/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz బొట్టుగూడ పూర్వ విద్యార్థినికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం Mane Praveen
బొట్టుగూడ పూర్వ విద్యార్థినికి 10వేల రూపాయల ఆర్థిక సహాయం
2023-24 విద్యా సంవత్సరంలో SSC పరీక్షల్లో *సాంఘిక శాస్త్రంలో 10 GPA* సాధించిన నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన M.సిరి అనే విద్యార్థినికి పాఠశాల *సోషల్ స్కూల్ అసిస్టెంట్ K.లింగయ్య*  విద్యార్థినిని ప్రోత్సహించే భాగంగా 10,000/- రూపాయల ఆర్థిక సహాయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ద్వారా అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ చదువుల్లో ప్రతిభను చూపించడం ఎంతో సంతోషదాయకమని మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని చదువులో రాణించాలని తెలియజేస్తూ, ఆర్థిక సహాయం అందజేసిన లింగయ్య ను పాఠశాల పక్షాన ప్రత్యేకంగా అభినందిస్తూ, దాతలు అందించిన సహకారాన్ని ఉన్నత చదువుల కోసం ఉపయోగించుకోవాలి సూచించారు.
NLG: బొట్టుగూడ హైస్కూల్లో సంపూర్ణత అభియాన్ హెల్త్ చెక్ కార్యక్రమం
WHO నేషనల్ హెల్త్ అథారిటీ సంపూర్ణత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనరల్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.

ఈ ప్రోగ్రాంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులకు జ్వరం, బీపీ, షుగర్, శరీర టెంపరేచర్ పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ విభాగానికి చెందిన స్టాఫ్ నర్స్ హైమా కుమారి, ఏఎన్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
NLG: కొండమల్లేపల్లి, గుడిపల్లి మండల ఏఐఎస్ఎస్ డి కన్వీనర్లుగా మేదరి ప్రసాద్, దారమల్ల రాజు
నల్గొండ జిల్లా:
దేవరకొండ లోని అంబేద్కర్ గ్రంథాలయంలో బుధవారం ధోనియాల గ్రామానికి చెందిన మేదరి ప్రసాద్, గణపురం గ్రామానికి చెందిన దారమల్ల రాజు లను బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ కొండమల్లేపల్లి, గుడిపల్లి మండల కన్వీనర్లుగా  ప్రాతినిధ్యం వహించుటకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి బరుపటి వెంకటయ్య ఇరువురు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న  మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ను అన్ని గ్రామ కమిటీలను పూర్తిస్థాయిలో విస్తరింప చేయాలని ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ హక్కులు పరిచయం చేస్తూ, ప్రతి పౌరుడికి రాజ్యాంగ పలాలు అందే విధంగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు సామాజిక పోరాటానికి సంసిద్ధులు కావాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం కొండమల్లేపల్లి గుడిపల్లి కన్వీనర్లు మేదరి ప్రసాద్, దారమల్ల రాజు మాట్లాడుతూ.. మాకు ఈ సంస్థలో మండల కన్వీనర్లుగా బాధ్యతలు ఇచ్చినందుకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువతను చైతన్య పరుస్తూ ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేసి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘ ఆశయ సాధన కోసం, రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరునికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి చెట్టి యాదగిరి, మండల నాయకులు ఖండేల వెంకన్న, ముల్కశిర విజయ్ అదిరాల తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో మర్రిగూడ మండలంలో భారత్ బంద్

ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపుమేరకు ఇవాళ మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు దళిత రత్న నాగిల్ల మారయ్య ఆధ్వర్యంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి ఆదేశాల మేరకు మర్రిగూడ మండలంలో ర్యాలీలు నిరసనలు చేపట్టి, స్కూలు కళాశాలలు తిరిగి భారత్ బంద్ నిర్వహించారు.

మారయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకమని, వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిగణలోకి రాదని, ఆర్డినెన్స్ లు జారీ చేయాలంటే రాజ్యాంగం ప్రకారమే చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఈద కృష్ణ, ఈద కాశి, ప్రభుదాస్, నరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు కు మరొక అవకాశం
నల్లగొండ: గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కోసం గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పట్టణ ప్రజలు ఉచిత కరెంట్ రానివారు, ప్రజాపాలన సైట్లో అప్లై చేయలేదని నమోదు అయినవారు, ఆన్లైన్లో ఎడిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కలిగించింది.

దీనికోసం నల్లగొండ పట్టణ ప్రజలు సంబంధిత కరెంట్ బిల్లు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నెంబర్ తో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో ఒక పేర్కొన్నారు.
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డి
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మర్రిగూడ మండలంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభివృద్ధి మార్గంలో దేశాన్ని నడిపించిన మహా నాయకుడని, రాజీవ్ గాంధీ యువతకు స్ఫూర్తి ప్రదాత అని వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య  మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, నరసింహారెడ్డి, జంగిలి రవి, గంట యాదయ్య, పి ఏ సి ఎస్ డైరెక్టర్ లింగయ్య., కొడాలి అల్వాల్ రెడ్డి, లవకుమార్, రేణుక వెంకన్న, జమ్ముల వెంకటేష్ గౌడ్, నందికొండ లింగారెడ్డి కోలుకుల పల్లి శంకర్, ఎలిమినేటి సత్తిరెడ్డి, మేతరి శంకర్, రాములు, పొనుగోటి శేఖర్, పగడాల అంజయ్య, పంతంగి సుధాకర్, పగడాల చిన్నయ్య, ఎడ్ల ముత్తయ్య, గ్యార యాదయ్య, సిల్వర్ వెంకటయ్య, వెంకటంపేట చంద్రయ్య, పగడాల యాదయ్య, గ్యార వెంకటేష్, 

సిరుపంగి శ్రీనివాస్, బిక్షమాచారి, సిలివేరి యాదయ్య, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను వెంటనే ఆమోదించాలని సంతకాల సేకరణ
నల్లగొండ జిల్లాలో నిత్యం కరువుకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.

సోమవారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో "సంతకాల సేకరణ" చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజులలో, 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి గొట్టిముక్కుల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్లు నింపి సాగునీరు అందించడం ద్వారా ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగిన కీలకమైన డి పి ఆర్ ను ఆమోదించకపోవడం, అట్లాగే సుమారు 27 కిలోమీటర్ల కాలువని తవ్వే పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీవ్రమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.

డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సిపిఎం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.

డిండి ఎత్తిపోతల పథకం సాధన కోసం కొనసాగింపుగా తక్షణమే సంతకాల సేకరణ అన్ని గ్రామాల్లో జరుగుతాయని మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు పోరాటం కొనసాగుతుందన్నారు.. కార్యక్రమంలో బుర్కల శేఖర్, బుర్కల నవీన్,శంకర్,నగేష్,జంగయ్య,మారయ్యతదితరులు పాల్గొన్నారు
మునుగోడు నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలని ఒక ప్రకటనలో తెలిపారు. అన్నా, చెల్లెళ్లు అక్కా, తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక  అయిన రాఖీ పండుగ ను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారత తో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.
మర్రిగూడ లో ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రములో ఆదివారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా, పలువురు గ్రామస్తులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత నాగిల్ల మారయ్య మాట్లాడుతూ.. గోల్కొండ కోటను  ఏలిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి, తురుష్కులను తరిమి కొట్టిన గొప్ప యుద్ద వీరుడు, గోల్కొండ ను స్వాధీనం చేసుకుని సాటి లేని యుద్ద నైపుణ్యాలతో ఔరంగజేబు కు తెలంగాణ దెబ్బ రుచి చూపించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, బహుజన రాజ్యాధికారం కోసం పోరాడి, దొరల అరాచకాలను మొగలాయి  దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు.. శ్రీ సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.