/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అవినీతి ఊబిలో బిజెపి : ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి Vijay.S
అవినీతి ఊబిలో బిజెపి : ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


అవినీతి ఊబిలో బిజెపి - ఏఐటీయూసీ పుస్తకాన్ని ఆవిష్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి..* అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపిని ఓడించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసం వద్ద ఏఐటియూసి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముద్రించిన 'అవినీతి ఊబిలో కూరుకుపోయిన బిజెపి కేంద్ర ప్రభుత్వం' వైఫల్యాలకు సంబంధించిన బుక్లెట్లను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సిపిఐ ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింస పెరిగిపోయాయని, లౌకిక,ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనా పరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తున్నారని,రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తున్నదని, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నదని,ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశం లో అమలు చేస్తున్నదని అన్నారు.కేంద్రంలోని BJP ప్రభుత్వం కార్మిక కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని, కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా తయారు చేసారని, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా తయారు చేసారని,4 లేబర్ కొడులను రద్దు చేయాలని, కార్మిక, కర్షక హక్కుల కోసం ఇండియా కూటమి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధికా మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు ఎలగందు అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి పోలెపాక యాదయ్య, ఏఐటీయూసీ కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, నాయకులు సల్వద్రి రవీందర్,సుద్దాల సాయి కుమార్, చొప్పరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకమైన ఎన్నికల నిరంలో భాగంగా జిల్లాలో వైన్ షాపులు బంద్: జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ హనుమంతు కే జెండగే


ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13 వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పురస్కరించుకొని 11 వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి 13 వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు, అలాగే జూన్ 4 వ తేదీన కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయబడతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు* *అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేయడం జరుగుతుందని, దీనిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 1951 ప్రజా ప్రాతినిథ్యం చట్టం 135 సి సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

చామలను గెలిపించాలని ఆయన సతీమణి డింపుల్ రెడ్డితో కలిసి ప్రచార నిర్వహించిన ఏఐటీయూసీ, కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి డింపుల్ రెడ్డి ఏఐటీయూసీ నాయకులను మరియు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. గురువారం రోజున భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చమల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ అయన సతీమణి చామల డింపుల్ రెడ్డి పలు కార్మికుల అడ్డాల వద్ద ఏఐటీయూసీ మరియు కాంగ్రెస్ నాయకులు కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా *భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ* కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కార్మికులను, కర్షకులను, రైతులను మరియు యువతను ఇలా అన్ని వర్గాల ప్రజలని మోసం చేసిందని, ముఖ్యంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని, దానితోపాటు 44 కార్మిక చట్టాలను రద్దు చేసే 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చిందని వారు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు, అవినీతిపరులకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారా దత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో నిరుద్యోగం, ఆకలి చావులు, రైతుల పైన మహిళల పైన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ, నిత్యవసర ధరలు పెంచడం లాంటివి బిజెపి పాలనలో పెరిగిపోయాయి అని వారు అన్నారు. మరో మారు దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వత్వం పెరుగుతుందని, రాజ్యాంగం, రిజర్వేషన్లు లేకుండా చేస్తారని, బీజేపీ ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు తిరగబడి ఓటు అనే ఆయుధంతో బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసినటువంటి కర్తవ్యం మన అందరిపై ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్,ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గనబోయిన వెంకటేష్, సామల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగారం శంకర్, బురాన్, సమీర్, శివ, రామకృష్ణ, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థులకు అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన భాజపా సీనియర్ నాయకులు ,న్యాయవాది దంతూరి సత్తయ్య గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో వారం రోజున హైస్కూల్ స్టార్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగు వేసవి కాల శిక్షణ తరగతులు జరుగుతున్న సందర్భంగా గురువారం ఉదయం హైస్కూల్ మైదానంలో ప్రతిరోజు ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు బిస్కెట్లు అందజేయడం జరుగుతుంది గురువారం రోజున దాత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు న్యాయవాది దంతూరి సత్తయ్య గౌడ్ వేసవి కాల శిక్షణ తరగతులలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అరటి పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లకు టీవీలను ఎక్కువ వాడరాదు. ఈ వేసవికాలంలో ఇంటి వద్ద ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ స్టార్ వాకర్స్ సభ్యులు పోలెపాక బిక్షపతి, వంగరి రమేష్, మైసొల్ల శ్రీకాంత్, ఎడవెల్లి అనిల్, నీరుడు భాను, పల్లెర్ల నరేష్ పండు, డాక్టర్ దయ్యాల వెంకటేశం, బాలగోని మధు బాలరాజు వాకర్ సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

బూర నర్సయ్య గౌడ్ కి బీసీ సంఘం మద్దతు, అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. పల్లగొర్ల మోదీ రాందేవ్


భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కి బీసీ సంఘాలు మద్దతు తెలిపారు భువనగిరిలో svహోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ కు పూర్తిమద్దతు ప్రకటించారు వారు మాట్లాడుతూ 2024 లోక్సభ నియోజకవర్గ భువనగిరి పార్లమెంట్ పరిధిలో 60 శాతం పైబడి ఉన్న బీసీలు అన్ని కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం పని చేయాలన్నారు ఒట్టు అనే ఆయుధంతో బీసీల సత్తా నిరూపించుకునే సమయం వచ్చిందన్నారు గతంలో MPగా పని చేసినా అనుభవం పార్లమెంట్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు బడ్జెట్లో బీసీల వాటా కోసం కొట్లాడే నాయకుడు అన్నారు భువనగిరిలో బూర దేశంలో బీసీ ప్రధానమంత్రిని చేసుకుందామన్నారు రాష్ట్రంలోనూ ఏకైక ఏమ్స్ బోనగిరికి తీసుకువచ్చి పేదలకు వైద్యాన్ని అందించిన వ్యక్తి విద్యార్థుల కోసం కేంద్రీయ విద్యాలయం పాస్పోర్ట్ సేవాకేంద్రం జాతీయ రహదారులు చేనేత పరిశ్రమలు ఫార్మా కంపెనీలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసినటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ అధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు *ఈ సమావేశంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్వి శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన శంకర్, కొత్తపెళ్లి బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వట్టెం మధు, సంతోష్ కుమార్, నూచి మహేష్,కొడారి వెంకటేష్,పబ్బల ఎలేషా, పూస సాయిరాం, రాపోలు వినయ్, సంజయ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థిని గెలిపించండి; సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలిపించండి... సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య 35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు గురువారం మండల పరిధిలోని చిత్తపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే ఏకైక సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసీ ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు,సిపిఎం మండల నాయకులు ఏటెల్లి నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాచమల్ల అంజయ్య,లింగమ్మ, రేణుక,భూపతి పద్మ,వల్లమల్ల పావని తదితరులు పాల్గొన్నారు.


ఉపాధి హామీ చట్టం తెచ్చి , చట్ట పరిరక్షణకై పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

వలసలను ఆపాలని, గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని చూపాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పార్లమెంటులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిన సిపిఎం ను, నేడు చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రము పైన ఓట్లు వేసి గెలిపించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని నమాత్ పల్లి, బండసోమవారం, ముస్త్యాలపల్లి, వీరవెల్లి గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల వద్ద, అమాలి కార్మికుల దగ్గర సిపిఎం అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజల పైన బారాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పదం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం, రాజ్యాంగం లోని ముఖ్యమైన విషయాలను తొలగించడం, ప్రజలకు ఉన్న చట్టాలను తొలగించడం లాంటివి తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని , సమాచార హక్కు చట్టాన్ని, మూడు హక్కుల చట్టాన్ని భూ సేకరణ చట్టాన్ని , కార్మికుల చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా నూతన చట్టాలను తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందని అన్నారు. మరో భారత దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగం అనేది ఉండదని, భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కొనసాగే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు. సనాతన పద్ధతులను తెచ్చి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని పూర్వపు ఆచారాలను కులాన్ని మతాన్ని మళ్లీ ముందుకు తెచ్చి దేశ సమైక్యత సమగ్రత దెబ్బతీయాలని చూస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. అవకాశవాద కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమి లేదని ప్రజలను మభ్యపెట్టడం మోసగించడం లాంటివి తప్ప ప్రజల హక్కుల కోసం ఏనాడు పోరాటం చేయలేదని ఇలాంటి పార్టీలకు అవకాశం ఇవ్వద్దని నిరంతరం ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం పోరాడుతున్న సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను దేశ ఐక్యత విషయాలను పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం ఉంటుందని అలాంటి అవకాశాన్ని ప్రజలందరూ జహంగీర్ ని గెలిపించి కల్పించాలని కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్ ,జిట్టా అంజిరెడ్డి,సిలివేరు ఎల్లయ్య ముస్త్యాలపల్లి శాఖ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, యాదగిరి, మండల నాయకులు వడ్డెబోయిన వెంకటేష్,యాదమ్మ , బుచ్చమ్మ, సుగుణమ్మ ,అండమ్మ, చంద్రమ్మ, మనమ్మ తదితరులు పాల్గొన్నారు.

గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో అపశృతి, కాలు విరిగిన చిన్నారి, ఓ మీడియా ప్రతినిధి కంటికి గాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోడ్డు షోలో అపశృతి చోటుచేసుకుంది . ఈ రోడ్ షో లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కార్యకర్తలు బాణసంచా కాల్చగా భయంతో జనాలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ చిన్నారికి కాలువగా ఓ మీడియా ప్రతినిధికి కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి.

రైతులు ఎవరు అధర్యపడవద్దు: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


రైతులు ఎవరు అధైర్య పడవద్దని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు . రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య . అలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడం చాలా బాధాకరమన్నారు. ఉదయం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ కు *ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య*  ఫోన్ చేసి మాట్లాడారు.మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని,లారీలను కేంద్రాలకు పంపించి వడ్లు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ధైర్యం నింపి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు.
అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి ,మామిడి రైతులను ఆదుకోవాలి, మామిడి , వరి రైతులకు నష్టపరిహారం అందించాలి: దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి


యాదాద్రి భువనగిరి జిల్లాలో  కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు తీవ్రంగా నష్టపోయిన రైతులను, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఐకెపి కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కదలాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు.* *బుధవారం రోజున సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపును కోరుతూ హన్మాపురం, వడపర్తి, పెంచికల్పహాడ్ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఐకెపి కేంద్రాల్లో ,ఉపాధి హామీ కేంద్రాల్లో సందర్శించి ప్రచారం నిర్వహించడం జరిగింది.* *ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకేప్ కేంద్రాల్లో పోసి ఉన్న దాన్యం పూర్తిగా తడిచిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని అదేవిధంగా రాలిపోయిన మామిడి కాయలను, పడిపోయిన మామిడి చెట్లను పరిశీలించి మామిడి రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి మామిడికాయలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల మామిడి చెట్లు మామిడికాయలు నేలరాలిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 10 లక్షల పైన పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు. బలమైన ఈదుర గాలుల వల్ల అనేక చెట్లు నేలమట్టం అయ్యాయని చెప్పారు . తక్షణమే మావిడి తోట రైతులను ఆదుకోవడం కోసం ఎకరాకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ యంత్రాంగం జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపరిహారాన్ని అందించడానికి పర్యటన చేయాలని డిమాండ్ చేశారు.* *గ్రామాలలో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోవడం ,పాత ఇండ్లు పోవడం వలన ఆస్తి నష్టం ఇంట్లో దాచుకున్న బియ్యం తడిసి నష్టం జరిగిందని అన్నారు అనేక చోట్ల చెట్లు కూలి కరెంటు లైన్ స్తంభాలు పడిపోయాయని , ఇండ్ల పైకప్పులు లేచిపోయి ఇంటిలో ఉన్న వంట సామాగ్రి బియ్యం బట్టలు పూర్తిగా తడిసి ముద్ద అయ్యయని అన్నారు. ఈదురుగాలుల వల్ల కరెంటు స్తంభాలు కూలి రాత్రంతా కరెంటు లేక బిక్కుబిక్కుమంటూ మేల్కొని ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల్లో పోసి ఉన్న ధాన్యం పూర్తిగా తడిచాయని తడిచిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించిధన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ వ్యవసాయ అధికారులు కలిసి కలిసి నష్టపోయిన వరి ధాన్యం రాలిపోయిన మామిడి పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.* *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, మాజీ ఎంపిటిసి దయ్యాల లక్ష్మి, పాండల మైసయ్య, మోటే ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్ ,కొండాపురం యాదగిరి ,బండి శ్రీను, కళ్లెం లక్ష్మీ నరసయ్య ,దయ్యాల మల్లేశం, పాండాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.