/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించాలి Mane Praveen
NLG: డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించాలి
మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ కార్యాలయంలో దామెర లక్ష్మీ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చాలా పీడిత ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించి, డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించి, సాగునీరు అందించే వరకు పోరాటాలు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.

2016లో జీవో ఎంఎస్ నెంబర్ 107 ద్వారా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీరు జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టముక్కల చింతపల్లి లక్ష్మణాపురం శివన్న గూడెం రిజర్వాయర్ నింపి సాగునీరు అందించడం ద్వారా, ఈ మునుగోడు దేవరకొండ ప్రాంతాలను వ్యవసాయ రంగానికి నీరు అందించి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వ నిర్ణయించినప్పటికీ రిజర్వాయర్లకు సంబంధించిన పనులు కొంతమేరకు జరిగినా కీలకమైన డిపిఆర్ను ఆమోదించకపోవడం, అట్లాగే సుమారు 27 కిలోమీటర్లు కాలువను తవ్వి పనులను సంబంధించిన పర్యావరణ అనుమతుల కోసం లేఖలు రాయకపోవడం ద్వారా ఆ ప్రభుత్వం తీరమైన తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు.

డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ఆమోదింపజేసి అధిక నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ రిజర్వాయర్లకు కాలువలు పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు కాగు లింగయ్య కాగు ఎల్లయ్య బొల్లంపల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు
మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసి బస్సులు నడిపించాలి: ఎమ్మెల్యే
హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను,  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

మునుగోడు లోని వివిధ మండల అధ్యక్షులు, ముఖ్య నేతల తో కలిసి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆర్టీసి, బీసీ సంక్షేమ శాఖ కు సంబంధించిన పలు  సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసి బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే కోరారు.

నియోజకవర్గానికి కొత్త బస్సులు మంజూరు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్ పనులు అప్ గ్రేడ్ చేసి, శానిటేషన్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దాంతో పాటు మునుగోడు నియోజకవర్గం లోని నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు నూతన బస్ షెల్టర్ ల నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన వినతుల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
LS కార్ప్ సంస్థతో సమావేశమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొరియా పర్యటన సోమవారం ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన -  LS కార్ప్‌తో తెలంగాణలో పెట్టుబడులు పెట్టుటకు వారిని ఆహ్వానిస్తూ సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు మరియు అధికారులు, LS గ్రూప్ చైర్మన్  కూ జా యున్ మరియు అతని సీనియర్ నాయకత్వాన్ని కలిసి..
ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, మరియు బ్యాటరీల కోసం తెలంగాణలో తయారీ, పెట్టుబడులతో సహా విస్తృత ప్రయోజనాలపై మాట్లాడారు.

LS బృందం త్వరలో తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించనున్నట్లు, రాబోయే రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టుటకు వారిని తాము లాంఛనంగా స్వాగతిస్తున్నామని  సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
NLG: కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి: కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి


నల్లగొండ జిల్లా:

దేవరకొండ, మునుగోడు పరిధిలో నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం, డిండి లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రజల తరఫున, భూ నిర్వాసితుల తరఫున ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.

మునుగోడు: యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అభ్యర్థి మేకల ప్రమోద్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అభ్యర్థి అబ్బనబోయిన రామ్ యాదవ్ ఆధ్వర్యంలో, శుక్రవారం మునుగోడులో యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో  మర్రిగూడ మండలం యువజన కాంగ్రెస్ అభ్యర్థి ఉడతల లవకుమార్ గౌడ్, మర్రిగూడ యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్ మరియు మునుగోడు యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలి: బూడిద సురేష్
ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మర్రిగూడ మండల కార్యాలయంలో సిపిఐ మండల పార్టీ సహాయ కార్యదర్శి బూడిద సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందక మండల కేంద్రంలో పేద విద్యార్థులు పై చదువులు చదవలేక పోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, మర్రిగూడ మండల పరిసర ప్రాంతాల విద్యార్థుల జీవితాల్లో మార్పులు జరగడం లేదని చదువు కుంటే చదువు రావడం లేదు 
చదువు కొనుక్కుంటే దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య AISF - AIYF ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఐటిఐ కాలేజీలు నిర్మించాలని అనేకమార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా.. ప్రభుత్వం మరియు అధికారులు పట్టించుకోలేదు, వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోవడానికి  విద్యార్థులు బస్సు సౌకర్యాలు లేక ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ప్రైవేటు కళాశాలలో చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతూ వారు  చదువులను కొనసాగిస్తున్నారు. కావున ఈ ప్రాంతం సమస్యల పైన స్థానిక ఎమ్మెల్యే కు పూర్తి అవగాహన  ఉన్నందున ఇప్పటికైనా ప్రభుత్వం నుండి కళాశాలలు మంజూరు చేయించి నిర్మించే విధంగా చూడాలని కోరారు.

