madagoni surendar

Mar 28 2023, 16:36

ఏపీ పి ఎస్సీ : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

ఏపీ పి ఎస్సీ : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ (APPSC Group-1 mains) పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం..

ఏప్రిల్‌ 23 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జూన్‌ తొలి వారానికి వాయిదా వేశారు. ఏప్రిల్‌ 24 నుంచి మే 18వరకు సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. నిన్న యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తాజా నిర్ణయం తీసుకుంది. సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్‌ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో ఉంచుకొని అధికారులు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల తేదీల్లో ఈ మార్పులు చేశారు..

madagoni surendar

Mar 28 2023, 16:27

అద్భుతమైన ఘటం...నేడు ఆకాశంలో ఐదు గ్రహాలను చూడచ్చు.. వరుస క్రమం ఇలా.. సూర్యాస్తమయం ముగిసిన వెంటనే చూడాలి

అద్భుతమైన ఘటం...నేడు ఆకాశంలో ఐదు గ్రహాలను చూడచ్చు.. వరుస క్రమం ఇలా..!

సూర్యాస్తమయం ముగిసిన వెంటనే చూడాలి

పశ్చిమదిశలో ఒకే సమాంతర రేఖపైకి ఐదు నక్షత్రాలు

గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు

మిగిలిన రెండింటిని చూడాలంటే బైనాక్యులర్ అవసరం

నేడు సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. 

సరైన సమయం

సూర్యస్తమయం అయిన వెంటనే పశ్చిమం వైపు చూడాలి. ఐదు గ్రహాలూ సమాంతర రేఖలో కనిపిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే సూర్యాస్తమయం ముగిసిన అరగంట తర్వాత బుధగ్రహం, గురుడు సమాంతర రేఖ నుంచి కొంచెం కిందకు వస్తారు. ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటే భూమిపై ఎక్కడి నుంచైనా వీటిని చూడొచ్చు. 

గురుడు, శుక్రుడు, అంగారకుడిని కళ్లతో చూడొచ్చు. ఇవి కొంచెం ప్రకాశవంతంగా కనిపిస్తాయి. సమాంతర రేఖలో అన్నింటికంటే దిగువన ఉన్నది బుధగ్రహం. తర్వాత ఉన్నది శుక్రుడు. దానిపైన, చంద్రుడికి దిగువన ఉన్నది యురేనస్. తర్వాత చంద్రుడు. చంద్రుడికి ఎగువ భాగంలో తొలుత మార్స్ ఉంటుంది. అన్నింటికంటే పైన గురుగ్రహం కనిపిస్తుంది. సాధారణంగా మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు దర్శనమిచ్చినా, యురేనస్ కనిపించడం అరుదు. ఈ ఏడాది జూన్ లోనూ ఇదే మాదిరి దృశ్యం కనిపించనుంది. కాకపోతే ప్రతిసారీ ఇవే ఐదు గ్రహాలు ఉండవు.

madagoni surendar

Mar 28 2023, 16:20

ఏపీ ::మహిళల పక్షపాతి వైఎస్ జగన్. నరసరావుపేట శాసనసభ్యులు డా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

మహిళల పక్షపాతి వైఎస్ జగన్ -నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి .

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన..

ఘనంగా ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గంలో 3వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- చెక్కు నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేసారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ది.11-04-2019 నాటికి స్వయం సహాయక సంఘాలకు రుణ మొత్తాన్ని 4 విడతల్లో రుణమాఫీ చేయుటకు నిర్ణయించింది, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 3 విడతలలో స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ నిధులు నేరుగా లబ్ధిదారులు ఖాతాలో జమ చేయడం జరిగినది..

పట్టణ పేదరికం నిర్మూలన సంస్థ (మెప్మా) నరసరావుపేట పురపాలక సంగం నందు 1190 స్వయం సహాయక సంఘాలు వైయస్సా ఆసరా పథకాన్ని పొందటకు అర్హత కలిగి ఉన్నాయి. 1190 స్వయం సహాయక సంఘాల్లో ని 11,351 మంది సభ్యులకు 8,97,96,156/- కోట్లు చెక్కు నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది, ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 1190 స్వయం సహాయక సంఘాలకు 26.86 కోట్లు స్వయం సహాయక సంఘాలకు జమ చెయ్యటమైనది..

నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ కు భారీగా తరలి వచ్చిన మహిళలు - కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,

ఈ సంధర్బంగా. నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ:

రాష్ట్రంలో మూడవ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చేపట్టడం హర్షణియ్యమని అన్నారు..

ఈ మూడు సంవత్సరాల కాలంలో సుమారు 20 వేల కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ ఆసరా కొసం కేటాయించడం చరిత్రలో లిఖించదగిన అంశంగా పేర్కొన్నారు..

గతలో తెలుగుదేశం ప్రభుత్వాలు మహిళలను మోసం చేస్తే, ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులలో సైతం మాట నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కొనియాడారు..

ఇది సామాన్యమైన విషయం కాదని, నాయకుడి యెక్క విలువలకు, విశ్వసనియతకు ఇది నిదర్శమన్నారు...

కుటుంబం నడపగల ఆలోచన శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుందని గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి , కుల, మత, వర్గ పార్టీ, ప్రాంతాలకు అతీతంగా ప్రతి మహిళకు చేయూతనందించారని అన్నారు..

ఎవరికి ఒక్క పైసా లంచం లేకుండా ఇటువంటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం అని అన్నారు..

ప్రతి మహిళకు సొంత అన్నలా ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళల శ్రేయస్సు కోసం శ్రమించారో..

ఆయన తనయుడిగా నేడు వైయస్ జగన్ ఆ ఆశయాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆశించిన పేదరిక నిర్మూలన కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి,అహర్నిశలు పాటు పడుతున్నారని అన్నారు..

ఈ కార్యక్రమంలో  శాసనసభ్యులు డా౹౹ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, పిడి మెప్మా , మున్సిపల్ కమిషనర్, PUDA చైర్మన్ మిట్టపల్లి రమేష్ , జిల్లా మరియు మండల ఉన్నతాధిరులు, డ్వాక్రా మహిళలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, అన్ని శాఖల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మండలంలోని రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.._

madagoni surendar

Mar 28 2023, 16:08

భద్రాద్రి కొత్తగూడెం పోలిస్ శ్రీరామనవమి ఉత్సవం-2023 సందర్బంగా భద్రాచలానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం.

భద్రాద్రి కొత్తగూడెం పోలిస్ శ్రీరామనవమి ఉత్సవం-2023 సందర్బంగా భద్రాచలానికి విచ్చేస్తున్న మీకు స్వాగతం.

ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు & లడ్డూ ప్రసాదం స్టాల్స్ మరియు కల్యాణమండపం యొక్క సెక్టార్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం:

ఇవ్వబడిన QR కోడ్ ని స్కాన్ చేయండి

లేదా

దిగువ లింక్‌పై క్లిక్ చేయండి

https://bhadrachalam.netlify.app

వినీత్.జి ఐపిఎస్

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*

madagoni surendar

Mar 28 2023, 16:00

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

ఐపీల్ 2023: ఐపీఎల్ నయా రూల్స్.. జట్లన్నీ కొత్తగా.

Streetbuzz news ::

పోయిన ఏడాది వరకు ఒక లెక్క.. ఈ ఏడాది ఇంకో లెక్క అన్నీ రీతిలో ఐపీఎల్ 2023 సీజన్ ఉండనుంది. ఈసారి జట్లన్నీ కొత్తగా కనిపించనున్నాయి. చాలా జట్లు తమ కీలక ప్లేయర్లను ఈ సీజన్లో వదిలేశాయి. టీ20 ప్రపంచకప్ లో రాణించిన కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ లో భారీ ధరకు అమ్ముడుపోయారు. పంజాబ్.. శామ్ కరన్ రూ.18.5 కోట్లకు దక్కించుకోగా, బెన్ స్ట్కోక్స్ ను చెన్నై రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. పోయిన ఏడాది సన్ రైజర్స్ కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్.. ఇప్పుడు గుజరాత్ తరుపున ఆడనున్నాడు. ఢిల్లీకి వార్నర్, సన్ రైజర్స్ కు మార్ క్రమ్, పంజాబ్ కు ధవన్, కోల్ కతాకు నితిష్ రాణా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

మళ్లీ ఇంటా, బయటా…

లీగ్ స్టేజ్ లో మ్యాచ్ లన్నీ ఇంటా, బయట విధానంలో జరగడం కొత్తేమీ కాదు. అయితే. 2019 కరోనా తర్వాత ఆ రూల్ ని తీసేశారు. ప్రస్తుతం మళ్లీ ఐపీఎల్ 2023లో ఈ రూల్ ని తీసుకొచ్చారు. ప్రతి జట్టు సొంతగడ్డపై 7 మ్యాచులు, ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచులు ఆడుతుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి. రాజస్థాన్‌, ధర్మశాల, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్‌, జైపుర్‌, మొహాలీలో మ్యాచ్‌లు జరుగుతాయి.

madagoni surendar

Mar 28 2023, 15:52

ఏపీ :అనంతపురం జిల్లా::రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు

కణేకల్ మండలం లో పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం,

Stretubuzz news.

అనంతపురం జిల్లా లో సోమవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో దారుణ హత్యకు గురైన కడపల రమాదేవి మరియు మరీ ఎందరో గత వైసీపీ పాలన లో S.C S.T లు పై దౌర్జన్యం. దాడులు,హత్యలు మాన భంగాలు జరిగావి మాకు రక్షణ కల్పించలేరాని..?రమాదేవి ఫ్యామిలీ నిలదీశారు.రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు చేయడానికి పోయిన తల్లి, దండ్రులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.హంతుకుడు జాఫర్ వలికే వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ,ఎస్టీల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన్నారు. ఎస్సీ,ఎస్టీల పై దాడులను అరికట్టాలి,స్నేహ లత,నల్లపు రమ్య,టేకు లక్ష్మి,ప్రీతి నాయక్ ఇలా సబ్బండ కులాల అడ బిడ్డలను ఎంత మందిని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు.మా గోడు,ఉసురు తగలక పోదాని శపించారు. రమాదేవి కిరాతకంగా హత్య చేసిన జాఫర్ వలిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి ఉరి తీయాలని,కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని,ఈ వైసీపీ ప్రభుత్వం మృతురాలు కుటుంబానికి 50లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పోరాడి సాధించు కుంటామన్నారు. రమాదేవి నీ కిరాతకంగా హత్య చేసిన జాపర్ వలిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్ష వేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము,

             ఇట్లు

       మల్లెల ప్రసాద్

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం

పిడిఎసుయు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు

madagoni surendar

Mar 28 2023, 15:42

ఏపీ:ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం.ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు • 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి.

ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం

• ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు

• 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి

• నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున.

Stretbuzz news:

అమరావతి, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున.

madagoni surendar

Mar 28 2023, 14:38

ఏపీ ::ఎన్టీఆర్ జిల్లా /జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

ఎన్టీఆర్ జిల్లా / జుజ్జూరు :

జుజ్జూరు లో వైయస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

ఆసరాతో అక్క చెల్లెమ్మలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

వీరులపాడు మండల పరిధిలో 1055 పొదుపు సంఘాలకు 10550 మంది అక్కచెల్లెమ్మలకు రూ.8 కోట్ల 74 లక్షల రుణమాఫీ ..

డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ది ..

టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారు ..

జుజ్జూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వీరులపాడు మండల పరిధి వైయస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చెక్కును పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య ఆశయమని, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి, 45 సంవత్సరాల వయసు వారికి రూ.18,750, సున్నా వడ్డీ పథకం డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన ఘనత ఒక్క జగన్ కే దక్కిందని చెప్పారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆలోచనతో టిడిపి వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ఎమ్మెల్సీ గెలవడం గొప్ప అని ఎద్దేవా చేశారు, తామొస్తే పథకాలు రద్దు చేస్తామని చెబుతున్న చంద్రబాబు పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ము ఉందా అని అనడంతో .. లేదు.. లేదంటూ మహిళలు బదులిచ్చారు .. ప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు గతంలో రెండు విడతలుగా రుణమాఫీ నగదు అందించామని, మూడో విడత సైతం పంపిణీ చేసినట్లు తెలిపారు, మహిళల జీవన ప్రమాణాలు మార్చాలనదే సీఎం జగన్ లక్ష్యంమని, కులమతాలు, పార్టీలకతీతంగా డ్వాక్రా మహిళలందరికీ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు, గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు డ్వాక్రా మహిళల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు, టిడిపి నేతలు నిజమైన సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .. అనంతరం మహిళలంతా థాంక్యూ సీఎం సార్ అంటూ నినదించడంతో సభా ప్రాంగణం మార్మోగింది ..

