/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే Mane Praveen
గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చందంపేట  పీ ఏ సి ఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి లు శుక్రవారం డా. బుర్రి వెంకన్నను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను దళిత రత్న బుర్రి వెంకన్న రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని నేడు ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం.. ఆయన మన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ వాసి కావడం సంతోషకరమని అన్నారు.     

డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగ ఫలాలు, హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటాలు నిర్వహించినందుకు, నాకు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన గౌరవ డాక్టరేట్ ను తన వెన్నంటూ ఉండి సంపూర్ణ సహకారం అందించిన తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, డివిజన్ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, పీఏ పల్లి మండల అధ్యక్షులు జిల్లా రాములు, కొండమల్లేపల్లి మండల ఉపాధ్యక్షులు చేపూరి రాజేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, మామిడి చెట్టు యాదగిరి. టీజీ ఎంఆర్పిఎస్ మల్లేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, కడారి రాజు, ఖండేలా వెంకన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: కప్ప కాముడు నిర్వహించిన లెంకలపల్లి గ్రామస్తులు

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఇవాళ వరుణ దేవుని ప్రార్థిస్తూ కప్ప కాముడు ఆటలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రాయికి నీళ్ళు పోసి సమృద్ధిగా వర్షాలు కురవాలని పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా సరిగ్గా వర్షాలు లేవని దీంతో పత్తి చేలు ఎండిపోతున్నాయని, వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతామని, వర్షాలు సమృద్ధిగా పడాలని బొడ్రాయికి పూజలు నిర్వహించామని తెలిపారు.

యరగండ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్లగొండ జిల్లా, మారిగూడ మండలం (ఆగష్టు 15, స్ట్రీట్ బజ్ న్యూస్): 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

స్కూల్  హెడ్మాస్టర్ మాలతి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ పోరాట నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ కు యువ చైతన్య యూత్ కమిటీ సభ్యులు సౌండ్ బాక్స్ లు ఇవ్వడం జరిగింది. యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్కూల్లో ఉన్న స్టూడెంట్ కు ఏమైనా అవసరం ఉంటే మేము ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.తదనంతరం యూత్ కమిటీ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు ను అందుకున్న నవీన్ కుమార్
నల్గొండలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఇంటింటా ఇన్నోవేటర్- ఇంటికి ఒక శాస్త్రవేత్త  ప్రాజెక్టు, "తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం" లో బొమ్మలరామారం మోడల్ స్కూల్ కెమిస్ట్రీ లెక్చరర్ కోట నవీన్ కుమార్ ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా "డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు" ను అందుకున్నారు. ఈ సందర్భంగా రావులపెంట గ్రామానికి నవీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా  పిచికారి చేయడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని, పండిన పంట మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ ల ధర ఎక్కువగా ఉంటుందని, అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నానని  తెలిపారు. రావులపెంట గ్రామస్తులు, మరియు మోడల్ స్కూల్ అధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం పట్ల ఆయనను అభినందించారు
బహుజన సంఘాల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం
నల్లగొండ జిల్లా:
దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న పూలమాల వేశారు. తదంతరం వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర నాయకులు గుద్దేటి సైదులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి  ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి కంబాలపల్లి వెంకటయ్య, నియోజకవర్గ కన్వీనర్ సహదేవుడు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని ఎందరో స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం సాధించుకున్నటువంటి మన భారతదేశంలో ఇంకా అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయిలో  రాజ్యాంగ  ఫలాలు దక్కుతలేవని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, చింతపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంధ్య, ఏసు వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు చారి, వస్కుల నాగరాజు, చాట్ల చందర్, యాదగిరి, మాతంగి జాన్, పెరిక వెంకన్న, బీసీ సంఘం నాయకులు భాస్కరాచారి, ఎర్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జెండా వందనం అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణను, జాతీయతాభావాన్ని పెంపొందించుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ బొట్టుగూడ హైస్కూలుకు గతంలో క్రీడల్లో ఘనమైన రికార్డు ఉందని దాన్ని కొనసాగించాలంటే విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో విద్యాభ్యాసం కొనసాగాలని సూచిస్తూ స్వాతంత్ర త్యాగాలను గుర్తుచేసే స్లొగన్స్ ను విద్యార్థుల చేత ఇప్పించారు.
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఇవాళ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్న ప్రజా ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం లో స్వీట్లు పంచుకొని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ నాంపల్లి అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య,PACs డైరెక్టర్ బాయికడి కొండల్, అజ్జిలాపురం ఉప్పునుతులమల్లయ్య,ఎలిమినేటి సత్తి రెడ్డి,పగడాల లింగయ్య,మాజీ ఎంపీటీసీ వెంకటపేట బాలయ్య,ఏర్పుల శ్రీశైలం, కొడాల ఆల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్,అశోక్ రెడ్డి,ఐతపాక జంగయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు మహ్మద్ ఖధీర్, సలవోజు బిక్షమాచారి,నందికొండ లింగారెడ్డి, చాపల రవి, పెంబళ్ల గిరి,పగడాల యాదయ్య,బేత వెంకటేష్,బడేటి వెంకటేష్, జమ్ముల వెంకటేష్, వల్లపు భాస్కర్, రావుల రాములు, గ్యార వెంకటేష్,సిరపంగి శ్రీను,ఉడుతల లవకుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

NLG: చర్లపల్లి లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నల్లగొండ మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి గ్రామంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకుడు బొజ్జ ముత్తయ్య చే జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రాపోల్ విద్యాసాగర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి బద్దం నాగేష్, బిజెపి సీనియర్ నాయకుడు రాపోలు యాదగిరి, కటకం శ్రీధర్, ఏర్పుల గణేష్, రాపోల్ భాస్కర్, రాపోలు నరేష్, రాపోలు సాగర్,  మామిడి శ్రవణ్, జి నాగేష్ గౌడ్,  టంగుటూరు రాజు, బద్దం నాగరాజ్,  సిహెచ్ రామకృష్ణ, ఇసరం ఎల్లయ్య, బిపంగి అంజయ్య, బిక్షం చిన్న ఎల్లయ్య, భారీ రాములు, రాపోలు పరమేశం, కొడదల వెంకన్న, మల్లయ్య, టంగుటూరి భాస్కర్, మేడి లక్ష్మయ్య, బిజెపి కార్యకర్తలు, నాయకులు, మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు.
అనంతరం స్వీట్స్ అరటిపండ్లు పంపిణీ చేశారు.
మునుగోడు ను ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి సమీక్షలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి సమీక్షలు చేస్తున్నారు. నిన్న మర్రిగూడెం, ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, విద్య, వైద్యంపై ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
TG: హెడ్‌ కానిస్టేబుల్ చదువు యాదయ్య ను అభినందించి సన్మానించిన డీజీపీ
HYD: మాదాపూర్ సీసీఎస్ హెడ్‌ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపిక అయ్యారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక నేరస్తున్ని పట్టుకునే ప్రయత్నంలో ఏడుసార్లు కత్తి పోట్లకు గురైనా వెరవకుండా, రక్తమోడుతున్నా.. ఆ దొంగను విడవకుండా హెడ్‌ కానిస్టేబుల్ యాదయ్య విధినిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచి తెలంగాణకు గర్వకారణమైనారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి డా.జితేందర్ ఐపీఎస్ ఇవాళ యదయ్య ను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.