నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:49

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్:జూన్ 11

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌందర్య ఆత్మహత్య కు పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా కొండాపూర్‌లోని ఐబీఎం IBM లో ఉద్యోగం చేస్తున్నారు. 2022 డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్‌ తో వివాహం జరిగింది.

ఈనెల 8న సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రోజు సాయంత్రం భర్త అభినవ్‌తోపాటు మామకు ఫోన్ చేశారు. తాను దూరంగా వెళ్లపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి.. శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకుతున్నట్లు భర్తకు చెప్పారు.

దీంతో భర్త అభినవ్‌ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సౌందర్య భవనం నుంచి దూకి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ నిన్న శనివారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్‌లోని అర్కాన్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి సౌందర్య దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండడం లేదని తరుచూ ఫ్రెండ్స్‌తో చెప్పారని, ఇటీవలే భర్త ఉద్యోగం కోల్పోవడంతో.. ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో సౌందర్య మానసికంగా బాధపడుతూ.. అనుకున్న విధంగా భర్త దొరకకపోవడం.. ఊహించుకున్న జీవితం లేకపోవడం వల్లే.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:24

వికారాబాద్‌లో 19 ఏళ్ల యువతి దారుణహత్య

వికారాబాద్:జూన్ 11

మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు. అంతెందుకు దేశాన్ని భరతమాతగా కొలుస్తున్నాం. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు.

ఐదేళ్ల పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు నిత్యకృత్యమైపోయాయి. నానాటికి మహిళలపై గృహహింసతో పాటు అనేక రూపాల్లో లైంగికంగా మానిసిక వేధింపులకు గురవుతున్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న హింస పరాకాష్టకు చేరింది.

హైదరాబాద్‌లో అప్సర దారుణహత్య మరువకముందే మరో యువతి దారుణ హత్య ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) అనే యువతి ని దుండగులు హత్య చేశారు. శనివారం అర్ధ రాత్రి సమయంలో ఇంటి నుంచి శిరీష బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది.

ఈ రోజు మధ్యాహ్నం చెరువు కుంట ఒడ్డున యువతి దుస్తులు స్థానికుల కంట పడ్డాయి. అనుమానంతో కుంటలో శిరీష కోసం వెతికారు. కుంటలో యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి పరిశీలించారు. యువతి మృతదేహంపై కత్తిగాట్లను పోలీసులు గుర్తించారు. సమగ్ర విచారణ జరుపుతున్నామని త్వరలోనే

నిందితులను గుర్తించి శిక్షస్తామని డీఎస్పీ తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 17:22

పంచాయతీ కోసం వచ్చిన మహిళ దారుణ హత్య

హనుమకొండ:జూన్ 11

జిల్లా కేంద్రంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని బుడగ జంగాల కాలనీలో ఈరోజు మధ్యాహ్నం పురాణం స్వరూప 40 అనే మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది,

పంచాయతీ కోసం కాలనీకి వచ్చిన మహిళపై తన మరిది కత్తితో దాడి చేసి హతమార్చినట్లు తెలిసింది, మృతురాలి భర్త నాలుగు నెలల క్రితం చనిపోగా రాజు, కిషోర్ అనే తన ఇద్దరు పిల్లలు తన మరిది వద్ద ఉంటున్నారని స్థానికులు తెలిపారు.

పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి పిల్లలను తన వద్దకు తీసుకెళ్లడానికి నేడు పంచాయతీ పెట్టకోగా పంచాయతీకి వచ్చిన పెద్దల సమక్షంలోనే స్వరూప మరిది నాపై పంచాయతీ పెడతావా? అంటూ!స్వరూప పై తన మరిది ఒక్కసారిగా కత్తితో దాడి చేసి మెడ కోసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు.

కాగా గత వారం రోజుల కిందట తన మరిది వల్ల ప్రాణ భయం ఉన్నట్లు మృతురాలు స్వరూప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు చేయవలసి ఉంది...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 15:41

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షం : వాతావరణ శాఖ హెచ్చరిక *

తరువాతి 6 గంటల్లో చాలా తీవ్రమైన తుఫాను తుఫానులో మార్చబోతోంది. అరబ్ సరాబ్ హరికేన్ 'ద్విపాయం హరికేన్' ద్విపాయం 'లో చేసిన తుఫాను ఆదివారం ఇండియన్ మెటియోరోలాజికల్ డిపార్ట్మెంట్, ఉత్తరాన 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాన తరలించబడింది మరియు తరువాతి 6 గంటలలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ తుఫాను యొక్క ప్రభావం అనేక తీర ప్రాంతాల్లో చూడవచ్చు. ఈ సమయంలో ఒక హరికేన్ మరియు ఒక బలమైన వర్షం ఉంది.

గుజరాత్-మహారాష్ట్రలోనూ గొప్ప విపత్తు

ముంబై నుండి 600 కిలోమీటర్ల దూరంలో, 530 కిలోమీటర్ల దూరంలో 830 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్బందర్ నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది కరాచీ. తుఫాను ఇక్కడ నుండి తీవ్రమైన మరియు తరువాత జూన్ 15 వరకు పాకిస్తాన్, సౌరాష్ట్ర మరియు కచ్లతో సహా పరిసర ప్రాంతాలను చేరుకుంటుంది.

రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో వర్షం అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో గత ఆరు గంటల్లో, ముంబైలో ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాను తుఫాను, పోర్బందర్, 580 కిలోమీటర్ల దక్షిణ-నైరుతి దక్షిణ-దక్షిణాన కరాచీ నుండి పశ్చిమ మరియు 830 కిలోమీటర్ల జూన్ నుండి కేంద్రీకృతమై ఉంది దక్షిణ భారత ప్రాంతంలో తదుపరి నాలుగు రోజుల్లో వర్షం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కేరళ మరియు తీర కర్ణాటకలో భారీ వర్షాలు అవకాశం ఉండినప్పటికీ, ఆదివారం వరకు లక్షద్వీప్లో వర్షం ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో తరువాతి 24 గంటల్లో వాకింగ్ గాలి దెబ్బలు, రాయ్గడ్, రత్నగిరి మరియు సింధుదుర్గ్ సహా. పాకిస్తాన్ ప్రభావం చూస్తుంది ఈ తుఫాను యొక్క ప్రభావం పాకిస్తాన్ వరకు కనిపిస్తుంది. జూన్ 15 నాటికి, ఈ ప్రమాదకరమైన బిపెర్జాయ్ పాకిస్తాన్ మరియు ప్రక్కనే ఉన్న తీరానికి చేరుకుంటాడు. మెట్రోపాలిస్ దక్షిణాన 900 కిలోమీటర్ల అంచనా ఉందని శనివారం నా న్యూస్, పాకిస్తాన్ చెప్పారు. VSCS "Bipeljoy" కారణంగా నౌకలు మరియు పోర్ట్ సౌకర్యాలను రక్షించడానికి కరాచీ పోర్ట్ ట్రస్ట్ 'అత్యవసర మార్గదర్శకాలను' విడుదల చేసింది.

అరీ న్యూస్ నివేదిక ప్రకారం, KPT షిప్పింగ్ కార్యకలాపాలు సస్పెండ్ చేసే ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ప్రకటనలో, 25 నాట్ల పైన బలమైన గాలుల విషయంలో షిప్పింగ్ కార్యకలాపాలు సస్పెండ్ చేయబడతాయని నమ్ముతారు. ఇది గాలి వేగం 35 నాట్లు పైన ఉంటే, కార్గో నౌకల ఉద్యమం సస్పెండ్ చేయబడుతుంది అని చెప్పబడింది. కరాచీ పోర్ట్ ట్రస్ట్ కూడా నౌకలను సంప్రదించడానికి రెండు అత్యవసర పౌనఃపున్యాన్ని విడుదల చేసింది. ఇది 'తుఫాను యొక్క ప్రభావం ఇచ్చిన, నౌకల కదలిక రాత్రి సస్పెండ్ చేయబడుతుంది.' తనిఖీ కేంద్రం లో ఒక సురక్షితమైన స్థలంలో హార్బర్ క్రాఫ్ట్ను మార్చడానికి అధికారులను ట్రస్ట్ కూడా ఆదేశించారు.

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 14:25

తిరుమల కొండపై మరోసారి అపచారం

తిరుమల:జూన్ 11

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల కొండ పైనుంచి విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. శనివారం అన్నదాన సత్రంపై నుంచి వెళ్లిన విమానం. ఆదివారం శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని గొల్లమండపం పైనుంచి వెళ్లింది.

గత వారం రోజులు వ్యవధిలో విమానాలు తిరుమల కొండపై చక్కర్లు కొట్టడం ఇది మూడోసారి. ఆగమశాస్త్ర నిబంధనలకు ఇది విరుద్ధమని.. ఆనందనిలయం మీదుగా విమానం ఎగరటం అపచారమని వేద పండితులతో పాటు భక్తులు అంటున్నారు.

ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై ఎటువంటి విమానాలు ఎగురకూడదనే నియమం ఉంది. గతంలో అలాంటి ఘటనలు జరిగినా భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అందుకు తగిన విధంగా స్పందిస్తుండేది.

ప్రస్తుతం రోజూ విమానాలు కనిపిస్తున్నా.. టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. తరచూ ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించినా.. ఏటీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి........

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:45

చిన్న జీయర్ స్వామి మేనల్లుడి కథే వేరు లే

ముచ్చింతల్ :జూన్ 11

స్వాములు స్వాములుగా ఉండకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే… జరిగే పరిణామాలు వారి ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రభావం చూపిస్తాయి. చినజీయర్ పొలిటికల్ స్వామిగా.. అత్యంత ఖరీదైన స్వామిగా ప్రసిద్ధులు. ఇప్పుడు ఆయన మేనల్లుడి వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉదయం అంతా .. చినజీయర్ వారసుడి తరహాలో స్వామిలాగా .. ముచ్చింతల్ ఆశ్రమంలో తిరిగే అయన సాయంత్రం అయ్యే సరికి పబ్బులు, క్లబ్బుల్లో సేదదీరుతూంటారని ఫోటోలతో సహా వెలుగులోకి వచ్చాయి. నిజానికి చినజీయర్ భువబంధాలకు అతీతుడనని చెప్పుకుంటారు. సన్యాసం తీసుకున్నప్పుడే అన్నింటినీ వదిలేశానని చెబుతారు. అయితే ఆయన తన మేనల్లుడిని తన తదుపరి వారసుడ్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆయన చినజీయర్ మేనల్లుడని చాలా మందికి తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన ప్రైవేటు లైఫ్ సహా మొత్తం బయటకు వచ్చింది. ఆయన ఏం చేసినా అది వ్యక్తిగతం కానీ.. ప్రజలకు ఏం చేయకూడదో చెప్పి.. అదే చేయడం ఏమిటన్న విమర్శలు ఈ కారణంగా వస్తున్నాయి.

చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని పెట్టుకుంటారు.. అన్నది ఎవరికీ అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరం అయింది. ముందు ముందు చినజీయర్ విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. శారదాపీఠం పేరుతో మరిన్ని రాజకీయాలు చేసే స్వరూపానంద కూడా తన మేనల్లుడు అయిన యువకుడ్ని తదుపరి ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు........,..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:43

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

ములుగు జిల్లా:జూన్11

భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకస్మికంగా మృతి చెందారు. హన్మకొండలోని స్నేహనగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.

ఎంత సేపు అయినా ఆయన బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా.. ఆయన శరీరం నల్లగా మారిపోవడం గమనించారు. వెంటనే ములుగు రోడ్‌లో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఆయనలో ఎలాంటి కదలిక రాలేదు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జగదీశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

నిరుడు ఏప్రిల్‌లో కూడా జగదీశ్‌కు ఛాతినొప్పి వచ్చింది. ఆ సమయంలో పక్కనే ఉన్న భార్య రమాదేవి సీపీఆర్ చేసి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో జగదీశ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ, ఈ సారి మాత్రం బాత్రూంలో పడిపోవడం.. సీపీఆర్ చేసేంత సమయం లేకపోవడంతో జగదీశ్ ప్రాణాలను కాపాడలేక పోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుసుమ జగదీశ్ కీలక నాయకుడిగా వ్యవహరించారు. అన్నీ తానై ముందుండి ఉద్యమంలో ఎంతో మందిని నడిపించారు. ఏఐపీఆర్ఎఫ్ సభ వరంగల్‌లో జరిగినప్పుడు.. కొంత మంది అగంతకులు వేదికను పేల్చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో వేదిక మెట్లపై కూర్చొని ధైర్యంగా కాపలా కాసిన వ్యక్తిగా జగదీశ్‌ను గుర్తుంచుకుంటారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ములుగు పర్యటనలో జగదీశ్ అన్నీ తానై చూసుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:41

మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, పదిహేను వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు

మహబూబాబాద్‌:జూన్11

 మహబూబాబాద్ జిల్లాలో మహదేవ్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు…

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ లోని జిల్లాలోని కేసముద్రం మండలం భూక్యారాంతండా గ్రామంలోని మహాదేవ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఉన్న ఓ రైస్ మిల్లు కొనసాగుతోంది. అందులో శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం వరకు ఉండి, తరువాత ఇంటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత శనివారం ఉదయం 4 గంటలకు కూలీలు అక్కడకు చేరుకున్నారు..

అయితే ఐదు గంటల సమయంలో లోపలి నుంచి పొగరావడం వెంటనే మంటలు వ్యాపించడంతో వెంటనే రైస్ మిల్ ఓనర్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు.. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సీఐతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్నారు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు..

దీంతో సమీప జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని వెంటనే అక్కడకు చేరుకున్నాయి.. మిల్లు వెనక ఉన్న ఓ గోడను సిబ్బంది తొలగించారు. దాని ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగింది. 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం మంటల్లో కాలి బూడిద అయ్యాయని సమాచారం.. ఇక రూ.2 కోట్ల విలువైన మిషిన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన తరువాత మిగిలిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మరో రైస్ మిల్ కు తీసుకెళ్లారు.. మంటలని అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది చాలా కష్ట పడ్డారు.. ఇలా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాధాలకు కారణం తెలపాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:38

ఈనెల 12 న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన

అమరావతి:జూన్ 11

వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.

