నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:45

చిన్న జీయర్ స్వామి మేనల్లుడి కథే వేరు లే

ముచ్చింతల్ :జూన్ 11

స్వాములు స్వాములుగా ఉండకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే… జరిగే పరిణామాలు వారి ఆధ్యాత్మిక జీవితంలోనూ ప్రభావం చూపిస్తాయి. చినజీయర్ పొలిటికల్ స్వామిగా.. అత్యంత ఖరీదైన స్వామిగా ప్రసిద్ధులు. ఇప్పుడు ఆయన మేనల్లుడి వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉదయం అంతా .. చినజీయర్ వారసుడి తరహాలో స్వామిలాగా .. ముచ్చింతల్ ఆశ్రమంలో తిరిగే అయన సాయంత్రం అయ్యే సరికి పబ్బులు, క్లబ్బుల్లో సేదదీరుతూంటారని ఫోటోలతో సహా వెలుగులోకి వచ్చాయి. నిజానికి చినజీయర్ భువబంధాలకు అతీతుడనని చెప్పుకుంటారు. సన్యాసం తీసుకున్నప్పుడే అన్నింటినీ వదిలేశానని చెబుతారు. అయితే ఆయన తన మేనల్లుడిని తన తదుపరి వారసుడ్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ట్రస్ట్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. వ్యవహారాలు మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆయన చినజీయర్ మేనల్లుడని చాలా మందికి తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన ప్రైవేటు లైఫ్ సహా మొత్తం బయటకు వచ్చింది. ఆయన ఏం చేసినా అది వ్యక్తిగతం కానీ.. ప్రజలకు ఏం చేయకూడదో చెప్పి.. అదే చేయడం ఏమిటన్న విమర్శలు ఈ కారణంగా వస్తున్నాయి.

చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని పెట్టుకుంటారు.. అన్నది ఎవరికీ అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరం అయింది. ముందు ముందు చినజీయర్ విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. శారదాపీఠం పేరుతో మరిన్ని రాజకీయాలు చేసే స్వరూపానంద కూడా తన మేనల్లుడు అయిన యువకుడ్ని తదుపరి ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు........,..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:43

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

ములుగు జిల్లా:జూన్11

భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకస్మికంగా మృతి చెందారు. హన్మకొండలోని స్నేహనగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.

ఎంత సేపు అయినా ఆయన బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా.. ఆయన శరీరం నల్లగా మారిపోవడం గమనించారు. వెంటనే ములుగు రోడ్‌లో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఆయనలో ఎలాంటి కదలిక రాలేదు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జగదీశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

నిరుడు ఏప్రిల్‌లో కూడా జగదీశ్‌కు ఛాతినొప్పి వచ్చింది. ఆ సమయంలో పక్కనే ఉన్న భార్య రమాదేవి సీపీఆర్ చేసి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో జగదీశ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ, ఈ సారి మాత్రం బాత్రూంలో పడిపోవడం.. సీపీఆర్ చేసేంత సమయం లేకపోవడంతో జగదీశ్ ప్రాణాలను కాపాడలేక పోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుసుమ జగదీశ్ కీలక నాయకుడిగా వ్యవహరించారు. అన్నీ తానై ముందుండి ఉద్యమంలో ఎంతో మందిని నడిపించారు. ఏఐపీఆర్ఎఫ్ సభ వరంగల్‌లో జరిగినప్పుడు.. కొంత మంది అగంతకులు వేదికను పేల్చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో వేదిక మెట్లపై కూర్చొని ధైర్యంగా కాపలా కాసిన వ్యక్తిగా జగదీశ్‌ను గుర్తుంచుకుంటారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ములుగు పర్యటనలో జగదీశ్ అన్నీ తానై చూసుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:41

మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, పదిహేను వేల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలు

మహబూబాబాద్‌:జూన్11

 మహబూబాబాద్ జిల్లాలో మహదేవ్ రైస్ మిల్ ఇండస్ట్రీస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరకపోయినా భారీ స్థాయిలో ఆస్తి నష్ట జరిగింది.. ఈ ప్రమాదం వల్ల రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం, అలాగే 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యంజరిగినట్లు పోలీసుల వెల్లడించారు…

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ లోని జిల్లాలోని కేసముద్రం మండలం భూక్యారాంతండా గ్రామంలోని మహాదేవ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో ఉన్న ఓ రైస్ మిల్లు కొనసాగుతోంది. అందులో శనివారం తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం వరకు ఉండి, తరువాత ఇంటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత శనివారం ఉదయం 4 గంటలకు కూలీలు అక్కడకు చేరుకున్నారు..

అయితే ఐదు గంటల సమయంలో లోపలి నుంచి పొగరావడం వెంటనే మంటలు వ్యాపించడంతో వెంటనే రైస్ మిల్ ఓనర్ కు, ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు.. ఈ ఘటనా స్థలాన్ని అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, సీఐతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్నారు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు..

దీంతో సమీప జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని వెంటనే అక్కడకు చేరుకున్నాయి.. మిల్లు వెనక ఉన్న ఓ గోడను సిబ్బంది తొలగించారు. దాని ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే భారీ నష్టం జరిగింది. 15 వేల క్వింటాళ్ల ధాన్యం, 5 వేల క్వింటాళ్ల బియ్యం మంటల్లో కాలి బూడిద అయ్యాయని సమాచారం.. ఇక రూ.2 కోట్ల విలువైన మిషిన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కాలిపోయిన తరువాత మిగిలిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న మరో రైస్ మిల్ కు తీసుకెళ్లారు.. మంటలని అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది చాలా కష్ట పడ్డారు.. ఇలా తెలంగాణ లో వరుస అగ్ని ప్రమాధాలకు కారణం తెలపాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:38

ఈనెల 12 న సీఎం జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన

అమరావతి:జూన్ 11

వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.

12వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా క్రోసూరు చేరుకుంటారు.

అక్కడ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద పెదకూరపాడు నియోజకవర్గ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు.

అనంతరం బహిరంగ సభలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించి, ప్రసంగం అనంతరం విద్యార్ధులకు కిట్స్‌ అందజేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.......

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:36

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడితో విధి ఆడిన నాటకం

జైలు శిక్ష అనుభవిస్తున్న తండ్రి

ములుగు జిల్లా:జూన్‌11

ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయ పడ్డాడు. బైక్‌పై ఉన్న వీరిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన కంబాలపల్లి సాయి తరుణ్‌(22) తన మేన మామ కుమారుడు జెజ్జరి అఖిల్‌తో కలిసి సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఏటూరునాగారం మం డల కేంద్రానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఏటూరునాగారంలోని హైవేపై వీరి బైక్‌ను ఓ కారు ఢీకొంది. మంగపేట మండలం కమలాపురం గ్రామా నికి చెందిన వ్యక్తి పెట్రోల్‌ కోసం కారును రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సాయి తరుణ్‌, అఖిల్‌ కింద పడిపోయి తీవ్రంగా గాయప డ్డారు. ఈ ఇద్దరు యువకులను స్థానికులు 108 సహా యంతో ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వరంగల్‌కు రిఫర్‌ చేశారు. దీంతో ఇద్దరిని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో సాయి తరుణ్‌ తుదిశ్వాస విడిచాడు. అఖిల్‌కు వైద్యం అందుతోందని, ప్రాణాపా యం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

సాయి తరుణ్‌, అఖిల్‌ ఏటూరునాగారంలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతు న్నారు. సాయి తరుణ్‌ తండ్రి గణపతి వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డిలో పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తుండగా మావోయిస్తులకు సహకరిస్తున్నాడం టూ ఆయన్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలు కు పంపారు. అఖిల్‌ బాల్యదశలో ఉండగానే తల్లిదం డ్రులు రాథ, సమ్మయ్యను కోల్పోయాడు. ప్రస్తుతం అ తడు పెద్ద అన్నయ్య అశోక్‌ పోషణలో ఉన్నాడు. వ్యవ సాయం చేసుకుంటున్న అశోక్‌ తమ్ముడిని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోషించుకుంటున్నాడు.

నాన్నకు కడసారిచూపు దక్కేనా..?

విధి ఆ ఇంటిల్లిపాదిని వెంటాడుతోంది. వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలు వారి పాలిట శాపంగా మారాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డికి చెందిన గణపతి మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే కేసులో జైలులో ఉండగా అతడి కొడుకు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో తనువుచాలించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది.

కంబాల గణపతి తాను నివసించే గ్రామం గుమ్మ డిదొడ్డిలో పెట్రోల్‌బంకు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పలువురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అందులో గణపతి కూడా ఉన్నాడు. ఓ కాంట్రాక్టర్‌కు చెందిన యంత్రాలను మావోయిస్టుల సూచన మేరకు దహనం చేయడానికి కొరియర్లు యత్నించగా వారికి గణపతి పెట్రోల్‌ సమకూర్చాడనే కేసు నమోదైంది. దీంతో ఆ కొరియర్లతోపాటు గణపతిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌పై ఖమ్మం జైలుకు పంపారు. ఇదే క్రమంలో గణపతి కుమారుడు సాయి తరుణ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ ఇంట పెను విషాదాన్ని నింపింది. గణేష్‌కు కుమార్తెతో పాటు కుమారుడు సాయి తరుణ్‌ సంతానం కాగా పిల్లలను ప్రాయోజకులను చేయాలని అతడు ఎన్నో కలలు కన్నాడు. కొడుకు సాయి తరుణ్‌ డిగ్రీ చేస్తూనే తండ్రికి వ్యాపారంలో సహకరించే వాడు. తండ్రి జైలుకు వెళ్లగా పెట్రోల్‌ బంకును సాయి తరుణ్‌ నడుపుతున్నాడు. తండ్రి కోసం ఎదురుచూసిన కొడుకు.. చివరకు కానరాని లోకానికి చేరుకోవడం గ్రామంలో విషాదంలో ముంచెత్తింది.

కుమారుడి మరణవార్త తండ్రి చెవిలో ఇంకా పడలేదు. సాయి తరుణ్‌ అంత్యక్రియల్లో గణపతి హాజరవుతాడా.. కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేస్తుందా.. కొడుకు కడసారి చూపునకు అతడు నోచుకుంటాడా..? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు కాకపోతే ప్రత్యేక అనుమతితో పోలీసుల ఎస్కార్ట్‌ మధ్య కొడుకు అంత్యక్రియలకు తండ్రి హాజరవుతాడా..? అనేది చర్చనీయాంశమైంది.,,.

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 13:32

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం?

కర్ణాటక ప్రభావంతో ఇక్కడా అమలుకు యోచన

సాధ్యాఅసాధ్యాలపై సర్వేకు ముఖ్యమంత్రి ఆదేశం

మహిళా ప్రయాణికులపై అధ్యయనం షురూ!

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. మరిన్ని జనాకర్షక పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న అసతృప్తిని దూరం చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన హామీలు ప్రధాన కారణం కావడం.. ముఖ్యంగా అక్కడి మహిళలకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ బాగా పనిచేసినట్లు ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఈ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. అక్కడ ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఈనెల 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అక్కడ ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇదేతరహా పథకాన్ని తెలంగాణలోనూ అక్కడికంటే ముందుగానే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిసింది. పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వెంటనే సర్వే చేపట్టి నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం.. తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణలో ప్రతిరోజు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. ఇందులో సగానికి పైగా మహిళలుంటారు. పల్లె వెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్‌, మెట్రో, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య, అందులో మహిళా ప్రయాణికుల సంఖ్య.. తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక అందాక ముఖ్యమంత్రి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా సంస్థకు రోజుకు రూ.2 కోట్ల నష్టాలు వస్తున్నాయి. రోజురోజుకూ ఈ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ పెండింగులో ఉన్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైతే ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయి.

మద్దతు లేకుంటే గెలుపు కష్టమే!

రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రత్యేకంగా చేయించిన అనేక సర్వేల్లో స్పష్టమైంది. పార్టీకి చెందిన పులువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండనే ఉంది. అవినీతి, భూకబ్జాలు లాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనేకమంది ఉన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ పస్తావిస్తూ.. పద్ధతి మార్చుకోకుంటే ఈసారి సీటు దక్కదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు లేకుంటే మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. అధికారంలో ఉన్నందున ఇప్పటినుంచే మరిన్ని జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. బీసీలకు రూ.లక్ష రుణం పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. ఈ పథకంతో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గానికి మరింత దగ్గర కావచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారు...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 11:34

నేడు విశాఖలో అమిత్ షా పర్యటన

విశాఖపట్నం:జూన్ 11

ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రోజురోజుకు మారుతుంది. కొద్దీ రోజులుగా ఏపీపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. దానిలో భాగంగా.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ముందుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు.

బీజేపీ మహాసంపర్క్ అభియాన్ సభలో పాల్గొన్నారు.. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ది నిలిచిపోయి.. స్కామ్ లు నడుస్తున్నాయని జేపీ నడ్డా మండిపడ్డారు. అభివృద్దిలో మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. జగన్ సర్కార్ మాత్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన మండిపడ్డారు.

అయితే ఇవాళ ఏపీలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.

అయితే.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్‌ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్‌ ఉంటుందా?.. అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. వరుసగా ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులపై అమిత్ షా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి మరి...

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:55

ఐపీఎస్ అధికారి పై భార్య ఫిర్యాదు : ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కోర్టు

ఛత్తీస్గడ్:జూన్ 11

ఐఏఎస్ అధికారి అయిన భర్తపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. కట్నం కోసం వేధించడంతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారంటూ కోర్టుకెక్కారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా స్వస్థలం బీహార్‌లోని దర్భంగా జిల్లా. 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నారు.

ఆ సమయంలో కట్నకానుకల కోసం అమ్మాయి తల్లిదండ్రులు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇటీవల, ఆమె భర్తపై పలు ఆరోపణలు చేశారు. వివాహం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారని, గృహ హింసతోపాటు అసహజ శృంగారానికి బలవంతం చేసేవారని కోర్బా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో చత్తీస్‌గఢ్‌లోని కోర్బా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:33

రేపు తెరుచుకోనున్న మార్కెట్ యార్డ్ తలుపులు

గుంటూరు జిల్లా :జూన్‌ 11

నెలకు పైగా వేసవి సెలవుల అనంతరం మిర్చియార్డు గుంటూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ తలుపులు తెరుచుకోనున్నాయి.

సోమవారం ఈ నెల 12 నుంచి మిర్చి క్రయవిక్రయాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీసుకొచ్చే మిర్చి లోడు లారీలు, ట్రాక్టర్లు, ఆటోలను ఆదివారం రాత్రి నుంచే యార్డు లోపలికి అనుమతించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సెలవులకు ముందు వివిధ రకాల మిర్చి నాణ్యతని బట్టి క్వింటాల్‌కు రూ.22 వేలకు పైగా ధర లభించింది. నెల పాటు సెలవులు కారణంగా డిమాండ్‌ పెరిగి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు.

గుంటూరు మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌లలో దాదాపుగా 58 లక్షల మిర్చి టిక్కీల వరకు నిల్వ ఉంటాయని మార్కెటింగ్‌ వర్గాలు అంచనా వేస్తోన్నాయి............

నిజంనిప్పులాంటిది

Jun 11 2023, 10:30

మహిళా ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ మహిళ కానిస్టేబుల్

వరంగల్ జిల్లా :జూన్ 11

రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్ సోనాలి మాల్కే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు.

శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ నుంచి స్టేషన్‌లో దిగుతుండగా ఓ మహిళ కాలు జారి కిందపడిపోయింది.

దీంతో వెంటనే అప్రమత్తమై మహిళ కానిస్టేబుల్ పరిగెత్తుకెళ్లి కిందపడబోయిన ఆ మహిళను కాపాడారు.

మహిళ ప్రాణాల్ని కాపాడిన సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణీకులు అభినందించారు...