/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ప్రజా ఉద్యమ నాయకుడు జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారి ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు Vijay.S
ప్రజా ఉద్యమ నాయకుడు జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారి ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

భువనగిరి పార్లమెంట్ కు పోటీ చేస్తున్న అందరి అభ్యర్థుల్లో ప్రజా ఉద్యమాల్లో మెరుగైనవాడుగా ఉన్న ప్రజా నాయకుడు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం రోజున మండల పరిధిలోని వలిగొండ పట్టణం మరియు వెంకటాపురం, వేములకొండ,అరూర్ గ్రామాల్లో సిపిఎం నాయకులు వేరువేరు బృందాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నారీ ఐలయ్య,మాటూరి బాలరాజు లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా మెరుగైనవాడుగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజా ఉద్యమ నాయకుడిగా ఉన్న సిపిఎం ఎంపీ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ కు ఒక్క అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న జహంగీర్ పట్ల ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు ప్రజల్లో లేని ఎలాంటి ప్రజా ఉద్యమాలు నిర్వహించని వారందరూ ఎన్నికల్లో డబ్బు మద్యం పరమావధిగా వ్యవహరిస్తూ పోటీ చేస్తున్నారని వారందరినీ ఓడించాలని ప్రజల కోసం పోరాడే జాంగిర్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని కార్పొరేట్ అధిపతులు ముందుకు వచ్చి ప్రజల సమస్యలను ఇబ్బందులను అర్థం చేసుకోలేని వారు ధన బలంతో గెలవాలని చూస్తున్నారని అలాంటి వారందరికీ తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎన్నికల్లో ఉందని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, చీర్క శ్రీశైలం రెడ్డి,కల్కూరి రామచందర్,పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,పట్టణ సీనియర్ నాయకులు కొండూరు సత్తయ్య,సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కవిడే సురేష్,కర్ణకటి యాదయ్య,నాయకులు కంబాలపల్లి వెంకటేశం, వేముల లక్ష్మయ్య,రాపోతు వెంకులు,షాహిద్,పిట్టల అంజయ్య,వేముల జ్యోతి బస్,గంగాపురం వెంకటేశం,పెద్దబోయిన కాంతయ్య,కంబలపల్లి మహేష్త,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కంపల్లి అవాస గ్రామం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది, వెల్వర్తి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొంతమంది, వలిగొండ మండల కేంద్రంలో పబ్బు ఉపేందర్ బోస్ ఆధ్వర్యంలో 30 మంది, రెడ్ల రేపాక మాజీ సర్పంచ్ మాదా లావణ్య శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో20 మందిఅనిల్ కుమార్ రెడ్డి సమక్షంలోచేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


రెడ్డి నాయక్ తండాలో ఇంటింటికి BRS విస్తృత ప్రచారం

భువనగిరి మండలంలో రెడ్డి నాయక్ తండా లో గ్రామశాఖ అధ్వర్యం లో BRS పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశం  గెలుపుకోసం BRS పార్టీ గ్రామశాఖ అధ్వర్యం లో ఇంటింటికి విస్తృత ప్రచారం   నిర్వహించి, అనంతరం ఉపాధి హామీ కింద పని చేస్తున్న కార్మికుల ధగ్గరకి వెళ్లి కలిసి  క్యామ మల్లేశం గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ , భువనగిరి ZPTC బీరు మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు ఇస్లావత్ నరేష్ నాయక్, మాజీ సర్పంచ్ మంజి నాయక్, భూక్యా నంద నాయక్, భువనగిరి ఎస్టీ సెల్ అధ్యక్షులు కునుసోత్ గోపి నాయక్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కునుసోత్ నరేష్ నాయక్ మరియు కునుసోత్ వెంకటేష్, గుగులోత్ చిన్నా నాయక్, రవి నాయక్,లింగ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు గ్రామశాఖ కార్యకర్తలు పార్టీ పెద్దలు పాల్గొన్నారు.

పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా... పిల్లలతో రాజకీయ ప్రచారం మానుకోండి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు

పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా... పిల్లలతో రాజకీయ ప్రచారం మానుకోండి* కొడారి వెంకటేష్ *బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు* విద్యా హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు దాటుతున్నా , తరగతి వారి విద్యా సామర్ధ్యాలు అందించడంలో,మౌళిక సదుపాయాల కల్పనలో, భోదన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణలో పూర్తిగా విఫలమైన రాజకీయ పార్టీల నాయకులకు ఓట్లు అడిగే అర్హతలు లేవని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా! ప్రస్తుతం జరుగుతున్న 18వ లోక్ సభ ఎన్నికల్లో పిల్లలతో ప్రచారం చేయించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నేతలు పిల్లలను ఎన్నికల ప్రచారానికి ,ర్యాలీల్లో, సభలు ,సమావేశాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వినియోగించడం, పిల్లలచేత పార్టీ జెండాలను పట్టించి ప్రచారం చేయించడం పై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ లు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించక పోవడం , మౌళిక వసతులు కల్పించకపోవడం వల్ల పేద, మద్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగి పోయే ప్రమాదముందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యాప్రమాణాల పెంపుకు , పాఠశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో "విద్యా వ్యవస్థ ఎమర్జెన్సీ" లో ఉందని, వచ్చే జూన్ నుండి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవాలని ఆయన కోరారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు.




ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి : బుద్ధుల సునీత తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు

ఉమ్మడి వరంగల్, ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రజలు, విద్యార్థులు , మేదావులు,ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుద్దుల సునీత కోరారు. శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ను నామరూపం లేకుండా చేయుటకు నిరంతరం తన గలంతో "క్యూ న్యూస్" వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందిన తీన్మార్ మల్లన్న ను చట్టసభలకు పంపించే భాద్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. తెలంగాణలోని విద్యార్థులు ,మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్ ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ ఈనెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం యాదాద్రి మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో 93.78 లీటర్ల మద్యం, 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్: ఎస్ఐ డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న 93.78 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై డి మహేందర్ తెలిపారు దీని విలువ రూ.1,03,158 ఉంటుందని తెలిపారు. అలాగే వలిగొండ మండల కేంద్రంలోని నువ్వుల శ్రీను అనే వ్యక్తి అక్రమంగా ఇంట్లో విలువ ఉంచిన 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
అరూరు గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో శుక్రవారం రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా భద్రతపై ప్రజలకు భరోసా కల్పించడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు.
చిట్యాల లో మీడియా సమావేశంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ BSP అభ్యర్థి ఐతరాజు అబ్బెందర్

చిట్యాల పట్టణంలో పత్రిక ప్రతినిధుల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంటు బిఎస్పి అభ్యర్థి ఐతరాజు. అబ్బెందర్ మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీలో మూడవ పార్టీ అయినా పేద ఇంటి బిడ్డను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి డబ్బు మూటలతో వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు ఇప్పటివరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అలాగే మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గతంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా భువనగిరికి ఉన్న ఒక్క అభివృద్ధి పని చేయలేదని అన్నారు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని బీసీ ను ఓటు వేయాలని అడగడానికి మీ ముందుకు వస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంటుకు చేసింది ఏమీ లేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రాంత సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు కానీ గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి భువనగిరి పార్లమెంటుకు నియోజకవర్గానికి అభివృద్ధి పని చేయలేదని అన్నారు. కేవలం కేసీఆర్ వి మాటలు మాత్రమే పనులు మాత్రం నీటి మీది గాలి బుడగలు అని అన్నారు. ఇక్కడి ప్రాంతం పై పూర్తి అవగాహన నాకుంది చిట్యాల మండలంలో అనేక కాలుష్య కర్మాగారాలు ఏర్పాటుచేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా గురిచేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి చేయలేదు కచ్చితంగా వీటిపై పోరాటం చేస్తాము పార్లమెంటులో వాని వినిపిస్తామని అన్నారు భువనగిరి పార్లమెంట్ గడ్డ బిఎస్పి అడ్డాగా మారుతుందని అన్నారు ప్రజల్లో ఎటు చూసినా తీవ్ర అసంతృప్తికి లోనై ఉన్నారు ఏ నాయకునికి ఓటు వేసిన ఏం ఉపయోగం లేదు ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారని మేము ఎక్కడ వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కచ్చితంగా భువనగిరి పార్లమెంటు నుండి లక్ష మెజారిటీతో గెలుస్తున్నామని తెలిపారు. అనంతరము బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని బడుగు బలహీన వర్గాల బిడ్డ ఐత రాజు అబేందర్ అని గెలిపిస్తే పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడతాడు పార్లమెంటులో మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వాని వినిపిస్తాడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్పుల రాజా రావు,నియోజకవర్గ ఇంచార్జి మర్రి శోభ, నియోజకవర్గ అధ్యక్షులు గుని రాజు, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎ డ్ల విజయ్, నియోజకవర్గ కోశాధికారి మునుగోటి సత్తయ్య, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మునిసిపల్ అధ్యక్షులు అవిరెండి ప్రశాంత్, గ్యార మారయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


అవినీతి ఊబిలో బిజెపి : ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


అవినీతి ఊబిలో బిజెపి - ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి..* అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపిని ఓడించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఏఐటియూసి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముద్రించిన 'అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపి కేంద్ర ప్రభుత్వం' వైఫల్యాలకు సంబంధించిన బుక్లెట్లను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సిపిఐ ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింస పెరిగిపోయాయని, లౌకిక,ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనా పరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తున్నారని,రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తున్నదని, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నదని,ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశం లో అమలు చేస్తున్నదని అన్నారు.కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్మిక కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని, కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసారని, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా తయారు చేసారని,4 లేబర్ కొడులను రద్దు చేయాలని, కార్మిక, కర్షక హక్కుల కోసం ఇండియా కూటమి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధికా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు ఎలగందు అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి పోలెపాక యాదయ్య, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, నాయకులు సల్వద్రి రవీందర్,సుద్దాల సాయి కుమార్, చొప్పరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకమైన ఎన్నికల నిరంలో భాగంగా జిల్లాలో వైన్ షాపులు బంద్: జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ హనుమంతు కే జెండగే


ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13 వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పురస్కరించుకొని 11 వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 13 వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు, అలాగే జూన్ 4 వ తేదీన కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు* *అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేయడం జరుగుతుందని, దీనిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 1951 ప్రజా ప్రాతినిథ్యం చట్టం 135 సి సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.