Mane Praveen

Aug 09 2023, 23:05

గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
TS: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్  ఇండ్లులేని నిరుపేదల కోసం.. ఖాళీ స్థలం ఉండి, సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే, లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి దరఖాస్తులు పంపించవచ్చని తెలిపారు

గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Mane Praveen

Aug 09 2023, 22:09

బాధితుడికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు: మండలంలోని కిష్టాపురం గ్రామంలో జాజుల వెంకటయ్య ఆటో డ్రైవర్ నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా, ఆ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  వెంటనే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించగా, ఆ మొత్తాన్ని ఈరోజు కిష్టాపురం బీజేపీ నాయకులు వారి కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రాధా రమేష్, బిజెపి జిల్లా కార్యదర్శి వేదాంతం గోపీనాథ్, మునుకుంట్ల మల్లయ్య, బోయ సురేష్, మునుకుట్ల కిష్టయ్య, బీమనపల్లి సాయిబాబా, ఐతరాజు వేణు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జాజుల శంకరయ్య, మాల్గు కొండల్, గంటల మోహన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 09 2023, 19:08

గుజ్జ: విద్యార్థులకు షూస్, పలకలు, నోట్స్  ఉచితంగా పంపిణీ
యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం, గుజ్జ ప్రాధమిక పాఠశాలలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వేలిమినేడు గ్రామానికి చెందిన యువకుడు సురుగూరు రఘుమారెడ్డి.. బుధవారం విద్యార్థులకు షూస్, పలకలు, నోట్స్  ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పబ్బు దేవేందర్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్  మైల యాదవ రెడ్డి, మండల నోడల్ ఆఫీసర్ సుల్తాన్ హనుమంతు, ఉపాధ్యాయురాలు శివరంజని పాల్గొన్నారు. సర్పంచ్,నోడల్ ఆఫీసర్ దాతలను అభినందించారు.

Mane Praveen

Aug 09 2023, 18:49

గృహలక్ష్మి పథకం దరఖాస్తు సమయాన్ని పొడిగించాలి: మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా:
నకిరేకల్: గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు సమయాన్ని ఒక నెల రోజులకు పొడిగించాలని బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఒక ప్రకటనలో కోరారు. ఆమె మాట్లాడుతూ.. గృహలక్ష్మి దరఖాస్తుకు అవసరమైన కులము, ఆదాయము, నివాస ధ్రువీకరణ పత్రం ఎమ్మార్వో ఆఫీస్ నుంచి తొందరగా తీసుకునే అవకాశం లేదు. మీ సేవలో సర్వర్ ప్రాబ్లం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నాలుగు రోజుల గడువు సమయం సరిపోదని, వాళ్ళు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ బందు, మైనార్టీ బంద్ దరఖాస్తు సమయంలో కూడా తక్కువ సమయం ఇచ్చినందున చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయి ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోయారు. ప్రభుత్వం ఆదాయం కోసం ప్రారంభించిన వైన్స్ దరఖాస్తులకు 15 రోజులు గడువు ఇచ్చి పేదవాళ్ల చిరకాల కోరిక అయిన గృహనిర్మానానికి నాలుగు రోజుల గడువు ఇవ్వడం శోచనీయమని అన్నారు. పేదవారికి ఎలాంటి షరతులు లేకుండా సొంత ఇంటి స్థలం ఉండి, ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని కోరారు.నిజమైన అర్హత కలిగిన  పేదవారికి ప్రభుత్వ పథకాలలో  అవకాశం కల్పించాలని కోరారు.

Mane Praveen

Aug 09 2023, 16:32

NLG: మంత్రిని కలిసిన చర్లగూడెం భూ నిర్వాసితులు

మర్రిగూడెం: మండలంలోని చర్లగూడెం  భూ నిర్వాసితులు బుధవారం హైదరాబాదులో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తమకు  పునరావాస ఇంటి స్థలం, ఉపాధి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వారం పది రోజుల్లో పునరావాస ఇంటి స్థలాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లగూడ గ్రామస్తులు వల్లపుదాస్ కేశవ్ గౌడ్, సంకబుడ్డి శ్రీనివాస్ యాదవ్, తొడేటి వెంకన్న, ఎరుకల శేఖర్ గౌడ్, శంకరయ్య, ముంత నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 09 2023, 14:48

NLG: గృహలక్ష్మి దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక
మర్రిగూడెం: గృహలక్ష్మి పథకానికి చివరి తేదీ ఈ నెల 10. రేపే చివరి తేదీ కావడంతో, దరఖాస్తుదారులు మీసేవ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, అప్లికేషన్ ఫారాలను నింపుతూ హడావిడిగా ఉన్నారు. దరఖాస్తు ఫారం లో కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికెట్ అని ఉండగా అభ్యర్థులు ఆందోళన చెందుతూ.. కులం ఆదాయం సర్టిఫికెట్లు అప్లై చేయడానికి, మీసేవ సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే మర్రిగూడ మండల ఎమ్మార్వో మహేందర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. గృహలక్ష్మి దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థులు తమ వద్ద ఉన్న పత్రాలను జతచేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. కులం ఆదాయ సర్టిఫికెట్ వెంటనే తీయాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటివి ప్రస్తుతం అభ్యర్థుల దగ్గర ఉన్న సర్టిఫికెట్లను జత చేసి ఎమ్మార్వో కార్యాలయంలో అందజేయాలని అన్నారు. తర్వాత వెరిఫికేషన్ సమయంలో  మిగతా సర్టిఫికెట్లు అందిస్తే సరిపోతుందని అన్నారు.

Mane Praveen

Aug 08 2023, 22:01

పెద్దవూర: నూతన ఎస్సై అజ్మీరా రమేష్ నాయక్ కు ఘన సన్మానం
నల్గొండ జిల్లా, పెద్దవూర మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అజ్మీరా రమేష్ నాయక్ ను మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి,  వారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో పెద్దవూర మండల బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తుడుం రాకేష్, సంగారం 11వ వార్డు మెంబర్ తరి వెంకటయ్య, పోతునూరు ప్రధాన కార్యదర్శి ఎర్ర చంద్రయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వంగూరి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 08 2023, 21:47

NLG: కస్తూరిబా బాలికల విద్యాలయాలకు చేయుతనిస్తున్న కస్తూరి ఫౌండేషన్
గుర్రంపోడ్: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా కస్తూరి ఫౌండేషన్ వారు తెలుసుకొని సుమారు 3 లక్షల వ్యయంతో సానిటరీ వర్క్స్ మరమ్మత్తులు చేపట్టినారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాలలో పుష్పలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ఘన సన్మానం నిర్వహించారు. శ్రీ చరణ్ మాట్లాడుతూ.. 2017లో కస్తూరి ఫౌండేషన్ ప్రారంభించినపుడు విద్యారంగాన్ని సేవా రంగంగా ఎంచుకొని 6 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో తమ ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ.. మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులకు సూచించారు. మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారన్నారు. కస్తూరి శ్రీ చరణ్  చేతుల మీదగా  పాఠశాలోని విద్యార్దినులకు స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్, గ్రామర్ బుక్స్, డిక్షనరీ బుక్స్, మైక్ సెట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణ, మహేష్, పిన్నింటి నరేందర్ రెడ్డి, సమ్మిడి నవీన్ రెడ్డి, వీరమళ్ల కార్తీక్ గౌడ్, రవి, టీచర్లు హేమలత, జ్యోతి, కవిత, ఉమాదేవి, నేహా, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 08 2023, 21:15

చౌటుప్పల్: జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం నియోజకవర్గంలోని యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 మరియు 13 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళలు వారికి ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను ఎమ్మేల్యే అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులైన చౌటుప్పల్ మెయిన్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను ఎమ్మేల్యే పర్యవేక్షించారు. త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 08 2023, 19:48

NLG: గట్టు నెమలిపూర్ రైతుల సమస్యలు పరిష్కరించాలి: రామావత్ రమేష్ నాయక్
నల్లగొండ జిల్లా, పెద్దఅడిశర్లపల్లి: బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్, పెద్ద అడిశర్లపల్లి మండలంలోని గట్టునెమలిపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు, వారి సమస్యను రామావత్ రమేష్ నాయక్ దృష్టికి తీసుకెళ్ళారు, వారి సమస్యను విని అనంతరం రామావత్ రమేష్ మాట్లాడుతూ..   ధరణి అనే పోర్టల్ తీసుకువచ్చి, ధరణి పొరపాట్ల వల్ల, రైతుల్ని పొలాల్లో ఉండనివ్వకుండా ఎమ్మార్వో ఆఫీసులో చుట్టూ తిరిగేటట్టు చేసిన ప్రభుత్వం తప్పిదం వల్ల, ఎంతో మంది రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గట్టు నెమలిపూర్ గ్రామస్తుల భూ సమస్యను పరిష్కరించాలని, లేనియెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ ఆర్డీవో ఆఫీస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బాలునాయాక్, సాయి, లోకేష్, కృష్ణయ్య, దత్తు నాయక్ తదితరులు పాల్గొన్నారు