మంత్రి నివాసం మర్మోగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ 

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిబింభం అన్నారు.మహిళలకు ప్రతిబింభం అయిన పూలను ఆరాధించమంటే వారిని గౌరవించడమే అన్నారు.ప్రపంచంలో అనేక జాతులు ఉన్నా, ప్రకృతిని ఆరాధించే ఏకైక జాతి తెలంగాణ జాతి అన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ బతుకమ్మ పండుగ సంస్కృతి తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేసింది అన్నారు.మధ్య లో కొంత నిరాదారణకు గురైన బతుకమ్మ పండుగ ను ఇంటికి ఇంటికి చేర్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిదే అన్నారు. రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకం చేయడంలో  బతుకమ్మ పండుగ ప్రముఖ పాత్ర వహించింది అన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకలు సూర్యాపేటలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సూర్యాపేట కూడా ఉంటుందన్నారు. సద్దుల చెరువు ట్యాంకుబండ వద్ద నిర్వహించే వేడుకల్లో వేలాది మంది ఆడపడుచులు పాల్గొంటారని తెలిపారు.ఆడపడుచులు అంతా ఒకచోట చేరి సాంప్రదాయం ఉట్టిపడేలా, ఊరంతా ఒకటై తమలో బీదా గొప్పా వర్ణం ,వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారని అన్నారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయన్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందన్నారు.అందుకే బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ, బతుకమ్మ అంటే పూల పండుగ, బతుకమ్మ అంటే మనిషి ప్రకృతితో మమేకం అయ్యే అత్యంత అరుదైన అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్ష లు తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 11:06

నేడు అరుదైన సూర్య గ్రహణం: పాటించాల్సిన జాగ్రత్తలు

నేడు అరుదైన సూర్య గ్రహణం: పాటించాల్సిన జాగ్రత్తలు


వాషింగ్టన్: నేడు సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. ఇది పాక్షికం. అత్యంత అరుదైన గ్రహణం ఇది. మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి రావడం దీని ప్రత్యేకత. ఇదివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of fire) కనువిందు చేయనుంది.


ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు.


ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.

భారత కాలమానం ప్రకారం- ఈ రాత్రి 9 గంటలకు సూర్యగ్రహణ కాలం ఆరంభమౌతుంది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే మరుసటి రోజు తెల్లవారు జామున 1:45 నిమిషాలకు గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. 1:06 నుంచి 2:23 నిమిషాల వరకు సూర్యుడు పాక్షికంగా చీకట్లో ఉంటాడు.



సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఈ సారి ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ 5:17 సెకెండ్ల పాటు కనువిందు చేస్తుంది.

సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా సూర్యుడిని చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడుతుంది. సూర్యుడిని చూడటానికి సరైన ఫిల్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం బ్లాక్ కలర్ ఫిల్మ్స్ వాడొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.


నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:50

IND vs PAK: గిల్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు ఔట్.. జట్టులోకి నిప్పులు చెరిగే బౌలర్.. పాక్ తో భారత తుదిజట్టు ఇదే!

IND vs PAK: గిల్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు ఔట్.. జట్టులోకి నిప్పులు చెరిగే బౌలర్.. పాక్ తో భారత తుదిజట్టు ఇదే!

IND vs PAK: ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో ఈ రెండు జ‌ట్లూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు కన్నుల పండ‌గే. టీవీల‌కు అతుక్కుపోతారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఈ హై ఓల్టేజ్ పోరుకు కౌంట్ డౌన్ షురూ అయింది.





  • Follow us on

1/ 9

క్రికెట్‌లో భార‌త్‌-పాకిస్తాన్ (IND vs PAK) జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. ఉత్కంఠ‌త‌కు గురి చేసేదే. వార్ వ‌న్ సైడ్ అయిన‌ట్టు మ్యాచ్ మొత్తాన్నీ భార‌త్ త‌న వైపు లాగేసుకున్నా స‌రే! చివ‌రి నిమిషం వ‌ర‌కూ మ్యాచ్ మొత్తాన్నీ త‌నివి తీరా చూస్తారు భార‌త అభిమానులు. చివ‌రి బంతి వ‌ర‌కు ఆట‌ను ఆస్వాదిస్తారు.

ఇక ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో ఈ రెండు జ‌ట్లూ త‌ల‌ప‌డితే అభిమానుల‌కు కన్నుల పండ‌గే. టీవీల‌కు అతుక్కుపోతారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఈ హై ఓల్టేజ్ పోరుకు కౌంట్ డౌన్ షురూ అయింది. అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి.



మరోవైపు.. డెంగ్యూ కారణంగా శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అయితే అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. దీంతో.. ఈ యంగ్ ప్లేయర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.


దీంతో.. టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చోటు చేసుకునున్నాయి. దీంతో.. టీమిండియా తుది జట్టు అంచనాపై ఓ లుక్కేద్దాం.

ఓపెనర్లుగా రోహిత్ తో పాటు ఇషాన్ కిషన్ లేదా గిల్ ఇద్దరిలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. శనివారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం గిల్ ఫిట్నెస్ ఓ అంచనాకు రానున్నారు. గిల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.


విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో రాహుల్ బరిలోకి నిలవనున్నాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు.


అయితే.. బౌలింగ్ లైనప్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తుంది. పిచ్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం అశ్విన్ బెంచ్‌కే పరిమితమవుతాడు.


అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన మహమ్మద్ సిరాజ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. సిరాజ్ స్థానంలో అనుభవం కలిగిన మహమ్మద్ షమీని ఆడించే అవకాశాలున్నాయి. లేకపోతే సిరాజ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే.. ఐపీఎల్ లో షమీ గుజరాత్ తరఫున ఆడేవాడు. దీంతో.. అహ్మదాబాద్ కండీషన్లపై షమీకి పట్టుంది. దీంతో.. షమీని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా భావిస్తుంది.


భారత్ తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్/షమీ, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/మహమ్మద్ షమీ

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:38

మొన్న ఉల్లిగడ్డ,నిన్న టమాటా..ఇప్పుడు వెల్లుల్లి..డబుల్ సెంచరీ దాటిన కిలో ధర

Garlic Price: మొన్న ఉల్లిగడ్డ,నిన్న టమాటా..ఇప్పుడు వెల్లుల్లి..డబుల్ సెంచరీ దాటిన కిలో ధర

Garlic Price: నిత్యవసర సరుకులకు రెక్కలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూరల్లో వాడే కూరగాయలు, మసాలా దినుసులుగా ఉపయోగించే కిచెన్ పదార్ధాల ధరలు భగ్గుమంటున్నాయి. మొదట్లో టమాటా ధరలు అటుపై ఉల్లిగడ్డ ధరలు కిలో 200రూపాయలు పలికాయి. ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది.


1/ 9

నిత్యవసర సరుకులకు రెక్కలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూరల్లో వాడే కూరగాయలు, మసాలా దినుసులుగా ఉపయోగించే కిచెన్ పదార్ధాల ధరలు భగ్గుమంటున్నాయి. మొదట్లో టమాటా ధరలు అటుపై ఉల్లిగడ్డ ధరలు కిలో 200రూపాయలు పలికాయి. (Photo:pexels)

2/ 9

ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది. పౌష్టికారంలో నిత్యం వాడే మసాలా దినుసుల్లో ప్రధానమైనది వెల్లుల్లి. అందుకే ప్రతీ వంటింట్లో కనిపించే ఈ వెల్లుల్లి ఇప్పుడు మార్కెట్‌లో, కూరగాయల షాపుల్లో కనిపించకుండాపోతోంది. (Photo:pexels)

3/ 9

కొద్దిరోజుల క్రితం వరకు కిలో 100రూపాయల నుంచి 140-160 రూపాయల వరకు మార్కెట్‌లో దొరికేవి. కాని ఇప్పుడు వెల్లుల్లి ధర డబుల్ సెంచరీ దాటేసింది. అందుకే మార్కెట్‌లో వెల్లుల్లి కొనేందుకు వినియోగదారులు వెనుక ముందు ఆలోచిస్తున్నారు. (Photo:pexels)

4/ 9

గతంలో దేశ వ్యాప్తంగా వెల్లుల్లి సాగు, సప్లై బాగా ఉండేది. కాని ప్రస్తుతం మార్కెట్‌లోకి వెల్లుల్లి సప్లై తగ్గడం కారణంగానే ధర అమాంతం పెరిగిందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ ఆర్దిక రాజధాని ముంబైలో కిలో రూ.160 పలుకుతోంది. (Photo:pexels)

5/ 9

హోల్ సేల్ మార్కెట్లోనే కిలో రూ. 160 కి చేరింది వెల్లుల్లి. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో రూ.280 దాకా పెరిగింది. మార్కెట్ లోకి సప్లై తగ్గడం వల్లే వెల్లుల్లి ధరలు పెరుగుతున్నాయని, నెల రోజుల్లో ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.(Photo:pexels)

6/ 9

ముంబై నగరంలోనే కాదు ..హైదరాబాద్‌లో కూడా కిలో వెల్లుల్లి ధర గత వారం రోజుల క్రితం 100-120 రూపాయలు ఉండగా ఇప్పుడు 200-220రూపాయలకు విక్రయిస్తున్నారు. (Photo:pexels)

7/ 9

అటు నవీ ముంబైలోని మార్కెట్ కు నిత్యం 24 నుంచి 30 వాహనాలలో వచ్చే వెల్లుల్లి స్టాకు ప్రస్తుతం తగ్గిపోయిందని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) వెల్లడించింది. ఇప్పుడు రోజూ 15 ట్రక్కులకు మించి రావడంలేదని చెబుతున్నారు. (Photo:pexels)

8/ 9

సప్లై దాదాపు 40 శాతం పడిపోవడం వల్లే ఇంత డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో వెల్లుల్లి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. మే నెల మొదట్లో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు ఉండేది. ఇప్పుడు అప్పటి ధరకు ఏడు రెట్లు పెరిగింది. (Photo:pexels)

9/ 9

ఇదే పరిస్థితి కొనసాగితే వెల్లుల్లి ధర కిలో మే నెల ధర కంటే పది రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి మార్గెట్ వర్గాలు. స్పైసీ కోసం వంటలో తప్పక వాడే వెల్లుల్లి..ఈవిధంగా రేటు పెరగడంతో వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 14 2023, 10:23

IND vs PAK: ఒక స్థానం.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. హై ఓల్టేజ్ పోరులో రోహిత్ ఎవరికి ఓటు వేస్తాడు..?

IND vs PAK: ఒక స్థానం.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. హై ఓల్టేజ్ పోరులో రోహిత్ ఎవరికి ఓటు వేస్తాడు..?

IND vs PAK: టీమిండియా అతి పెద్ద మ్యాచుకు రెడీ అయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం.. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా గేమ్ ప్లాన్ సిద్దం చేసుకుంటుంది.





  • Follow us on



వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) లో భారత క్రికెట్ జట్టు దుమ్మురేపుతుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఐసీసీ మెగా టోర్నమెంట్‌లో టీమిండియా సత్తా చాటుతుంది. రోహిత్ శర్మ అండ్ కంపెనీకి చెందిన కారవాన్ ఇప్పుడు చెన్నై, ఢిల్లీ మీదుగా అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ శనివారం (అక్టోబర్ 14) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.


పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ,ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ లకు ఓ తలనొప్పి మొదలైంది. ఒక స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. మరి.. ప్లేయింగ్ ఎలెవన్ లో రోహిత్ ఎవరికి అవకాశం ఇస్తాడు..? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు..? ఇక్కడ తెలుసుకుందాం.

టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి 2023 వన్డే ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌.అశ్విన్‌కు టీమిండియాలో చోటు దక్కగా.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ షమీ పాకిస్థాన్‌తో (IND vs PAK) జరిగే హై ఓల్టేజ్ మ్యాచులో జట్టులో చోటు సంపాదించవచ్చు. (AP)


పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత పేస్ అటాక్‌లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించగలడు. షమీకి పాకిస్థాన్‌తో చాలా వన్డేలు ఆడే అవకాశాలు రాలేదు. అతను ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచుల్లో అతను 5 వికెట్లు తీసుకున్నాడు.


పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మహమ్మద్ షమీ 28 ఓవర్లు బౌలింగ్ చేసి 107 పరుగులు ఇచ్చాడు. పాకిస్థాన్‌పై షమీ 35 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ స్పెల్.


అహ్మదాబాద్‌లోని బ్యాటింగ్ పిచ్‌లో ఏదైనా మార్పు ఉంటే.. అప్పుడు రోహిత్ శర్మ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పెద్ద బౌండరీని పరిగణనలోకి తీసుకుని రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి బరిలోకి దిగవచ్చు.

ఆహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. ఇక్కడ పరుగుల వరద పారుతుంది. అయితే ఈ వికెట్ గతంలో స్పిన్నర్లకు కూడా సహాయపడింది. అశ్విన్‌కు బ్యాటింగ్ చేయగల సత్తా కూడా ఉంది. అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని.. అశ్విన్ కి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ఇవ్వచ్చు.


అహ్మదాబాద్ పిచ్‌పై పరుగులు చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. భారత జట్టు శార్దూల్ ఠాకూర్‌ కూడా అవకాశం ఇవ్వచ్చు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌పై భారత టాప్ ఆర్డర్ బ్యాట్‌తో సందడి చేసిన తీరు చూస్తుంటే.. టీమిండియాకు 8వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్, ద్రవిడ్ నిఖార్సైన బౌలర్ కు ఓటు వేయవచ్చు


టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కూడా పాకిస్థాన్‌పై భారత జట్టు శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా మహ్మద్ షమీని ప్లేయింగ్ ఎలెవన్‌లోని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.


ఈ మెగాటోర్నీలో పాకిస్థాన్‌పై విజయం సాధించడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేస్తుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, ఏడింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది.