తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2023, 21:58

నలగొండ పద్మ నగర్ వాసి బాసాని సైదులు గారి తల్లి మృతి పట్ల సంతాపం తెలియజేసి ఆర్థిక సాయం అందజేసిన నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ పట్టణం 17 వార్డు కి చెందిన బాసాని సైదులు గారి అమ్మ గారు పరమపదించారని తెలుసుకొని వెళ్లి వారి పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఆర్థిక సహాయం అందచేసి వారి

కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని బరోసా కల్పించిన బిజెపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డి గారు మరియు 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిర్యాల వెంకటేశం,వెంకన్న,తారకరామ, రామలింగం,సతీష్ , శీను మరియు వార్డు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2023, 15:41

Chidambaram: ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు: చిదంబరం

Kipp

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సును పురస్కరించుకుని భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి..

ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం (P. Chidambaram) అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా మోదీ సర్కారు తీరును విమర్శించారు.

విందుకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 'ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ-20 సదస్సులో ఏర్పాటు చేసిన విందుకు గుర్తింపు ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యం లేని దేశాల్లో మాత్రమే జరుగుతుంది. ఇంకా మన దేశంలో ప్రతిపక్షం ఉనికిని కోల్పోయే దశకు చేరుకోలేదనే నేను భావిస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. యూరప్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జీ20 సదస్సుకు పక్ష నేతను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోని 60 శాతం మందికి ప్రతినిధిగా ఉన్న నేతకు ప్రస్తుత నాయకత్వం విలువ ఇవ్వడం లేదని అర్థమవుతోంది. వాళ్లు ఎందుకలా భావిస్తున్నారు అని ప్రశ్నించారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2023, 15:35

Kodali Nani: బాలకృష్ణపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు

బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని(విగ్) తిరుగుతున్న బాలకృష్ణ, ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలని అన్నారు. అంతేకాక 'బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని కూడా పేర్కొన్నారు. ఇక అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టార్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్లు కూడా జత చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 09 2023, 09:45

తెలంగాణ ఇంజనీర్ల నైపుణ్యం మహా అద్భుతం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు ఏర్పాటు చేసిన వాటర్‌ కండక్టర్‌ సిస్టమ్‌ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం.

ప్రధాన ఓపెన్‌ కెనాల్‌ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్‌ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం.

ఒక్కో సర్జ్‌పూల్‌ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్‌ ద్వారా సగటున కిలో మీటర్‌ వరకు ప్రయాణించాల్సి ఉంది.

మొత్తం 11 ప్రధాన సొరంగాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్‌వర్క్‌ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్‌ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం.

అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తొలుత ఓపెన్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు........

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2023, 20:02

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ


సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్‌ల కంటే అధ్వానంగా ఉందని రేవంత్ అన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుంటే హోంగార్డులు ఎలా బతకాలని లేఖలో ప్రశ్నించారు. హోంగార్డు రవీందర్ ను ఉన్నతాధికారులు వేధించారన్నారు.

రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచిందన్నారు. రవీందర్ భార్యాపిల్లలకు దిక్కెవరని రేవంత్ ప్రశ్నించారు.

ఇంత జరిగినా ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణం. రవీందర్‌ది ఆత్మహత్య కాదని... ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు. 2017లో హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారని రేవంత్ విమర్శించారు.

హోంగార్డుల డిమాండ్‌లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. రవీందర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎస్సై నుంచి ముఖ్యమంత్రి వరకు కంటికి రెప్పలా కాపాడుతున్న హోంగార్డుల సమస్యలను పరిష్కారించాలనే సోయి ఏ ఒక్కరికి లేకపోవడం బాధాకరమని రేవంత్ పేర్కొన్నారు.

మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి హోంగార్డుల మనోవేదనను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కారించాలనే ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయిందని రేవంత్ దుయ్యబట్టారు.

ఇకనైనా హోంగార్డుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలి. లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాని రేవంత్ హెచ్చరించారు........

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2023, 17:23

కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం

హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది..

ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు.

శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 08 2023, 10:29

తెలుగు రాష్ట్రాల నుంచి హద్దులు దాటుతున్న గంజాయి: 8 మంది అరెస్టు

ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ మీదుగా 4 కార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఒక్కో ప్యాకెట్లో రెండేసి కిలోలు ఉండే విధంగా 75 ప్యాకెట్లుగా చేసుకొని గుట్టుగా గంజాయి తరలిస్తుండగా అనుమానంతో కార్లను వెంబడించి గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా గంజాయి అక్రమ రవాణా ముఠాను చకచక్యంగా పట్టుకొన్నారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు పులి రమేశ్ , అల్లం రాంబాబు, పెండ్యాల దేవేందర్,హసన్ పర్తి సిఐ తుమ్మ గోపి, ఎసై నర్సింహారావు , వంశీలు చేజ్ చేసి పట్టుకొన్నారు. ధరవత్ రవి (38), చిలుక సురేష్ (32), గుగూలోతు హరిసింగ్ (45), జటోతూ.చంద్రు (40), జటోతూ. ప్రవీణ్ (21), సలవోద్దీన్ (29), అజాజ్ ఖాన్ (41),షేక్ శమీర్ (28)లను అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి జెస్ట్ కారులో పారి పోయారు........

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2023, 18:52

Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైకాపా ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. పవన్‌ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు..

అనంతరం ప్రొద్దుటూరులోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తన కుమార్తె ఇష్టప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2023, 18:32

ప్రశాంతంగాఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు.. సీపీ రెమా రాజేశ్వరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అంతర్ జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్‌ రెమా రాజేశ్వరి తెలియజేశారు.

గురువారం రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లి డిసిపి గైక్వాడ్ వైబావ్ రఘునాథ్, నిర్మల్ ఎస్పి ప్రవీణ్ కుమార్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పి సురేష్ కుమార్, జగిత్యాల్ ఎస్పి ఎ,భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పి పి.కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కర్ణాకర్ రావులతో పాటు రామగుండం కమీషనరేట్ పరిదిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐలతో అంతర్‌ జిల్లాల సరిహద్దు సమావేశం నిర్వహించారు.

  

అనంతరం మాట్లాడుతూ… అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం,

సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలపై చర్చించామన్నారు.

ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా, బందోబస్తు ఏర్పాట్ల గురించి, సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి ఉమ్మడి కార్యకలాపాల మీద సమాచారం సేకరించామన్నారు.

ఎన్నికల సంబంధిత పరస్పర సమాచార మార్పిడి, వివిఐపి, విఐపిల కదలికల సమయంలో పరస్పర సమాచార మార్పిడి, బందోబస్తు ఏర్పాట్లలో సహకారం అందించుకోవాలన్నారు.

ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించామన్నారు. 80 సంవత్సరాల పైబడిన వృద్దులకు, మూడోవంతు అంగవైకల్యం ఉన్న వారికీ భారత ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వారికీ ఓటు వేసే విధంగా ప్రత్యేక విభాగాల ఏర్పాటు కోసం చర్చించామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సరిహద్దు జిల్లాల పోలీసుల పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించామన్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 07 2023, 16:09

బిజెపి గూటికి చందూలాల్ కుమారుడు :అజ్మీరా ప్రహ్లాద్?

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. ఒక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. వేరే పార్టీల నుంచి హామీలు లభిస్తే గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.

అధికార పార్టీ బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతులు వేరే పార్టీలవైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారు.

దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆయన కమలం గూటికి చేరనున్నారు. ఆ రోజు ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు...