Mane Praveen

Aug 02 2023, 16:17

HYD: జాతీయ స్థాయి పోటీల్లో నిజాంపేట్ విద్యార్థికి కాంస్య పతకం
హైద్రాబాద్: జూలై 28 నుంచి 30 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నో రాజధాని లో జరిగిన ఆరవ టైక్వాండో జాతీయ ఛాంపియన్షిప్ - 2023 లో  ఛాంపియన్స్ మార్షల్ ఫిట్నెస్ అకాడమీ  నిజాంపేట్ విద్యార్థిని నాగసాయి అరుషి (14).. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి  కాంస్య పతకం సాగించడం పట్ల, తెలంగాణ హోం మినిస్టర్  మొహమ్మద్ మహమూద్ ఆలీ మరియు స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బుధవారం  నాగసాయి అరుషి  ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ మధుసూదన్, అసిస్టెంట్ కోచ్ బన్నీ అరుణ్, తల్లిదండ్రులు పవన్ కుమార్, ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 02 2023, 14:53

రైతు బీమా చేశారా..
TS: రైతు బీమా నమోదుకు చివరి తేదీ ఈ ఏడాది ఆగస్టు 5 అని అధికారులు తెలిపారు. కొత్తగా రైతులు పట్టాదార్ పాస్ పుస్తకం జూన్ 18 లోపు పొందినట్లయితే, రైతు బీమా నమోదుకు అర్హులని తెలిపారు. అయితే వయసు 18_59 సంవత్సరాలు ఉన్న రైతులు అర్హులు అని తెలిపారు. అనగా 14.08.1964 నుండి 14.08.2005 మధ్య జన్మించిన వారు అర్హులు అని అన్నారు. ఇందుకోసం రైతులు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలతో సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించాలని సూచించారు.

Mane Praveen

Aug 02 2023, 14:15

గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ 'కీ' విడుద‌ల
TS: గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ కీ ని టీఎస్పీఎస్సీ విడుద‌ల చేసింది. తుది కీ ని టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో  పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్రకటించిన త‌ర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు  టీఎస్పీఎస్సీ ఎంపిక చేయ‌నుంది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ జూన్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా  2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Mane Praveen

Aug 02 2023, 09:16

యాదాద్రి జిల్లా: బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పమేలా సత్పతి 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బదిలీ అయ్యారు. వారు జీ.ఏ.డీ లో రిపోర్ట్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన టీ.వినయ్ కృష్ణారెడ్డి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ని యాదాద్రి జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా టి. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు.

Mane Praveen

Aug 01 2023, 16:42

పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ .1,50,000/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా చండూర్ మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బి. రాధికకు రూ. 60,000/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే కూసుకుంట్ల అందజేశారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 1,00,000/-  సహాయానిధి చెక్కును ఎమ్మెల్యే  అందజేశారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Aug 01 2023, 15:51

తెలంగాణ TET నోటిఫికేషన్‌ను విడుదల
TS: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులు బిఈడి లేదా డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ TET నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 15 న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు రూ.400 గా పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో https://tstet.cgg.gov.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.

Mane Praveen

Aug 01 2023, 14:50

బాధిత కుటుంబానికి ఆరు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా, మునుగోడు: ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొంపెల్లి ఎంపిటిసి మోగుదాల సాలయ్య కుటుంబానికి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబానికి అందజేసి, వారికి భరోసా కల్పించి అండగా నిలిచారు. గతంలో ఆ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందజేశారు.  ఆ కుటుంబ పరిస్థితిని చూసి 6 లక్షల రూపాయలు మంజూరు చేయించి, ఆ కుటుంబ సభ్యులకు అందజేసి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల పనితీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Aug 01 2023, 13:32

నల్లగొండ జిల్లా యాదవ ఐక్యవేదిక సంఘం కార్యదర్శిగా పాక నగేష్ యాదవ్ నియామకం
నల్లగొండ: యాదవ సంఘం భవన్లో జిల్లా యాదవ విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు ఈరటి బాలరాజు యాదవ్ అధ్యక్షతన, సోమవారం యాదవ విద్యావంతుల ఐక్య వేదిక సంఘం కార్యక్రమంలో, రాష్ట్ర యాదవ సంఘం విద్యావంతుల ఐక్యవేదిక అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్ మరియు రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్యవేదిక కార్యదర్శి దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్ ల నుండి.. జిల్లా యాదవ ఐక్యవేదిక సంఘం కార్యదర్శిగా మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాక నగేష్ యాదవ్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యాదవ సోదరునికి ప్రత్యేక ధన్యవాదాలని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు యాదవ సోదరులు పాల్గొన్నారు.

Mane Praveen

Jul 31 2023, 19:00

వికలాంగుల సర్టిఫికెట్ పొందాలంటే.. మీసేవ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి
నల్లగొండ జిల్లా: సదరం ధ్రువీకరణ పత్రం పొందగోరు శారీరక, మానసిక వికలాంగులు, కంటి రుగ్మత, వినికిడి లోపం ఉన్న వారి  కోసం ఆగస్టు నెల కు సంబంధించిన షెడ్యూలు విడుదలైంది. ఇందుకోసం దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు క్యాంపు షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 3, 8, 22, 29, 31 తేదీలలో శారీరక వైకల్యం ఉన్నవారికి క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్లాట్ లో పొందుపరిచిన తేదీ, సమయానికి.. నల్లగొండలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని సదరం కార్యాలయంలో హాజరు కావాలని  చెప్పారు.
మరెందుకు ఆలస్యం వెంటనే దగ్గర్లో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి సదరం స్లాట్ బుక్ చేసుకోండి. SHARE IT

Mane Praveen

Jul 31 2023, 18:20

దళిత బంధులో మాలలకు 50% కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని, సోమవారం జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు చలిచీమల యాదగిరి మర్యాపూర్వకంగా కలిసి 2వ విడుత దళిత బందు పథకంలో నియోజకవర్గంలోని మాలలకు 50% కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శిర్గమళ్ళ కిశోర్, అద్దంకి రామలింగయ్య, బేరి రవీందర్, బెల్లం బాలశివరాజు, బాజా మనోజ్, సంకు యాదగిరి, ఈద పవన్, ముచ్చపోతుల నర్సింహా, వడ్డేపల్లి శంకర్, బండారు లింగస్వామి, చలిచీమల శంకరయ్య, నరసింహ, కట్ట పవన్ కళ్యాణ్, సంకు నరసింహ, పిట్టల లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు