/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మర్రిగూడ మండల నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Mane Praveen
మర్రిగూడ మండల నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి.. మండల నాయకులకు సూచించిన ఎమ్మెల్యే

మర్రిగూడ మండలం లోని వివిధ సమస్యలపై మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మండల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల సమస్యలు రోడ్లు, విద్యుత్ ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

బెల్ట్ షాపు ల పై సమగ్రమైన అధ్యయనం చేసి తన దృష్టికి తీసుకురావాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాసు, మర్రిగూడ మండల మాజీ జిల్లా ప్రాదేశిక సభ్యులు మేదరి యాదయ్య, కొట్టాల మాజీ సర్పంచ్ గంట కవిత యాదయ్య లు పాల్గొన్నారు.
విద్యుత్ పనులకు 57 కోట్లు నిధులు మంజూరు
మునుగోడు నియోజకవర్గం:
నాణ్యమైన, భద్రతతో కూడిన విద్యుత్ అందించడమే తన ప్రధాన కర్తవ్యం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. విద్యుత్ పనులకు 57 కోట్లు నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విద్యుత్ అత్యవసర పనులకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా లో-వోల్టేజి సమస్య ఉండొద్దని విద్యుత్ అధికారులకు సూచించారు.

NLG: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

నల్లగొండ జిల్లా, దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున్న సభ్యులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా రాష్ట్రంలో 540 గురుకులాలు ఉంటే ఆ గురుకులాల సమస్యల ను పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు.

స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి చదువుకునే విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల పైగా పెండింగ్ లో ఉంటే పై చదువులు ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తపరిచారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు 33 రూపాయల అరవై పైసలు తోటి మూడు పూటల భోజనం పెట్టడం ద్వారా పౌష్టికాహారం ఎలా సాధ్యమవుతుందని అన్నారు.

పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మేస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు దొంగతనాలు చేసిన వారికి నిందితులకు 50 పై చిలుకు రూపాయల తోటి మూడు పూట భోజనం పెడుతున్నారంటే విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుందని ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలు తెలుపుకుందామంటే ఇంతవరకు కూడా కొత్త ప్రభుత్వం లో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు.

ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యారంగా సమస్యలు పరిష్కరానికి చేసే ఈ దీక్ష ఇంతటితో ఆగదు ఈనెల 27 న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను ఐక్యం చేసి చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు పొట్ల రాకేష్, జిల్లెల్ల ఇద్ది రాములు, నెర్లపల్లి జైచరణ్, గోలి శివ, ఉంగరాలు శివయ్య, నేలపల్లి భాను, కావ్య, నందిని, మంజుల, మహేశ్వరి, రామావత్ చరణ్ తేజ్, మనోహర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్గానిక్ వ్యవసాయం పై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు
నల్లగొండ:
కే.ఎన్.బయోసైన్సెస్ మరియు శ్రీసత్యం వర్మి బయోఆర్గానిక్స్& కన్సల్టెన్సీ సంస్థల సంపూర్ణ సహకారంతో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం మరియు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం నిర్వహించి యువతీ యువకుల్లో శారీరకదారుఢ్యం మరియు సమాజానికి సంపూర్ణ ఆరోగ్యం అవగాహనపై క్షేత్రస్థాయి అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ రంగంలో యువతీ యువకులు రాణించేటందుకు ఉద్యోగ అవకాశాల కల్పన కొరకు కూడా ప్రయత్నిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
NLG: సిపిఎం పోరాటాల ద్వారానే  ప్రజల సమస్యలు పరిష్కారం: ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం జిల్లా కార్య దర్శి
నల్లగొండ జిల్లా:
సిపిఎం పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామ శాఖ ఆరవ మహాసభలు తిరుగండ్లపల్లి గ్రామంలో నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగాయి. ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. పాలకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రైతులు, కూలీల సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలిపారు. ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్ల కు డిపిఆర్ ఆమోదించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే డిపిఆర్ ను ఆమోదించి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ప్రభుత్వాల మెడలు వంచుతారని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు నెలకి రూ.2,500 మరియు ఇతర పథకాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. మద్యం మత్తు పదార్థాలు యేరులై పారుతున్నాయని మునుగోడు నియోజకవర్గం లాగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాలు ఊసే లేదని సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ ఇంకా అనేకమందికి కాలేదని రుణమాఫీ చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కారం చేయుటకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహాసభల ప్రారంభ సందర్భంగా సిపిఎం జెండాను చల్ల ముత్యాలు ఆవిష్కరించగా,నీలకంఠం సత్తెమ్మ స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ శాఖ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠ రాములు, కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, దామెర లక్ష్మి, గడగోటి వెంకటేష్, కాగు వెంకటయ్య, నీలకంఠం లక్ష్మమ్మ, సిరసనవాళ్ళ ఎల్లయ్య, నీలకంఠ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో వివిధ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం ప్ల కార్డులతో నాలుగు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేసి  నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. గతంలో 2019 సంవత్సరంలో వేతనాల కోడ్, 2020లో ఐ ఆర్ కోడ్, ఓ ఎస్ హెచ్ కోడ్, సామాజిక భద్రత కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్ లు కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించింది. అంతకుముందు 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్ట బెట్టిందని, కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేస్తుందని ఆయన అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుంది గతంలో ఎన్నో సమ్మెలు సమరశీల ఉద్యమాలు జరిపినప్పటికీ బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ వ్యతిరేకించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికి నిర్ణయించుకుందని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బ్లాక్ డే కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారని చెప్పారు.

ఆశా వర్కర్స్ యూనియన్, ఐకెపి వివో ఎల్ యూనియన్ రంగినేని చంద్రకళ, గంట మంజుల, లెంకలపల్లి పాపా చారి , మాధగోని యమున, లలిత, పల్లె మహేష్, జాజాల అనిత, ఆయిల్ కలమ్మ, రోజా, కలకొండ వెంకటమ్మ, వట్టిపల్లి విజయమ్మ, మంజుల, మైల నీలకంఠం,యాదయ్య, గడగూటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
TG: వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం అందించిన గీతం యూనివర్సిటీ
HYD: వరద బాధితుల సహాయార్థం  ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ  1 కోటి రూపాయల విరాళం అందించింది. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ శ్రీ భరత్  ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి ని  జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఈ మేరకు చెక్కు అందజేశారు.

సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా  అభినందించారు.
శివన్నగూడ: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం:
ఈరోజు శివన్నగూడ గ్రామంలో అకాల మరణం చెందిన గ్యార రమణ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన శివన్నగూడ గ్రామ తాజా మాజీ సర్పంచ్ చిట్యాల సబితా యాదగిరి రెడ్డి..

కీ.శే. గ్యార రమణయ్య కు చిన్నపిల్లలు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది పేద కుటుంబం, అందరూ పెద్ద మనసు చేసుకొని దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.
NLG: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యాచరణలో క్షేత్ర క్షేత్రస్థాయి ఉచిత ఆర్గానిక్ వ్యవసాయ సదస్సులు
ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యాచరణలో ఉచిత క్షేత్రస్థాయి వ్యవసాయ సదస్సులు
నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్ అక్కెనపల్లి కిరణ్ తెలిపారు.

నల్గొండ మండలం ఆర్జాలబావి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కే.ఎన్. బయో సైన్సెస్ ఆర్గానిక్ వ్యవసాయ నిపుణులు రామానుజ పాల్గొని రైతులకు సహజ పద్ధతుల్లో పంటను ఆశించే చీడపీడల నివారణ, వేరుకుల్లుడు తెగులు నివారణ పద్ధతులను మరియు క్రొత్తగా తోటలను పెంచే రైతులకు సమగ్ర పద్ధతులను వివరించే కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు.
NLG: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సిఐ నవీన్
నల్లగొండ జిల్లా:
చింతపల్లి: యువత విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మాదకద్రవ్యాలకు  విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని నాంపల్లి సిఐ నవీన్ అన్నారు.

నాంపల్లి సర్కిల్ పరిధిలోని చింతపల్లి మండలం, గొడకొండ్ల గ్రామపంచాయతీ లోని వెంకటేశ్వర్ నగర్ ( మాల్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, శనివారం  పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు.. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని ప్రణాళికతో ముందుకెళ్లలన్నారు.

నవ సమాజ స్థాపన కోసం విద్యార్థులు, యువత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధ్యాపకులు సీఐ నవీన్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేల్లం  పాండురంగారావు, గోడుకొండ్ల పంచాయతీ కార్యదర్శి జేరుపుల పద్మ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయ బృందం ఎం.డి. అన్వర్, గోపాల్, ప్రవీణ్ శర్మ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.