/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.2.80 లక్షల నగదు, 16.9 లీటర్ల మద్యం: వలిగొండ ఎస్సై డి మహేందర్ Vijay.S
వలిగొండ మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో పట్టుబడ్డ రూ.2.80 లక్షల నగదు, 16.9 లీటర్ల మద్యం: వలిగొండ ఎస్సై డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద వలిగొండ పోలీసులు సోమవారం సాయంత్రం ఏడు గంటలకి పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు వలిగొండ నుండి చిత్తం పురం వైపు తన బైక్ పై వెళ్తున్న ఏనుగు నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మల్లారెడ్డి వద్ద గల బ్యాగులో సరైన పత్రాలు లేని రూ.2,80,000 నగదును పట్టు కున్నామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారులకి సమాచారం నిమిత్తం మరియు తదుపరి చర్య నిమిత్తము రెవెన్యూ అధికారులకు తెలిపామని అన్నారు. అలాగే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 4225 విలువగల 16.9 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని వలిగొండ ఎస్ఐ డి మహేందర్ తెలిపారు.

నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం : బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి


నరేంద్ర మోడీ పాలన దేశానికి చాలా అవసరం

- కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థి నీ గెలిపించాలి

 - బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడు

-బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి*

దేశానికి నరేంద్ర మోడీ పరిపాలన ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరమని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్య గౌడ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. బూర నర్సయ్య గౌడ్ నీతి నిజాయితీపరుడని,అవినీతి మచ్చలేని నాయకుడని కొనియాడారు. ప్రపంచంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపిన అలుపెరుగని నాయకుడు నరేంద్ర మోడీ అని, ఆయన పరిపాలన దేశానికి చాలా అవసరమని అన్నారు.హిందువుల చిరకాల కోరిక అయిన రామ మందిరం నిర్మాణం నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పడమే కాకుండా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా మోడీ చూశాడని అన్నారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా ఐదవ స్థానంలో ఉందని,త్వరలో మోడీ ఆధ్వర్యంలో మూడవ స్థానానికి చేరుకుంటుందని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు: పాశం భాస్కర్


భారతీయ జనతా పార్టీ మండల శాఖ అద్యక్షులు బోల్ల సుదర్శన్ మరియు బూత్ అద్యక్షులు కాలే పరమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు 2 వ విడత ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ పాశం భాస్కర్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడడం జరిగింది, గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కేంద్రం నుండి వస్తుందని వారికి తెలియజేసారు, ఈ సందర్భంగా వారు బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా నాతల్ల గూడెం గ్రామంలోని చెరువును మరియు మూసి కాల్వను వారు సందర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మూసి నదిని పరివాహక ప్రాంతంలో ఉన్న చెరువులల్లో రసాయన ఎరువుల కర్మాగారంల నుండి వెలువడే కాలుష్యం మూసి నదిలో కలవకుండా ప్రక్షాళన చేసి రైతులకు ,తెలంగాణ ప్రజలకు మంచి నీటి నదిగా మార్చాలని, నది పరివాహక ప్రాంతంలో గొలుసు చెరువులను మంచి నీటి చెరువులుగా మార్చాలని వ్యవసాయం కు,ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని మరియు మూసి పరివాహక ప్రాంతాల్లో వున్న చెరువులలో , కాలువలలో విపరీతంగా పేరుకపోయిన గుర్రపు డెక్క ఆకును ఆధునిక యంత్రాలతో తొలగించి,రైతులకు , తెలంగాణ ప్రజలకు ఉపయోగ పడే విధంగా చేయాలని ఈ సందర్బంగా వారు అన్నారు ఆదేవిధంగా గ్రామంలో వున్న ఐకేపీ సెంటర్ ను సందర్శించి ఒడ్ల కొనుగోళ్లు ,రైతు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందిఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్,జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ , దంతూరి సత్తయ్య ,జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చు శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ మైసొల్ల మచ్చగిరి,కిసాన్ మోర్చా జిల్లా సెక్రెటరీ కందుల తానీషా గౌడ్,మారోజు అనిల్ కుమార్, లోడే లింగ స్వామి, దయ్యాల వెంకటేష్, డోగిపర్తి సంతోష్ , వట్టిపల్లి సంతోష్,గంగధారీ దయాకర్, మైసొల్ల చిన్న మచ్చగిరి, మందుల నాగరాజు, గంగపురం నరేష్, అప్పిశేట్టి సంతోష్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మందుల లక్ష్మి,BJYM మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి,BJYM జిల్లా నాయకులు రెగురి అమరేందర్,బంగమట్ల మహేష్, దంతూరి అరుణ్, బూత్ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ లో కవుల పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం ఏఐవైఎఫ్


భారతదేశంలో రాజ్యాంగం పునాదిలా నిలిచింది.లౌకిక విలువలు-సాహిత్యం అనే అంశంపై సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ...బిజెపి ప్రభుత్వం ఈ పది సంవత్సరాల కాలంలో అనేకమైన చట్టాలను మార్పులు చేస్తూ చివరికి ఈ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వం మరోసారి గద్దెనెక్కి రాజ్యాంగాన్ని తీసివేయాలని కుట్ర పన్నుతున్నారు ఈ పది సంవత్సర కాలంలో మేధావులపైన,కవుల పైన దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల పైన అనేకమైన దాడులు చేస్తున్నది. నిన్న వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన సమూహ సదస్సు పై ఏబీవీపీ కార్యకర్తలు సదస్సులోకి దూసుకొచ్చి రచయితల పైన మేధావుల పైన వారి ప్రసంగాలను అడ్డుకొని,వారి వద్ద ఉన్న పుస్తకాలను గుంజుకొని వారి పైన దాడులకు పాల్పడ్డారు. ఫాసిస్టు అల్లరి మూకలైన.ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ డిమాండ్ చేశారు.

పెద్దమ్మతల్లి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, సోమనబోయిన సతీష్ కుల నరసింహ, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన శ్రీ శ్రీ శ్రీ పెద్దిరాజు పెద్దమ్మ తల్లి వార్షిక బ్రహ్మ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కళ్యాణo నిర్వహించి అనంతరం డప్పు చప్పుళ్లతో, భాజా భాజంత్రీలతో శివశత్త్తులతో. మహిళలు ఘనంగా బోనాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల శ్రీనివాస్, కుందారపు కొమురయ్య, చెరకు శివయ్య, బోళ్ల రాం చెంద్రమ్, సతీష్, కాసుల వెంకన్న, మాటూరు రాజు, బోళ్ల భాస్కర్ , కూర రవీందర్,కూర వెంకటేష్, తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కే బాలరాజు నియామకం


వలిగొండ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండల పరిధిలోని అరుర్ గ్రామానికి చెందిన కె బాలరాజు నియమితులయ్యారు.ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు లాల్జీ దేశాయి,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవల అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతంగా పార్టీని మరింత పటిష్టపరిచి పూర్వవైభవం తెచ్చేందుకు తన కృషి చేస్తానన్నారు,రానున్న పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో అత్యధిక మెజార్టీ స్థాయిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు.తనకి పదవి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే,కేసీ వేణుగోపాల్,దీప దాస్ మున్షి,మహేష్ కుమార్,భీమశంకర్,సంగ్రామ్ తౌడే,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు రవీందర్,పిట్టల బాలరాజు, కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో లింగరాజు పల్లి నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామం నుండి గ్రామ శాఖ అధ్యక్షులు బొడిగె నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ మాజీ సర్పంచ్ బొడిగె మైసయ్య గౌడ్,మండల నాయకులు గందమల్ల నరసింహ గౌడ్,మాజీ విద్యాకమిటి చైర్మెన్ ఎర్ర మహేష్,బొడిగె రాఘవేందర్,పబ్బు బిక్షపతి,లోడె కాటమయ్య,గందమ్మల్ల సాయిలు,బుంగమట్ల రాములు మరియు మహిళలు 50మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజల పక్షాన పోరాడే ఎండి జహంగీర్ ని గెలిపించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


అవకాశవాద బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించండి

-- ప్రజల పక్షాన పోరాడే యండి. జహంగీర్ ని గెలిపించండి*

     - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వారికి సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపు

   పూట కొక్క పార్టీలు మార్చి అవకాశవాద రాజకీయాలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకు వస్తున్న బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ ను ఓడించి ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలలో ముందుండి పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థి యండి. జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం ‌భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని సిపిఎం కార్యాలయంలో గ్రామ జనరల్ బాడీ సమావేశం ఏదునూరి మల్లేష్ అధ్యక్షతన సమావేశం జరుగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ గత పది సంవత్సరాల మోడీ బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబాటు గురైందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మొదలుకొని అన్ని రంగాలను బిజెపి సమూలంగా మార్చి తన మతోన్మాద మనువాద ఎజెండాను అమలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాలను మార్చి పనిభారాలను పెంచిందని, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు తన అన్యాయులైన అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి నల్ల చట్టాలు తెస్తే దేశవ్యాప్తంగా రైతాంగము వారి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటుతో వెనుక కొట్టిన పరిస్థితి ఉన్నదని అన్నారు. ఇప్పటికే కీలక రంగాలైన రైల్వే ఎల్ఐసి పోస్టల్ టెలికం సంస్థలలో ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానించి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని బిజెపి ఆలోచన చేస్తుందని విమర్శించారు. మరోపక్క విపరీతమైన ధరలు పెంచి సామాన్య మానవులు నిత్యవసర వస్తువులను కొనితిని పరిస్థితుల్లో లేకుండా పోయిందని అన్నారు. విద్య వైద్యం ఉపాధి సంక్షేమం లాంటి విషయాలలో బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. బిజెపి మరో మారు గెలిస్తే ఈ దేశంలో కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు బతికే పరిస్థితి ఉండదని, రాజ్యాంగం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యం హరించబడతాయని అన్నారు ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచన చేసి బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి సిపిఎం ను ఈ పార్లమెంటులో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి చేయూతనియాలని భాస్కర్ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, మాజీ సర్పంచి బొల్లెపల్లి కుమార్ పాల్గొని మాట్లాడగా. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లావుడియా రాజు, గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, ఏరియా కార్యదర్శులు ఎద్దులూరి వెంకటేష్, ముచ్చపతి బాలయ్య , నాయకులు యండి.జహంగీర్, కడారి కృష్ణ, షాపోద్దీన్, బొల్లెపల్లి పరమేష్, పిట్టల బాలరాజు, నరసింహ, వెంకటస్వామి, మహేందర్, స్వామి, సత్యనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

              

138వ మే డే ను జపం చేయండి: ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డే ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు.

      ఆదివారం రోజున సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం గోరేటి రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపేడుతున్నదని ఆరోపించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిందని ఈ10 సంవత్సరాల కాలంలో కార్మికులకు కర్షకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం హామీని అమలు చేయలేదని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

  భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని 2021లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 5 కనీస వేతనాల జీవోలకు గెజిట్ ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పట్టణాలకు విస్తరించాలని, కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు స్కీం వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, హమాలీ కార్మికుల కోసం సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అసంఘటిత కార్మిక వర్గానికి సామాజిక భద్రత చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు.

   *ఈ కారిక్రమం లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గనబోయిన వెంకటేష్, గోపగాని రాజు, సోమన సబిత, సామల శోభన్ బాబు, దాసరి లక్ష్మయ్య, పుట్ట రమేష్, పల్లె శ్రీనివాస్ ముదిగొండ బసవయ్య, పాపగల్ల శంకరయ్య, చింతల మల్లేష్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.