/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వాత పెట్టిన వాగ్దానం మారలేదు Yadagiri Goud
వాత పెట్టిన వాగ్దానం మారలేదు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచేందుకు అనేక హామీలు ఇస్తుండ‌టం స‌హ‌జం .. అయితే ఓ క్యాండిడేట్ ఎన్నిక‌ల వాగ్ధానాల‌లో కాస్త కిక్కు ఇచ్చింది

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో ఓ స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేస్తున్న వ‌నితా రౌత్ పేదలకు సబ్సిడీ పై బీరు, విస్కీ అందిస్తానని హామీలు ఇచ్చేసింది.

ప్రతి గ్రామంలో బీరు బార్లు ఓపెన్‌ చేసి ఎంపీ నిధుల నుంచి విదేశీ మద్యంతో పాటు విదేశీ బీర్లను కూడా ఇస్తానని చెబుతోంది. ముందుగా ఈ షాపుల‌లో ప్రీగా మందు అందిస్తానని వాగ్దానం చేసేసింది.

ఇండియ‌న్ లిక్క‌ర్ కాకుండా విదేశీ మద్యం అందుబాటు లో ఉంచుతాన‌ని ఘంటా ప‌ధంగా చెపుతున్న‌ది.. దీంతో ఆమె ప్రచారానికి జ‌నాలు పోటేత్తుతున్నారు.

తాగేందుకూ లైసెన్స్….

అయితే ఈ స్కీమ్‌ కింద తాగేవాళ్లు, అమ్మేవాళ్లు ఇద్దరికీ లైసెన్స్‌ ఉండాల్సిందే నన్న కండీషన్‌ పెడుతోంది. అత్యంత కష్టపడి పనిచేసే పేదలకు ఉన్న ఒకే ఒక విలాసం మందు తాగడ మని, ఇందుకే తన ఈ వినూత్న స్కీమ్‌ వారికి అవసరమని సమర్థించు కుంటోంది.

పేదలకు అందుబాటులో ఉండేది కేవలం దేశీయ మద్యమేనని, ఇది తాగి వారు చనిపోతున్నారని, ఇందుకే వారి కోసం విదేశీ మద్యం తెప్పించి ఇస్తానని తెలిపింది.

గ‌త ఎన్నిక‌లో ఇదే వాగ్ధానం… వాత‌పెట్టిన ఎన్నిక‌ల సంఘం…

వనిత ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగ్‌పూర్‌ నుంచి పోటీ చేయగా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిమూర్‌ సెగ్మెంట్‌ నుంచి బరిలో నిలిచారు. గతంలో కూడా విస్కీ, బీరు హామీ ఇచ్చినందుకు ఆమె సెక్యూరిటీ డిపాజిట్‌ను ఎన్నికల కమిషన్‌ జప్తు చేసింది. అయినా ఆమె మారకుండా మళ్లీ అదే హామీ ఇస్తుండటం విశేషం.

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి.

ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా చెల్లించాల్సి ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంపిక చేసిన కొన్ని ఏటీఎమ్‌ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలు మునుపటి కంటే రూ. 75 ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది...

Streetbuzz News

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు.

ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై చర్చించనున్నారు.

కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ, మరో నాలుగు పార్లమెంట్ నియోజకవ ర్గాల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

ఇక తెలంగాణలో అభ్యర్థు లను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు ఢిల్లీలో జరిగే సీఈసీ మీటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది....

నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు

పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈరోజు ఏప్రిల్‌ 1నుంచి పెరగనున్నాయి.

ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడి న అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్స రంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ఎన్​పీపీఏ వెల్లడించింది..

ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల ‘టోకు ధరల సూచీ’లో వార్షిక మార్పును ప్రకటించింది.పెయిన్‌కిల్లర్ డైక్లోఫెనాక్ ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది.

WPIలో సూచించిన ధర లకు అనుగుణంగా షెడ్యూ ల్​ చేసిన ఫార్ములాల మందు లపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు.

ఈవిధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయో టిక్స్, యాంటీ మలేరియ ల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.

బెజ్జంకి యువతికి మిస్‌ టీన్‌ టైటిల్‌..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌ కైవసం చేసుకుంది..

యూకేలోని వారింగ్‌టన్‌ పార్‌ హాల్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నలుమూలల నుంచి 25 మంది యువ తులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది.

వచ్చే ఆగస్టులో యూఎస్‌ ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనున్నది...

Streetbuzz News

ఏప్రిల్ 5 న కరీంనగర్‌ జిల్లాలో పొలాల బాట పట్టనున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 5న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు.

కరీంనగర్ రూరల్, వేముల వాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్నారు.

రైతులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెబుతామన్నారు. గులాబీ బాస్ కరీంనగర్‌ పర్యటన ఖరారు కావడంతో బారాస నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Streetbuzz News

CSK పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. విశాఖ వేధిక‌గా CSKతో తలపడిన ఢిల్లీ, చెన్నైని ఓడించి సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారీ ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితమైంది.

దీంతో చెన్నైపై ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.చేజింగ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్లు కోల్పో యింది చెన్నై జట్టు. మిడిలా ర్డర్‌లో అజింక్యా రహానే (45), డారిల్ మిచెల్ (34) పరుగులు సాధించగా.. శివమ్ దూబే (18) పరుగు లకే అవుటయ్యారు.

ఆఖరిలో జడేజా 21 నాటౌట్ ధోని 37 నాటౌట్ పరుగులు చేశారు. చెన్నై గెలుపు భారం అంతా మిడిల్ ఆర్డర్ పైనే. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. మరోవైపు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన పృథ్వీ షా (43) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు...

వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను రీఎంట్రీ

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది.

ఆమె థాయిలాండ్‌లో ఆది వారం ప్రారంభమైన ఇంటర్నే షనల్ వెయిట్‌ లిఫ్టింగ్ ఫెడ రేషన్ వరల్డ్ కప్‌ బరిలో నిలిచింది. సోమవారం మహిళల 49 కేజీల కేట గిరీలో మీరాబాయిచాను పోటీపడనుంది.

ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకో నుంది. ఒలింపిక్ క్వాలి ఫికేషన్ ర్యాంకింగ్స్‌లో మీరాబాయి తన విభా గంలో 2వ ర్యాంక్‌లో ఉండ టం బెర్త్‌కు ఢోకా లేదు.

అయితే, ఒలింపిక్స్‌కు ఈ టోర్నీనే చివరి క్వాలిఫ యింగ్ ఈవెంట్. అలాగే, ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చాలంటే ఈ టోర్నీలో పాల్గొ నడం తప్పనిసరి. నిబంధ నల ప్రకారం..

వరల్డ్ కప్ ముగిసిన తర్వా త ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచిన వారు తమ విభా గాల్లో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమా ర్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తు తం ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అయితే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయా లని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.

తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నారని, ఈ మేరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయా లని పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక కోర్ట్,లో సోమవారం విచారణ జరగనుంది.

ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అవుతుందా?లేదా?అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.

మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ కవితను బెయిల్ ఇవ్వొద్దని కోరుతు న్నారు. లిక్కర్ స్కామ్ కేసు లో కవిత ప్రధాన సూత్రధారి గా ఉన్నారని, దాదాపు రూ.100 కోట్ల మేర అక్ర మాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది..,

క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరిన భారాస అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌: భారాస (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయి పర్యటనకు బయల్దేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు.

సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో ఆయన వెళ్లారు. తొలుత జనగామ జిల్లా ధరావత్‌ తండాకు చేరుకుని పంటలను పరిశీలించనున్నారు.

ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్‌ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. 3:30కు తిరిగి బయల్దేరి.. సాయంత్రం 4:30కు నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకుని రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమవుతారు.