/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz నేడే మహాత్కరా ఘట్టం ‼️* TS breaking
నేడే మహాత్కరా ఘట్టం ‼️*

- యాదాద్రి థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల యూనిట్ కు సింక్ చేయడానికి సిద్ధం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్‌ చేయనున్నారు.

దాదాపు 72 గంటల పాటు విద్యుత్‌ ఉత్పాదన చేసిన తర్వాత ప్లాంట్‌ కమిషన్‌ కానుంది. ఆ తర్వాత గ్రిడ్‌కు ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్‌ను అందించనున్నారు.

ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పాదన సజావుగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయన్తున్నట్లు(సీవోడీ-కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌) ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఇక్కడే ఉంది.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ అనంతరం ప్లాంట్‌ నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు.

ఘనంగా చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి

•మోడరన్ దోబిఘాట్ ఉపాధ్యక్షుడు యలిజాల శంకర్ ఆధ్వర్యంలో

నల్లగొండ పట్టణంలో వీటి కాలనీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మోడరన్ దోబిఘాట్ ఉపాధ్యక్షుడు యలిజాల శంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా యలిజాల శంకర్, దూదిగామ నాగరాజు గార్లు మాట్లాడుతూ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ గారని,

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. ఐలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు నాటి భూ పోరాటానికి ముందుకు వచ్చారని గుర్తు చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ పట్టణ రజక నాయకులు ఓరుగంటి ఐలయ్య, తుపాకుల ప్రసాద్, యలిజాల సంతోష్ కుమార్, మారగోని సుధాకర్, దూదిగామ శంకర్, భూతరాజు రాంబాబు, చిలకరాజు రాజు, పగిల్ల సైదులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు. సోమవారం గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో తక్షణమే కులగణన జరిగే విధంగా ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ సమగ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి గత 8 నెలలుగా రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ కులగణన పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.

కులగణనపై అఖిలపక్ష పార్టీలు, వివిధ ప్రజా స్వామిక సంఘాలు, ఉద్యమ సంఘాలు ముక్తకంఠంతో కులగణనను చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించడం చాలా దారుణమన్నారు. బీసీ కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల వ్యతిరేకతతో కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశాడని కెసిఆర్ బాటలోనే మేము కూడా నడుస్తామని కాంగ్రెస్ అనుకుంటే బీసీల అగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని లేకుంటే వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనన నిర్వహించి బీసీలకు జనాభా ప్రకారం వాటా దక్కాలని మాట్లాడుతుంటే ఆయన బొమ్మతో గెలిచిన ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై మీన మేషాలు లెక్కబెడుతుందన్నారు. రాష్ట్రంలో కులగణనను చేయకుండా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతిష్టకు బంగం కలిగే విధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.

ఈ పూజా కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు విశ్వనాధుల శివకుమార్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యువజన సంఘం నాయకులు కోట రమణ, వీరమల్ల ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు...

ఈ మేరకు AICC ప్రధాన కార్యదర్శి కె.సీ వేణుగోపాల్ ఒక‌ ప్రకటన విడుదల చేశారు.

Streetbuzz News

తెలంగాణ తల్లి దొరల కోటలో బందీకావొద్దు

ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఇవాళ శుభ దినమని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి తెలంగాణ తల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2004 కరీంనగర్‌లో తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత అనేక రకాలుగా వెనుక బడ్డారన్నారు. తెలంగాణ తల్లిని వెనక్కి నెట్టి వారే సర్వం అన్నట్లు గత పాలకులు వ్యవహరించారన్నారు. ముళ్ళ కంచె ఏర్పాటు చేసుకొని రాజ భోగం అనుభవించారన్నారు. అది ఒకప్పుడు ఘడీల భవనమని.. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవనమని పేర్కొన్నారు.

పదేళ్లు ముఖ్యమంత్రి , మంత్రులు ఎవరూ అందుబాటులో లేరని.. అసలు సచివాలయంలోకి సామాన్యులకు ఎంట్రీయే లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి సచివాలయం నిర్మించిన వాళ్లకు కోటి రూపాయలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపొయారని రేవంత్ విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సచివాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో కొంతమంది తమ కోసం ఆపారన్నారు. తెలంగాణ తల్లి అంటే దర్పం, పోరాట పటిమకు స్ఫూర్తి అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి దొరల కోటలో బందీ కావొద్దన్నారు.

రేవంత్ నీ పౌరుషం ఏమైంది.⁉️

- ఎంపి ధర్మపురి అరవింద్ కీలక వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. రాద్దాంతం చేశారు కాబట్టే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుంచి బయట పడేశారని చెప్పారు.

రేవంత్ పౌరుషం ఏమైంది.. గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు ఏమైంది. కమిషన్లు వేయడం కాదు.. మీ చిత్త శుద్ధి నిరుపించుకోండి. రాష్ట్రానికి చీడ పురుగులా బీఆర్ఎస్ ఉండేది..దాన్ని వదిలించుకున్నారు.

గులాబీ పార్టీను భూస్థాపితం చేయాలి. బీఆర్ఎస్ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ బీజేపీలో ఐక్యత ఉంది. రైతు రుణమాఫీపై డేటా తీసుకుని ఆ తర్వాత స్పందిస్తాం. రుణ మాఫీ ఒకటే కాదు ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతులు, మహిళలు, యువకులు సీఎం రేవంత్‌ను విమర్శిస్తున్నారు’’ అని అరవింద్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ గురించి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయనేది అనవసరం. బడ్జెట్ దేశానికి మంచి చేసేలా ఉందని మేధావులు చెబుతున్నారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ. 31 వేల కోట్ల రైల్వే పెట్టుబడులు పెట్టారు.

