Mane Praveen

Aug 05 2023, 22:36

ఎల్ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ ను విజయవంతం చేయాలి: బుర్రి వెంకన్న
TS: బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, ఆదివారం   హైదరాబాదులోని సైఫాబాద్ లో, సామ్రాట్ కమర్షియల్ కాంప్లెక్స్ యందు గల ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్ లో జరగనున్న  'ఎల్ ఆర్ బాలే శ్రద్ధాంజలి సభ' ను దిగ్విజయం చేయాలను, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఉద్యమ సన్నిహితుడు ఎల్ఆర్ బాలే,  పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నవాన్ షహర్ జిల్లాలోని షాహిద్ భగత్ సింగ్ నగర్ లో 1930లో జూలై 20న జన్మించారు. ఎల్ ఆర్ బాలే ఢిల్లీలో తపాల శాఖలో పని చేసేవారు. ఆయనకు ప్రతి సాయంత్రం బాబా సాహెబ్ అంబేద్కర్ ను కలుసుకునే అవకాశం కలిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవనశైలి, దినచర్య, పుస్తక పఠనం రచన, వ్యాసంగం, సంభాషణ ఇవన్నీ సమీపము నుంచి పరిశీలించి ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడినారని తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పని చేయడానికి ఎల్ ఆర్ బాలే తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 1958 లో భీమ్ పత్రిక పక్ష పత్రికను ప్రారంభించారు. అలాంటి గొప్ప అంబేద్కర్ వాది ఎల్ఆర్ బాలే గారి సంతాప సభను  హైదరాబాదులో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని బుర్రి వెంకన్న తెలిపారు.

ఈ సంతాప సభకు మాజీ జాతీయ అధ్యక్షులు బాబా సాహెబ్ అంబేద్కర్ తో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తులు కూడా వస్తున్నారని వారు తెలియజేశారు.  అంబేద్కర్ వాదులంతా విచ్చేసి ఈ  సంతాప సభను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక దళ్ సంస్థలో పనిచేయడం చాలా గర్వకారణమని అన్నారు.

Mane Praveen

Aug 05 2023, 21:42

నల్లగొండ జిల్లా కోర్టులో భూ చట్టాలపై వర్క్ షాప్
నల్లగొండ: జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం 'LAND AND REVENUE LAWS' (భూమి మరియు రెవెన్యూ చట్టాలు) పై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు ముఖ్యఅతిథిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూమి సునీల్ కుమార్ స్పీకర్ గా విచ్చేసి మాట్లాడుతూ.. రెవెన్యూ అమెండ్మెంట్స్, రెవెన్యూ చట్టాల మీద క్లుప్తం గా వివరించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు ఏ.జయరాజు, బి.తిరుపతి, జి.సంపూర్ణ ఆనంద్, ఇతర న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేతి రఘుపతి, ప్రధాన కార్యదర్శి జెనిగల రవికుమార్, సీనియర్ న్యాయవాదులు ఏ.సతీష్ కుమార్, ఎం.ఆదిరెడ్డి, మామిడి ప్రమీల, జెనిగల రాములు, ఇతర న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 19:07

పిడిఎస్యు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించాలి: మధు
నల్గొండ: పట్టణంలో  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడించిన పిడిఎస్యు నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించాలని పి.డి.ఎస్.యు  జిల్లా ఉపాధ్యక్షుడు మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న 5వేల కోట్ల పైచిలుకు స్కాలర్ షిప్స్, రీయంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చేయాలని, DSE డైరెక్టర్ దేవసేన ప్రభుత్వ విద్య సంస్థల్లోకి మీడియాను/విద్యార్థి సంఘాలకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని, సంక్షేమ హాస్టళ్స్ సమస్యలను పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యాసంస్థలు/ప్రైవేటు యూనివర్సిటీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అభివృద్ది చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడించిన పిడిఎస్యు నాయకులను విడుదల చేయాలని  అన్నారు. ఈ కార్యక్రమం లో నాగేంద్రబాబు, నరేష్, గౌతమ్  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 18:47

