/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అవకాశవాద పార్టీలను ఓడించండి ,సిపిఎం ను ఆదరించి జహంగీర్ ని గెలిపించండి :దయ్యాల నరసింహ భువనగిరి సిపిఎం మండల కార్యదర్శి Vijay.S
అవకాశవాద పార్టీలను ఓడించండి ,సిపిఎం ను ఆదరించి జహంగీర్ ని గెలిపించండి :దయ్యాల నరసింహ భువనగిరి సిపిఎం మండల కార్యదర్శి


మతోన్మాద బిజెపి నుంచి దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు.

ఈరోజు మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అదే విధంగా ఉపాధి హామీ కేంద్రాల్లో సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గారి గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు.

 ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా Md. జహంగీర్ పోటీ చేస్తున్నారని వారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు బ్యాలెట్ లో వరుస సంఖ్య 5 పై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

 గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు రైతంగ వ్యతిరేక చట్టాలను తీసుకురావడం వలన వందలాది మంది రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలను చేసి అనేకమంది ప్రాణాలను కోల్పోయారని తెలిపారు .అంతేకాకుండా వామపక్ష పోరాట ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టంలోని కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉపాధి హామీ కార్మికులకు ప్లేస్ స్లిప్పులు, మెడికల్ కిట్టు, టెంటు, త్రాగునీరు, పనిముట్లను కార్మికులకు తగ్గించారన్నారు. ఉపాధి హామీ కూలి రేటు రూ. 600 కు పెంచాలని సిపిఎం గా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీల కట్టబెడుతూ ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని వీటన్నిటి ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి కుల మతాలను ప్రేరేపిస్తూ ప్రసంగించడంతోపాటు ప్రజల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అందుకే బీజేపీ ని అవకాశవాద పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ లను ఓడించి గత 35 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాలు నడిపిన ప్రజా పోరాటాల నాయకుడు నిస్వార్థ నాయకుడు ఎండి జహంగీర్ గారిని గెలిపించి పోరాడే వారికే ఆయుధం ఇవ్వాలని నరసింహ పిలుపునిచ్చారు

 *ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, తుక్కాపూర్ శాఖ కార్యదర్శి గుండెనబోయిన దానయ్య, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

  

సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపుకై గోపరాజుపల్లి లో విస్తృత ప్రచారం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో భువనగిరి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ గెలుపుకై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సిపిఎం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలని కోరారు. అనంతరం గ్రామ రచ్చబండ వద్ద సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ అధ్యక్షతన ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గాజుల ఆంజనేయులు మాట్లాడుతూ అను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పోరాడే నాయకుడు జహంగీర్ అని అన్నారు. సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసిని , కమ్యూనిస్టులు ఏదైతే హామీ ఇస్తారో అది అమలు చేస్తారు. కొంతమంది కాంగ్రెస్ ,బిజెపి రాజకీయ నాయకులు అమలు గాని హామీలను ఇచ్చి ప్రజలను మోసిగించారని అన్నారు. కూలి రేట్లు పెంచింది ,కరువు పని తెచ్చింది కమ్యూనిస్టులు అని అన్నారు. ప్రజల్లో ఉంటున్నాము గెలిస్తే ప్రజల్లో ఉంటూ మరికొన్ని పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవనగంటి వెంకటేశం, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, సురేందర్, సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, గ్రామ సిపిఎం కార్యకర్తలు గాజుల మల్లయ్య, గాజుల వెంకటేశం, సలిగంజి నరసింహ, మంద సంజీవ, సలిగంజి రాజయ్య , ఏటేల్లి నరసింహ, గాజుల లక్ష్మమ్మ సలిగంజి పద్మ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ పనికి ఆహార పథకం దగ్గర దాదాపు 200 మంది మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కుల మతాలు లేని సమ సమాజం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు ఈ దేశం కోసం శ్రీమతి ఇందిరా రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పదవ తరగతి ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు


 

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా, 25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను, బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు. ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో రూ.1.66 లక్షలు సీజ్ ; వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వలిగొండ పోలీసులు గురువారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన కొమ్మిడి వెంకట్ రెడ్డి తండ్రి నర్సిరెడ్డి వద్ద టు వీలర్ లో  సరైన ఆధారాలు లేని రూ. 1,66,000 నగదును పట్టుకున్నారు. ఈ నగదును సీజ్ చేసి డిటిఓ యాదాద్రి భువనగిరి జిల్లా యందు డిపాజిట్ చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

చౌటుప్పల్ లో సమాచార హక్కు చట్టం - 2005 అవగాహన సదస్సులో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....

భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమాచార హక్కు చట్టం సంబంధించిన అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.సమాచార హక్కు చట్టాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినది.ఈ చట్టాన్ని కాపాడాలని మార్గదర్శకం తో ప్రభుత్వం నడవాలని మీరందరూ ఒక సమిష్టిగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు.గత పది సంవత్సరాలుగా భారతదేశంలో గానీ మన రాష్ట్రంలో చీకటి జీవోలను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన జీవోలు ప్రజలకు తెలవకుండా అధికారాన్ని చలాయించి లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై మోపారు.. సమాజం కోసం మంచి చేయాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆర్టిఐ సభ్యులకు ధన్యవాదాలు. స్వచ్ఛందంగా ప్రజలకు మంచి జరగాలని మార్గదర్శకంగా ప్రభుత్వాలు పనిచేయాలని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి విధంగా ఉండకుండా ప్రజలు అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి అని తెలిపారు.ప్రతి జీవోను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాస్తవాలను తెలిసే విధంగా ఉండాలి అని,గతంలో కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టాన్ని  ప్రవేశపెట్టిందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచారం చైర్మన్ డా.వర్రె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న "కమలం "నాగారం లో ఇంటింటికి,విస్తృత ప్రచారం

భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నాగారం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కావున భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ద్వారా పాట్లమెంట్ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ క్షేత్ర స్థాయిలో అందుతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,మాజీ మండల అద్యక్షులు నాగెల్లి సుధాకర్ గౌడ్,జిల్లా కార్య వర్గ సభ్యులు భచ్చు శ్రీనివాస్ ,మహిళా మౌర్చ కార్యదర్శి మందుల లక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శులు మారోజూ అనిల్ కుమార్, లోడే లింగ స్వామి,మండల ఉపాధ్యక్షులు గంగదారి దయాకర్,మండల కోశాధికారి అప్పి శెట్టి సంతోష్,మండల కార్యదర్శి మందుల నాగరాజు , ఓబీసీ మోర్చ మండల అద్యక్షులు వెలిమినేటి వెంకటేష్, BJYM మండల అద్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి,BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,పోలు నాగయ్య,డాక్టర్ లక్ష్మణ్, బూత్ అద్యక్షులు కట్ట బిక్షం, పుండరీకం ,బర్ల మల్లేశం మండలూజు శ్రీనివాస్ చారి బర్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మోడీ, అమిత్ షా తాటాకు చప్పుల్లకు రేవంత్ రెడ్డి భయపడడు: అతహర్


ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఢిల్లీ కు రావాలని నోటీసులు ఇవ్వడం పై కాంగ్రెస్ నాయకులు అతహర్ మండిపడ్డారు. ఈ సందర్బంగా అతహర్ మీడియా తో మాట్లాడుతూ మొన్నటి వరకు అమిత్ షా, మోడీ లు ఈడి, సిబిఐ లతో ముఖ్యమంత్రులను బయపెట్టాలని చూశారని నేడు ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు పంపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నోటీసులు ఇస్తే ఇక్కడ భయపడే వారు ఎవ్వరు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆటలు ఇక కేవలం నెల రోజులు మాత్రమేనని జూన్ 4 వ తేది రోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ లో బిఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రం లో బీజేపీ కి పట్టడం ఖాయం అని అన్నారు. సెమిఫైనల్ లో కెసిఆర్ ను ఓడించి గద్దె దించింది కాంగ్రెస్ పార్టీ అని ఫైనల్ లో మోడీ ని కూడా గద్దె దించేది కూడా కాంగ్రెస్ పార్టీ నే అని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కూటమికి ఎదురు గాలి వీస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పడం తో మోడీ, అమిత్ షా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ గెలవడం ఖాయం అని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి వరికుప్పల కృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి: తెలంగాణ మైనార్టీ సంఘం సభ్యులు ఖాజా రఫీ హుద్దిన్


భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అవినీతిని అంతా అంతం చేయాలంటే భువనగిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వరికుప్పల కృష్ణ ను పడవ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ మైనారిటీ సంఘం సభ్యులు ఖాజా రఫి హుద్దీన్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరికుప్పల కృష్ణ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని బూర్జువా పార్టీలు ప్రజలకు డబ్బు మద్యం మభ్యపెట్టి మోసం చేస్తున్నాయన్నారు. ప్రజల మనసు మీదికి వచ్చిందంటే ఎలాంటి నాయకుడినైనా ఓడించే సత్తా ఉందని గుర్తుచేశారు. పార్లమెంటు అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని గుర్తించి ఓటు వేయాలన్నారు. గతంలో ఎంపీగా వ్యవహరించిన ఏ నాయకుడు పార్లమెంటును ఉదరించింది లేదని ఎద్దేవ చేశారు. తనను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించినట్లయితే పార్లమెంటుకు పూర్తిస్థాయిలో అభివృద్ధికి పాటుపడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని శబదం చేశారు. తమ దగ్గర డబ్బు లేకపోయినా అభివృద్ధి సహాయం చేసే మనసు నిండుగా ఉందన్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన సమయంలో తమను ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాత్రి కొమురమల్లు తదితరులు పాల్గొన్నారు.

నాటి అమరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై పోరాడుదాం :సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ


  నాటి అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఐక్యంగా కార్మికులు, కర్షకులు , ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. బుధవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం, ముత్తిరెడ్డిగూడెం, కృష్ణాపురం, పెంచికల్ పహాడ్, హన్మాపురం, వడపర్తి, నందనం, నమాతుపల్లి గ్రామాలలో మేడే సందర్భంగా ఆయా గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేసినారు.ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ అనేకమంది కార్మికులు కర్షకులు సమస్త ప్రజలు తమ హక్కుల కోసం, పని గంటల తగ్గింపు కోసం, శ్రమకు తగ్గ వేతనం కోసం సమరశీల పోరాటాలు నడిపి తమ ప్రాణాలర్పించి తమ హక్కులను సాధించుకున్న రోజే మేడే అని ఈ మేడే స్ఫూర్తితో భారత దేశంలో పరిపాలన చేస్తున్న మతోన్మాద బీజేపీ ఆనాటి కార్మిక హక్కులను చట్టాలను కాలరాయాలను చూస్తున్నదని దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నా. బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని వర్గాల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడ్డి దారులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ వారికి ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. మరోపక్క ప్రజల పైన అనేక భారాలు మోపుతూ కులం పేరుతో మతం పేరుతో విభజన చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఇలాంటి దుర్మార్గము బిజెపి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధమై ఈ ఎన్నికల్లో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి వామపక్షాలను, ప్రజాతంత్ర వాదుల గెలిపించాలని, భువనగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, అన్నంపట్ల కృష్ణ, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలువేరి ఎల్లయ్య, పాండాల మైసయ్య,మోటే ఎల్లయ్య , ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ఆయా గ్రామాలకు సంబంధించిన శాఖా కార్యదర్శులు పార్టీ సభ్యులు కూకుట్ల కృష్ణ, ఉడత విష్ణు, మధ్యపురం బాల్ నరసింహ, ఉడత వెంకటేష్, మచ్చ భాస్కర్, ఎంఏ. రహిమాన్, ముదిగొండ కృష్ణ, కాసారం మల్లయ్య, సుబ్బురు పోశయ్య తదితరులు పాల్గొన్నారు.