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, వైస్ ఎంపిపి ఆదాం, నాగుల్ మీరా, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి సూర్యనారాయణ, మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొమ్మిశెట్టి భాస్కరరావు, స్థానిక గ్రామ సర్పంచ్ కోటి మరియు పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 28 2023, 14:28

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు :హీరో నాని

ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు : నాని

 

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మార్చి 30న రిలీజ్ కానుంది. ఆదివారం సాయంత్రం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈసందర్భంగా నాని మాట్లాడుతూ ‘ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు. ‘దసరా’తో మీ మనసుకు హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్‌‌‌‌‌‌‌‌తో విజిల్స్ వేసే ఆనందం దసరాతో ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేస్తారు. దసరా నా మనసుకు దగ్గరైనా సినిమా. ఏడాది కాలం దమ్ము ధూళిలో చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌‌‌‌ని రూపొందించిన నిర్మాత సుధాకర్, దర్శకుడు శ్రీకాంత్‌‌‌‌కి థ్యాంక్స్’ అని చెప్పాడు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘నాని, నేను కలిసి ‘నేను లోకల్’ సినిమా చేశాం. కానీ నాకు ‘దసరా’నే లోకల్ అనిపిస్తుంది. నాని నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ కో యాక్టర్. ఈ సినిమాతో అందరికీ వెన్నెలగా గుర్తుంటాను’ అని చెప్పింది. నటుడు దీక్షిత్ శెట్టి, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 13:52

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

హైదరాబాద్ : మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల ఎత్తులు.. ఇంట్లో కూర్చోబెట్టే లక్షలు దోచేస్తున్న కేటుగాళ్లు..

మహిళలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్ల ఎత్తులు రోజురోజుకూ సృతి మించుతున్నాయి. తాజాగా తెలంగాణలోని అబిడ్స్‌లో ఓ యువతి వీరి మాయలోపడి రూ.5 లక్షలు పోగొట్టుకుంది. బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతి మొబైల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే రోజూకు అరగంట పని చేసుకుని రూ.700ల నుంచి 900ల వరకు సంపాదించొచ్చంటూ ఆశ చూపారు. అందుకు ముందుగా రూ.2,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. నెల తర్వాత డిజిటల్‌ ఖాతాలో రూ.28 వేల ఆదాయం చూపారు. ఆ మొత్తం సొమ్ము విత్‌డ్రా చేసుకునేందుకు అదనంగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలనే షరతు పెట్టారు. సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్‌ పెంచుతూ వచ్చారు. ఈ క్రమంలో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయించుకొని చెప్పాపెట్టకుండా ఖాతా రద్దు చేశారు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను సంప్రదించింది.

ఇలా ఫోన్లకు తొలుత పార్ట్‌టైం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అంటూ మెసేజ్‌లను పంపించి ఆశల వల విసురుతున్నారు. గతంలో దీపాల వత్తులు, కరక్కాయ పొడి, బుక్స్‌ పీడీఎఫ్‌గా మార్చి రూ.లక్షలు సంపాదించమంటూ సామాజిక మాధ్యమాల వేదికగా మోసగాళ్లు చెలరేగారు. వీరి వలలో గృహిణులు, యువతులు అధికంగా చిక్కుకుంటున్నారు. నగరంలో సైబర్‌ క్రైమ్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఉద్యోగం, పెట్టుబడులకు సంబంధించిన మోసాలే ఉంటున్నాయి. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతులు తేలికగా బుట్టలో పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ సమయాల్లో 2-3 గంటలు కష్టపడితే చాలనే ఉద్దేశంతో బాధితులు అవతలి వారి మాటలను నమ్ముతూ ఉచ్చులో చిక్కుతున్నారు. ఇంట్లో ఉంటూ సంపాదించే అవకాశం ఉందనగానే తేలికగా నమ్మి సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు వచ్చే ఇటువంటి ప్రకటనలు నమ్మొద్దు. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండంటూ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీ నేహా మెహ్రా సూచించారు.