తెలంగాణ బడ్జెట్‌లో మైనార్టీలకు బడ్జెట్ పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ తగ్గించారు. అధ్యక్ష పదవికి మా పార్టీలో రేసులు ఉండవు. నాకు ఇస్తా అంటే నన్ను పిలిచి మాట్లాడుతారు.. అప్పుడు నా సమాధానం పార్టీ అధిష్ఠానానికి చెబుతా. బీజేపీ అధ్యక్ష పదవి హిందు సామాజిక వర్గానికి ఇస్తే బావుంటుంది. భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ హిందువే. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది నా అభిప్రాయం అడిగితే పార్టీకి చెప్తా’’ అని అరవింద్ పేర్కొన్నారు.

బండి సంజయ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ‼️

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

బండి సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేకపోతున్నారా...? అని నిలదీశారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

 మంత్రి పొన్నం ప్రభాకర్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఇంతపెద్ద రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ధ్వజమెత్తారు. దేశంలోనే ఒక రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు.

భారీ వర్షాలకు పంట నష్టపోయిన గుజరాత్ రైతులకు వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటలు నామా రూపాలు లేకుండా కొట్టుకుపోతే కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా....? 

రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.. గుజరాత్‌లో భారీ వర్షాలు కురిస్తే రూ.100ల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామ రూపలేకుండా పోతే పంట నష్ట పరిహారం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు.

మంత్రివర్గ విస్తరణలో తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలి

బీసీ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ సంఘం కార్యాలయంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిత్యం బీసీ సమస్యలపై గళం విప్పుతు. బీసీలను అణగారిన కులాలుగా చూస్తున్నటువంటి వాళ్ళని భరతం పడుతూ బీసీ సమస్యలే తన సమస్యలుగా బీసీల అభివృద్ధి తన సంక్షేమంగా భావించే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు నూతనంగా ఏర్పాటు చేసే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి బీసీల గొంతుకకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని అయినా అన్నారు .

ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా నిత్యం బీసీ సమస్యలపైనే బీసీలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టసభలలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలు ముందుండాలని నిత్యం ప్రశ్నించే గొంతుక ను గౌరవించి బిసి ల తరుపున తీన్మార్ మల్లన్న మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కోరారు... ఈ కార్యక్రమంలో రాయించు నరసింహ, చిలకల మురళి యాదవ్, ఎర్రవెల్లి గంగాధర్, మహేశ్వరపు నరేష్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

నేటి రాశి ఫలాలు జులై 10, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి రాశి ఫలాలు

జులై 10, 2024

మేషం

సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా  పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది.

మిధునం

నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా  ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

సింహం

ఆకస్మిక ధన ప్రాప్తి  కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు  పెరుగుతాయి.

కన్య

ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది.

తుల

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు  బంధువుల  నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

ధనస్సు

వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం

ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

నేటి పంచాంగం జులై 11, 2024

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమో నారాయణాయ

ఓం శ్రీ గురుభ్యోనమః

నేటి పంచాంగం

జులై 11, 2024

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం 

ఋతువు: గ్రీష్మ

మాసం: ఆషాఢ

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: పంచమి ఉ‌.08:42 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతి

వాసరే

 

నక్షత్రం: పూర్వఫల్గుణి ప‌.12:40 వరకు 

తదుపరి ఉత్తరఫల్గుణి

యోగం: వరియాన రా.04:07 వరకు 

తదుపరి పరిఘ

 

కరణం: బాలవ ఉ‌.08:42 వరకు

తదుపరి కౌలువ రా.09:39 వరకు

తదుపరి తైతుల

వర్జ్యం: రా.08:39 - 10:25 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:10 - 11:03

మరియు ప‌.03:25 - 04:17

రాహు కాలం: ప‌.01:59 - 03:38

గుళిక కాలం: ఉ‌.09:05 - 10:43

యమ గండం: ఉ‌.05:48 - 07:27

 

అభిజిత్: 11:55 - 12:47

సూర్యోదయం: 05:48

సూర్యాస్తమయం: 06:54

చంద్రోదయం: ఉ‌.10:15

చంద్రాస్తమయం: రా.10:44

సూర్య సంచార రాశి: మిథునం 

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: దక్షిణం

స్కంద పంచమి 

గురుపంచమి‌ యోగము 

శమీగౌరీ‌ వ్రతం 

ఇడాపంచమి‌ 

నఖరంజని‌ - గోరింటాకు

అలంకరణ‌ 

హేర పంచమి‌ 

సంత్‌ చూడామణి 

మహారాజ్ ప్రకటనోత్సవం‌ 

శ్రీ బ్రహ్మానందస్వామి జయన్తీ 

శ్రీ వల్లభాచార్య‌ పుణ్యతిథి‌ 

శ్రీ శాయి‌ టేవురాం 

 మహారాజ్ జయన్తీ 

శ్రీ నాథ్‌భుజంగ్‌ మహారాజ్ 

పుణ్యతిథి‌ 

శ్రీ అల్లూరి సీతారామరాజు

 జన్మతిథి‌ 

ద్వారకాధీష్ పటోత్సవ్

 రాజస్థాన్ 

అణి ఉత్తర‌ ఉత్సవం