/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ Mane Praveen
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో  మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్  పంపిణి చేశారు.

యరగండ్లపల్లి గ్రామానికి చెందిన పోలగోని యాదయ్య తండ్రి మారయ్య  కు రూ. 48,000/-, పోలగోని ప్రసాద్ తండ్రి సత్యనారాయణ రూ.18000/-,గొడ్డేటి వెంకటయ్య తండ్రి మారయ్య రూ.36000/-, దంటు లక్ష్మమ్మ భర్త దంటు శేఖర్ రూ. 31000/-, ముద్దం వెంకటయ్య తండ్రి రామస్వామి రూ.42000/, ఇరగోని శ్రీను తండ్రి ముత్యాలు రూ. 21000/-  విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు.                                            
ఈ సందర్భంగా రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, మాడెం జంగయ్య, జమ్ముల వెంకటేష్, సిలువేరు యాదయ్య, ఆకారపు శ్రీను, గ్యార వెంకటేష్, పోలె చిన్నపెద్దయ్య, దండేటికారి నాగార్జున్, మడెం శంకర్, వనపర్తి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: లెంకలపల్లి లో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ 1 లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ అయితగోని అండాలు మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు (ముర్రుపాలు) గంట లోపు పట్టించడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండి, బిడ్డ ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తుందని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి గోపీనాథ్, టీబి నోడల్ అధికారి ప్రేమ్ కుమార్, ఎస్ టి ఎస్ సైదులు, ఏఎన్ఎంలు స్వర్ణలత, జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నాంపల్లి: AEE ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు సన్మానం
నల్గొండ జిల్లా:
నాంపల్లి: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో AEE ఉద్యోగాలకు ఎంపికైన యువకులను సన్మానించారు. ఈరోజు నాంపల్లి మండల కేంద్రం జడ్.పి.హెచ్.యస్ హైస్కూల్లో AEE ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ఆకులపల్లి సుధాకర్, బొంత శ్రీను, కన్యబోయిన గోపాలకృష్ణ, జక్కుల రమేష్ ను సన్మానించిన ఎంపీడీవో స్వర్ణ కుమారి మరియు హెచ్ఎం అజయ్ కుమార్.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. కష్టపడి చదివి వీరిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త శ్రీహరి,స్వేరో నాయకులు మధు, రాంబాబు,టీచర్లు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
NLG: బాధిత కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఏ ఆర్ కే మిత్రమండలి
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో గుండె నాగయ్య నిన్న అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏ ఆర్ కే మిత్ర మండలి, ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కొరకు 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అరుణ రామకృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్ యర్రమాద యాదమ్మ రత్నారెడ్డి, వల్లపు ఇంద్రసేనారెడ్డి, వల్లపు కర్ణాకర్ రెడ్డి, తంతనపల్లి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ను సందర్శించిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ

రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సిసిఎల్ఏ నవీన్ మిట్టల్, నేడు నాగార్జునసాగర్ డ్యామ్ ను సందర్శించారు. డ్యాం క్రస్ట్ గేట్ల నుండి విడుదలవుతున్న నీరును, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఆయన వెంట జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ రాష్ట్ర సభ్యుడు భూమి సునీల్ కుమార్, డీఎఫ్ఓ రాజశేఖర్ తదితరులు ఉన్నారు

ఎంపీడీవో కు సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో, బుధవారం స్థానిక ఎంపీడీవో కు సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామపంచాయతీలో ప్రభుత్వం లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, పంచాయతీ సిబ్బంది అందరిని పర్మనెంట్ చేసి కనీస వేతనం చెల్లించాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పిఆర్సి పరిధిలోనికి గ్రామపంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని,జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని పాత కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలని, విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.

ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులతో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షల ఇవ్వాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాడ్యుయేట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శి ఊరు పక్క లింగయ్య, పోలేపల్లి రాములు, శిలువేరు మహేష్, వంపు ముత్తమ్మ, ఐతపాక పద్మ పాల్గొన్నారు
NLG: తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష: అంగన్వాడీ టీచర్ చాపల పద్మ
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈ రోజు అంగన్వాడీ కేంద్రం - 2 నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన గంట లోపు బిడ్డకు తల్లి పాలు(ముర్రుపాలు) పట్టించాలని, అటువంటి ముర్రుపాలు బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని, మొదటి టీకా గా పనిచేస్తుందని, అదేవిధంగా తల్లి ని రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని తెలిపారు. 

ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు తప్ప వేరే ఇతర ఏ పానీయాలు ఇవ్వకూడదని, తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష అని.. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి గోపీనాథ్, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, ఏఎన్ఎం లు స్వర్ణలత, జ్యోతి, ఆశాలు సైదాబీ, పద్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
దామర భీమనపల్లి: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మాజీ సర్పంచ్
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం,
దామేర భీమన పల్లి  గ్రామానికి చెందిన మునగాల వెంకట్ రెడ్డి రూ 60000, నీల అంజమ్మ రూ.30000, చెక్క రమణ రూ.7000, కర్నాటి శివ రూ.12000, ఒంటెద్దు యాదమ్మ రూ. 23000 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయ్యాయి.

ఈ చెక్కులను  గ్రామ మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం బాధితులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వస్పర్ శ్రీశైలం, గొట్టేటి నరసింహ, మలిగిరెడ్డి వెంకటరెడ్డి, ఐతరాజు పాపయ్య, కర్నాటి కృష్ణయ్య, చిలువేరు నరేష్, కర్నాటి యాదయ్య, చెక్క సురేష్, జిల్లా శంకర్, తదితరులు పాల్గొన్నారు
కోదాడ: 21 వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3 వ రోజు కోదాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు హుజూర్ నగర్ రోడ్డు లో నీటి ప్రవాహము సక్రమంగా జరుగుటకు మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, వైస్ చైర్మన్, కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్, జి. రమేష్, మేనేజర్, పి.యాదగిరి, సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ దీపక్
నల్లగొండ జిల్లా:
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ దీపక్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం ఆరోగ్య సిబ్బందితో డాక్టర్ దీపక్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఇంటింట చేపడుతున్న ఫీవర్ సర్వే తో పాటు లార్వా సర్వే కూడా చేపట్టాలని, దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అందుకు లార్వా సర్వే ప్రతిరోజు 20 ఇండ్లలో చేపట్టి అన్ని ఇండ్లలో సర్వే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

కలుషిత నీరు నిల్వ నీరు ఉండకుండా దోమల వ్యాప్తి జరగకుండా, లార్వా సర్వే ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాప్తి  చెందుతాయని దోమల నివారణకు తగు చర్యలు చేపట్టాలన్నారు.

మర్రిగూడ మండలంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్య బాధితులు హాస్పిటల్ ను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని కోరారు.