TeluguCentralnews

Mar 23 2023, 19:20

చెన్నైలో విచారకర సంఘటన... కోర్టు ఆవరణలో భార్యపై భర్త యాసిడ్ దాడి

చెన్నైలో విచారకర సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూర్ లోని కోర్టు ఆవరణలో యాసిడ్ దాడి కలకలం రేపింది. తనపై కేసు పెట్టిందని భార్యపై కోర్టు ఆవరణలో యాసిడ్ బాటిల్ ను భార్య మొహంపై విసిరాడు భర్త శివకుమార్. భర్త శివకుమార్ వేదింపులు తట్టుకోలేక కేసు పెట్టింది భార్య చిత్ర.

అయితే నేడు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వారు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో పక్కకు తప్పుకుంది అతడి భార్య చిత్ర. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆసిడ్ బాటిల్ టేబుల్ పై పడడంతో కోర్టు ఆవరణలో ఉన్న టేబుల్ కాలి బూడిదైంది. దీంతో కోర్టుకు వచ్చిన ఇతర బాధితులు, పోలీసులు శివకుమార్ నీ చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులపై సీరియస్ అయింది న్యాయస్థానం.

TeluguCentralnews

Mar 23 2023, 18:51

ప్రతిపక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతుంది – కేజ్రీవాల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచారం వేల కర్ణాటకలోని కోలార్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది గుజరాత్ సూరత్ లోని న్యాయస్థానం. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ స్పష్టం చేశారు.

ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. “ప్రతిపక్ష నేతలను, పార్టీలను అంతం చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్తో మాకు విభేదాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీని ఇలా ఇరికించడం సరైనది కాదు. న్యాయస్థానాన్ని గౌరవిస్తా.. కానీ తీర్పుతో ఏకీభవించను’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

TeluguCentralnews

Mar 23 2023, 18:42

దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం : సీఎం జగన్

పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేనే పోలవరమని అన్నారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదన్నారు. 

 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారి కూడా పోలవరం పేరు రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. టీడీపీ ద్యాసంతా డబ్బుల మీదనే అని విమర్శించారు. దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానమని , టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టిందని ఆరోపించారు.

పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అన్న జగన్… ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని తెలిపారు. పోలవరం పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ సభకు తెలిపారు.

TeluguCentralnews

Mar 23 2023, 18:31

ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు..! పసిబిడ్డ బరువుతో గిన్నిస్‌ రికార్డ్‌..!!

శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకరమైన పండ్లలో అతి ముఖ్యమైనది అరటిపండు అని మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక అరటిపండు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరటిపండును చూసి మీరు కూడా ఒక్క క్షణంకు గురవుతారు. ఎందుకంటే ఒక మనిషి ఈ మొత్తం అరటిపండును తినలేడు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. ఈ పండు దాదాపు ఒక పసిబిడ్డ బరువుంది. ఏ ఒక్కరూ ఈ అరటిపండును పూర్తిగా తినటం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. అయితే, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ భారీ అరటిపండు గురించి తెలుసుకోండి..

మనక్ గుప్తా అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇది చిన్న పిల్లల బరువుతో సమానంగా ఉందని చెప్పారు. వీడియోలో ఈ భారీ అరటిపండును చేతిలో పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి పూర్తిగా తినడం సాధ్యం కాదు. ఈ వీడియో ఆస్ట్రేలియన్ ద్వీపం పాపువా న్యూ గినియాలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తుంది. అక్కడ ఈ రకమైన అరటి మొక్కను పెంచుతారు. దాని నుండి వచ్చే అరటి పండ్లు ఒక మూర పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ భారీ అరటిపండు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.

న్యూ పాపువా గినియాకు చెందిన ఈ అరటి మొక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద అరటి మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ మొక్క నుండి వచ్చే అరటి బరువు సుమారు 3 కిలోలు. ఇది నవజాత శిశువుతో సమానం. అయితే, ఈ పండు పండడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పెద్దగా వ్యాపారం లేదు. ఈ మొక్క ట్రంక్ 15 మీటర్ల ఎత్తు ఉంటుందని, ఆకులు కూడా భూమి నుండి 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయని చెబుతారు.

అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 38 సెకన్ల వీడియోను 88 వేలకు పైగా వీక్షించారు. అయ్యబాబోయ్‌ ఇంతపెద్ద అరటిపండా అని కొందరు నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్ పెట్టారు. 5 ఏళ్లలో పండే ఈ అరటిపండు తినడానికి కనీసం 5 రోజులు పడుతుందంటూ మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.

TeluguCentralnews

Mar 23 2023, 13:59

రాహుల్‌ గాంధీ దోషే.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పు.. రెండేళ్ల జైలు శిక్షకు ఛాన్స్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేల్చిచింది గుజరాత్ కోర్టు. 2019 ఎన్నికల సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీని ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. దొంగలందరూ మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారెందుకు? అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. గత శుక్రవారం విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన సూరత్ న్యాయస్థానం.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వయనాడ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినప్పుడు ఈ కేసు 2019కి సంబంధించినది. ఆ తర్వాత అతనిపై పరువు నష్టం కేసు నమోదైంది. ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఒక్కటే ఎందుకు?’ అని రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌ సభలో రాహుల్‌ ఈ కామెంట్స్‌ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై క్రిమినల్‌ డెఫమెషన్‌ కేసు నమోదు చేశారు. రాహుల్‌పై పరువునష్టం దావా కేసుని విచారించిన సూరత్‌ కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించింది.

రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం వల్ల ఆయన సభ్యత్వానికి ముప్పు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రెండేళ్ల శిక్షను కూడా ప్రకటించవచ్చు. అయితే కోర్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నా ప్రకటన వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. శిక్షను తగ్గించాలని కోర్టును ఆశ్రయించాను. మరోవైపు, అశ్విని చౌబే మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ కోర్టు పరిధిలో ఉన్నారు. అతను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. పార్లమెంట్‌కు వచ్చి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద నేరం నమోదు చేశారు.

ఈ కేసులో ఇవాళ మూడోసారి కోర్టుకు హాజరయ్యారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల వాదనలు విని మార్చి 23న తీర్పును ప్రకటించాలని నిర్ణయించింది. ఈరోజు విచారణ అనంతరం రాహుల్ గాంధీని దోషిగా కోర్టు తేల్చింది.

TeluguCentralnews

Mar 23 2023, 13:52

Cyber crime : వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్‌ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్‌ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి సందేశాలపై ప్రతిఒక్కరూ అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను ఇప్పటికే చోరీ చేసినట్లు గుర్తించారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారని తెలుస్తోంది. 

ఇన్‌కాగ్ని సంస్థ నివేదికలో ఏముంది..? 

దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డేటా చోరీ జరిగిందని ఇన్‌కాగ్ని సంస్థ వెల్లడించింది. డేటా చోరీ బాధిత టాప్‌-5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని వివరించింది. అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని ఇన్‌కాగ్ని పేర్కొంది. భారత్‌ తర్వాత యూకే, బ్రెజిల్‌, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా చోరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది.

TeluguCentralnews

Mar 23 2023, 13:44

విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై..

విమాన ప్రయాణం అంటే డీసెంట్.. అందరూ ఎలైట్ పీపుల్స్.. పద్దతిగా ఉంటారు అనే టాక్.. మొన్నటి వరకు అలాగే ఉంది.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. విమానంలో గొడవలు కామన్ అయ్యాయి. ఎంతలా అంటే.. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడు సంఘటనలు జరిగాయి. ఒకరు మూత్రం పోస్తే.. మరొకరు ఉమ్మి వేయటం.. మరొకరు సీటు కోసం కొట్టుకోవటం వంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 

లేటెస్ట్ గా.. మార్చి 22వ తేదీ బుధవారం ఇండిగో విమానంలో తాగిన మత్తులో.. మందు ఎక్కువై.. ఇద్దరు వ్యక్తులు బీభత్సం చేశారు. తోటి ప్రయాణికులను బండ బూతులు తిట్టారు. దాడి చేశారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన కో పైలెట్, ఎయిర్ హోస్టస్ పై దాడికి ప్రయత్నించారు ఆ ఇద్దరు ప్రయాణికులు. దుబాయ్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో ఫ్లయిట్ లో ఈ ఘటన జరిగిందని.. గొడవ చేసిన ప్రయాణికులు ఇద్దరినీ.. ముంబైలో ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీస్ అధికారులు. 

ఆ ఇద్దరు ప్రయాణికులను కోర్టులో హాజరుపరిచామని.. వారికి బెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు ముంబై ఎయిర్ పోర్ట్ పోలీస్ అధికారులు. వారిద్దరూ మహారాష్ట్రలోని పాల్ఘర్, కొల్హాపూర్ ప్రాంతానికి చెందిన వారని.. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నారని.. ఏడాది తర్వాత ఇండియాకు తిరిగి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి తెచ్చుకున్న మద్యం తాగి విమానంలోనే సంబరాలు చేసుకున్నారని.. మద్యం మత్తులో.. కిక్ ఎక్కువై.. తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వివరించారు అధికారులు.

విమానాల్లో ఇటీవల జరుగుతున్న వరస ఘటనలపై భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొన్నటికి మొన్న విమానంలోని టాయిలెట్ లో సిగరెట్ తాగి.. ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ప్రయాణికులు సహనం కోల్పోతున్నారని.. కోపంతో దాడులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

TeluguCentralnews

Mar 23 2023, 13:11

నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన కనికరం లేని ఖాకీలు.. ఎక్కడ?

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగు రోజుల శిశువును పాషాణ హృదయులైన కొందరు పోలీసులు కాళ్ళతో తొక్కి చంపేశారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని కోసాగోండోడిఘి గ్రామంలో జరిగింది. 

ఈ వివరాలను పరిశీలిస్తే, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ వృద్ధుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు చిన్న శిశువు మాత్రమే కనిపించింది. ఆ బిడ్డ నిద్రపోతుండటంతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. 

ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు గాలించిన పోలీసులకు వారు ఎక్కడా కనిపించకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా నాలుగున్నర నెలల శిశువు మరణించివుండంతో వారు బోరున విలపించసాగారు. నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు కాళ్ళతో తొక్కి చంపారని శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వచ్చిన కథనాలపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందించారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

TeluguCentralnews

Mar 23 2023, 11:30

నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది..

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని బుధవారం అన్నారు.

గతేడాది నవంబర్ లో పంజాబ్ ప్రావిన్సులో నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు తనను చంపేందుకు మరో ప్లాన్ వేశారని ఆయన అన్నారు. ఇస్లామాబాద్, పంజాబ్ పోలీస్ చీఫ్ లు వారి హ్యాండ్లర్లు జమాన్ పార్క్ నివాసంలో మరో ఆపరేషన్ ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు.

ప్లాన్ ఏమిటంటే.. జమాన్ పార్క్ వద్ద రేపు లేదా తర్వాతి రోజు మరో ఆపరేషన్ ఉందని, వారి మనుషులు ప్రజల్లో కలిసిపోయేలా రెండు స్వ్కాడ్ లను తయారు చేశారు. ఆపై నలుగురైదుగురు పోలీస్ అధికారులను కాల్చి చంపుతారు, ఆ తరువాత జరిగే కాల్పుల్లో తన పార్టీ కార్యకర్తలను చంపేస్తారని, గతంలో ముర్తాజా భుట్లో హత్య తరహాలోనే నన్ను చంపేస్తారని ఆయన ఆరోపించారు. 1996 కరాచీ పోలీస్ ఎన్ కౌంటర్ లో మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో సోదరుడు ముర్తాజాను చంపేశారు. ఆ సమయంలో ప్రధానిగా బెనజీర్ భుట్టోనే ఉన్నారు. ఈ ఘటన జరిగిన 11 ఏళ్ల తర్వాత 2007 రావల్పిండి ఎన్నికల ర్యాలీలో ఉగ్రవాదుల దాడిలో ఆమెను హతమార్చారు.

పోలీసులు ఏం చేసినా రెచ్చిపోవద్దని కార్యకర్తలకు ఇమ్రాన్ ఖాన్ దిశానిర్దేశం చేశారు. సంయమనం పాటించాలని కోరారు. నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కానీ రక్తపాతం మాత్రం వద్దు అని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇస్లామాబాద్ కోర్టులో హాజరుపరిచే సందర్భంలో తనను డెత్ ట్రాప్ చేశారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 20 మంది గుర్తుతెలియని వ్యక్తులు నన్ను చంపేందుకు వచ్చారని ఆయన ఆరోపించారు.

TeluguCentralnews

Mar 21 2023, 19:13

విరాట్‌ కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా..?

విరాట్‌ కోహ్లీ.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. క్రికెట్‌ ప్రపంచంలో ఒక సంచలనం.. సాధరణంగా ఏ క్రికటర్‌కు అయినా.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రమే ఉంటారు.. కానీ విరాట్‌ కోహ్లీకి మాత్రం..క్రికెట్‌ అంటే తెలియని వాళ్లు కూడా ఫ్యాన్స్‌ ఉంటారు. హీరోలు, హీరోయిన్స్‌ అందరూ కింగ్‌కు అభిమానులే.. అయితే.. విరాట్‌ కోహ్లీ తాగే వాటర్‌ గురించి గతంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. కోహ్లీ ఫిట్ నెస్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. విరాట్‌ తినే బియ్యం కాస్ట్‌ ఎంతో మీకు తెలుసా..?

భారత మాజీ కెప్టెన్ , రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ గురించి ఎప్పుడూ కష్షపడుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీ పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు తినడు. వాటికి దూరంగా ఉంటాడు. విరాట్ తన ఆహారంలో కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోడు. ఇది శరీరం కొవ్వును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు.

స్పెషల్‌ రైస్‌..

కోహ్లీ మామూలు అన్నం కాకుండా స్పెషల్ రైస్ తింటారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. గ్లూటెన్ రహితంగా ,కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం సాధారణ రుచిని కలిగి ఉంటుంది. ఈ బియ్యం కిలో ధర రూ.400 నుంచి 500 వరకు ఉంటుందని సమాచారం. తాను పాల ఉత్పత్తులు తినడం పూర్తిగా మానేశానని తెలిపాడు. తాను గోధుమలతో చేసిన రొట్టెలను కూడా తిననని కోహ్లీ తెలిపాడు.

ఫిట్‌గా ఉండటం కోసం.. తాను చాలా స్వీట్లు కూడా తినడం మానేశానని తెలిపారు. 34 ఏళ్ల వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా, బాగానే మెంటైన్ చేస్తున్నాడు.

కోహ్లికి చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బట్టర్ ఒకటి. అయితే తన ఆటపై, తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారించే కోహ్లి.. చోలే బట్టర్ తినడం కూడా తగ్గించారట.. అలాగే.. అల్పాహారం గురించి మాట్లాడుతూ, కోహ్లీ రోజును మూడు గుడ్డులు, ఒక గుడ్డుతో కూడిన ఆమ్లెట్‌తో ప్రారంభిస్తాడట.. అలాగే భోజనంలో ఉడికించిన చికెన్, మెత్తని బంగాళదుంపలు, బచ్చలికూర మరియు కూరగాయలను తింటాడు. మొత్తానికి కింగ్‌ తన డైట్‌ను ఇలా మెయింటేన్‌ చేస్తున్నాడు..