గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణను పక్కగా నిర్వహించాలి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే
![]()
గ్రూప్-1 పరీక్ష నిర్వహణను పక్కాగా నిర్వహించాలని, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అధికారులను ఆదేశించారు. గురువారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ఛీప్ సూపరిటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెటిక్ ఆఫీసర్లకు గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించబడుతున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని ఆదేశించారు. ఛీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణను చేపట్టాలని, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్, వసతులు పరిశీలించాలని, ఆడ మగ అభ్యర్ధులకు విడివిడిగా తనిఖీ ఏర్పాట్లు చేయాలని, ఇతరులను అనుమతించవద్దని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణతో పరీక్షాల కేంద్రాలను పరిశీలించాలని, పరీక్ష రోజున ప్రతి సెంటర్ మూడు సార్లు పరిశీలించాలని, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు అభ్యర్ధుల ఐడి కార్డులతో హాల్ టిక్కెట్లను పరిశీలించాలని, పరీక్షా కేంద్రాలలో ఎవరికీ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, ఒక చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రము ఎమర్జెన్సీ కోసం అనుమతి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పరీక్ష వ్రాసే అభ్యర్ధులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని తెలియచేస్తూ కోరుతూ......ఈ నెల 9 వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని,* సుమారు 3349 అభ్యర్డులు హాజరగుతున్నారని తెలిపారు. *పరీక్ష కేంద్రాల గురించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 8331997006, 8331997037 సంప్రదించవచ్చునని సూచించారు. హాల్ టికెట్ ను http://www.tspsc.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ ను A4 పేపర్ నందు ప్రింట్ తీసుకోవాలని తెలిపారు.* హాల్ టికెట్లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి లేటెస్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను గమ్తో అతికించాలని, అభ్యర్దులు పరీక్షహాలుకు హాల్ టికెట్ తో పాటుగా ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, ఇతర ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి మరియు బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలని, ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో సరిగా ముద్రణ కాకపోయినా, లేదా కనిపించనట్లయితే అభ్యర్థి గెజిటెడ్ అధికారి/ అభ్యర్ది చివరగా చదివిన సంస్థ ప్రిన్సిపాల్ చేత ధృవీకరించబడిన మూడు (3) పాస్పోర్ట్ సైజు ఫోటోలను, అండర్టేకింగ్ ఫామ్ (TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫార్మాట్తో) తో పాటుగా తీసుకురావాలి. అట్టి ఫోటోలు, అండర్టేకింగ్ ఫామ్ ను పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కు సమర్పించినట్లయితే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడతారని, లేనట్లయితే అభ్యర్దిని పరీక్ష హాల్ లోకి అనుమతించబడరని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతించబడరని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి OMR ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్కు అందజేయాలని, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్ ను ఇవ్వకపోతే వారి OMR ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు. చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, ఒకవేళ ఉంటే బయోమెట్రిక్ చేయుటకు తంబ్ ఇంప్రెషన్ పడకపోవచ్చునని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని, *పరీక్ష కేంద్రము లోనికి ప్రవేశించడానికి ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని, పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసివేయబడుతుందని తెలిపారు.* పరీక్షకు హాజరయ్యే అభ్యర్దికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకులు కావాలి అని ముందుగానే దరఖాస్తు చేసినవారికి మాత్రమే పరీక్ష కేంద్రము వారు స్క్రైబ్ ను ఇస్తారని, అనుమతి లేకుండా ఎవరూ సహాయకులను తీసుకురాకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు. *పరీక్ష కేంద్రము లోకి వాటర్ బాటిల్ అనుమతించరని, పరీక్ష కేంద్రం వారే త్రాగు నీటి సౌకర్యము కల్పిస్తారని, పరీక్ష కేంద్రము లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు , హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని,* పరీక్ష కేంద్రము వద్ధ వస్తువులు భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/ స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని, కాబట్టి అభ్యర్డులు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు ఈ సూచనలు పాటించాలని కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాధ రెడ్డి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణ రెడ్డి, TGPSC రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ బాలాజీ, వ్యవసాయ శాఖ ఏడి నీలిమ, అధికారులు పాల్గొన్నారు.
![]()

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు పరీక్ష వ్రాసే అభ్యర్ధులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని తెలియచేస్తూ కోరుతూ......ఈ నెల 9 వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని,* సుమారు 3349 అభ్యర్డులు హాజరగుతున్నారని తెలిపారు. *పరీక్ష కేంద్రాల గురించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 8331997006, 8331997037 సంప్రదించవచ్చునని సూచించారు. హాల్ టికెట్ ను

ఈ సదస్సు ముఖ్య అతిధులుగా గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీమతి సీతక్క, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాజ్యసభ సభ్యులు శివ దాసన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. నాగయ్య, ఆర్. వెంకట్రాములు పాల్గొంటున్నారని వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో డి. కళమ్మ, ఎం. సుజాత, ఎం. పోచమ్మ , ఎం. రాములమ్మ , డి. ధనలక్ష్మి , ఎ. సత్తమ్మ , ఎం. స్వరూప, కే. మంగమ్మ, ఎన్. పద్మ, ఎన్. సుజాత, బి. రేణుక, ఆర్. చంద్రకళ, ఆర్ .కలమ్మ, ఏ. పద్మ పాల్గొన్నారు.
వలిగొండ మండల కేంద్రంలో దళిత కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ మాట్లాడుతూ* డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఈనెల 18,19,20 తేదీలలో యాదగిరిగుట్ట, మండలంలో లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో జరగనున్నట్లు తెలిపారు... గ్రామాలలో ఇంకా అంటరానితనం అవమాననీయ దురాచారాలు అత్యంత దారుణంగా జరుగుతున్నాయి రోజురోజుకు దళితులపైన కుల వివక్ష చూపిస్తున్నారు.ఇలాంటి అణచివేతలను ఎదిరించే విధంగా దళితులను సామాజిక సంఘటితంగా రాజకీయ చైతన్యపరచటకు ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ మండల కో కన్వీనర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, చొప్పరి వెంకటేష్,సుద్దాల సాయికుమార్, భూశి శివ, నరేష్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయినది. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,249 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి కి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వారి కుమారుడు ఉప్పల ముత్యాలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేయుచున్నారు కుమారులు కుటుంబ సభ్యులు అంకితభావంతో పార్టీలో కొనసాగుతున్నారు అని అన్నారు ఈ సందర్భంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు యానాల దామోదర్ రెడ్డి, బోలగొని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెడచంద్రయ్య, ఏషాల అశోక్,కల్లెం కృష్ణ,పాసి కంటి లక్ష్మీ నరసయ్య,సిపిఐ మండల కార్యదర్శిలు జల్ది రాములు, అన్నపు వెంకటేష్, అన్నేమైన వెంకటేష్, మారుపాక వెంకటేష్, బబ్బూరి శ్రీధర్,సలిగంజి వీరాస్వామి,ఎల్లంకి మహేష్, పుట్ట రమేష్ ,ఉప్పుల శాంతి కుమార్, గుర్రం రాజమణి,సూరారం జానీ, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మరి పెళ్లి రాములు, భాష బోయిన సర్వేయ్య సోమనబోయిన నరసయ్య లు పాల్గొన్నారు.
యాదాద్రి.. భువనగిరి పార్లమెంట్ 6 రౌండ్లు పూర్తయ్యేవరకు కాంగ్రెస్ అభ్యర్ధి 32వేల కు పైగా ఆధిక్యం..
Jun 06 2024, 20:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.4k