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నల్లగొండలో రెండు రోజుల దీక్ష ప్రారంభం
నల్లగొండ: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని  చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, శనివారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ  మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్.. ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి., డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే SC / ST / BC / EBC విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ రేటు రూ. 1800/- నుండి 15,000/- రూపాయలకు పెంచాలి.
SC / ST / BC కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/ - రూపాయలకు, పాఠశాల SC / ST / BC హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/ - నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బి.సి.లకు 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతున్నామని, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని జనార్దన్ గౌడ్ అన్నారు. అదేవిధంగా SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టెఫాండు" మంజూరు చేయాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి.
బి.సి. స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి శివకుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయితరాజు సిద్దు ,కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపెళ్లి గౌతమ్, మనీ, పృద్వి, మౌనిక, మనీషా, లక్ష్మి , శ్రీదేవి, సౌందర్య, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, రమేష్ ఆక మహేష్, అబ్బనబోయిన స్వామి, కిరణ్, అంజి, మహేష్, రాజు  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 05 2023, 06:35

TS: నూతనంగా పోస్టులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులు గా గుర్తించింది. అదే విధంగా పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టుల కు అసెంబ్లీ సమావేశాల్లో  రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది విఆర్‌ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్‌ను వర్తింప జేసింది.

Mane Praveen

Aug 05 2023, 05:58

నల్గొండ: నూతన డిఎస్పి ని కలిసిన జిల్లా మైనార్టీ నాయకులు
నల్గొండ:  పట్టణంలో నల్గొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ని, శుక్రవారం సాయంత్రం  నల్లగొండ జిల్లా 'యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్'  మైనార్టీ నాయకులు  మర్యాద పూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు  డీఎస్పీ  ని శాలువాతో సత్కరించి, స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ అధ్యక్షుడు నజీర్, జావిద్, రియాజ్, అబ్దుల్ మాజిద్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 04 2023, 22:18

NLG: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఢిల్లీలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా జాతీయ ర‌హ‌దారి 65 పై మ‌ల్కాపూర్ నుంచి విజ‌య‌వాడ వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ని ఏర్పాటు చేయాల‌ని ప్రధాన మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Mane Praveen

Aug 04 2023, 17:53

NLG: విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం: బీసీ విద్యార్థి సంఘం
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో  నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీక్షని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు  అయితగోని జనార్దన్ గౌడ్  కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి, డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే  విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ ను పెంచాలి. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/- రూపాయలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/- నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బిసి గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతూ, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని అన్నారు.

SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టైఫండ్" మంజూరు చేయాలి.
బిసి సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి
బి.సి స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలోనల్గొండ మండల వైస్ ఎంపీపీ జిల్లాపళ్లి పరమేష్, యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీ చందు యాదవ్, కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపల్లి గౌతమ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్ ,రమేష్, మహేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు..

Mane Praveen

Aug 04 2023, 14:47

విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఎంఈఓ కు వినతి
నల్లగొండ జిల్లా, దేవరకొండ: సమస్యలు పరిష్కారం చేయకుండా 'విద్యాసంస్థల్లోకి  విద్యార్థి సంఘాలు, మీడియా  రావొద్దని' నోటిసులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి  బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో‌, కెజిబివిలలో పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు. ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.

కేజీబీవి, మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు, లెక్చరర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, జిల్లాలో కేజీబీవి పాఠశాలలో ఉండాల్సిన సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు, కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ అన్నారు.

రాష్ట్రంలో 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు, తప్ప కనీసం విచారణ లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన  తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా,  మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని, తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్, దేవరకొండ మండలం కుర్ర రాహుల్, మూడవత్ వినోద్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 04 2023, 12:44

నిడమనూరు: ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
నల్లగొండ: జిల్లా నిడమనూరు మండలంలో సెకండ్ ఏఎన్ఎం లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎమ్ లను,  శుక్రవారం పోలీసులు   హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేస్తున్న తమ ను  జీవో నెంబర్ 16 ప్రకారం, హెల్త్ అసిస్టెంట్ లను ఏ రకంగానయితే రెగ్యులర్ చేశారో అదేవిధంగా  రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు సెకండ్ ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేశారు.

ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను,  ఇబ్బందులను  ఇప్పటికే చాలాసార్లు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించామని, తమ విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఏఎన్ఎంలు సుచిత్ర, మంజుల ఉన్నారు.