Mane Praveen

Aug 04 2023, 14:47

విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని ఎంఈఓ కు వినతి
నల్లగొండ జిల్లా, దేవరకొండ: సమస్యలు పరిష్కారం చేయకుండా 'విద్యాసంస్థల్లోకి  విద్యార్థి సంఘాలు, మీడియా  రావొద్దని' నోటిసులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి  బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలలో‌, కెజిబివిలలో పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు, టీచర్ పోస్టులు భర్తీ లేదు. ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసుకొని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.

కేజీబీవి, మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు, లెక్చరర్స్ లేక ఇబ్బందులు పడుతున్నారనీ, జిల్లాలో కేజీబీవి పాఠశాలలో ఉండాల్సిన సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు, కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ అన్నారు.

రాష్ట్రంలో 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు, తప్ప కనీసం విచారణ లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన  తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా,  మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని, తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామావత్ లక్ష్మణ్, దేవరకొండ మండలం కుర్ర రాహుల్, మూడవత్ వినోద్, శ్రవణ్, చందు తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 04 2023, 12:44

నిడమనూరు: ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
నల్లగొండ: జిల్లా నిడమనూరు మండలంలో సెకండ్ ఏఎన్ఎం లను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.

అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎమ్ లను,  శుక్రవారం పోలీసులు   హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేస్తున్న తమ ను  జీవో నెంబర్ 16 ప్రకారం, హెల్త్ అసిస్టెంట్ లను ఏ రకంగానయితే రెగ్యులర్ చేశారో అదేవిధంగా  రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు సెకండ్ ఏఎన్ఎం లను ముందస్తు అరెస్టు చేశారు.

ఏఎన్ఎంలు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను,  ఇబ్బందులను  ఇప్పటికే చాలాసార్లు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించామని, తమ విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఏఎన్ఎంలు సుచిత్ర, మంజుల ఉన్నారు.



Mane Praveen

Aug 03 2023, 21:29

నులిపురుగుల వ్యాధి నివారణ మాత్రలు పంపిణీ చేసిన సర్పంచ్ పాక నగేష్ యాదవ్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం  మండలం లెంకలపల్లి గ్రామంలో, జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా.. మండల ప్రభుత్వ ఆసుపత్రి సూచనల మేరకు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్  మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగుల వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో మేతరి శంకర్, ఏఎన్ఎం నక్క జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, స్కూల్ హెడ్మాస్టర్ యాదగిరి, ఉపాధ్యాయుడు యాదయ్య, టీచర్ అపర్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 03 2023, 18:25

గట్టుప్పల్: కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
మునుగోడు: నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో రైతులకు రుణమాఫీ చేయడం పట్ల.. రైతులు హర్షం వ్యక్తం చేస్తూ గట్టుప్పల్ చౌరస్తాలో,  సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసరెడ్డి గట్టుప్పల్ లోని 15 యూత్ అసోసియేషన్లకు మరియు హై స్కూల్ లోని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు క్షేమం కోరుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, రైతుల కష్టాల గురించి సీఎం కెసిఆర్ కు తెలుసు కాబట్టే రైతు బందు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు.
రైతులకు బ్యాంకు లలో ఉన్నటువంటి క్రాప్ లోన్ లను లక్ష వరకు మాఫీ చెయ్యడం పట్ల తెలంగాణ రైతాంగం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలలో విజయాలు సాధించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తాయని అన్నారు.

Mane Praveen

Aug 03 2023, 14:02

నల్లగొండలో బహుజన విద్యార్థి గర్జన పోస్టర్ ఆవిష్కణ
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ
కళాశాలలో స్వెరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ మరియు స్వెరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్  గురువారం కళాశాల విద్యార్థులతో కలిసి, ఎస్టీ ఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ చేతుల మీదుగా, ఆగస్టు 10న నల్గొండ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో జరగబోయే బహుజన విద్యార్థి గర్జన
పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో బహుజన విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Mane Praveen

Aug 02 2023, 21:49

108, 102 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
యాదాద్రి జిల్లా: భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండల కేంద్రంలో  నూతన 108, 102 అంబులెన్స్ వాహనాలను  భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీబీ నగర్  ప్రజలకు,  ఈ అంబులెన్స్ వాహనాలు 24 గంటలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2023, 19:51

NLG: శాసనసభ సమావేశంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి: జనార్దన్ గౌడ్
నల్గొండ: బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఉన్న బిసి ఏ  సంక్షేమ హాస్టల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మొదటగా విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించాలి, బిసి సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు సొంతభవనాలు ఎర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని,  ప్రైవేట్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన చేసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వాన్ని, పోరాట పట్టిమ పెంచుకోవాలన్నారు. విద్యార్థుల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించకపోవడం చాలా దుదుష్టకరమని  ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిరంతరం విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నారని, సంక్షేమ వసతి గృహాలైన గురుకుల పాఠశాలలు ప్రభుత్వం మంజూరు చేసిందంటే  ఆర్ కృష్ణయ్య  పోరాట ఫలితమే అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్లో బీసీ విద్యార్థి సంఘం కమిటీలు కూడా వేయడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంక్షేమ కమిటీలు వేస్తామని అన్నారు. ఈరోజు బీసీ ఏ హాస్టల్లో కమిటీని వేయడం జరిగింది. హాస్టల్ అధ్యక్షుడిగా ఏ. వేణు, ఉపాధ్యక్షుడిగా కే. నాగరాజు, జనరల్ సెక్రెటరీగా కే .హరీష్ , సెక్రటరీగా బి .ఉదయ శంకర్ ,కార్యదర్శిగా వి .అఖిల్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్యంగ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు  కొంపల్లి రామన్న గౌడ్, మహేష్, కుమార్, సురేష్ , పృధ్విరాజ్, శంకర్ మణికంఠ, రమేష్, రాఘవేంద్ర, హరి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 02 2023, 16:17

HYD: జాతీయ స్థాయి పోటీల్లో నిజాంపేట్ విద్యార్థికి కాంస్య పతకం
హైద్రాబాద్: జూలై 28 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో రాజధాని లో జరిగిన ఆరవ టైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్ - 2023 లో  ఛాంపియన్స్ మార్షల్ ఫిట్నెస్ అకాడమీ  నిజాంపేట్ విద్యార్థిని నాగసాయి అరుషి (14).. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి  కాంస్య పతకం సాగించడం పట్ల, తెలంగాణ హోం మినిస్టర్  మొహమ్మద్ మహమూద్ ఆలీ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బుధవారం  నాగసాయి అరుషి  ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ మధుసూదన్, అసిస్టెంట్ కోచ్ బన్నీ అరుణ్, తల్లిదండ్రులు పవన్ కుమార్, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2023, 14:53

రైతు బీమా చేశారా..
TS: రైతు బీమా నమోదుకు చివరి తేదీ ఈ ఏడాది ఆగస్టు 5 అని అధికారులు తెలిపారు. కొత్తగా రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జూన్ 18 లోపు పొందినట్లయితే, రైతు బీమా నమోదుకు అర్హులని తెలిపారు. అయితే వయసు 18_59 సంవత్సరాలు ఉన్న రైతులు అర్హులు అని తెలిపారు. అనగా 14.08.1964 నుండి 14.08.2005 మధ్య జన్మించిన వారు అర్హులు అని అన్నారు. ఇందుకోసం రైతులు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలని సూచించారు.

Mane Praveen

Aug 02 2023, 14:15

గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ 'కీ' విడుద‌ల
TS: గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ కీ ని టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. తుది కీ ని టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో  పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్రకటించిన త‌ర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు  టీఎస్పీఎస్సీ ఎంపిక చేయ‌నుంది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ జూన్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా  2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.