/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నైరుతి..తీరు మారింది Raghu ram reddy
నైరుతి..తీరు మారింది

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితి మాయమైంది. ఇది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రుతుపవనాల సీజన్‌లో ఆగస్టును అత్యంత కీలకమైన నెలగా పరిగణిస్తారు. ఖరీఫ్‌ పంటలకు దోహదం చేసేలా ముసురుపట్టి వర్షాలు కురవాలి. కానీ, ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం కలిగేలా వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

మిగులు వర్షపాతం నమోదైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండున్నర నెలల కాలాన్ని పరికించి చూస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని స్పష్టమవుతుంది. వర్షాలకు భూమి, ఆకాశం, సముద్రాలు సహకరించాలి. అంటే మూడింట మధ్య ఏర్పడే తేడాల ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ, ఈ మూడూ వేడెక్కడంతో సమతుల్యత తప్పింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో సగటున ప్రతి వారం ఒక అల్పపీడనం ఏర్పడాలి.

సీజన్‌ మొత్తం ఆరేడు వాయుగుండాలు రావాలి. కానీ, పది రోజులక్రితం భూమిపై అల్పపీడనం ఏర్పడగా, మళ్లీ శుక్రవారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. ఈ నెలలో గత 16 రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండడం ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపింది. వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకునే నైరుతి రుతుపవనాల తీరు మారిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆగస్టులో వేసవి ఛాయలు నెలకొన్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత ఉంటున్నాయి. అసలైతే ముసురు వాతావరణంతో ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోవాలి. కానీ, గత 16 రోజుల్లో రెండు, మూడు రోజుల తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నాలుగైదు రోజులు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదయ్యాయి. రానురాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తేడా మరింత ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది పంటలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. రోజుల తరబడి పొడి వాతావరణం నెలకొనడంతో పంటల ఎదుగుదల, మనుగడ ఇబ్బందిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.నైరుతి సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని 54 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 242 మండలాల్లో మిగులు వర్షాలు, 328 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

మొత్తం 670 మండలాల్లో 345.9 మి.మీ.కుగాను 403.9 మి.మీ(సాధారణం కంటే 16.7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో 10, శ్రీకాకుళంలో 7, ఒంగోలులో 6, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నాలుగేసి మండలాల్లో వర్షాభావం కొనసాగుతోంది.కొన్ని జిల్లాల్లో ఒకటి నుంచి మూడు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టులో గడచిన 16 రోజుల్లో మూడు రోజులు తప్ప మిగిలిన 13 రోజుల్లో సాధారణం కంటే 20 నుంచి 80 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లో సాఽధారణం కంటే చాలా ఎక్కువగా, మరికొన్నిచోట్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది.

కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. ఐఎండీ నివేదిక ప్రకారం గతవారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొంతమేర లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని, నైరుతి ప్రారంభ నెల జూన్‌లో ఎక్కువ రోజులు, అలాగే, ఆగస్టు తొలి పక్షంలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో వర్షాభావం నెలకొందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారుపండిన పంటను ఏడాదికి సరిపడేలా రైతులు ఇళ్లలో, గాదెల్లో భద్రపరుచుకుంటారు. ఇదే విఽధానం ఇప్పుడు నీటి నిల్వ కోసం అమలుచేయాల్సి అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే నాలుగు నెలల నైరుతి సీజన్‌లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య తగ్గుతోందని, ఒకవేళ కురిసినా భారీవర్షాలే తప్ప చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే తీరు ఇప్పుడు మాయమైందని పేర్కొన్నారు.

పడిన వర్షం నీటిని ఒడిసిపట్టి ప్రతి గ్రామంలో ఒకచోట నిల్వ చేసుకునేలా చెరువులు, కుంటల ఏర్పాటు తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, లేకపోతే నీటికి కటకట తప్పదని హెచ్చరించారు.

రుతుపవనాల సీజన్‌లో ఒక వారం వర్షాలు కురిస్తే, మరో వారం కొంత వరకు పొడి వాతావరణం ఉంటుంది. అంటే వర్షం పడిన తరువాత సముద్రంలో తిరిగి తేమ తయారీకి వారం పడుతుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. భూమి, సముద్రం, వాతావరణం మూడూ కూడా వేడెక్కిపోతున్నాయి. సాధారణంగా భూమి వేడెక్కినప్పుడు సముద్రం చల్లగా ఉంటే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ మూడు వేడెక్కడంతో పరిస్థితి భిన్నంగా తయారైంది.ఒకవేళ మేఘాలు ఆవరించినా అవి ముక్కలై ఒక వైపు భారీ వర్షం కురిస్తే మరోవైపు పొడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌లలో వరదలు సంభవించగా మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం లేదా అనావృష్టి కొనసాగుతోంది. చివరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు తక్కువగా ఏర్పడుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతోనే రుతుపవనాల కాలంలో అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి.

అడ్డంగా బుక్కైన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని కిరాణం, కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల షాపులో గుట్కాలు, మద్యం దొరకడంతో షాపును సీజ్ చేశారు. అయితే ఎండోమెంట్కమీషనర్కార్యాలయంలో రూ.20 వేల ఫైన్చెల్లిస్తే షాపు లైసెన్స్పునరుద్ధరిస్తామని ఆలయ భిక్షమాచారి చెప్పారు. అయితే జరిమానాతోపాటు మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాలని సాంబయ్యనుడిమాండ్‌ చేశాడు ఈవో భిక్షమాచారి.

దీంతో విసుగుచెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఆదివారం ఆలయ ఆవరణలో రూ.20 వేలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్షలు చేయగా.. నిందితుడి కుడి చేతి వేళ్లకు, లంచం డబ్బు దాచిన క్యాష్ కౌంటర్ డ్రాయర్‌లో కెమికల్ నమూనాలు ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిలో భాగంగా భిక్షామాచారి స్వగ్రామమైన మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.70 వేల నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం, కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ఏసీబీ సీఐ ఎస్‌ రాజు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ఎస్‌ రాజుతో పాటు ఏసీబీ సీఐ శ్యామ్సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.

సినిమాల్లో హీరో... బయట జీరో..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా పేరు సంయుక్త.. గత నెల నుంచి ఒక హీరోపై న్యూస్‌లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనిలో మేటర్ లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఏడాది కాలంగా అతను మా ఫ్రెండ్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏమో కానీ.. ఆ పిల్ల ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది.

ఎలా అంటే ఇద్దరూ ఒకటే బెడ్‌పై పడుకుంటారట.. అతను మాత్రం అటువైపు తిరిగి పడుకుంటాడట. అమ్మాయి చనవుగా దగ్గరకు వెళ్ళినా సరే ఆ మనిషి దూరంగా వెళతాడట.. ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదని నాతో చెప్పి ఏడుస్తుంది.. 27 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడా.. ఇప్పుడు 30 ఏళ్లు వచ్చాయి. అయినా పెళ్లి చేసుకోలే.. ఇంకో పది ఏళ్లు అయినా పెళ్లి చేసుకోడు.. ఎందుకంటే అతనిలో ఏం లేదు. సినిమాలు మాత్రం బానే చేసుకుంటాడు.. అంటే చూడడానికి బానే ఉంటాడు.. కానీ అతడిలో మేటర్ ఏమి లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో బయట మాత్రం జీరో‘‘.. త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా బయటపెడతానని సంయుక్త స్పష్టం చేశారు.

న్యాయం కోసం రక్షాబంధన్ సందర్భంగా వినూత్న నిరసన..

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని రెండు రోజుల క్రితం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో రీక్లైమ్ ది నైట్‌కు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి మహిళలు టార్చ్‌లు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు

ప్రస్తుతం రక్షా బంధన్ వేడుకను నిరసనలకు వేదికగా చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, వైద్య విద్యార్థులు నిర్ణయించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాలు తిలోతమ రాఖీ బంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కోల్ కతాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రక్షాబంధన్ వేడుక సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ రూపంలో నల్ల దారం కట్టి నిరసన తెలుపనున్నారు.

ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లోని జాయింట్ ఫోరమ్ ఆఫ్ డాక్టర్స్ పిలుపు మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు రక్షా బంధన్‌ను నిరసిస్తూ.. భారీ ఎత్తున మానవహారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా మానవహారం కార్యక్రమం నిర్వహించి అభయ హంతకులను శిక్షించాలని డిమాండ్ చేయాలని డాక్టర్స్ జాయింట్ ఫోరమ్ ప్రజలకు పిలుపునిచ్చింది.

పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా రక్షా బంధన్‌ను నిర్వహించాలని బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా నిర్ణయించింది. మహిళల భద్రత కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్రశాఖ కోర్టును ఆశ్రయించనుంది. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరంతర ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆగస్టు 20న రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు ఆగస్టు 21న నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 22వ తేదీన జరిగే నిరసనలో బిజెపికి చెందిన అన్ని విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా.. ఎక్కడంటే?

నగరంలో సంచలనం రేపుతున్న హైద్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ (ఆదివారం) నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు.

నగరంలో సంచలనం రేపుతున్న హైద్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ (ఆదివారం) నగర శివారు ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు.

నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ్ మండలం ఖానాపూర్‌లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు.

అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి బిగ్ అప్డేట్ - కీలక మలుపు..!!

అమరావతిలో కీలక అడుగు పడింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. తాజాగా ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం సమయంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. రాజదానిలో న్యాయ పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమించి మందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతికి రుణం అంశంలో ప్రపంచ బ్యాంకు నుంచి కీలక సమాచారం వచ్చింది.

అమరావతి వచ్చే వారం అత్యున్నతస్థాయి ప్రపంచ బ్యాంకు బృందం రానుంది.14 మంది సభ్యులతో కూడిన బృందం రానున్నట్లు సీఆర్‌డీఏకు సమాచాం ఇచ్చారు. అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది. దీంతో ఈ బృందానికి సవివర నివేదికలను అందించేందుకు వీలుగా సీఆర్‌డీఏ కమిషనర్‌ భాస్కర్‌ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఆర్‌డీఏ విభాగాలను సమీక్షిస్తున్నారు.

ఈ సమీక్షల్లో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌, ఎన్‌జీఓ, సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్‌ - 1, టైప్‌ - 2 భవనాలు, ఎల్‌పీఎస్‌ ఇన్ర్ఫా, ట్రంక్‌ ఇన్ర్ఫా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్ధం చేసేలా నిర్దేశించారు. దాదాపుగా ఆయా శాఖలు నివేదికలన్నీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అమరావతి రాజధాని ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను ఇంతకు ముందు వచ్చిన ప్రపంచ బ్యాంకు ఫోర్‌మెన్‌ బృందం రెండు రోజుల పాటు అమరావతిలో పర్యటించి ప్రాథమిక పరిశీలన జరిపింది.

ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యింది. అమరావతి ప్రణాళికల గురించి బృంద సభ్యులకు చంద్రబాబు వివరించారు. ఈ బృందం వెళ్లిపోయిన వెంటనే రుణాన్ని నిర్ణయించే కీలక బృందం రాకకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ కమిటీకి సీఆర్‌డీఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా సీఆర్‌డీఏ కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో సిద్ధం చేయిస్తోంది. అమరావతి రాజధానిలోని కీలక ప్రాజెక్టులకు లోన్‌ కాంపోనెంట్‌ ఎంతెంత ఇవ్వాలన్నది 14 మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది.

కాళేశ్వరంపై విచారణ స్పీడప్‌.. 2 వారాల పాటు నాన్‌స్టాప్‌ ఎంక్వైరీ..!

ఏం చేసినా ఈ నెలాఖరులోపే. కాళేశ్వరంలో అవినీతిపై అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించడానికి.. మిగిలింది ఇంకో రెండు వారాలే. బహుశా ఈ వారంలో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయంటున్నారు. కీలక వ్యక్తులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు

ఏం చేసినా ఈ నెలాఖరులోపే. కాళేశ్వరంలో అవినీతిపై అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించడానికి.. మిగిలింది ఇంకో రెండు వారాలే. బహుశా ఈ వారంలో కొన్ని సంచలనాలు కూడా ఉంటాయంటున్నారు. కీలక వ్యక్తులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు వెళ్తాయంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుందో.. వారికి కూడా సమన్లు వెళ్తాయా? వాళ్లు విచారణకు హాజరవుతారా

కాళేశ్వరం లిఫ్టుల్లో ఏమేం అక్రమాలు జరిగాయ్.. ఎంత అవినీతి జరిగింది.. నాణ్యతా లోపాలకు కారణాలేంటి, కారకులెవరు? వీటిని తేల్చేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే, కాళేశ్వరంలోని వివిధ బ్యారేజీలను కమిషన్ స్వయంగా పరిశీలించింది వచ్చింది. ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన ఇంజనీర్లను విచారించి.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణలో భాగంగా అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు సమన్లు జారీ చేసింది. అయితే.. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుండడంతో.. ఆలోపే విచారణను ముగించేయాలనుకుంటోంది కమిషన్. ఎంక్వైరీని స్పీడప్‌ చేయాలనే ఉద్దేశంతో శుక్రవారమే హైదరాబాద్ వచ్చిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్.. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాష్‌ను విచారించారు.

తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టాలనే ఆలోచన మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర ఒప్పుకోలేదని కమిషన్‌కు వివరించారు వి.ప్రకాష్. సరిపడినంత స్టోరేజీ లేకపోవడం వల్లే తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదని కమిషన్‌కు స్పష్టం చేశారు. పైగా సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164 టీఎంసీల్లో 64 టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉందన్న విషయాన్ని కూడా కమిషన్‌కు గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత 54 టీఎంసీలే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించానన్నారు వి.ప్రకాష్. తెలంగాణ భవిషత్ కోసం తుమ్మిడిహట్టితో పాటు అన్ని ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్‌ రీ-డిజైన్ చేశారని కమిషన్‌ ముందు చెప్పానన్నారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మరోసారి కమిషన్ ముందు హాజరవుతానన్నారు.

