విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నల్లగొండలో రెండు రోజుల దీక్ష ప్రారంభం
నల్లగొండ: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, శనివారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్.. ప్రారంభించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
SC / ST / BC / EBC / మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలకు అడ్మిషన్లు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేసి, అందరి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించాలి.
ఇంజనీరింగ్, పి.జి., డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే SC / ST / BC / EBC విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి.
కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20,000/- వేల రూపాయల స్కాలర్ షిప్ ప్రతి విద్యార్థికి మంజూరు చేయాలి.
ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ రేటు రూ. 1800/- నుండి 15,000/- రూపాయలకు పెంచాలి.
SC / ST / BC కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/ - రూపాయలకు, పాఠశాల SC / ST / BC హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/ - నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
బి.సి. లకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ
కాళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఇటీవల ముఖ్యమంత్రి బి.సి.లకు 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
మంజూరు చేయాలని పోరాడుతున్నామని, పూర్తి డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని జనార్దన్ గౌడ్ అన్నారు.అదేవిధంగా SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
దరఖాస్తు చేసిన విదేశీ విద్యార్థులందరికి "స్టెఫాండు" మంజూరు చేయాలి.
బి.సి. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలి.
IIT, IIM కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేయాలి.
బి.సి. స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్ల రూపాయలకు పెంచాలి.
20 వేల కోట్లతో బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.
జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టెఫాండు 1000/- రూపాయల నుంచి 10,000/- రూపాయలకు స్టెఫాండు పెంచాలి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున కళాశాల మరియు పాఠశాల వసతి గృహాలను అదనంగా మంజూరు చేయాలి.
సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నెలకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి శివకుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయితరాజు సిద్దు ,కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపెళ్లి గౌతమ్, మనీ, పృద్వి, మౌనిక, మనీషా, లక్ష్మి , శ్రీదేవి, సౌందర్య, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, రమేష్ ఆక మహేష్, అబ్బనబోయిన స్వామి, కిరణ్, అంజి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, శనివారం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి , నల్గొండ మండలం వైస్ ఎంపీపీ జిల్లాపెళ్లి పరమేష్ , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్ వి కుమార్ యాదవ్, బిజెపి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కన్మంత శ్రీదేవి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు నాగం వర్షిత్ రెడ్డి, అఖిల భారత యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగుల వంశీచంద్ యాదవ్.. ప్రారంభించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇటీవల ముఖ్యమంత్రి బి.సి.లకు 33 బి.సి. గురుకుల పాఠశాలలు, 15 బి.సి. గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 120 బి.సి. గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కళాశాలలు
అదేవిధంగా SC / ST / BC విద్యార్థులకు 300 కాలేజి హాస్టళ్ళు కొత్తగా ప్రారంభించాలి.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగ నరేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మనగోటి శివకుమార్, జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అయితరాజు సిద్దు ,కాంగ్రెస్ యువజన నాయకుడు చర్లపెళ్లి గౌతమ్, మనీ, పృద్వి, మౌనిక, మనీషా, లక్ష్మి , శ్రీదేవి, సౌందర్య, బచ్చనబోయిన సాయికుమార్ యాదవ్, రమేష్ ఆక మహేష్, అబ్బనబోయిన స్వామి, కిరణ్, అంజి, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులు గా గుర్తించింది.
అదే విధంగా పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టుల కు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది విఆర్ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ను వర్తింప జేసింది.
నల్గొండ: పట్టణంలో నల్గొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ని, శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా 'యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్' మైనార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు డీఎస్పీ ని శాలువాతో సత్కరించి, స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ అధ్యక్షుడు నజీర్, జావిద్, రియాజ్, అబ్దుల్ మాజిద్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా జాతీయ రహదారి 65 పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీక్షని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జనార్ధన్ గౌడ్ మాట్లాడుతూ..
కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1500/- నుండి 3,000/- రూపాయలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను నెలకు రూ.1100/- నుండి 2,000/- రూపాయల వరకు పెంచాలి.
నల్లగొండ జిల్లా, దేవరకొండ: సమస్యలు పరిష్కారం చేయకుండా 'విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా రావొద్దని' నోటిసులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో, కెజిబివిలలో పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు. ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.
నల్లగొండ: జిల్లా నిడమనూరు మండలంలో సెకండ్ ఏఎన్ఎం లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేస్తున్న తమ ను జీవో నెంబర్ 16 ప్రకారం, హెల్త్ అసిస్టెంట్ లను ఏ రకంగానయితే రెగ్యులర్ చేశారో అదేవిధంగా రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు సెకండ్ ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేశారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా.. మండల ప్రభుత్వ ఆసుపత్రి సూచనల మేరకు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగుల వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు.
కార్యక్రమంలో మేతరి శంకర్, ఏఎన్ఎం నక్క జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, స్కూల్ హెడ్మాస్టర్ యాదగిరి, ఉపాధ్యాయుడు యాదయ్య, టీచర్ అపర్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు: నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ చేయడం పట్ల.. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గట్టుప్పల్ చౌరస్తాలో, సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం శ్రీనివాసరెడ్డి గట్టుప్పల్ లోని 15 యూత్ అసోసియేషన్లకు మరియు హై స్కూల్ లోని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందచేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు క్షేమం కోరుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, రైతుల కష్టాల గురించి సీఎం కెసిఆర్ కు తెలుసు కాబట్టే రైతు బందు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలలో విజయాలు సాధించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని అన్నారు.
Aug 05 2023, 19:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.5k