/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: బొట్టుగూడ హైస్కూల్లో విద్యార్థులకు సన్మానం Mane Praveen
NLG: బొట్టుగూడ హైస్కూల్లో విద్యార్థులకు సన్మానం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో హిందీ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఆధ్వర్యంలో హిందీ భాషలో మంచి ప్రావీణ్యం సాధిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించే పనిలో భాగంగా హిందీ మాస్టర్ సలీం సారధ్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హిందీ భాష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందీ భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
NLG: పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కౌన్సిలర్
నల్లగొండ పట్టణ కేంద్రంలోని 33 వ వార్డులో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద వినాయకుడి శనివారం 8 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య రెడ్డి పాల్గొని వినాయకుడికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సేకరణ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ నాగుల జ్యోతి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: సీతారాం ఏచూరి మరణం సిపిఎం కు తీరని లోటు
నల్లగొండ జిల్లా:
కొండ మల్లేపల్లి : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కస్ట్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. భారత ప్రజానీకానికి, శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆయన ఆశయ సాధన కొరకు కార్యకర్తలు అందరూ అలుపెరగని పోరాటాలు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చింతపల్లి మండల కమిటీ సభ్యులు పోలే యాదయ్య, కొండమల్లేపల్లి పాత బజారు శాఖ కార్యదర్శి ఎం.శ్రీనివాసు, ఆర్.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు అందుగుల్ల కేశవులు, ఆరకంటి ఆంజనేయులు, వెంకటయ్య, ఏర్పుల మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి పల్లి గ్రామంలో యువ చైతన్య యూత్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ పాల్గొని  అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసాదము స్వీకరించి యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: అంతరాష్ట్ర బైక్ దొంగను అరెస్టు చేసిన పోలీసులు
చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బు సంపాదించాలని  బైకులను దొంగతనం చేసి, ఆ డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్న ఏపీ మాచర్ల కు చెందిన రాజా అనే అంతరాష్ట్ర బైక్ దొంగను కొండ మల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయాలలో రెండు పల్సర్ బైక్ లను దొంగ కొట్టేశాడని, సీసీ కెమెరాల ద్వారా నిందితుని గుర్తించడం జరిగిందని తెలిపారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG
లెంకలపల్లి: వినాయకుడికి ఘనంగా 8 వ రోజు పూజలు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,గాంధీ సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం విఘ్నేశ్వరుడికి 8 వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పగిల్ల రమేష్ రేణుక దంపతులు 8 వ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  సిపిఎం మండల  కార్యదర్శి ఏర్పుల యాదయ్య శుక్రవారం,  కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..  ఆగస్టు 12, 1952లో మద్రాసులో జన్మించిన సీతారాం ఏచూరి 1974 లో జవహర్లాల్ నెహ్రూ  విశ్వవిద్యాలయం లో విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ లో ఎన్నికయ్యారు. 1975లో సిపిఎం పార్టీ సభ్యుడయ్యారు. పార్టీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.

హరికిషన్ సింగ్ సుజిత్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని సిపిఎం జెండాను భుజాన వేసుకుని 1985లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో పోలిట్ బ్యూరో  సభ్యులుగా చోటు దక్కించుకొని గొప్ప నాయకుడుగా నిలిచారనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, మహిళా సంఘం నాయకురాలు దామెర లక్ష్మీ, గిరి, విష్ణు శిరసవాడ ఎల్లయ్య, బోయపళ్లి యాదయ్య, తదితరులు పాల్గొని అమర యోధునికి జోహార్లు అర్పించారు.
NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో ,డిఎస్పీ లకు వినతి పత్రం
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న కోళ్ల ఫామ్ ఎదుట ముందు జరిగిన ధర్నాకు అధికారులు స్పందించి పాఠశాలకు పరిశీలించడానికి వచ్చిన ఆర్డిఓ శ్రీరాములు,  డీఎస్పీ గిరిబాబు లకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. దేవరకొండ ఆదర్శ పాఠశాలలో సుమారుగా 540 మంది విద్యార్థులు దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నారని  విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో  స్థలం యొక్క యజమానులు కోళ్ల ఫారం ఏర్పాటు చేసి  ఉంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు దుర్వావాసనతో విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యం పాలై వాంతులు, విరోచనాలకు గురవుతున్నారని అన్నారు.

కేవలం ఒక్క ఆదర్శ పాఠశాల విద్యార్థులే కాకుండా పక్కనే ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా కేజీబీవీ ల విద్యార్థులు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకున్న అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో పాటు కలిసి తక్షణమే కోళ్ల ఫామ్ తొలగించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్, చరణ్, సిద్దు, విక్రమ్, మనోహర్, అనూష శ్రావణి, మంజుల, శ్రీలత,ధనమ్మ,వైషు, సోనీ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. అన్నదానం
                
నల్లగొండ జిల్లా:
నాంపల్లి  మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వినాయకుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల శివారెడ్డి,  వీరమల్ల శ్వేతా నాగరాజ్, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల లవ్వయ్య, కోట ప్రమీల, రఘునందన్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, అలంపల్లి ఆనంద్ కుమార్, నాంపల్లి హనుమంతు, ఈద శేఖర్, గాజుపాక రమేష్, కర్నే యాదయ్య, జాల కృష్ణయ్య, కామిశెట్టి నాగరాజు, కోరే జయరాం, బెల్ది సత్తయ్య, జాల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NLG
NLG: రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన అధ్యాపకులకు సన్మానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల నుంచి సెప్టెంబర్ 5న రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు పొందిన వాణిజ్యశాస్త్ర అధ్యాపకులు డా. ర్యాక శ్రీధర్,  రసాయనశాస్త్ర అధ్యాపకులు డా. అనిల్ కుమార్ లను స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.  మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో రెండు ఉత్తమ అధ్యాపక అవార్డులు నాగార్జున కళాశాలకు రావడం గర్వ కారణమని అన్నారు.
అవార్డులు మరింత బరువు బాధ్యతలను పెంచుతాయని అందుకే అంకితభావంతో పనిచేయాలని అన్నారు. అవార్డు గ్రహీతలు డా. శ్రీధర్, అనిల్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల తన విద్యా సేవకు గుర్తుగా తమకు ఈ అవార్డులు లభించాయని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల విద్యా స్థాయిలను, కుటుంబ పరిస్థితులను గమనించి వారికి అండదండగా నిలబడాలని తాము అలాగే చేసామని అన్నారు.

వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్, కళాశాల అంతర్గత నాణ్యతా ప్రమాణాల సమన్వయ కర్త డా. ప్రసన్న కుమార్, అధ్యాపకులు డా. మునిస్వామి, డా. జలీల్, డా. నాగరాజు, డా. అనిల్ కుమార్ బొజ్జ, మల్లేశం తదితరులు అవార్డుగ్రహీతల సేవలను కొనియాడారు. స్టాఫ్ క్లబ్ కార్యదర్శి జి.బాగ్య లక్ష్మి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డా. వెల్దండి శ్రీధర్, చరిత్ర అధ్యాపకులు కోటయ్య, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.