ఈ సమావేశంలో  సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కొనిరెడ్డి గిరి, AISF మండల కార్యదర్శి ఇస్కీళ్ల మహేందర్, AIYF మండల సహాయ కార్యదర్శి సిరిపంగి శ్రీనివాస్, AIYF మండల నాయకులు పున్నం సుభాష్ పాల్గొన్నారు.
మర్రిగూడ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలు

నల్లగొండ జిల్లా: ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి మేడమ్ పుట్టిన రోజు సందర్భంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ, కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ లు నున్సావత్ బిచ్చునాయక్, పాక నగేష్, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, ఉప్పునుతుల ఈశ్వర్, ఇబ్రహీం, ముద్దం శ్రీనివాస్, చామకూరి అబ్బయ్య, వడ్త్యా యాదగిరి, ఆకారపు శ్రీను, గొడ్డేటి వెంకటేష్, రమావత్ శ్రీను, కుక్కడపు ముత్యాలు, ఉడుతల లవకుమార్, గ్యార వెంకటేష్, నందికొండ లింగారెడ్డి, జింకల కొండల్, పొనుగోటి శేఖర్, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: డిండి ఎత్తిపోతల పథకం పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి: నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా:
మునుగోడు: కరువు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు నిర్ణీత కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మునుగోడు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సత్యం పాల్గొని మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అప్పటి  ప్రభుత్వం మహాబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలోని సుమారు 3.61 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు 2015లో జి.వో. 107  విడుదల చేసినప్పటికి  గత ప్రభుత్వం డిటైల్స్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్‌) ను ఆమోదించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకరాలేకపోవడంతో జాప్యం జరిగి  ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉన్నదన్నారు.

ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై గత ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందని, ఈ ప్రభుత్వమైనా నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ 300 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ డిపిఆర్‌ అమోదం, పర్యావరణ అనుమతులు తీసుకొని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిదంగా నల్లగొండ జిల్లాలో సుమారు 3.20 వేల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు సాగునీరు ఇచ్చే శ్రీశైలం సొరంగం పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. 19 ఏండ్ల క్రితం రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు నేటికి రూ.4658 కోట్ల అంచనా వ్యయానికి చేరింది. 9.5 కి.మీ. సొరంగం త్రవ్వాల్సి ఉన్నప్పటికీ  గత ప్రభుత్వం 10 ఎండ్లలో అరకొర నిధులు కేటాయించడం వలన సొరంగం పనుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఎంతమాత్రం ముందుకు సాగ లేదన్నారు. దాంతో లిప్టు వల్ల మాత్రమే ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, హైద్రాబాద్‌ త్రాగునీటికి సగం నీరు, సగం నీరు మాత్రమే సేద్యానికి ఉపయోగించడం వలన ఆయకట్టుకు నీరు అందటం లేదు. సొరంగం పూర్తయితే మాత్రమే సాగు, తాగు నీరు అందుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులు చెప్పిన విధంగా 30 నెలలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు  పూర్తి చేయాలన్నారు.  సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బలుగూరి నరసింహ గురిజా రామచంద్రం, టి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శీను సహాయ కార్యదర్శులు బండమీది యాదయ్య,మందుల పాండు, మాజి జడ్పీటిసి గోసుకొండ లింగయ్య,  కార్యవర్గ సభ్యులు వనం వెంకన్న ఊపునుతుల రమేష్, ఈదులకంటి కైలాష్,మాదగోని సత్తమ్మ, కాగితం వెంకన్న మునుగోడు దయాకర్  బి లాలు దుబ్బ వెంకన్న, ఎం డి జానీ,యువజన సంఘం కార్యదర్శి బండారు శంకర్, తదితరులు  పాల్గొన్నారు.
గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మె చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సిబ్బందిని అందరిని పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు అమలు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,కార్మికులకు వేతనాల్లో ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలని పిఆర్సి లో అర్హులుగా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గ్రామాల్లో వర్షాకాలంలో మురికి కాల్వలను రోడ్లను శుభ్రం చేసే కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదని ఆయన అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గల్లి గల్లి వాడ వాడ లలో శుభ్రం పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సహజ మరణానికి ఐదు లక్షల ఇవ్వాలి విధి నిర్వహణలో మరణించిన కార్మికులకు 10 లక్షల ఎక్స్ గ్రెసియా ఇవ్వాలని, జీవో నెంబర్ 51 సవరించాలని, కార్మికులకు దుస్తులు చెప్పులు సబ్బులు బ్లౌజులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరు పక్క లింగయ్య, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, ఒంపు ముత్తమ్మ, సిలువేరు మహేష్, మైలారం నరసింహ, ఐతపాక పద్మ, ఎడ్ల నరసింహ, ఆవుల ముత్తయ్య, పోతురాజు కృష్ణయ్య, ఎడ్ల రమణ గ్యార దుర్గమ్మ, ఊరు పక్క వెంకటయ్య, గ్యార యాదగిరి, లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డల్లాస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి మహాత్ముడి కి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మహాత్ముడి కి నివాళులర్పించారు.