/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి Vijay.S
ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి


ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

భువనగిరి దీప్తి హోటల్ లో జరిగిన  పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు

 ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ...

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల లోపే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులను గుర్తించింది అని అన్నారు.

రాబాయే రోజులలో ఆర్యవైశ్యులకు పెద్ద బిడ్డ వేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులను పట్టించుకోలేదు

కెసిఆర్ నియంత పాలన ప్రజలు తరిమి కొట్టారు అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పాలనను తరిమికొట్టాలి.

మోడీ ప్రధానమంత్రి అనే స్థాయిని మర్చిపోయి గుజరాత్ మోడల్ అని మోడీ గుజరాత్ కి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నాడు

సామాన్య ప్రజల సమస్యలు ఏమిటో నాకు అవగాహన ఉన్నది ఎందుకంటే నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మధ్యతరగతి వ్యక్తి కాబట్టి

ఆర్యవైశ్య సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సంఘానికి రావలసిన పదవులు తీసుకోచ్చే బాధ్యత నేను తీసుకుంటాను

ఈ నెల 13 న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి.

ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమర వాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, సీనియర్ నాయకులు పిసిసి నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, బాల లక్ష్మి పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గస్థాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భువనగిరి లో సిపిఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల సమావేశం : కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సిపిఐ


యాదాద్రి భువనగిరి జిల్లా, బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, తద్వారా బిజెపిని ఎదుర్కొనవచ్చు అని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఐ మండలాల కౌన్సిల్ సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ ...కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ పోరాటం ఉంటుందని, వారికి నష్టం కలిగించే ఏ పార్టీ అయినా ఓడించడానికి ,ఓడించే సత్తా కలిగిన పార్టీతో కలిసి పని చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శారాజిపేట లో కరువు పనిలో భాగంగా తట్టలు ఎత్తి మహిళలకు అందించి, చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గోలనుకొండ, శారజీపేట గ్రామల్లో చేయి గుర్తుకు ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిచాలని కోరుతూ వారికి మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ప్రచారం నిర్వహించారు.

శారాజిపేట గ్రామంలో ఉపాధి హామీ కరువు పని చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు, కరువు పనిలో భాగంగా తట్టలు ఎత్తి మహిళలకు అందించారు.

భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు


భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని దీప్తి హోటల్ లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు నిర్వహించడం జరిగింది .

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మైనారిటీ సెల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫక్రుద్దీన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , భువనగిరి పార్లమెంటు కో ఆర్డినేటర్ బాల లక్ష్మీ,సీనియర్ నాయకులు మహమ్మద్ కలియుకుర్ రహ్మాన్ , మహమ్మద్ ఖలీల్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

ప్రజల మనిషి ,భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి


ప్రజల మనిషి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని భువనగిరి మండలం హనుమాపురం శుక్రవారం సాయంత్రం శనివారం ఉదయం ఎండి జాంగిర్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ హాజరై మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి హనుమపురం నుండి అనంతరం రోడ్డు గుంతలమయమయి రాకపోకలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అదేవిధంగా గ్రామపంచాయతీ బిల్లింగ్ పెండింగ్ లో ఉన్నది కురుమ గూడెం నుండి మన్నె వారు పంపు పోయే రోడ్డును గుంతల మయమయి అయింది గ్రామాల ప్రజలకు రైతులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా హన్మపురం నుండి బసాపురం వరకు మెటల్ రోడ్డు కొత్తగా వేయాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి పనులు ప్రారంభించాలని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఎం గ్రామ శాఖ తరపున కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లె అంజయ్య సిపిఎం హనుమపురం గ్రామ శాఖ కార్యదర్శి 10 ఎల్లయ్య సాయి కార్యదర్శి బండి శీను కొండాపురం యాదయ్య రాగాల రాజేశ్వరి దయ్యాల మల్లేష్ తోటకూరి గణేష్ బాధ మల్లయ్య వడ్డెబోయిన వెంకటేష్ ప్రమోదు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్... జెండా ఆవిష్కరించారు...

దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి నీచ కుయుక్తులు పన్నుతున్న బీజేపీ ని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించాలని...విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య 

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను

 దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిన ఏకైక యువజన సంఘం AIYF. నేటికీ అనేకమైన ఉద్యమాలు చేస్తూ,విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ను రూపొందించి, అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు.

అదే విధంగా నేడు దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ యువత ఉద్యమించాలని, ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధి కి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా యువత పరిగణించాలని వారు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు, మత ఛాందస విధానాలకు వ్యతిరేకిస్తూ యువత ఆలోచనలు మారాలని, రాజకీయాలంటే కార్పొరేట్ శక్తుల ధన ప్రభావం కాదని... ప్రజా సేవకు పాటుపడే నేటి యువత అని చాటి చెప్పే విధంగా యువజనులు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ కు ఏఐవైఎఫ్ మండల సమితి సంతాపం

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్‌ అతుల్‌ కుమార్‌ అంజన్‌ మరణం, దేశంలో వామపక్షాలకు తీరని లోటని. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఫైర్‌ బ్రాండ్ విద్యార్థి నాయకుల్లో కామ్రేడ్ అతుల్ ఒకరని, ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.

స్వామినాథన్ కమిషన్ సభ్యుడు కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ ఏకైక రైతు నాయకుడని, స్వామినాథన్ కమిషన్ నివేదికను రూపొందించడంలో ఆయన పాత్ర ఆధునిక భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని.కార్యక్రమంలో మారోజు నరసిమాచారి, లింగస్వామి, ఎంగోజు ప్రశాంత్, అంజయ్య,మనీష్ తదితరులు పాల్గొన్నారు

ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా మాత్రమే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ కు ఓటేసి గెలిపించండి చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ


భువనగిరి పార్లమెంటులో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు అన్నారు

  ఈరోజు ఎన్నికల ప్రచారంలో మండల పర్యటనలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నేడు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో సిపిఎం అనేక ప్రజా పోరాటాలను నిర్వహించిందని కాంగ్రెస్, బిజెపి,టిఆర్ఎస్ పార్టీలు ప్రజల కోసం ఏం ఉద్యమాలు నిర్వహించారు తెల్పాలని అన్నారు ఎన్నికల్లో డబ్బు మద్యం విపరీతంగా పంచి గెలవాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారని వారందరినీ ఓడించాలని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని కోరారు ఈ ప్రాంతం నుండి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి సోదరులు ఎంపీలుగా గెలిచిన నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేకపోయారని విమర్శించారు కాంట్రాక్టులు పైరవీలు తప్ప వీటివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ నాడు ప్రజలకు ఏమి చేయకుండా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేశారని పదవి పోయిన తర్వాత వెంటనే పార్టీ మారి బిజెపిలోకి పోయి మళ్లీ బిజెపి అభ్యర్థిగా ముందుకు వస్తున్నారని ప్రజల కోసం ఏం చేశాడో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి ఎక్కడి నుండి వచ్చారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ ఈ ప్రాంతంలో ఉన్న మూసి జల కాలుష్యం అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా 10 రోజులపాటు బస్సు యాత్ర స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న స్థానిక సమస్యలు పరిష్కారం కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారని పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డులు లాంటి అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారని మిగతా పార్టీల అభ్యర్థులు ఒక్కరోజైనా ప్రజల కోసం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారా అని ప్రశ్నించారు అందుకే ఈ ఎన్నికల్లో కేవలం ఓట్లు అడిగే నైతిక హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని సిపిఎం అభ్యర్థి జహంగీర్ను ప్రజలందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు 

సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్లో సిపిఎం ఏర్పడ్డ నాటి నుండి పోటీ చేస్తుందని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ద్వారా ప్రజలకు అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని గత 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నానని ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్న అనేక దీర్ఘకాలిక సమస్యలతో పాటు తాత్కాలిక సమస్యలను పరిష్కారం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎంకు ఈ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో ప్రచారం ప్రారంభించి వెలువర్తి కెర్చిపల్లి, మొగిలిపక ,తుర్కపల్లి,గోపరాజుపల్లి వెంకటా పురం, గ్రామాల్లో పర్యటించమని తెలిపారు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని కమ్యూనిస్టులు గెలవాలని ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ తీగల సాగర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య కొండమడుగు నరసింహ తప్పెట్ల స్కైలాబ్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం దోనూరు నర్సిరెడ్డి దాసరి పాండు సిపిఎం మండల కార్యదర్శి సిరిఫంగి స్వామి జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మెరుగు వెంకటేశం కూర శ్రీనివాస్ కల్కూరి రామచందర్ మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు వాకిటి వెంకటరెడ్డి ఏలే కృష్ణ కందడి సత్తిరెడ్డి కవిడే సురేష్ దుబ్బ లింగం కర్ణ కంటి యాదయ్య వేముల నాగరాజు దొడ్డి బిక్షపతి వేముల జ్యోతిబసు పల్చం లింగం ఉండ్రాటి పాపయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.

అవకాశవాద పార్టీలను ఓడించండి ,సిపిఎం ను ఆదరించి జహంగీర్ ని గెలిపించండి :దయ్యాల నరసింహ భువనగిరి సిపిఎం మండల కార్యదర్శి


మతోన్మాద బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు.

ఈరోజు మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ కేంద్రాల్లో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా Md. జహంగీర్ పోటీ చేస్తున్నారని వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు బ్యాలెట్ లో వరుస సంఖ్య 5 పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

 గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం వలన వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేకమంది ప్రాణాలను కోల్పోయారని తెలిపారు .అంతేకాకుండా వామపక్ష పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టంలోని కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికులకు ప్లేస్ స్లిప్పులు, మెడికల్ కిట్టు, టెంటు, త్రాగునీరు, పనిముట్లను కార్మికులకు తగ్గించారన్నారు. ఉపాధి హామీ కూలి రేటు రూ. 600 కు పెంచాలని సిపిఎం గా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీల కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి కుల మతాలను ప్రేరేపిస్తూ ప్రసంగించడంతోపాటు ప్రజల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అందుకే బీజేపీ ని అవకాశవాద పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి గత 35 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపిన ప్రజా పోరాటాల నాయకుడు నిస్వార్థ నాయకుడు ఎండి జహంగీర్ గారిని గెలిపించి పోరాడే వారికే ఆయుధం ఇవ్వాలని నరసింహ పిలుపునిచ్చారు

 *ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, తుక్కాపూర్ శాఖ కార్యదర్శి గుండెనబోయిన దానయ్య, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

  

సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపుకై గోపరాజుపల్లి లో విస్తృత ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో భువనగిరి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపుకై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సిపిఎం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలని కోరారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ అధ్యక్షతన ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గాజుల ఆంజనేయులు మాట్లాడుతూ అను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పోరాడే నాయకుడు జహంగీర్ అని అన్నారు. సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసిని , కమ్యూనిస్టులు ఏదైతే హామీ ఇస్తారో అది అమలు చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ ,బిజెపి రాజకీయ నాయకులు అమలు గాని హామీలను ఇచ్చి ప్రజలను మోసిగించారని అన్నారు. కూలి రేట్లు పెంచింది ,కరువు పని తెచ్చింది కమ్యూనిస్టులు అని అన్నారు. ప్రజల్లో ఉంటున్నాము గెలిస్తే ప్రజల్లో ఉంటూ మరికొన్ని పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవనగంటి వెంకటేశం, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సురేందర్, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, గ్రామ సిపిఎం కార్యకర్తలు గాజుల మల్లయ్య, గాజుల వెంకటేశం, సలిగంజి నరసింహ, మంద సంజీవ, సలిగంజి రాజయ్య , ఏటేల్లి నరసింహ, గాజుల లక్ష్మమ్మ సలిగంజి పద్మ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ పనికి ఆహార పథకం దగ్గర దాదాపు 200 మంది మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కుల మతాలు లేని సమ సమాజం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు ఈ దేశం కోసం శ్రీమతి ఇందిరా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.