/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తా: వీఆర్పీ ఇన్చార్జ్ నూనె సురేష్ Mane Praveen
నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తా: వీఆర్పీ ఇన్చార్జ్ నూనె సురేష్

నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం, ఉచిత విద్య, వైద్యం లక్ష్యంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నానని విద్యార్థుల రాజకీయ పార్టీ (వి.ఆర్.పి) జిల్లా ఇన్చార్జ్ నూనె సురేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో త్రాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వెనుకబడిన దేవరకొండ, మునుగోడు, సాగర్ ప్రాంతాలకు రైల్వే లైన్ కోసం కృషి చేస్తానని తెలిపారు.

SB NEWS NATIONAL

SB NEWS TELANGANA

NLG: చత్రపతి శివాజీ ఫుట్బాల్ లీగ్స్ పోటీలకు.. ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సిఐ సత్యనారాయణ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 8 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో, ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో KV ఫుట్బాల్ క్లబ్, CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన మ్యాచ్ జరగగా 2-0 స్కోర్ తో CSFC ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది.

ఈ సందర్భంగా క్రీడాకారులకు TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకన బోయిన రమణముదిరాజ్ అరటిపండ్ల ను పంపిణీ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

విద్యార్థుల్లో స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని, రాబోయే రోజుల్లో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ కల్చర్ ని డెవలప్మెంట్ చేస్తూ గ్రామీణ క్రీడాకారులని వెలుగులోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని వారు తెలిపారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన వన్ టౌన్ CI సత్యనారాయణ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని దానిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ శారీరకంగా దారుఢ్యం కొరకు, ప్రతిరోజు ఎక్సర్సైజులు చేయాలని తద్వారా మానసికంగా బలోపేతం కావచ్చునని తెలియజేస్తూ, పిల్లలు సెల్ ఫోన్లకు, వీడియో గేమ్స్ కు అలవాటు కాకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, తమ తమ పిల్లల్ని మైదానాలకు తీసుకెళ్లి ఏదో ఒక క్రీడలో రాణించే విధంగా కృషి చేస్తే ఎంతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. 

  

గౌరవ అతిధి TRMS రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను తయారు చేయడం, దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం, నిరంతరం క్రమం తప్పకుండా సాధన చేయించడం, సాధనకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, SRM మద్రాస్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఫుట్బాల్ కోచ్ ను ఏర్పాటు చేయడం, ఇదంతా సేవా దృక్పథంతో ముందరికి వెళ్తున్న చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు అభినందనీయమని తెలియజేశారు. తనవంతుగా క్రీడాకారులకు ఈరోజు అరటిపండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో MCC-9 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫౌండర్ పాముల అశోక్, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, అంబటి ప్రణీత్ , సత్యం, గణేష్ సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు రాచూరి వెంకట్ సాయి, కొక్కు యశ్వంత్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఫుట్బాల్ అండర్ 20 సెలక్షన్ ట్రయల్స్ కు ఎంపికైన కుశాల్

NLG: రేపటి నుండి హైదరాబాదులో జరిగే రాష్ట్ర ఫుట్బాల్ జట్టు ట్రయల్స్ కు, నల్గొండ జిల్లా నుండి నాంపల్లి మండలానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు జి. కుశాల్ ఎంపికైనట్టు టిఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు.

రాష్ట్ర ఫుట్బాల్ జట్టు ఎంపిక కొరకు 35 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించి, ఫైనల్ గా అత్యున్నత స్థాయి 18 మంది క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసే ప్రక్రియ ఉంటుందని వారు తెలిపారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే: బండ శ్రీశైలం

చండూరు మండలం, నెర్మట: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కారంకోసం కమ్యూనిస్టులను గెలిపించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు బిజెపికి లేదన్నారు. అభ్యుదయ వాదులకు, అవకాశవాదులకు మధ్య ఈ పోటీ కొనసాగుతుందని ఆయన అన్నారు.

డబ్బులు వెదజల్లి గెలవాలని చూస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏనాడైనా ఇతర పార్టీలు పోరాటం చేశారా అని ప్రశ్నించారు. కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని, నేటికీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్నామని అన్నారు.

ఈ ప్రాంతంలో భూ పోరాటాలతో పాటు, తాగునీరు, సాగునీరు కోసం అవిశ్రాంత పోరాటాలు నిర్వహించి సాధించామన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిలదీసి వాటి పరిష్కారం కోసం ఉద్యమించే తత్వం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకోవడం తో పాటు, అటవీ హక్కుల చట్టాన్ని సాధించుకున్నామన్నారు.

బిజెపి అధికారం చేపట్టిన తర్వాత ఈ చట్టాలను తుంగలో తొక్కి, మతోన్మాదాన్ని బిజెపి ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మనువాదాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కనీస వేతన చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు పేదల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయడంతో పాటు మతోన్మాదాన్ని ఎదుర్కోని లౌకిక వాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.ఈ ప్రయత్నం సిపిఎం మాత్రమే చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కోసం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీముందుండి పోరాటం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు అంతిరెడ్డి, సిపిఎం గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, బుర్కల అంజయ్య గౌడ్, ఈరగట్ల స్వామి, బల్లెం స్వామి, కొత్తపల్లి లక్ష్మమ్మ, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ ని అరికట్టడానికి కఠినమైన చట్టాలను ఉపయోగిస్తున్నాం: SP

నల్లగొండ జిల్లా :

నల్లగొండ జిల్లాలో నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో 26 కేసులలో పట్టుబడిన, ఒక కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల గంజాయి, నార్కట్ పల్లి మండలం గుమ్మల్లబావి గ్రామంలోని 12 వ బెటాలియన్ గన్ ఫైరింగ్ రేంజ్ ప్రదేశంలో డ్రగ్స్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తగలబెట్టినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం తెలిపారు.

-గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.

-డ్రగ్స్ ని అరికట్టడానికి కఠినమైన చట్టాలను ఉపయోగిస్తున్నాం.

-డ్రగ్స్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అని SP తెలిపారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

           

NLG: మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేసిన నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి

నాంపల్లి: మండలంలోని టిపి గౌరారం గ్రామానికి చెందిన కొమ్ము రమణమ్మ, ఇటీవల అనారోగ్య కారణంతో మరణించిన విషయం తెలుసుకున్న, నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి.. శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, మనో దైర్యం కల్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము బిక్షం, జిల్లా కాంగ్రెస్ నాయకులు శీలం జగన్ మోహన్ రెడ్డి , గేల్వాల్ రెడ్డి, రేవల్లి మాజీ సర్పంచ్ హరిత గోపాల్ రెడ్డి, గణపతి రెడ్డి, సిహెచ్ బిక్షం, కొమ్ము ఈదయ్య, బేకరి గిరి, గ్రామ శాఖ అధ్యక్షులు పి.యాదయ్య, ఈదయ్య, సిహెచ్. రామకృష్ణ, పుల్లయ్య, భూతం రాములు, శ్రీను, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

నాంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు దాచేపల్లి నర్సింహా ఆధ్వర్యంలో శనివారం, పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా దాచేపల్లి నర్సింహా మాట్లాడుతూ.. ఏప్రిల్ 6,1980 లో ఏర్పడిన పార్టీ ఎందరో కార్యకర్తల, నాయకుల బలిదానాల పునాదులపై నిర్మితమై, ఏకాత్మ మానవతావాదం , అంత్యోదయ ఆలంబనగా క్రమశిక్షణ, అంకుటిత దీక్ష, అంకితభావానికి ప్రతిరూపమై దేశాభివృద్ధి యజ్ఞంలో నిరంతరాయంగా నిమగ్నమై, దేశానికి పూర్వవైభవం తెచ్చి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు.

మొదటి సారిగా కేవలం 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన పార్టీ నేడు 300 పైగా ఎంపీ స్థానాల్లో గెలిచి దేశంలో దాదాపు 19 రాష్ట్రంలో అధికారం సాదించుకొని దేశ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నదని అన్నారు. 

రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోగుల వెంకటరెడ్డి, చిరుమామిళ్ల గిరి, దుదిమెట్ల సత్యం, సింగారం గిరి, బీజేవైఎం అధ్యక్షులు నాంపల్లి సతీష్, వేలాద్రి,సాంభశివ, లక్ష్మయ్య,కోట మల్లేష్, లింగస్వామి, శ్రీధర్ రెడ్డి, శంకర్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

తుక్కుగూడ సభకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదు లోని తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, గాదెపాక నాగరాజు, గెలవ రెడ్డి, దీప్లా నాయక్, అంగిరేకుల పాండు, దండిగ నరసింహ, బొల్లంపల్లి విష్ణుమూర్తి, నా రోజు సైదాచారి, మేకల యాదయ్య, పానుగంటి వెంకటయ్య, గఫార్, కిరణ్, కంశెట్టి చత్రపతి, ఎరెడ్ల నారాయణరెడ్డి, అబ్బాస్, గాదేపాక యాదయ్య, దోటి పరమేష్, బుష్పాక అరుణ, కలకొండ దుర్గయ్య, రేవల్లి సుధాకర్, కోరే పెద్ద వెంకటయ్య, పులికుంట్ల విజయ్ కుమార్, ఏడుకొండలు, దేవతల్లి యాదగిరి, ఎరుకలి యాదయ్య, ముదిగొండ అంజయ్య, తదితరులు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిఎంహెచ్ఓ

నల్లగొండ: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ కొండల్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, రెండు లక్షల పైగా ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామని వారు తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి ప్రథమ చికిత్స చేసేందుకు ఆశా వర్కర్ల దగ్గర 50 ప్యాకెట్లు, ఏఎన్ఎం దగ్గర 100 ప్యాకెట్లు, పిహెచ్సి లలో 2000 వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA

నాగార్జునసాగర్ లో అడుగంటుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శనివారం ఉదయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 511. 50 అడుగులు ఉంది. 312. 00 టిఎంసీల నీటి నిల్వకుగాను 134. 23 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయం నుండి 5, 963 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో మాత్రం ఏమీ లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA