/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: సాగర్ ప్రస్తుత నీటిమట్టం 544. 60 అడుగులు Mane Praveen
NLG: సాగర్ ప్రస్తుత నీటిమట్టం 544. 60 అడుగులు
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. ఇవాళ ఉదయం  అందిన సమాచారం ప్రకారం
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 544. 60 అడుగులు ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలకు గాను 198. 0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో 3, 27, 969 క్యూసెక్కులు రాగా, ఔట్ ఫ్లో 30, 747 క్యూసెక్కు లుగా నమోదయింది.
TG: స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
TG: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఈ నెల 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న మౌళిక  సమస్యలను పరిష్కరించాలన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడమే కాకుండా అవి మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.

కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ శాఖ కమిషనర్ వీపీ గౌతమ్, అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి: కెవిపిఎస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం:
కుల వివక్ష వ్యతిరేక  పోరాట సంఘం (KVPS ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడెం మండల కేంద్రంలో ఎస్టీ,ఎస్సీ బాలుర హాస్టల్ కెవిపిఎస్ మునుగోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా KVPS జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ఎస్టీ హాస్టల్ కు ప్రహరి గోడ నిర్మాణం చేయాలి, ఎస్సీ హాస్టల్ కు సొంత భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల వలయంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని, తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కెవిపిఎస్ తరపున  డిమాండ్ చేశారు. ప్రస్తుతం అద్దె భవనం ఉంటున్న ఎస్సీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు సరైన రీతిలో లేవు.ఎస్టీ హాస్టల్లో ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు.

తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని  ప్రభుత్వం డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాణావత్ దేవా, మిట్టపల్లి ఆనంద, పర్వతం కిరణ్ కుమార్, సైదులు, నరసింహ, యాకోబు, యాదయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.

       
RR: నేడు మీర్ ఖాన్ పేటకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఈ రోజు గురువారం సాయంత్రం 4:00 గంటలకు రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం, మీర్ ఖాన్ పేట గ్రామం లో..  రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం  మొట్టమొదటగా "*స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ"* కి  శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మహేశ్వlరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, పీసీసీ మెంబర్ మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవ భాస్కర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
AITUC నాయకుల అరెస్టు చేయడం అప్రజాస్వామికం: జిల్లా ప్రధాన కార్యదర్శి
నల్గొండ: సివిల్ సప్లై హమాలీ , మధ్యాహ్న భోజనం, ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ, చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్మికులను జిల్లా వ్యాప్తంగా  ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సివిల్ సప్లై, మధ్యాహ్న భోజనం, ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమానికి AITUC పిలుపునివ్వడం జరిగింది.
హైదరాబాద్ వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కార్మికులను అరెస్ట్ చేయడం జరిగింది. నల్గొండలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తో పాటు కార్మికులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబించి ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని అన్నారు. సమస్యలు పరిష్కరించామంటే అరెస్టులతో నిర్బంధించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని రెచ్చగొట్టే చర్యలు తప్ప మరోటి కాదని  పేర్కొన్నారు.
సివిల్ సప్లై హామాలి కార్మికుల వేతన కాలం డిసెంబర్ 2023 తో ముగిసి ఏడు నెలలు అయిన వేతనాలు పెంచమని సివిల్ సప్లై హమాలీ కార్మికులు కోరుతున్న వేతనాలు పెంచకుండా జాప్యం చేస్తుందనీ ఆరోపించారు.

అధికారులు ఎన్ని సార్లు అడిగినా కబుర్లతో కాలయాపన చేస్తున్నారు తప్ప హమాలి రేట్లు పెంచడం లేదని విమర్శించారు . మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతామని గత ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందని మరియు ట్రాన్స్పోర్ట్ రంగ  కార్మికులను ఆదుకుంటామని చెప్పారని గుర్తు చేశారు.

అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరని కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో AITUC డివిజన్ కార్యదర్శి వి. లెనిన్, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, యాదయ్య, వెంకటయ్య, లక్ష్మయ్య, శ్రీను, రవి, నాగరాజు తదితరులు  పాల్గొన్నారు.
NLG: మహిళా మోర్చా నాయకురాల ముందస్తు అరెస్ట్
నల్లగొండ:  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు, అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నల్లగొండ మహిళా మోర్చా నాయకురాలను బుధవారం వన్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ముందస్తు అరెస్టును ఖండిస్తున్నట్లు మహిళా మోర్చా నాయకురాలు తెలిపారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు  రావిరాల కాశమ్మ, దాసోజు అరుణ లను అరెస్ట్ చేశారు.

నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లా గా మార్చడమే లక్ష్యమని, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో వారు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో గంజాయి టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని.. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఏఎస్పి రాములు నాయక్ తదితరులు ఉన్నారు.
NLG: ఉన్నత విద్య -పరిశోధన విధానం పై పుస్తకావిష్కరణ
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల లో "ఉన్నత విద్య -పరిశోధన విధానం" పై పుస్తకావిష్కరణ కళాశాల గ్రంథాలయ సమాచార కేంద్రం, గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ రచించిన పుస్తకాలు పరిశోధన విధానం, మరియు ఉన్నత విద్యలో ఎలక్ట్రానిక్ సమాచార వనరులు పై పుస్తకాలు రచించి ప్రచురించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తక రచయిత డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్, కళాశాల గ్రంథపాలకులు మాట్లాడుతూ.. పరిశోధన విధానం పుస్తకం విద్యార్థులకు పరిశోధన, వివిధ రంగాలలో నూతన మార్పులు- సమస్యలకు పరిశోధన ఎలా చేయాలనేటువంటి అంశాలపై పూర్తిగా సమాచారం ఈ రీసెర్చ్ మెథడాలజీ అనే పుస్తకంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్క భారతీయుడు కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇంటర్నెట్లో ఉచితంగా సమాచారాన్ని ఎలా వెతకాల్లో, ఏవిధంగా ఉపయోగించుకోవాలో వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ బుక్స్,ఎలక్ట్రానిక్ జర్నల్స్ సమాచార వనరులు ముఖ్యంగా ఉన్నత విద్యలో సాహిత్యం, సాంకేతికత, పరిశోధన వ్యాసాలపై సమాచారము ఈ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-పరిశోధన విధానం అనే పుస్తకాలలో విపులంగా సమాచారం అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్.కృష్ణ కౌండిన్య, డాక్టర్ దీపిక, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ యాదగిరి, డాక్టర్ యాదగిరిరెడ్డి, యాదగిరిరావు, నాగిరెడ్డి, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ నారాయణ రావు, ముత్తయ్య, నాగరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, చంద్రయ్య, అసిస్టెంట్ లైబ్రేరియన్  మణెమ్మ, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ సూదిని వెంకటరెడ్డి తదితరులు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
NLG: ధ్వజస్తంభ పునః నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ధ్వజస్తంభ పునః నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, సిపిఎం చిట్యాల రూరల్ మండల కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. మే నెలలో కురిసిన వర్షం, ఈదురుగాలుల వల్ల ధ్వజస్తంభం కూలిపోయిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
AP: ఆగస్టు 1న శ్రీశైలం డ్యామ్ వద్దకు సీఎం చంద్రబాబు
శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం పెరుగుతోంది. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1 వ తేదీ న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో వస్తోంది.