/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పేదల కోసం పోరాడే జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు Vijay.S
పేదల కోసం పోరాడే జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


నిరంతరం పేదలు,వ్యవసాయ కార్మికులు,రైతుల సమస్యలపై పోరాడే సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోమవారం రోజున మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతులు,వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న త్రిబుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని పార్లమెంట్ వేదికగా అలైన్మెంట్ మార్పు కోసం పోరాడుతారని తెలిపారు ఇప్పటిదాకా జరిగిన అనేక ఆందోళనలో సిపిఎం పార్టీ అగ్ర భాగాన నిలిచిందని భవిష్యత్తులో జహంగీర్ గెలిస్తే ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటారని తెలిపారు డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ అధిపతులు గెలవడం ద్వారా ప్రజలకు మరిన్ని కష్టాలు తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరగదన్నారు ధరల పెరుగుదలను నియంత్రించాలంటే పార్లమెంట్ వేదికగా పోరాడే వారు కావాలని,ఉపాది హామీ పథకం చట్ట రక్షణ కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు మండల కార్యదర్శి సిర్పంగి స్వామి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి చేగూరి రాములు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

వేములకొండలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల వెంకటేశం, కేశిరెడ్డి నీరజారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఎస్.కె రసూల్, పులిపలుపుల రాములు, ఇంజమూరి శ్రీను, ఏనుగుల నరసింహ, కాడిగళ్ల రవి, ఇంజమూరి నాగేష్, కొవ్వాకుల యాదగిరి ,పట్టేటి జగన్, దాసరి యాదగిరి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య కు నివాళులర్పించిన సిపిఎం నాయకులు


సుంకిషాల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు అమరజీవి కామ్రేడ్ ఈర్లపల్లి బొందయ్య గారి పార్థివ దేహం పై ఎర్రజెండాను కప్పి పూలమాల వేసి నివాళులర్పించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య గారు,కొండమడుగు నర్సింహ గారు,జగదీష్ గారు,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు గారు బొందయ్య గారి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన సిపిఎం నాయకులు సుంకిషాల మాజీ సర్పంచ్ ఫైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి గారు వారితో పాటు పాల్గొన్న సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి గారు,జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ళ లింగారెడ్డి గారు,సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య గారు,బుగ్గ చంద్రమౌళి గారు,పోచం పల్లి మండల నాయకులు ప్రసాదం విష్ణు గారు, గారు,శాఖ కార్యదర్శి గూడూరు వెంకట్ రెడ్డి గారు,సహాయ కార్యదర్శి మంగ బాలయ్య గారు,నాయకులు వేముల నాగరాజు,కాటపల్లి వెంకటేశం,గోపగాని కుమార్,వేముల జ్యోతిబస్,లక్ష్మమ్మ,తదితరులు పాల్గొన్నారు

బొందయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి....

   సిపిఎం...

ఎండ తీవ్రత వల్ల బొందయ్య తట్టుకోలేక మృతి చెందారని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటన లో కోరారు.

ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని పార్లమెంటుకు పంపండి : కొండమడుగు నరసింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


  

భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో ఆదివారం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొని నరసింహ మాట్లాడుతూ సిపిఎం నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పోరాడుతుందని, నియోజకవర్గం లో నెలకొన్న అనేక సమస్యలపై CPM పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహిస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారు ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న సమయంలో 2013 భూ సేకరణ చట్టం ప్రకారంన్యాయమైన పరివారం ఇవ్వాలని ఆందోళనలో ప్రత్యక్షంగా భాగస్వామిగా ఉన్నారు. రిజర్వాయర్లో ముప్పుకు గ్రామాలకు తిమ్మాపురం, లప్పనాయక్ తండ, సోకుల తండా, జంగంపల్లి ,బస్వాపురం రైతులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరివారం చెల్లించాలని, భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని అనేక ఆందోళనలో చేసి అధికారుల దృష్టికి ,ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు.

 *ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య, అన్నప్పట్ల కృష్ణ, కొండ అశోకు, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, వడ్డెబోయిన వెంకటేష్, మధ్యపురం బాల నరసింహ ,ఉడత విష్ణు, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్ ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మోడీ ఫోటో తీయడం ఖాయం: అతహర్

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ ఫోటో తొలగించడం పక్కా అని కాంగ్రెస్ నాయకులు అతహర్ అన్నారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టి గుండె పోటు వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో తీసివేయడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. స్వయంగా వ్యాక్సిన్ తయారుచేసిన కంపెనీ ఆస్ట్రాజెనిక కంపెనీ యాజమాన్యం అందులో లోపాలు ఉన్నాయని ఒప్పుకున్నారని అలాంటి వార్తలకు భయపడి వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో ను తొలగించారని అన్నారు. అతి త్వరలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ ఫోటో ను తొలగించి దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ ఫోటో పెట్టడం ఖాయం అని అన్నారు.

మే 13వ తేదీ జరిగే పోలింగ్ సమయం మరో గంట పాటు పొడిగింపు

యాదాద్రి భువనగిరి జిల్లా, మే 13వ తేదీ పోలింగ్ రోజున జరిగే పోలింగ్ సమయం గంట పాటు పొడగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం చూపించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో మే 13న పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ... ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

భువనగిరి దీప్తి హోటల్ లో జరిగిన  పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు

 ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ...

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల లోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను గుర్తించింది అని అన్నారు.

రాబాయే రోజులలో ఆర్యవైశ్యులకు పెద్ద బిడ్డ వేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకోలేదు

కెసిఆర్ నియంత పాలన ప్రజలు తరిమి కొట్టారు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పాలనను తరిమికొట్టాలి.

మోడీ ప్రధానమంత్రి అనే స్థాయిని మర్చిపోయి గుజరాత్ మోడల్ అని మోడీ గుజరాత్ కి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నాడు

సామాన్య ప్రజల సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి వ్యక్తి కాబట్టి

ఆర్యవైశ్య సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సంఘానికి రావలసిన పదవులు తీసుకోచ్చే బాధ్యత నేను తీసుకుంటాను

ఈ నెల 13 న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి.

ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమర వాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, సీనియర్ నాయకులు పిసిసి నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, బాల లక్ష్మి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గస్థాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భువనగిరి లో సిపిఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల సమావేశం : కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిపిఐ


యాదాద్రి భువనగిరి జిల్లా, బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, తద్వారా బిజెపిని ఎదుర్కొనవచ్చు అని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఐ మండలాల కౌన్సిల్ సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ ...కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ పోరాటం ఉంటుందని, వారికి నష్టం కలిగించే ఏ పార్టీ అయినా ఓడించడానికి ,ఓడించే సత్తా కలిగిన పార్టీతో కలిసి పని చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శారాజిపేట లో కరువు పనిలో భాగంగా తట్టలు ఎత్తి మహిళలకు అందించి, చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గోలనుకొండ, శారజీపేట గ్రామల్లో చేయి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిచాలని కోరుతూ వారికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రచారం నిర్వహించారు.

శారాజిపేట గ్రామంలో ఉపాధి హామీ కరువు పని చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు, కరువు పనిలో భాగంగా తట్టలు ఎత్తి మహిళలకు అందించారు.

భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు


భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని దీప్తి హోటల్ లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు నిర్వహించడం జరిగింది .

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మైనారిటీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫక్రుద్దీన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , భువనగిరి పార్లమెంటు కో ఆర్డినేటర్ బాల లక్ష్మీ,సీనియర్ నాయకులు మహమ్మద్ కలియుకుర్ రహ్మాన్ , మహమ్మద్ ఖలీల్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.