/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కర్రోడా అన్నందుకు విడాకులు..! Mane Praveen
కర్రోడా అన్నందుకు విడాకులు..!
భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. అక్కడి ఎన్నికలు బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్ర వివాదాల నేపథ్యంలో హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 42 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా 33 చోట్ల పోలింగ్ పూర్తయింది. మిగిలిన 9 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 124 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
హైదరాబాద్‌ చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో సంచలన నిజాలు..
ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రమ ముఠా దందా యధేచ్చగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్‌ ట్రాఫికింగ్‌ సీక్రెట్‌ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు లేని తల్లిదండ్రులు ఆరాటం ఆ దళారులకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను,  ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. మేడ్చెల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ని చేదించారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు కొంతమంది కేటుగాళ్లు. పీర్జాదిగూడలోని ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్‌ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు
NLG: అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు
నల్లగొండ మూడో వార్డు పరిధిలోని శేషమ్మ గూడెం, లెప్రసీ కాలనీ లో గాలి వాన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్లను బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి పగిడి మహేష్, వార్డు ఇంచార్జ్ ప్రభంజన్, తదితరులు  ఉన్నారు.
NLG: మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల సిఐటియు ఆధ్వర్యంలో, బుధవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుండి గ్రామపంచాయతీలలో వెట్టి చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గ్రామాలకు స్పెషల్ అధికారులు వచ్చిన నాటి నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మనెంట్ చేయాలని పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు తక్షణమే రెండు జతల బట్టలు, చెప్పులు, సబ్బులు, టవల్స్ టార్చ్ లైట్, చేతి గ్లౌజ్, బూట్ల, ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పోలేపల్లి రాములు,నక్క నరసింహ,ఒంపు ముత్తమ్మ, పెరుమాండ్ల మంజుల, అయితపాక పద్మ, గ్యార దుర్గమ్మ, యాచారం జంగమ్మ, మర్రి ఇందిరమ్మ, హేమలత, నర్సమ్మ, ఏపూరి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి: సిఐటియు
పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన నిర్ణయించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కార్మికులను విస్మరించిందని అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలలు గడుస్తున్నా కార్మికులను పట్టించుకోవడంలేదని అన్నారు. వెంటనే గ్రామపంచాయతీ కార్మికులకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు వెంకటాచారి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
నాంపల్లి మండలంలో సోమవారం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 75% పోలింగ్ జరగడం ఆశ్చర్యకరమని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం, బాధ్యతలో పనిచేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, శీలం జగన్మోహన్ రెడ్డి, రేవల్లి గోపాల్ రెడ్డి, బట్టు జగన్, ఈదశేఖర్, పానుగంటి వెంకటయ్య, కామిశెట్టి చత్రపతి, కోరే శివ, మేకల రమేష్ ముదిరాజ్, కొండలు ముదిరాజ్, కోరే యాదయ్య గుండాల అంజయ్య, బొల్లంపల్లి దేవత్ పల్లి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
NLG: పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బిజెపి మునుగోడు నియోజకవర్గం కోఆర్డినేటర్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, మునుగోడు నియోజకవర్గం బిజెపి కోఆర్డినేటర్ కళ్లెం బాల్ రెడ్డి, ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను మరియు మూడు మున్సిపాలిటీ లను సందర్శించారు. ఈ సందర్భంగా పలు పోలింగ్ స్టేషన్ లలో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షకీల్ మీర్జా, తదితరులు ఉన్నారు.
నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఎం నాయకులు ధనుంజయ గౌడ్

చండూరు మండలం నేర్మట గ్రామంలో ఇవాళ గాలి దుమారం, ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో గ్రామాన్ని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. గాలి దుమారానికి, ఈదురు గాలులతో వర్షం పడటంతో  నారపాక రాములు, జంగులు,ఈరగట్ల నరసింహ ఇంటి పై కప్పు రేకులు ఎగిసి పడ్డాయని, తక్షణమే ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీరి కుటుంబాలకుప్రభుత్వం ఆర్థిక సాయం అందించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నేర్మట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నారపాక రాములు వీరి ఇంట్లో నాలుగు క్వింటాల బియ్యం పూర్తిగా తడిసినవి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి వెంకన్న, రాములు, దానయ్య,శంకరయ్య, జంగయ్య,లింగాలు,నాగరాజు, నరసింహతదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నకిరేకల్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ 1997-99 బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులందరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అధ్యాపకులను విద్యార్థులు శాలువాలు, మెమంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు గూడూరు సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, జానయ్య, భరణి కుమార్, శ్రీనివాస్, రాములు, కృష్ణ, పద్మాచారి, శ్రీనివాసాచారి, పూర్వ విద్యార్థులు డా. అక్కెనపల్లి సుధాకర్ జియాలజిస్ట్, నాగార్జున, మల్లికార్జున్, కిషోర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.