12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు.

అక్కడ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు.

అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్‌ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.......

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:36

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడితో విధి ఆడిన నాటకం

జైలు శిక్ష అనుభవిస్తున్న తండ్రి

ములుగు జిల్లా:జూన్‌11

ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. బైక్‌పై ఉన్న వీరిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన కంబాలపల్లి సాయి తరుణ్‌(22) తన మేన మామ కుమారుడు జెజ్జరి అఖిల్‌తో కలిసి సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఏటూరునాగారం మం డల కేంద్రానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఏటూరునాగారంలోని హైవేపై వీరి బైక్‌ను ఓ కారు ఢీకొంది. మంగపేట మండలం కమలాపురం గ్రామా నికి చెందిన వ్యక్తి పెట్రోల్‌ కోసం కారును రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సాయి తరుణ్‌, అఖిల్‌ కింద పడిపోయి తీవ్రంగా గాయప డ్డారు. ఈ ఇద్దరు యువకులను స్థానికులు 108 సహా యంతో ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వరంగల్‌కు రిఫర్‌ చేశారు. దీంతో ఇద్దరిని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో సాయి తరుణ్‌ తుదిశ్వాస విడిచాడు. అఖిల్‌కు వైద్యం అందుతోందని, ప్రాణాపా యం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

సాయి తరుణ్‌, అఖిల్‌ ఏటూరునాగారంలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతు న్నారు. సాయి తరుణ్‌ తండ్రి గణపతి వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డిలో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తుండగా మావోయిస్తులకు సహకరిస్తున్నాడం టూ ఆయన్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలు కు పంపారు. అఖిల్‌ బాల్యదశలో ఉండగానే తల్లిదం డ్రులు రాథ, సమ్మయ్యను కోల్పోయాడు. ప్రస్తుతం అ తడు పెద్ద అన్నయ్య అశోక్‌ పోషణలో ఉన్నాడు. వ్యవ సాయం చేసుకుంటున్న అశోక్‌ తమ్ముడిని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోషించుకుంటున్నాడు.

నాన్నకు కడసారిచూపు దక్కేనా..?

విధి ఆ ఇంటిల్లిపాదిని వెంటాడుతోంది. వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలు వారి పాలిట శాపంగా మారాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన గణపతి మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే కేసులో జైలులో ఉండగా అతడి కొడుకు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో తనువుచాలించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది.

కంబాల గణపతి తాను నివసించే గ్రామం గుమ్మ డిదొడ్డిలో పెట్రోల్‌బంకు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పలువురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అందులో గణపతి కూడా ఉన్నాడు. ఓ కాంట్రాక్టర్‌కు చెందిన యంత్రాలను మావోయిస్టుల సూచన మేరకు దహనం చేయడానికి కొరియర్లు యత్నించగా వారికి గణపతి పెట్రోల్‌ సమకూర్చాడనే కేసు నమోదైంది. దీంతో ఆ కొరియర్లతోపాటు గణపతిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌పై ఖమ్మం జైలుకు పంపారు. ఇదే క్రమంలో గణపతి కుమారుడు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. గణేష్‌కు కుమార్తెతో పాటు కుమారుడు సాయి తరుణ్‌ సంతానం కాగా పిల్లలను ప్రాయోజకులను చేయాలని అతడు ఎన్నో కలలు కన్నాడు. కొడుకు సాయి తరుణ్‌ డిగ్రీ చేస్తూనే తండ్రికి వ్యాపారంలో సహకరించే వాడు. తండ్రి జైలుకు వెళ్లగా పెట్రోల్‌ బంకును సాయి తరుణ్‌ నడుపుతున్నాడు. తండ్రి కోసం ఎదురుచూసిన కొడుకు.. చివరకు కానరాని లోకానికి చేరుకోవడం గ్రామంలో విషాదంలో ముంచెత్తింది.

కుమారుడి మరణవార్త తండ్రి చెవిలో ఇంకా పడలేదు. సాయి తరుణ్‌ అంత్యక్రియల్లో గణపతి హాజరవుతాడా.. కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేస్తుందా.. కొడుకు కడసారి చూపునకు అతడు నోచుకుంటాడా..? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు కాకపోతే ప్రత్యేక అనుమతితో పోలీసుల ఎస్కార్ట్‌ మధ్య కొడుకు అంత్యక్రియలకు తండ్రి హాజరవుతాడా..? అనేది చర్చనీయాంశమైంది.,,.