/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం Mane Praveen
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

కేతేపల్లి మండలం, గుడివాడ గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు మరియు జిల్లా, రాష్ట్ర ప్రజలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట పండగ ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సిరిసంపదలతో తులతూగాలని, జీవితంలో ప్రతి ఒక్కరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

NLG: జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు.. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా, తెలంగాణ సమస్త ప్రజానీకం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని.. ప్రతీ ఇంట్లో ఉగాది సంబరాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మరియు నల్లగొండ జిల్లా ప్రజలందరికి తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.

NLG: ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమవారం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి చౌటుప్పల్ సమీపాన గల ఆందోల్ మైసమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం చౌటుప్పల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పట్టణంలోని 30వ వార్డ్ ఉస్మాన్ పుర కి చెందిన జిలాని బాషా మృతి చెందగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. భాష మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా ద్వారా ఈరోజు నగదు పంపించగా కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సలీమ్,సల్మాన్, చోటు, రాజు,బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులు

నల్లగొండ: పట్టణంలోని 30, 41 వ వార్డులకు చెందిన 80 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు ఈరోజు నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమానికి ముందు కౌన్సిలర్ కేసానీ వేణుగోపాల్ రెడ్డి వార్డు నుంచి మంత్రి క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, యువజన కాంగ్రెస్ నల్గొండ అసెంబ్లీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బాబా పాల్గొన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నాగార్జున గౌడ్, మహేష్ అలియాస్ కోటి, వెంకటేష్, శరత్, గురువేందర్, హనీఫ్, సంకీర్తన్ రెడ్డి, అరుణ్, అఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

SB NEWS NALGONDA DIST

నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తా: వీఆర్పీ ఇన్చార్జ్ నూనె సురేష్

నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం, ఉచిత విద్య, వైద్యం లక్ష్యంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని విద్యార్థుల రాజకీయ పార్టీ (వి.ఆర్.పి) జిల్లా ఇన్చార్జ్ నూనె సురేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో త్రాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వెనుకబడిన దేవరకొండ, మునుగోడు, సాగర్ ప్రాంతాలకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని తెలిపారు.

SB NEWS NATIONAL

SB NEWS TELANGANA

NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్స్ పోటీలకు.. ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సిఐ సత్యనారాయణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 8 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో, ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో KV ఫుట్బాల్ క్లబ్, CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 2-0 స్కోర్ తో CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకన బోయిన రమణముదిరాజ్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

విద్యార్థుల్లో స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని, రాబోయే రోజుల్లో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేస్తూ గ్రామీణ క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని వారు తెలిపారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన వన్ టౌన్ CI సత్యనారాయణ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని దానిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ శారీరకంగా దారుఢ్యం కొరకు, ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయాలని తద్వారా మానసికంగా బలోపేతం కావచ్చునని తెలియజేస్తూ, పిల్లలు సెల్ ఫోన్లకు, వీడియో గేమ్స్ కు అలవాటు కాకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, తమ తమ పిల్లల్ని మైదానాలకు తీసుకెళ్లి ఏదో ఒక క్రీడలో రాణించే విధంగా కృషి చేస్తే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. 

  

గౌరవ అతిధి TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను తయారు చేయడం, దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం, నిరంతరం క్రమం తప్పకుండా సాధన చేయించడం, సాధనకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, SRM మద్రాస్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఫుట్బాల్ కోచ్ ను ఏర్పాటు చేయడం, ఇదంతా సేవా దృక్పథంతో ముందరికి వెళ్తున్న చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు అభినందనీయమని తెలియజేశారు. తనవంతుగా క్రీడాకారులకు ఈరోజు అరటిపండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో MCC-9 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫౌండర్ పాముల అశోక్, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, అంబటి ప్రణీత్ , సత్యం, గణేష్ సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట్ సాయి, కొక్కు యశ్వంత్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఫుట్బాల్ అండర్ 20 సెలక్షన్ ట్రయల్స్ కు ఎంపికైన కుశాల్

NLG: రేపటి నుండి హైదరాబాదులో జరిగే రాష్ట్ర ఫుట్బాల్ జట్టు ట్రయల్స్ కు, నల్గొండ జిల్లా నుండి నాంపల్లి మండలానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు జి. కుశాల్ ఎంపికైనట్టు టిఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు.

రాష్ట్ర ఫుట్బాల్ జట్టు ఎంపిక కొరకు 35 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి, ఫైనల్ గా అత్యున్నత స్థాయి 18 మంది క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుందని వారు తెలిపారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే: బండ శ్రీశైలం

చండూరు మండలం, నెర్మట: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కారంకోసం కమ్యూనిస్టులను గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదన్నారు. అభ్యుదయ వాదులకు, అవకాశవాదులకు మధ్య ఈ పోటీ కొనసాగుతుందని ఆయన అన్నారు.

డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడైనా ఇతర పార్టీలు పోరాటం చేశారా అని ప్రశ్నించారు. కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని, నేటికీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్నామని అన్నారు.

ఈ ప్రాంతంలో భూ పోరాటాలతో పాటు, తాగునీరు, సాగునీరు కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి సాధించామన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిలదీసి వాటి పరిష్కారం కోసం ఉద్యమించే తత్వం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకోవడం తో పాటు, అటవీ హక్కుల చట్టాన్ని సాధించుకున్నామన్నారు.

బిజెపి అధికారం చేపట్టిన తర్వాత ఈ చట్టాలను తుంగలో తొక్కి, మతోన్మాదాన్ని బిజెపి ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కనీస వేతన చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడంతో పాటు మతోన్మాదాన్ని ఎదుర్కోని లౌకిక వాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.ఈ ప్రయత్నం సిపిఎం మాత్రమే చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కోసం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీముందుండి పోరాటం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు అంతిరెడ్డి, సిపిఎం గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, బుర్కల అంజయ్య గౌడ్, ఈరగట్ల స్వామి, బల్లెం స్వామి, కొత్తపల్లి లక్ష్మమ్మ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.