ఈ నెలాఖరులోగా రిపోర్ట్ సమర్పించేందుకు రెడీ అవుతోంది కమిషన్. అంతకంటే ముందు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు ప్రజాప్రతినిధుల పాత్రపై కమిషన్‌కు అనుమానాలున్నాయి. అనుమానాల నివృత్తి కోసం.. కొందరు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలనుకుంటోంది కమిషన్. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ విషయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను విచారించిన కమిషన్.. వాళ్ల నుంచి ఇప్పటికి 50కిపైగా అఫిడవిట్లు రాబట్టింది. కానీ ఇంతవరకూ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మాత్రం అఫిడవిట్ సమర్పించలేదు. ఆయనతోపాటు స్పందించని మరికొందరు అధికారులకు రేపోమాపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై నివేదిక ఇవ్వాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ చైర్మన్‌ను కోరింది. వాళ్లు కూడా రిపోర్ట్ సబ్‌మిట్‌ చేయకపోవడంతో నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అఫిడవిట్లు సమర్పించిన అధికారులను సైతం మరోసారి పిలిపించి.. క్రాస్ ఎగ్జామిన్‌ చేయనుంది కమిషన్‌. మొత్తంగా ఈ నెలాఖరు నాటికి కాళేశ్వరంపై విచారణను ముగించే లక్ష్యంతో పనిచేస్తోంది.

మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది.

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై 2008లో నమోదైన కేసును కొట్టేయరాదని విజ్ఞప్తి చేసింది. అందువల్ల 2011లో మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని నివేదించింది. మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని పేర్కొంటూ 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఈ కేసును కొట్టేయాలని మార్గదర్శి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో ఉమ్మడి ఏపీ హైకోర్టు రెండుగా విడిపోవడానికి చివరిరోజు అయిన డిసెంబర్‌ 31 రోజున మార్గదర్శికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మార్గదర్శికి వ్యతిరేకంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోపాటు డిపాజిట్లను పూర్తిగా తిరిగి ఇచ్చినందున కేసును కొట్టివేసింది. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఆర్బీఐ సహా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరుల వాదనలు తాజాగా వినాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.

జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పుడు క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించే అవకాశం ఉండదని అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ద్వారా స్పష్టమైందని తెలిపింది. అందువల్ల మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. ఈ పిటిషన్‌ ఈనెల 20న మరోసారి విచారణకు రానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..

కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు నగరంలోనే మకాం వేయనున్నారు. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ ఎదుట హాజరై పలు అంశాలపై వివరణ ఇచ్చారు

కమిషన్ విచారణ అనంతరం బయటకు వచ్చిన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.."కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చాను. తెలంగాణ భవిషత్ కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ మదిలో ఉండేది. కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. స్టోరేజీ లేకపోవడం వల్ల తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదు. సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164టీఎంసీల్లో 64టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉంది.

వార్ధా నది బ్యారేజీ రూ.2,500కోట్లతో నిర్మాణం అవుతుంది.. తుమ్మిడిహట్టికి రూ.7,500ఖర్చు అవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశాం. 'వి' ఆకారంలో బ్యారేజీ కట్టడం సాధ్యం కాదు కాబట్టే కట్టలేదు. తుమ్మిడిహట్టి వద్ద 54టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించాను. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు. నేను కమిషన్ ముందు చెప్పిన వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అన్నారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతా" అని చెప్పారు.

సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా.. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్ట్ కానున్నారా. ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముడా కుంభకోణంలో సీఎంపై, సీఎం కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి చట్టం కింద సీఎంపై విచారణకు.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఏం జరుగుతోందని ఆసక్తి నెలకొంది.

కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై కర్ణాటక మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది.

అయితే కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం.. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేయడంతో కర్ణాటకలో తీవ్ర చర్చకు దారి తీసింది. భారత్ నాగరిక్ సురక్ష సంహితలోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు.

ఇక తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని.. హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఇక ఇదే వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు సమాచారం.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కుంభకోణం విషయంలో.. ముగ్గురు వ్యక్తులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను స్వీకరించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సీఎంపై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు రాజ్‌భవన్ ఒక లేఖను విడుదల చేసింది. కాగా ముడాకు సంబంధించి 14 ఇళ్ల స్థలాలను సీఎం సిద్ధరామయ్య తన భార్యకు కేటాయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.